
‘భారత చట్టాల ప్రకారం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తర్వాత మామూలుగానైతే 60 రోజులకు, లేదా 90 రోజులకు కచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సీబీఐ తన వంకరవాదనను కొనసాగిస్తోంది’ అని మండిపడ్డారు. వాన్పిక్ కేసులో సీబీఐ నాటకం బయటపడిందని, భూకేటాయింపుల్లో జగన్ ప్రమేయం లేదంటూ తప్పని పరిస్థితుల్లో హైకోర్టులో సీబీఐ న్యాయవాది అంగీకరించారని చెప్పారు. జగన్మోహన్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకొస్తారని అన్నారు. పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురికావాల్సిన అవసరంలేదని రాష్ట్ర ప్రజల దీవెనలు, అభిమానం, దేవుని ఆశీస్సులతో అక్టోబర్ 5న జగన్ తప్పక బయటకొస్తారని అంబటి పేర్కొన్నారు.
source:sakshi
No comments:
Post a Comment