
వడివడిగా ముందుకుసాగుతున్న షర్మిలను చూసేందుకు చెట్లు, చేమలు, డాబాలపైకి ఎక్కారు. అభిమానులు, పార్టీశ్రేణులు, ప్రజలతో పాదయాత్ర మార్గమంతా కిటకిటలాడింది. జిల్లాలోకి అడుగిడిన తర్వాత మన్సాన్పల్లిలో షర్మిల తొలిసారి ప్రసంగానికి కరతాళ ధ్వనులు మిన్నంటాయి. వైఎస్కు జిల్లాపై ఉన్న ప్రేమ, ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సేవలను గుర్తు చే స్తుంటే స్థానికుల చప్పట్లతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. కడప, ఆనంతపూర్, కర్నూలు, మహబూబ్నగర్లో యాత్ర ముగించుకొని రంగారెడ్డి జిల్లాలోకి రాగానే తనకు అపూర్వ స్వాగతం పలికారని, ఆప్యాయంగా ఆహ్వానించారని షర్మిల అనగానే ప్రజల నుంచి హర్షధ్వనాలు వెలువడ్డాయి.
No comments:
Post a Comment