YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 27 October 2012

మతాలతో రాజకీయం ?








http://telugu.greatandhra.com/mbs/oct2012/28a_10_12_mbs_a.php

Sakshi special Edition 'Ananta Adaranalo'

తెలుగుదేశం పార్టీలో అగ్రవర్ణాల ఆధిపత్యం

దళిత మహిళనని అవమానిస్తున్నారు
చంద్రబాబుకు చెప్పినా పట్టించుకోలేదు
గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత వెల్లడి
భవిష్యత్ కార్యాచరణపై రెండురోజుల్లో నిర్ణయం

దేవరపల్లి(పశ్చిమగోదావరి), న్యూస్‌లైన్: టీడీపీలో అగ్రవర్ణాల ఆధిపత్యం కొనసాగుతోందని, మూడున్నరేళ్లుగా పార్టీలో ఎన్నో ఇబ్బందులు, అవమానాలను ఎదుర్కొన్నానని పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో కొంతమంది అగ్రకుల నాయకులు తనను ఇబ్బంది పెడుతున్నట్లు ఆమె వాపోయారు. దళిత మహిళను కావడంవల్లే వారు తనను చిన్నచూపు చూస్తున్నారన్నారు. తానెదుర్కొంటున్న అవమానాల గురించి జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులకు మూడేళ్లుగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవట్లేదన్నారు. పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకుపోయినా ఫలితం లేకపోయిందన్నారు. ఎమ్మెల్యే వనిత దేవరపల్లి మండలం యర్నగూడెంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు తనకు తెలియకుండా తన నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపడుతున్నా పార్టీ పట్టించుకోవట్లేదన్నారు. పార్టీ అధిష్టానమూ బాపిరాజుకే కొమ్ము కాస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కష్టపడుతున్నా, అధిష్టానం నుంచి గుర్తింపు ఉండట్లేదన్నారు. చంద్రబాబు పాదయాత్రకు సంఘీభావంగా ఇటీవల నియోజకవర్గంలో సుమారు వంద కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించానని, అప్పుడూ కొందరు నాయకులు తనను ఇబ్బందులకు గురి చేశారని ఆమె వివరించారు. 

అల్లూరి విక్రమాదిత్య పార్టీలో చే రుతున్న విషయంగానీ, ఈ నెల 24న నిర్వహించిన కార్యక్రమం గురించికానీ తనకెవ్వరూ సమాచారం ఇవ్వకపోవడం తీవ్రమనస్తాపానికి గురి చేసిందన్నారు. తన నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో విక్రమాదిత్య కార్యక్రమాలు జరిగినప్పటికీ తనకు ఆహ్వానం లేదన్నారు. విక్రమాదిత్య కార్యక్రమం జరిగినప్పటి నుంచి తనకు ఇబ్బందులు ఎక్కువయ్యాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో ఇమడలేకపోతున్నానన్నారు. 

ఇక భరించే శక్తిలేదు: మూడేళ్లుగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నప్పటికీ ఇంటి ఇబ్బందులను వీధిలో పెట్టకూడదనే ఆలోచనతో.. ఓర్పుతో ఇంతకాలం భరించానన్నారు. ఇక భరించే ఓపికలేక తన అసంతృప్తిని పత్రికలు, మీడియా ద్వారా అధిష్టానానికి తెలియజేస్తున్నట్లు వనిత తెలిపారు. పార్టీలో స్వేచ్ఛ లేనప్పుడు ఎలా పనిచేయగలనని ప్రశ్నించారు. పొమ్మనలేక పొగపెట్టినట్టుగా పార్టీలో తనను ఇబ్బంది పెడుతున్నారన్నారు. పార్టీ మారుతున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, రెండురోజుల్లో కార్యకర్తలు, నాయకుల సమావేశం ఏర్పాటుచేసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆమె చెప్పారు.

తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందనే ఆ రెండు పార్టీలు కుట్ర

మరో ప్రజాప్రస్థానంలో వైఎస్ షర్మిల మండిపాటు
తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందనే ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయి
చంద్రబాబుకు బుద్ధి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది
జగనన్న సీఎం అయితే రైతులు తలెత్తుకొని జీవిస్తారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 10, కిలోమీటర్లు: 139.4

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాజన్న కొడుకుగా జగనన్న ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై పోరాడుతున్నాడు. జగనన్న మీ గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నాడన్న భయంతో, ఇక తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందన్న కారణంతో కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు పన్ని దొంగ కేసులు పెట్టాయి. ఈ అన్యాయాన్ని మీరంతా చూస్తున్నారు. బాబుగారికి బుద్ధి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల మండిపడ్డారు. జగనన్న సీఎం అయితే రైతులు తలెత్తుకొని తిరుగుతారని, వారి కష్టాలు తీరిపోతాయని చెప్పారు. 

శనివారం పదోరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో తన ముందు గోడు వెళ్లబోసుకున్న అనంతపురం జిల్లా రైతులకు షర్మిల ఈ మేరకు భరోసానిచ్చారు. జ్వరం కారణంగా షర్మిల కాస్త అస్వస్థతకు గురయ్యారు. అయినా ఉదయం 10.30కు పాదయాత్రకు బయలుదేరారు. మార్గమధ్యలో బడన్నపల్లి క్రాస్ సమీపంలో చెన్నారెడ్డి అనే రైతు వేరుశనగ పంటను పరిశీలించారు. తాను పూర్తిగా నష్టపోయానని ఆ రైతు మొరపెట్టుకున్నారు. భార్య తాళిబొట్టును కూడా బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చానని, ఐదెకరాల్లో 60 వేల పెట్టుబడితో వేరుశనగ పంట వేస్తే ఇప్పుడు పంటకు రూ. 15 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇంతకుముందు మండలం యూనిట్‌గా పంట బీమా అందేదని, ఇప్పుడు దాన్ని తీసేసి వాతావరణ ఆధారిత బీమా అని ఇస్తున్నాని చెప్పారు. దానివల్ల తమకు ఒరిగేదేమీ లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘‘రాజన్న ఉన్నప్పుడు పరిహారం చెల్లించే ఉద్దేశం ఉంది కాబట్టే గ్రామాన్ని యూనిట్‌గా తీసుకున్నారు. 

ఇప్పుడు ఈ ప్రభుత్వానికి పరిహారం ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే ఇలా అనేక ఆంక్షలు పెడుతున్నారు.. మన్ను తిని బతకాలని చెబుతోంది ఈ ప్రభుత్వం. జగనన్న సీఎం అయితే రైతు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వస్తుంది..’’ అని చెప్పారు. బడన్నపల్లి క్రాస్‌రోడ్డులో 11.15కు జిల్లాకు చెందిన పలువురు ముస్లిం సోదరులు షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు రాగా వారికి షర్మిల బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బడన్నపల్లి స్థానికులంతా తమకు గ్రామాల్లో నీళ్లు లేవని, కరెంటు ఉండడం లేదని వాపోయారు. అర్ధరాత్రి కరెంటు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు పంట వద్దే పడుకోవాల్సి వస్తోందని, ప్రాణాలకు కూడా భద్రత లేదని చెప్పారు. వైఎస్ ఉన్నప్పుడు కరెంటు ఉండేదని, వర్షాలు బాగా పడేవని గుర్తుచేసుకున్నారు. అందుకు ‘‘రాజు మంచోడైతే దేవుడు కూడా దీవిస్తాడు. రాజన్న ఉన్నప్పుడు మాట మీద నిలబడ్డాడు. అందుకే అప్పుడు సుభిక్షంగా ఉంది..’’ అని షర్మిల వారితో పేర్కొన్నారు. రైతుల అవసరాలు గుర్తించి ముందు చూపుతో రాజన్న కరెంటు కొనుగోలు చేసి సరఫరా చేశారని, ఈ ప్రభుత్వానికి ముందు చూపులేదని విమర్శించారు.

వాళ్లు 3 కి.మీ. నుంచి నీళ్లు తె చ్చుకుంటే తెలుస్తుంది..

స్థానికులు నీటి సమస్యను షర్మిలతో చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘వైఎస్ ఉన్నప్పుడు పెన్నా రిజర్వాయర్‌కు 10 టీఎంసీల నీటిని తీసుకురావడంతో ఆప్పుడు నీటి సమస్య లేదు. కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు ఆ నీళ్లు రాక భూగర్భజలాలు అడుగంటిపోయాయి. జిల్లాలో దాదాపు 30 వేల బోర్లు ఎండిపోయాయి. ఈ ప్రభుత్వం నిద్రపోతోంది. ముఖ్యమంత్రికేం బాగానే ఉన్నారు. మూడు కిలోమీటర్లు పోయి ఆయన భార్య నీళ్లు మోసుకొస్తే ఆ బాధ అర్థమయ్యేది. ఈ పాపం ఈ సర్కారుదే..’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.15కు గరుడాపల్లి సమీపంలో భోజన విరామానికి ఆగారు. జ్వరం కారణంగా విశ్రాంతి తీసుకుని తిరిగి సాయంత్రం 5 గంటలకు బయలుదేరారు. దారిలో వసంతపురం గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. రాత్రి 7 గంటలకు చిగిచెర్లకు చేరుకోగా స్థానికులు షర్మిలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం తుంగభద్ర నీటిని తీసుకురావడంలో విఫలమవడం వల్లే ఇక్కడ నీటి కష్టాలు వచ్చాయని మండిపడ్డారు. అనంతరం రాత్రి 7.40కి చిగిచర్ల సమీపంలో ఏర్పాటుచేసిన రాత్రిబస స్థలానికి చేరుకున్నారు.

షర్మిలకు జ్వరం

షర్మిలకు శుక్రవారం రాత్రి నుంచే జ్వరం రావడంతో కొద్దిగా నీరసించారు. రాత్రి 101.8 డిగ్రీల జ్వరం ఉందని, రెండు రోజులుగా తీవ్ర జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారని షర్మిల చిన్నాన్న కుమారుడు, వైఎస్సార్ పార్టీ నేత వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రానికి జ్వరం కాస్త తగ్గిందన్నారు. ఉదయం అనంతపురం నుంచి రిమ్స్ వైద్య నిపుణుడు డాక్టర్ వెంకటేశ్వరరావు షర్మిలకు వైద్య పరీక్షలు చేశారు. సాయంత్రం పులివెందుల నుంచి వైద్య నిపుణులు, వైఎస్ జగన్ మామ, అత్తగార్లు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, డాక్టర్ సుగుణమ్మ వచ్చి షర్మిలను పరీక్షించారు. షెడ్యూలు ప్రకారం షర్మిల శనివారం 13.8 కిలోమీటర్లు నడవాల్సి ఉండగా.. 8.5 కిలోమీటర్లు మాత్రమే నడవగలిగారు. పాదయాత్రలో పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి, పార్టీ ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి, ఆయన సతీమణి భారతి, మరో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఆయన సతీమణి మాధవి, వాసిరెడ్డి పద్మ తదితరులు నడిచారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సాయంత్రం కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు.

షర్మిల పాదయాత్రలో ఎన్‌ఆర్‌ఐలు

ధర్మవరం, న్యూస్‌లైన్: మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టిన షర్మిళకు స్థానిక ప్రజలే కాక విదేశాల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. వృత్తిరీత్యా విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు యాత్రలో పాల్గొంటున్నారు. అమెరికా నుంచి పవన్‌కుమార్, అమర్‌జీవ్, అవినాష్, వేణుగోపాల్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ విభాగం మెంబర్ షిప్ కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి అనంతపురం జిల్లాకు వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఎన్‌ఆర్‌ఐ సంఘం రాష్ట్ర కన్వీనర్ వెంకట్ మేడపాటి ఆధ్వర్యంలో యాత్రలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. కువైట్, డల్లాస్ నుంచి మరికొందరు ఈ పాదయాత్రలో పాల్గొంటారన్నారు.
మరో ప్రజాప్రస్థానంలో వైఎస్ షర్మిల మండిపాటు
తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందనే ఆ రెండు పార్టీలు కుట్ర పన్నాయి
చంద్రబాబుకు బుద్ధి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది
జగనన్న సీఎం అయితే రైతులు తలెత్తుకొని జీవిస్తారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 10, కిలోమీటర్లు: 139.4

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘రాజన్న కొడుకుగా జగనన్న ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై పోరాడుతున్నాడు. జగనన్న మీ గుండెల్లో స్థానం సంపాదించుకుంటున్నాడన్న భయంతో, ఇక తమ దుకాణాలు మూసుకోవాల్సి వస్తుందన్న కారణంతో కాంగ్రెస్, టీడీపీలు కుట్రలు పన్ని దొంగ కేసులు పెట్టాయి. ఈ అన్యాయాన్ని మీరంతా చూస్తున్నారు. బాబుగారికి బుద్ధి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల మండిపడ్డారు. జగనన్న సీఎం అయితే రైతులు తలెత్తుకొని తిరుగుతారని, వారి కష్టాలు తీరిపోతాయని చెప్పారు. 

