YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Friday, April 11, 2025

Monday, 12 November 2012

వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడిగా జిట్టా


 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడు (సీఈసీ)గాను, తెలంగాణ ఐదు జిల్లాలకు రీజినల్ కో-ఆర్డినేటర్‌గా జిట్టా బాలకృష్ణారెడ్డి నియమితులయ్యారు. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు జిట్టా కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించనున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిట్టాను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కన్వీనర్లు వీరే..

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ పలు జిల్లాలు, ముఖ్య పట్టణాలకు కన్వీనర్లను, కో-ఆర్డినేటర్లను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు నేతల ఎంపిక జరిగినట్లు ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ సోమవారం తెలిపారు.

కన్వీనర్లు: వరంగల్ జిల్లా - తక్కల్లపల్లి మోహన్‌రావు, తూర్పుగోదావరి జిల్లా- అడపా వెంకట రమణ (గెడ్డం రమణ), ఒంగోలు సిటీ- ముదవర్తి బాబూరావు, హైదరాబాద్ సిటీ- శివకుమార్, విశాఖపట్నం రూరల్- మస్తానప్ప.

కో-ఆర్డినేటర్లు: పి.నర్సింహారెడ్డి- మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్; ఎం.బాబురావు- ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం; బి.ఓబుల్‌రెడ్డి- అనంతపురం, చిత్తూరు; ఎ.రాజారెడ్డి- వైఎస్‌ఆర్ జిల్లా, కర్నూలు; సీహెచ్ రవీంద్రారెడ్డి- రంగారెడ్డి, విశాఖపట్నం, గుంటూరు; ఎన్.హరికృష్ణ- నిజామాబాద్, మెదక్, నల్లగొండ; ఎం.ఎస్.వి.ఆర్.మూర్తి- శ్రీకాకుళం, విజయనగరం; ఎన్.రవిప్రసాద్- తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి; సీహెచ్ మనోరంజని- కృష్ణా; పి.మాధవనర్సింహా రెడ్డి- ప్రకాశం, నెల్లూరు.
source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!