YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Thursday, April 10, 2025

Friday, 23 November 2012

కలుకుంట్ల గ్రామస్తులతో షర్మిల రచ్చబండ

కలుకుంట్ల గ్రామస్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల రచ్చబండ నిర్వహించారు. ఆర్డీఎస్ నీటి సమస్యను గ్రామస్తులు షర్మిల వద్ద ప్రస్థావించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ దివంగ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్డీఎస్‌కు నిధులు కేటాయించారని చెప్పారు. ఆయన మరణానంతరం ఆర్డీఎస్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కలుకుంట్ల గ్రామస్తులకు షర్మిల భరోసా ఇచ్చారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!