శనివారం పదోరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో తన ముందు గోడు వెళ్లబోసుకున్న అనంతపురం జిల్లా రైతులకు షర్మిల ఈ మేరకు భరోసానిచ్చారు. జ్వరం కారణంగా షర్మిల కాస్త అస్వస్థతకు గురయ్యారు. అయినా ఉదయం 10.30కు పాదయాత్రకు బయలుదేరారు. మార్గమధ్యలో బడన్నపల్లి క్రాస్ సమీపంలో చెన్నారెడ్డి అనే రైతు వేరుశనగ పంటను పరిశీలించారు. తాను పూర్తిగా నష్టపోయానని ఆ రైతు మొరపెట్టుకున్నారు. భార్య తాళిబొట్టును కూడా బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చానని, ఐదెకరాల్లో 60 వేల పెట్టుబడితో వేరుశనగ పంట వేస్తే ఇప్పుడు పంటకు రూ. 15 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇంతకుముందు మండలం యూనిట్‌గా పంట బీమా అందేదని, ఇప్పుడు దాన్ని తీసేసి వాతావరణ ఆధారిత బీమా అని ఇస్తున్నాని చెప్పారు. దానివల్ల తమకు ఒరిగేదేమీ లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘‘రాజన్న ఉన్నప్పుడు పరిహారం చెల్లించే ఉద్దేశం ఉంది కాబట్టే గ్రామాన్ని యూనిట్‌గా తీసుకున్నారు. 

ఇప్పుడు ఈ ప్రభుత్వానికి పరిహారం ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టే ఇలా అనేక ఆంక్షలు పెడుతున్నారు.. మన్ను తిని బతకాలని చెబుతోంది ఈ ప్రభుత్వం. జగనన్న సీఎం అయితే రైతు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వస్తుంది..’’ అని చెప్పారు. బడన్నపల్లి క్రాస్‌రోడ్డులో 11.15కు జిల్లాకు చెందిన పలువురు ముస్లిం సోదరులు షర్మిలకు సంఘీభావం తెలిపేందుకు రాగా వారికి షర్మిల బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బడన్నపల్లి స్థానికులంతా తమకు గ్రామాల్లో నీళ్లు లేవని, కరెంటు ఉండడం లేదని వాపోయారు. అర్ధరాత్రి కరెంటు ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో రైతులు పంట వద్దే పడుకోవాల్సి వస్తోందని, ప్రాణాలకు కూడా భద్రత లేదని చెప్పారు. వైఎస్ ఉన్నప్పుడు కరెంటు ఉండేదని, వర్షాలు బాగా పడేవని గుర్తుచేసుకున్నారు. అందుకు ‘‘రాజు మంచోడైతే దేవుడు కూడా దీవిస్తాడు. రాజన్న ఉన్నప్పుడు మాట మీద నిలబడ్డాడు. అందుకే అప్పుడు సుభిక్షంగా ఉంది..’’ అని షర్మిల వారితో పేర్కొన్నారు. రైతుల అవసరాలు గుర్తించి ముందు చూపుతో రాజన్న కరెంటు కొనుగోలు చేసి సరఫరా చేశారని, ఈ ప్రభుత్వానికి ముందు చూపులేదని విమర్శించారు.

వాళ్లు 3 కి.మీ. నుంచి నీళ్లు తె చ్చుకుంటే తెలుస్తుంది..

స్థానికులు నీటి సమస్యను షర్మిలతో చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘వైఎస్ ఉన్నప్పుడు పెన్నా రిజర్వాయర్‌కు 10 టీఎంసీల నీటిని తీసుకురావడంతో ఆప్పుడు నీటి సమస్య లేదు. కానీ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇప్పుడు ఆ నీళ్లు రాక భూగర్భజలాలు అడుగంటిపోయాయి. జిల్లాలో దాదాపు 30 వేల బోర్లు ఎండిపోయాయి. ఈ ప్రభుత్వం నిద్రపోతోంది. ముఖ్యమంత్రికేం బాగానే ఉన్నారు. మూడు కిలోమీటర్లు పోయి ఆయన భార్య నీళ్లు మోసుకొస్తే ఆ బాధ అర్థమయ్యేది. ఈ పాపం ఈ సర్కారుదే..’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ్నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.15కు గరుడాపల్లి సమీపంలో భోజన విరామానికి ఆగారు. జ్వరం కారణంగా విశ్రాంతి తీసుకుని తిరిగి సాయంత్రం 5 గంటలకు బయలుదేరారు. దారిలో వసంతపురం గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. రాత్రి 7 గంటలకు చిగిచెర్లకు చేరుకోగా స్థానికులు షర్మిలకు మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ... ఈ ప్రభుత్వం తుంగభద్ర నీటిని తీసుకురావడంలో విఫలమవడం వల్లే ఇక్కడ నీటి కష్టాలు వచ్చాయని మండిపడ్డారు. అనంతరం రాత్రి 7.40కి చిగిచర్ల సమీపంలో ఏర్పాటుచేసిన రాత్రిబస స్థలానికి చేరుకున్నారు.

షర్మిలకు జ్వరం

షర్మిలకు శుక్రవారం రాత్రి నుంచే జ్వరం రావడంతో కొద్దిగా నీరసించారు. రాత్రి 101.8 డిగ్రీల జ్వరం ఉందని, రెండు రోజులుగా తీవ్ర జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారని షర్మిల చిన్నాన్న కుమారుడు, వైఎస్సార్ పార్టీ నేత వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రానికి జ్వరం కాస్త తగ్గిందన్నారు. ఉదయం అనంతపురం నుంచి రిమ్స్ వైద్య నిపుణుడు డాక్టర్ వెంకటేశ్వరరావు షర్మిలకు వైద్య పరీక్షలు చేశారు. సాయంత్రం పులివెందుల నుంచి వైద్య నిపుణులు, వైఎస్ జగన్ మామ, అత్తగార్లు డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, డాక్టర్ సుగుణమ్మ వచ్చి షర్మిలను పరీక్షించారు. షెడ్యూలు ప్రకారం షర్మిల శనివారం 13.8 కిలోమీటర్లు నడవాల్సి ఉండగా.. 8.5 కిలోమీటర్లు మాత్రమే నడవగలిగారు. పాదయాత్రలో పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి, పార్టీ ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి, ఆయన సతీమణి భారతి, మరో ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఆయన సతీమణి మాధవి, వాసిరెడ్డి పద్మ తదితరులు నడిచారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సాయంత్రం కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు.

షర్మిల పాదయాత్రలో ఎన్‌ఆర్‌ఐలు

ధర్మవరం, న్యూస్‌లైన్: మరో ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేపట్టిన షర్మిళకు స్థానిక ప్రజలే కాక విదేశాల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. వృత్తిరీత్యా విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు యాత్రలో పాల్గొంటున్నారు. అమెరికా నుంచి పవన్‌కుమార్, అమర్‌జీవ్, అవినాష్, వేణుగోపాల్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ విభాగం మెంబర్ షిప్ కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి అనంతపురం జిల్లాకు వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఎన్‌ఆర్‌ఐ సంఘం రాష్ట్ర కన్వీనర్ వెంకట్ మేడపాటి ఆధ్వర్యంలో యాత్రలో పాల్గొన్నట్లు వారు తెలిపారు. కువైట్, డల్లాస్ నుంచి మరికొందరు ఈ పాదయాత్రలో పాల్గొంటారన్నారు.

మీ పలుకుబడితో చేస్తున్న పని ఇదా?!


ప్రజలు మిమ్మల్ని నాయకులుగా చేసింది మీ స్వప్రయోజనాల కోసం పోరాడడానికా, ప్రజల స్వరం వినిపించడానికా? జగన్‌కు వ్యతిరేకంగా చేసే పోరాటంలో ఒక్క శాతం అయినా ప్రజలకోసం నిజంగా పోరాడండి. ప్రజలకు సౌకర్యాలను సాధించిపెట్టండి. అప్పుడు ‘మీకోసం’ అంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు.

కొద్దిరోజుల క్రితం జగన్ బెయిల్ హియరింగ్ రోజున- అంటే అక్టోబర్ 5న సుప్రింకోర్టుకు సీబీఐ అందించిన స్టేటస్ రిపోర్ట్ చూశాను. అందులో ‘సాక్షి’ సంస్థ ఆస్తుల ఈడీ అటాచ్‌మెంట్ ప్రస్తావన వుంది. అది చూసిన వారికి ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది - కాంగ్రెస్, సంబంధిత సీబీఐ మరియు టీడీపీ ఎంత బాగా కలిసి పనిచేస్తున్నాయో.

సుప్రింకోర్టులో రాతపత్రం - అందునా 17 పేజీల రాతపత్రం సమర్పించాలంటే అప్పటికప్పుడు టైప్ చేయించి ఇవ్వడం వీలుపడదు. కానీ అక్టోబర్ 4 సాయంత్రం చంద్రబాబుగారి టీడీపీ ఎంపీలు చిదంబరం గారిని కలిసి ‘జగన్ ఆస్తులను అటాచ్ చెయ్యండి’ అని వినతిపత్రం ఇచ్చారు. ‘మీకోసం’ పాదయాత్రలో ఉన్న బాబుగారితో ఫోన్‌లో మాట్లాడించారు. రెండుమూడు గంటల వ్యవధిలో ‘సాక్షి’ సంస్థ ఆస్తులు అటాచ్ అయ్యాయి. ఇది అక్టోబర్ 5న సీబీఐ రాతపత్రం సమర్పించడానికి కొన్ని గంటల ముందు జరిగిన పరిణామం. అయినప్పటికీ సీబీఐ రాత

పత్రంలో ఈ విషయం చోటుచేసుకుంది. రెండు నెలలకు పైగా సుప్రీంకోర్టులో ఈ బెయిల్ హియరింగ్ విచారణలో వుంది. ఇన్ని రోజులు సమర్పించని రాతపత్రం టీడీపీ ఎంపీలు ‘సాక్షి’ ఆస్తులు అటాచ్ చేయించిన వెంటనే దాన్ని కూడా కొన్ని గంటల వ్యవధిలోనే రాతపత్రంలో పొందుపరిచి కోర్టుకు సమర్పించారు. టీడీపీ వాళ్ల వినతి మేరకు ఈడీ అటాచ్ చేస్తుంది... చేసిన వెంటనే అక్టోబర్ 5న దానిని జతచేసి రాతపత్రం కోర్టుకు సమర్పించాలనేది కాంగ్రెస్, టీడీపీ, సీబీఐల వ్యూహం. అక్టోబర్ 5న ఈ కుట్రల వల్ల బెయిల్ రాలేదు. ఇది అందరూ కలిసి ఆడుతున్న నాటకమని, దీనివెనక బెయిల్ రాకుండా అడ్డుకోవడానికి ఎంత కుట్ర దాగివుందని అర్థమవుతుంది.

ఒక కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ఇన్ని ప్లాన్‌లు వేస్తున్నారు? వైయస్‌ఆర్ గారికి, జగన్‌కు ఉన్న ప్రజాభిమానం చూసి ఓర్వలేక వారిని ఇబ్బందిపెట్టాలనుకుంటున్నారా? కానీ ఇలా చేస్తే వైయస్‌ఆర్ గారికి, జగన్‌కు ప్రజాభిమానం పెరిగేదే కాని తరిగేది కాదు. పెపైచ్చు ఇంత అన్యాయంగా కుట్రలు చేసే మీమీద అసహ్యం పెరగక మానదు. మిమ్మల్ని జనం అపనమ్మకంతో చూస్తారు. మీరు చేసేవన్నీ నాటకాలు అనుకుంటారు.

నిజం నిప్పులాంటిది. అన్నిరోజులు అందరినీ మోసం చేయలేరు. ప్రజాభిమానం పొందాలంటే మీ ఎంపీలను ఢిల్లీ పంపి ప్రజలకోసం వినతిపత్రాలు ఇవ్వండి. జగన్‌కు వ్యతిరేకంగానో, మీ కేసుల కోసమో కాకుండా ప్రజా సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో నేరుగా మాట్లాడి... లేదంటే ఫోన్‌లో మాట్లాడి పనులు చేయించండి. ఫోన్‌లో మాట్లాడి, ఎంపీలను పంపి ఆస్తులు అటాచ్ చెయ్యగల సామర్థ్యం ఉన్నప్పుడు ఆ సామర్థ్యాన్ని ప్రజా సమస్యల కోసం వాడండి. ఒక పెన్షన్ ఇప్పించండి. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయించండి. కొన్ని గంటలైనా అదనంగా కరెంటు ఇప్పించండి. అప్పుడు ప్రజాభిమానం దానంతట అదే వస్తుంది. దేవుడిచ్చిన పలుకుబడిని ఒకరిని ఇబ్బందిపెట్టడానికి బదులు, ఒకరికి మేలు చేయడానికి వాడండి. అప్పుడు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. దేవుడు మిమ్మల్ని కటాక్షిస్తాడు.

ఈరోజు జగన్‌కు వుండే బలం అదే. ‘సాక్షి’ ఆస్తులు అటాచ్ చేస్తే జగన్‌ను దెబ్బతీసినట్టు అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే జగన్ ఆస్తి ప్రజాభిమానం, దేవుని దయ. జగన్ పోరాటం తనకోసం కాదు... ప్రజలకోసం. అందుకే ప్రజలు జగన్‌ను అభిమానిస్తున్నారు.

గత మూడు సంవత్సరాలుగా ప్రజలు ఇన్ని కష్టాలు పడుతుంటే ప్రజా సమస్యలు గాలికి వదిలేసి, మన రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు చనిపోయిన వ్యక్తి గురించి చెడు మాట్లాడడం సభ్యత కాదు అని కూడా మరచి మాట్లాడుతున్నారు. 2009కి ముందు అసలు హైదరాబాద్‌లోనే లేని, ప్రభుత్వంతో సంబంధం లేని జగన్ మీద నిందలు మోపి, కేసులు వేసి, కుట్రతో జైలుకు పంపారు. బెయిల్ రాకుండా ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. ఈరోజు కొత్తగా జైలులో సౌకర్యాలు అని పాట పాడుతున్నారు. ఇన్ని మాటలు మాట్లాడే పెద్దమనుషులు వారిని ఎన్నుకున్న ప్రజలకోసం ఎంత మాట్లాడారు? వైయస్సార్ గారికి, జగన్‌కు వ్యతిరేకంగా ఎన్ని మాటలు మాట్లాడారు? ప్రజలు వీరిని నాయకులుగా చేసింది వీరి స్వప్రయోజనాల కోసం పోరాడడానికా, ప్రజల స్వరం వినిపించడానికా? జగన్‌కు వ్యతిరేకంగా చేసే

పోరాటంలో ఒక్క శాతం అయినా ప్రజలకోసం నిజంగా పోరాడండి. ప్రజలకు సౌకర్యాలను సాధించిపెట్టండి. అప్పుడు ‘మీకోసం’ అంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు.

జగన్ ఆలోచనలన్నీ ప్రజలకోసం తనేం చెయ్యగలనా అని! అంతేకాని, మిమ్మల్ని ఎలా ఇరికించాలా, ఎలా ఇబ్బందులు పెట్టాలా అని కాదు. అందుకే జగన్‌ను ప్రజలు నమ్ముతున్నారు. అభిమానిస్తున్నారు. జగన్‌కు కుళ్ళు, కుట్రలు రావు, తెలీదు. అందుకే దేవుని దయ జగన్‌ను ఆశీర్వదిస్తుంది.


- వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్

తీవ్ర జ్వరం బాధిస్తున్నా ....

అనంతపురం, న్యూస్‌లైన్‌ప్రతినిధి: జ్వరం బాధిస్తున్నా లెక్క చేయలేదు.. ప్రజాభిమానం ముందు ఆరోగ్యాన్ని ఖాతరు చేయలేదు.. జనాదరణ నానాటికీ రెట్టింపు అవుతుండటంతో వైఎస్ తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను మడమ తిప్పకుండా కొనసాగించారు. తీవ్ర జ్వరం బాధిస్తున్నా శనివారం 8.5 కిలోమీటర్ల దూరం నడిచారు. 


దర్మవరం మండలం గొల్లపల్లి శివారులో బసచేసిన షర్మిలకు శుక్రవారం రాత్రి తీవ్ర జ్వరం వచ్చింది. వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు మందులు వేసుకున్నారు. కానీ.. శనివారం ఉదయానికి కూడా జ్వరం తగ్గలేదు. శనివారం ఉదయం షర్మిలను పరీక్షించిన అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు కొంత విశ్రాంతి తీసుకోవాలని సూచించినా షర్మిల వినలేదు. తన కోసం వేలాది మంది ప్రజలు వేచి చూస్తున్నారని.. వారిని కలుసుకోవడం కోసం పాదయాత్ర కొనసాగిస్తానని తెగేసి చెప్పారు. ఆ తర్వాత ఉదయం 10.30 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు.

శుక్రవారం బసచేసిన ప్రాంతానికి భారీ ఎత్తున తరలి వచ్చిన జనం షర్మిల వెంట అడుగులో అడుగేస్తూ కదంతొక్కారు. పాదయాత్ర సాగే మార్గంలో రైతులను, రైతు కూలీలను, విద్యార్థులను, మహిళలను అప్యాయంగా పలకరిస్తూ.. ఆత్మీయంగా దగ్గరికి తీసుకుని.. వారి సమస్యలపై ఆరా తీస్తూ.. భుజంపై చేయి వేసి వారికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. పాదయాత్ర బడన్నపల్లి క్రాస్‌కు చేరుకునే సరికి అప్పటికే ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. అక్కడే ఉన్న వేరుశనగలో చేనులోకి వెళ్లి.. రైతు చెన్నారెడ్డితో సమస్యలపై ఆరా తీశారు. 

