YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal
Tuesday, April 08, 2025

Thursday, 9 August 2012

చంద్రబాబు హయాంలో లక్షా 60వేల కోట్ల రూపాయల విలువ చేసే భూ కేటాయింపులు

భూ కేటాయింపులపై టీడీపీ డిక్లరేషన్‌ ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో లక్షా 60వేల కోట్ల రూపాయల విలువ చేసే భూ కేటాయింపులు జరిగాయని ఆమె తెలిపారు. ప్రైవేట్ పోర్టులకు 924 ఎకరాలు ఇవ్వాలని చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్న మాట వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్‌ నడిబొడ్డున కోట్ల విలువైన భూములను సగం ధరకే ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెట్టారని ఆరోపించారు. వైఎస్‌ పథకాలను కొనసాగించాలని చంద్రబాబు స్వయంగా కోరడం సంతోషకరమని అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!