YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 2 March 2012

Speaker disqualifies 16 MLAs

In Any Moment take action on Jagan Vargam

Article about babu

Greatandhra Article:

















Chandrababu nothing done to farmers

రైతుల వద్దకు వెళ్లడానికి ముఖం చెల్లకే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష చంద్రబాబు కుమ్మక్కై సహకార ఎన్నికలు వాయిదా వేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు దుయ్యబట్టారు. రైతులకు వెన్నుదన్నుగా ఉండే సహకార సంస్థలకు ఎన్నికలు జరపకుండా నిర్విర్యం చేస్తున్నా...ప్రతిపక్ష చంద్రబాబు కిమ్మడం లేదని విమర్శించారు. ఎన్నికల గడువు ముగిసి ఆరునెలలు పూర్తయిన, మరో ఏడాదిపాటు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం పొడగిస్తున్నా ప్రతిపక్ష టీడీపీ నోరుమెదపడంలేదన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

‘‘వ్యవసాయానికి సహకారరంగం రైతులకు భరోసా అంటూ దివంగత వైఎస్‌ఆర్ చెబుతుండేవారు. అదే విధంగా ఆయన పాలన కూడా వ్యవసాయాన్ని గుండెకాయ చేసుకొని సాగింది. కానీ ప్రస్తుతం ఆయన తెచ్చిన ప్రభుత్వమే సహకార రంగాన్ని నిర్విర్యం చేస్తోంది. ఎన్నికల కాలం పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా... వాటిని నిర్వహించకుండా కిరణ్ ప్రభుత్వం పొడగిస్తోంది. రైతులకు రైతు పాలన ఇవ్వకుండా వారిపై అధికారులను బలవంతగా రుద్దుతున్నారు. కిరణ్ పాలన అచ్చం 2004కు ముందున్న చంద్రబాబు హయాంను గుర్తుచేస్తుంది’’ అని ధ్వజమెత్తారు.

రైతులకు కిరణ్-చంద్రబాబులు చేసిన ద్రోహం కళ్లముందు కనబడుతుందని, అందుకే వారిద్దరూ అన్నదాత వద్దకు వెళ్లలేకపోతున్నారన్నారు. చంద్రబాబు తన హయాంలో రైతులకు చేసిన అన్యాయాలను వివరించారు. ‘‘సహకార బ్యాంకులు రైతులకిచ్చే రుణాలపై వడ్డీ 13 శాతం ఉండేది. దాన్ని ఎన్టీఆర్ తన హయాంలో ఆరున్నర శాతం తగ్గించారు. ఆతర్వాత ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతులను పీల్చిపిప్పి చేసి 13 శాతం వడ్డీని వారినుంచి బలవంతంగా వసూలు చేశారు. 

ప్రపంచబ్యాంక్ జీతగాడిగా వాళ్లు చెప్పినట్లు తలూపుతూ రైతుల నడ్డివిరిచారు. సహకార రంగాన్ని పూర్తిగా నిర్విర్యం చేశారు. సభ్యత్వ రుసుము రూ.11 నుంచి ఏకంగా రూ. 900లకు పెంచితే పెద్ద ఎత్తున నిరసన వెళ్లువెత్తడంతో దాన్ని రూ. 300లకు చేసిన ఘనత చంద్రబాబుది’’ అని మండిపడ్డారు. అంతేకాదు ఆయన హయాంలో రైతులు కరెంట్ చార్జీలు చెల్లించకపోతే పీడీ యాక్టు కింద జైళ్లో పెట్టించేందుకు ప్రత్యేక జీవో తెచ్చిన మహానుభావుడని గట్టు ఎద్దేవా చేశారు. 

వైద్యనాథన్ కమిటీ సిపార్సును అమలు చేయాలి

సహకార బ్యాంక్‌లకు సంబంధించి వైద్యనాథన్ కమిటీ చేసిన సిపార్సులను ప్రభుత్వం అమలు చేయాలని గట్టు డిమాండ్ చేశారు. వైద్యనాథన్ సిపార్సు చేసిన రెండు సూచలను దివంగత వైఎస్ తన హయాంలో అమలు చేశారని గుర్తుచేశారు. రూ. 1600 కోట్లకు పైగా నగదును కేంద్ర బ్యాంక్‌ల్లో డిపాజిట్ చేసి ప్రతి రైతుకు వైఎస్ రుణ సదుపాయం కల్పించారన్నారు. షరతులు లేకుండా ప్రతి రైతుకు రుణం అందిచాలని డిమాండ్ చేశారు.



Wednesday 29 February 2012

29-02-2012 odharpu images

TODAY YSRCP YOUTH MEETING

ALL YSRCONGRESS PARTY MEMBERS ARE CORDIALLY 


INVITED TO ATTEND YSRCP RANGAREDDY DISTRICT 


YOUTH MEETING AT MEKALA VENKATESH FUNCTION 


HALL,BAHUDURPALLY X ROADS.


GUEST OF HONOUR; Y V SUBBA REDDY GARU.

TIME; 10AM ,1ST MARCH,2O12

Y S Vijayamma Emotional Speech In Assembly Session

Credit goes to YSR : MIM

మైనారిటీల సంక్షేమానికి కిరణ్ సర్కార్ వెలగబెట్టింది ఏమిలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మైనారిటీ విషయంలో ప్రభుత్వం చూపుతున్న వైఖరిపై అక్బరుద్దీన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల సంక్షేమానికి పాటుపడింది.. రిజర్వేషన్లను ఇచ్చింది మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఆయన సభలో గుర్తు చేశారు. మైనారిటీల సంక్షేమానికి వైఎస్ స్పందించిన తీరును సభ దృష్టికి అక్బరుద్దీన్ తీసుకు వచ్చారు. 

రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీల సంక్షేమం కోసం కేవలం 56 కోట్లు మాత్రమే కేటాయించారని ఆయన విమర్శించారు. మైనారిటీల సంక్షేమం విషయంలో కిరణ్ సర్కార్ కంటే.. పొరుగున ఉన్న కర్నాటక బీజేపీ సర్కారే నయమన్నారు. వక్ఫ్ భూముల ఆక్రమణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు.

YS Jagan Unveiled YSR Statue at Garikapadu, Guntur

ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు చూస్తుంటే చాలా బాధనిపిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న 70వ రోజు ఓదార్పుయాత్రలో భాగంగా జగన్ గరికపాడులో పర్యటించారు. గరికపాడు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న మహానేత వైఎస్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వరి వేసుకోవడం కంటే.. ఉరి వేసుకోవడం మేలని రైతులుచెబుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్‌ఆర్ బతికే ఉంటే తమకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోట వినిపిస్తోందని ఆయన అన్నారు. అంతేకాక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని ప్రజలు అంతా అనుకుంటున్నారని జగన్ అన్నారు. అనుకున్న సమయానికన్నా ఐదు గంటల లే టైనప్పటికీ.. జగన్ కోసం ప్రజలు ఓపిగ్గా ఎదురు చూశారు.


GUNTUR ODHARPU SPECIAL2

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!