
షర్మిలకు ఎమ్మెల్యేల సంఘీభావం
కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ఇతర జిల్లాల ప్రజాప్రతినిధులు వచ్చి మద్దతు ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(మాచర్ల) జిల్లాలోని పెద్దకడబూరు మండలంలో షర్మిలతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. వారితో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ), వై. బాల నాగిరెడ్డి(మంత్రాలయం), పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, వై. సాయిప్రసాద్ రెడ్డి, పార్టీ నేతలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి తదితరులు పాల్గొన్నారు.
source:sakshi
No comments:
Post a Comment