
పజలపై రోజుకో రూపంలో భారం మోపుతున్న ప్రభుత్వంపై వారు తీవ్రంగా విరుచుకుపడ్డారు. దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అటకెక్కించిన కిరణ్ సర్కారు.. చార్జీలతో చావబాదుతోందని ధ్వజమెత్తారు. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ బి.జనార్దన్రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ పుత్తాప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. వైఎస్సార్ సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ వంగపండు ఉష తదితరులు పాల్గొన్నారు.
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=458368&Categoryid=1&subcatid=33
No comments:
Post a Comment