‘అన్నా.. ఎన్ని ఎకరాల్లో వేరుశనగ వేశావు. ఏమేరకు దిగుబడి వస్తుంది’ అంటూ షర్మిల అడిగారు. ఇందుకు చెన్నారెడ్డి స్పందిస్తూ.. ‘అమ్మా.. ఐదెకరాల్లో వేరుశనగ వేశా. ఎకరానికి 20 బస్తాల దిగుబడి వస్తే గిట్టుబాటు అవుతుంది. కానీ.. ఇప్పుడు చెట్టుకు రెండు మూడు కాయలు కూడా లేవు. ఐదెకరాలకు కలిసి 15 బస్తాలు కూడా రావు. పంట సాగుకు రూ.60 వేలు ఖర్చు చేశా. పెట్టుబడి కూడా గిట్టదు. ఇంతకు ముందే రూ.5 లక్షల అప్పుంది. ఈ ఏడాది పెళ్లాం మెడలో తాళిబొట్టు కూడా కుదువపెట్టి పంట సాగుచేశా. వాటిని విడిపించుకునే శక్తి కూడా లేదు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అన్నా.. మీకు ఇన్‌పుట్ సబ్సిడీగానీ, పంట నష్టపరిహారాన్ని గానీ ప్రభుత్వం ఇవ్వలేదా’ అని అడిగారు. ‘అమ్మా.. రైతుకు నష్టం జరిగితే ఆదుకునే కాలం వైఎస్‌తోనే పోయింది. అప్పుడు పంట ఎండినా.. పండినా ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యంగా బతికే వాళ్లం. ఇప్పుడు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే.. వాతావరణ బీమాను వేరుశనగకు అమలు చేస్తున్నారు. 

ఆ పథకం వల్ల ఎలాంటి లాభం లేదు. పంటల బీమానే గ్రామం యూనిట్‌గా వైఎస్ అమలు చేసినట్లుగా అమలు చేస్తే రైతుకు న్యాయం జరుగుతుంది’ అంటూ వివరించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘ఈ ప్రభుత్వం రైతులకు మన్నుతిని బతకమని చెబుతున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు ఏమీ చేయలేం. అధైర్యపడొద్దు. రాజన్న రాజ్యం వస్తుంది. వైఎస్ అమలు చేసిన ప్రతి పథకాన్ని అమలు చేస్తాం’ అంటూ భరోసా కల్పించారు.

రచ్చబండ నిర్వహించిన షర్మిల
బడన్నపల్లి క్రాస్‌లో వైఎస్సార్‌సీపీ నేత సాలార్‌బాష నేత ృత్వంలో ముస్లింలు బక్రీద్ పండుగ సందర్భంగా షర్మిలను కలుసుకున్నారు. వారికి ఆమె బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత జగన్‌కు మంచి జరగాలని.. పాదయాత్ర విజయవంతం కావాలని.. ప్రజలకు కష్టాలు తొలగిపోవాలని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతం అక్కడే షర్మిల బడన్నపల్లి గ్రామానికి చెందిన మహిళలతో రచ్చబండ నిర్వహించారు.

‘అక్కా.. మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి’ అంటూ ఆత్మీయంగా ఆరా తీశారు. ఇందుకు జయప్రద అనే బీటెక్ విద్యార్థిని స్పందిస్తూ.. ‘అక్కా.. మా నాన్న పొలానికి రాత్రి ఒంటి గంటకు వెళతారు. మళ్లీ ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియదు. కారణం ఏమిటంటే.. సేద్యానికి కరెంట్ రాత్రి పూట ఇస్తారు. రాత్రి పూట మా నాన్నకు ఏం జరుగుతుందోనని భయంతో రోజూ ఆందోళన చెందుతున్నాం. ప్రతి రైతుదీ ఇదే సమస్య. మా నాన్న ఫీజు కట్టడానికి కష్టపడుతున్నారు. పంటలు పండక అప్పులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు కోతలు పెడుతోంది. మాలాంటి వారు ఎలా చదవుకోవాలి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘వైఎస్ హయాంలో సేద్యానికి కచ్చితంగా ఏడు గంటలు విద్యుత్ ఇచ్చేవారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేవారు. కానీ.. ఈ ప్రభుత్వం కోతలు పెట్టడమే పనిగా పెట్టుకుంది. రాజు మంచోడైతే దేవుడి దీవెనలు కూడా ఉంటాయి’ అంటూ వివరించారు. ఆ తర్వాత రాణి అనే మహిళ మాట్లాడుతూ ‘అక్కా.. మా గ్రామంలో తాగడానికి నీళ్లు లేవు’ అంటూ చెప్పింది. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘వైఎస్ పీఏబీఆర్‌కు పది టీఎంసీలు నీటిని కేటాయించి దాహార్తిని తీర్చితే.. ఈ ప్రభుత్వం వాటిని రద్దు చేసి తాగునీటి కష్టాలను పెంచుతోంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

చంద్రబాబుపై నిప్పులు
మధ్యాహ్నం గరుడంపల్లి సమీపంలో భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకున్న షర్మిల సాయంత్రం ఐదు గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. వసంతాపురం క్రాస్ మీదుగా చిగిచెర్లకు చేరుకున్నారు. షర్మిల చేరుకునే సరికి చిగిచెర్ల జనసంద్రంగా మారింది. అక్కడ ప్రజల సమస్యలపై షర్మిల ఆరా తీశారు. ‘అక్కా.. వైఎస్ ఉన్నప్పుడు సకాలంలో వర్షాలు పడేవి. మంచి పంటలు పండేవి. కానీ.. ఇప్పుడు వర్షాలు పడటం లేదు. పంటలు పండటం లేదు. తాగునీటి కోసం ఆడవాళ్లు జుట్లుజుట్లు పట్టుకునే దుస్థితి దాపురించింది’ అంటూ వాపోయారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘రాజు మంచోడైతే దేవుడి దీవెనలు కూడా ఉంటాయి. వైఎస్ మంచోడు కాబట్టే ప్రజలకు అంతా మంచే జరిగింది. 

కానీ.. ఈ ప్రభుత్వం ఎడాపెడా పన్నులు పెంచుతూ ప్రజలను బాధిస్తోంది. దేవుడు కూడా వర్షాలు కురిపించడం లేదు. కొద్ది రోజులు ఓపికపట్టండి. మన రాజన్న రాజ్యం వస్తుంది’ అంటూ భరోసా ఇచ్చారు. ‘అక్కా గ్యాస్ ధరలు పెంచేశారు. ఇప్పుడు ఏడాదికి ఆరు సిలిండర్లే ఇస్తారట. ఇదెక్కడి న్యాయం’ అంటూ ఓ మహిళ మొరపెట్టుకుంది. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘చంద్రబాబు సీఎం అయ్యే నాటికి సిలిండర్ ధర రూ.145 ఉండేది. ఆయన దిగిపోయే నాటికి రూ.305కు పెంచారు. ఆ తర్వాత వైఎస్ ఐదేళ్ల హయాంలో సిలిండర్‌పై ఒక్క రూపాయి కూడా పెంచలేదు. కేంద్ర ప్రభుత్వం సిలిండర్‌పై రూ.50 పెంచితే దాన్ని వైఎస్ భరించారు. 

పేదలపై మోపలేదు. కానీ.. ఈ ప్రభుత్వం సిలిండర్ ధరను సగటున రూ.850కు పెంచేసింది. ఇదెక్కడి న్యాయం’ అంటూ ప్రశ్నించారు. ఆ తర్వాత బహిరంగ సభలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఎన్నో పాపాలు చేశారు. నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎనిమిది సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. ఆర్టీసీ చార్జీలు పెంచారు. ప్రజలపై ఎడాపెడా పన్నులు విధించి.. పీల్చిపిప్పిచేశారు. ఇప్పుడు పాదయాత్ర అంటూ ఎల్లోడ్రామా ఆడుతున్నారు. పాదయాత్రలో చంద్రబాబు శ్మశానాలుగా మార్చిన గ్రామాల్లో ప్రజల కాళ్లు చేతులు పట్టుకుని క్షమాపణ అడిగినా ఆయన చేసిన పాపం పోదు’ అంటూ నిప్పులు చెరిగారు. షర్మిల ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన లభించింది. చిగిచెర్ల శివారులో రోడ్డు పక్కన వేసిన గుడారాల వద్ద రాత్రి 7.45 గంటల సమయంలో పాదయాత్రను ముగించి, అక్కడే బస చేశారు.

నేడు ఎస్కేయూ వద్ద షర్మిల బహిరంగసభ

 షర్మిల పాదయాత్ర ఆదివారం రాప్తాడు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. సాయంత్రం ఐదు గంటలకు ఎస్కే యూనివర్సిటీ వద్ద బహిరంగసభలో షర్మిల ప్రసంగిస్తారని చెప్పా రు. శనివారం ఆయన అనంతపురంలోని తన నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. కర్ణాటకలోని పావగడ, బాగేపల్లి నుంచి వెయ్యి ద్విచక్ర వాహనాల్లో రెండువేల మంది యువకులు కందుకూరుకు తరలివచ్చి షర్మిలకు ఘనస్వాగతం పలకనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని మహిళలు వైఎస్సార్‌సీపీ జెండా నమూనాతో తయారు చేసిన చీరలను ధరించి షర్మిలకు హారతులు పట్టనున్నట్లు చెప్పారు. 
పాదయాత్ర, బహిరంగసభకు నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పాదయాత్రకు హాజరయ్యే వారికి భోజనంతోపాటు 50వేల మంచి నీళ్ల ప్యాకెట్లు, 20 వేల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్, ఆపార్టీతో అంటకాగుతున్న టీడీపీ చర్యలకు నిరసనగా వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రతి కార్యకర్తా నల్ల బ్యాడ్జీ ధ రించి పాదయాత్రకు హాజరుకావాలన్నారు. చంద్రబాబు అధికార దాహంతో ‘వస్తున్నా.. మీ కోసం’ అంటూ బోగ స్ యాత్ర చేస్తున్నారని ప్రకాష్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పుట్టెడు కష్టాల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకు మేమున్నాం అని ధైర్యం చెప్పడానికి షర్మిల పాదయాత్ర చేస్తున్నారని వివరించారు.

source:sakshi

వైఎస్సార్‌సీపీలోకి తరిమెల శరత్ చంద్రారెడ్డి

 తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ తరిమెల శరత్‌చంద్రారెడ్డి ఈ నెల 29న వైఎస్సార్ సీపీలో చేరనున్నారు. అనంతపురం నగరంలో షర్మిల పాదయాత్ర సందర్భంగా వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. 

ఈయన శింగనమల నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా పేరుపొందిన కపార్ట్ మాజీ రీజనల్ చైర్మన్, దివంగత తరిమెల శేషానందరెడ్డి సోదరుడు. నియోజకవర్గంలో టీడీపీ నుంచి బల మైన నాయకుడిగా పేరు పొందారు. 50 ఏళ్ల రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. మహానేత వైఎస్‌తో సన్నిహిత సంబంధాలుం డేవి. ఈయనతో పాటు ఇద్దరు మాజీ జెడ్పీటీసీలు, ఇద్దరు మాజీ ఎంపీపీలు, 19 మంది మాజీ ఎంపీటీసీ సభ్యులు, 22 మంది మాజీ సర్పంచులు వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు.

source:sakshi
అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర ఈ రోజు చిగిచర్ల క్రాస్ నుంచి ప్రారంభమవుతుంది. ఆమె పాదయాత్ర 11వ రోజుకు చేరింది. హంపాపురం క్రాస్, కందుకూరు మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ వద్ద బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు.

నేడు షర్మిల 11వ రోజు పాదయాత్ర

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర ఈ రోజు చిగిచర్ల క్రాస్ నుంచి ప్రారంభమవుతుంది. ఆమె పాదయాత్ర 11వ రోజుకు చేరింది. హంపాపురం క్రాస్, కందుకూరు మీదుగా ఈ యాత్ర కొనసాగుతుంది. శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ వద్ద బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తారు.

