- మన్మోహన్ సర్కారుపై ప్రజాగ్రహం - ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపీఏ ఓటమి తథ్యం - యూపీఏకు 171-181 సీట్లు మించకపోవచ్చు - క్రమంగా బలం పుంజుకుంటున్న ఎన్డీఏ - ఎన్డీఏకు 195-205 సీట్లు రావొచ్చు - ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్కు 23-27 లోక్సభ సీట్లు రావొచ్చు ![]() ![]() ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే యూపీఏ ఓటమిపాలవుతుందని ఇండియా టుడే అంచనా వేసింది. 2009లో యూపీఏకు 259 సీట్లు ఉండగా ఆ సంఖ్య 171-181కి పడిపోవచ్చని పేర్కొంది. మరోవైపు ఎన్డీఏ మాత్రం 2009లో ఉన్న 159 సీట్ల నుంచి 195-205 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని వివరించింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 23 నుంచి 27 లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. ఎవరిని ఉత్తమ ప్రధానిగా భావిస్తారు?, మన్మోహన్ ప్రజల అంచనాలను అందుకున్నారా? మంత్రుల పనితీరు ఎలా ఉంది?, కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎవరిని ప్రధాని అభ్యర్థులుగా భావిస్తారు? వంటి ప్రశ్నల ఆధారంగా ఈ ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. మొత్తం 19 రాష్ట్రాల్లోని 125 పార్లమెంటు నియోజకవర్గాల్లో జూలై 6 నుంచి 20వ తేదీ మధ్య అర్హులైన ఓటర్లలోని 15,827 మంది నుంచి ఈ వివరాలను రాబట్టారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో రెండేసి అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున సర్వే సాగింది. బీజేపీతోనే ఆర్థిక సంస్కరణలు సాధ్యం. ![]() ![]() ఆంధ్రప్రదేశ్లో 2009 లోక్సభ ఎన్నికల్లో యూపీఏకు 33 సీట్లురాగా ఎన్డీఏకు ఒక్క సీటు కూడా రాలేదు. ఇతరులకు 9 సీట్లు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో యూపీఏకు కేవలం 3 నుంచి 8 సీట్లు రావొచ్చని, ఎన్డీఏకు ఒక్క సీటు కూడా రాదని సర్వేలో తేలింది. ఇతరుల జాబితాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 23 నుంచి 27 సీట్లు, మిగిలిన పార్టీలకు 12 సీట్ల వరకూ రావొచ్చని అధ్యయనంలో వెల్లడైంది. |
Thursday, 16 August 2012
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్కు 23-27 లోక్సభ సీట్లు.ఎన్నికలొస్తే యూపీఏ ఇంటికే! ఇండియా టుడే-నీల్సన్ సర్వేలో వెల్లడి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment