
బాజిరెడ్డి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. హోంమంత్రి మారారంటూ ఒకసారి, కొత్తపార్టీ వచ్చిందని మరోసారి అఖిలపక్షం పేరుతో డ్రామాలాడటం కాంగ్రెస్కు రివాజుగా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ ఇవ్వాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్కు ఉంటే పదేపదే అఖిలపక్ష సమావేశాలను ఎందుకు ఏర్పాటు చేస్తోందని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల కాంగ్రెస్ను నిలదీయాల్సిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆ పని చేయకపోగా అదే పార్టీతో దోబూచులాడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి చెప్పిన తర్వాత వైఎస్సార్సీపీ కూడా వెల్లడిస్తుందని గోవర్ధన్ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment