
ఒక ప్రమాదం జరిగిన ప్రతిసారీ విచారణకు ఆదేశించడం, సిఫార్సులు చేయడం, భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టడం చేయడానికి నిధులు లేవంటూ రైల్వేలు చెప్పడం పరిపాటిగా మారిందని ఆవేదన వెలిబుచ్చారు. ఇలాంటి ప్రమాదాలకు సంబంధించి ప్రతి ఒక్క కోణాన్ని స్పశిస్తూ లోగడ విచారణ కమిటీలు సమర్పించిన నివేదికల్లో పలు సిఫార్సులు అమలుకోసం ప్రభుత్వం వద్ద నిరీక్షిస్తున్న వైనాన్ని గుర్తుచేశారు. ఆయా కమిటీలు ఇచ్చిన సిఫార్సుల ప్రకారం రైల్వేలు సంస్కరణలను అమలుచేయలేకపోతున్నాయని, చాలినన్ని నిధులు లేకపోవడం, ప్రణాళికా సంఘం నుంచి బడ్జెట్పరంగా తోడ్పాటు అందాల్సివుండటం దీనికి ప్రధాన కారణాలని తెలిపారు. ఇది ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశమైనందున ఇప్పటికైనా రైల్వేలకు ఉదారంగా నిధులు ఇవ్వాలని కోరారు.
No comments:
Post a Comment