Another shock to tdp in West Godavari District



YS Sharmila's speech at Chegicharla in Ananthapur

Bhumana Karunakar Reddy Press Meet 27th Oct 2012

YS Sharmila suffering from fever

YS Sharmila fire on Chandrababu naidu

షర్మిల పాదయాత్ర చిగిచర్ల వరకు కుదింపు

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల జ్వరంతో బాధపడుతున్నారు. విశ్రాంతి తీసుకోవాలని డాక్లర్లు ఆమెకు సూచించారు. అయినప్పటికీ ఆమె పాదయాత్ర కొనసాగిస్తానన్నారు. ఈ రోజు షర్మిల పాదయాత్రను చిగిచర్ల వరకు కుదించినట్లు పార్టీ నేత తలశిల రఘురాం చెప్పారు.

'షర్మిల పాదయాత్రకు అనూహ్యస్పందన'

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల పాదయాత్రకు అనూహ్యస్పందన లభిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. షర్మిల పాదయాత్ర చారిత్రాత్మకమైనదన్నారు. ఇప్పటి వరకు ఆమె 38 గ్రామాల్లో 137 కిలో మీటర్లు పాదయాత్ర చేసినట్లు వివరించారు. ఇప్పటివరకు 6 లక్షల మంది ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నట్లు చెప్పారు. స్వల్ప జ్వరం కారణంగా నేడు ఆమె పాదయాత్రను 6 కిలో మీటర్లకు కుదించినట్లు చెప్పారు. రేపటి నుంచి యథావిధిగా ఆమె పాదయాత్ర సాగిస్తారన్నారు. వైఎస్ జగన్ ఎక్కడున్నా దృష్టంతా ప్రజల సమస్యలపైనేనన్నారు. 

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర విషాదయాత్రగా సాగుతోందన్నారు. ప్రజల్లో చంద్రబాబుకు ఏమాత్రం విశ్వాసం లేదని చెప్పారు.

తెలుగుదేశం పార్టీకి మరో షాక్

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత తెలుగుదేశం పార్టీని వదలి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరవచ్చని చెబుతున్నారు. దీనికి ముఖ్యకారణం కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే , టిడిపి సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణారావు పార్టీకి గుడ్ బై చెప్పి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరుతుండడమే. ఆయనకు ముఖ్య అనుచరుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాబాజీరావు కుమార్తె వనతి. ఆ రాజకీయ సంబందాల రీత్యా కృష్ణారావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని టిడిపి ఎమ్మెల్యేను కూడా తనతోపాటు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లోకి తీసుకు వెళితే అది తనకు ప్రతిష్టగా ఉంటుందని ఆయన భావించి ఉంటారు. ఇటీవలే చింతలపూడి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేశ్ కూడా పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అదే జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే వనిత కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపు వెళ్లడం వల్ల ఆ పార్టీకి కొంత బలం పెరుగుతుంది.

http://kommineni.info/articles/dailyarticles/content_20121027_7.php

బుడంగపల్లిలో మహిళలతో షర్మిల రచ్చబండ

అనంతపురం: మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా పదవరోజు జిల్లాలోని గొల్లపల్లిలో షర్మిల శనివారం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా బడంగపల్లి చేరుకున్న షర్మిల అక్కడి వేరుశనగ పంటలు పరిశీలించి రైతుల కష్టనష్టాలు తెలుసుకున్నారు. అనంతరం శనివారం బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.


అనంతపురం: జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల బుడంగపల్లెలోని మహిళలతో సమావేశమయ్యారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు రచ్చబండ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ తమ ప్రాంతంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి ఉందన్నారు. ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ సీఎం భార్య కూడా 3 కిలోమీటర్లు నడిచి తాగునీరు తెచ్చుకుంటే తప్ప ప్రజలు బాధలు తెలుసుకోలేరని విమర్శించారు. అక్కడ క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి నిక్షేపంగా ఉన్నారని, ఇక్కడ మాత్రం ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు.

Special edition on Ananta Aadaranalo

Anna Rajanna..Anna Rajanna...a song for Maro Prajaprasthanam

TDP MLA Vanita thinks to resign

Dont worry about Sharmila's health: Vasireddy Padma

Friday 26 October 2012

maro praja prasthanam

ప్రత్యర్థులు బెదిరిపోయేలా మిన్నంటిన జగన్నినాదాలు


జనం.. జనం.. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా జనమే.. దిక్కులు పిక్కటిల్లేలా.. ప్రత్యర్థులు బెదిరిపోయేలా మిన్నంటిన జగన్నినాదాలు.. అడుగులో అడుగేస్తూ కదంతొక్కిన జనసందోహం.. ఇదీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు జిల్లాలో నాలుగో రోజు వచ్చిన జనస్పందన. 

ఈనెల 18న ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. మన జిల్లాలో నాలుగో రోజుకు చేరుకుంది. గురువారం రాత్రి తుమ్మల శివారులో రోడ్డు పక్కన వేసిన గుడారాల్లో బస చేసిన షర్మిల శుక్రవారం ఉదయం 10.20 గంటలకు పాదయాత్రకు ఉపక్రమించారు. అక్కడి నుంచి నదిలా ప్రారంభమైన జనప్రవాహం ధర్మవరం చేరుకునే సరికి సముద్రాన్ని తలపించింది. 

తుమ్మల క్రాస్ నుంచి ధర్మవరం పట్టణానికి చేరుకునే మార్గమధ్యలో వేరుశనగ పొలంలో గుంటక పాస్తున్న మల్లేనిపల్లికి చెందిన రైతు కురుబ వెంకటేశును షర్మిల పలకరించారు. చేనులోకి ఎవరూ వెళ్లొద్దని సూచించిన షర్మిల.. పరిస్థితులపై రైతుతో ఆరా తీశారు. ‘అన్నా ఎన్ని ఎకరాల్లో వేరుశనగ వేశావు. ఎంత ఖర్చయింది.. ఎంత దిగుబడి వచ్చింది’ అంటూ ఆత్మీయంగా అడిగారు. ఇందుకు రైతు స్పందిస్తూ.. ‘అమ్మా మూడెకరాల్లో వేరుశనగ వేశా. రూ.30 వేల పెట్టుబడి వచ్చింది.. ఐదు బస్తాల దిగుబడి వచ్చింది. అమ్మితే రూ.పది వేలు కూడా రావు.. మొత్తమ్మీద రూ.20 వేల నష్టం వచ్చింది’ అంటూ వివరించారు.

‘అన్నా.. ప్రభుత్వం ఏమైనా నష్టపరిహారం ఇచ్చిందా? ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చిందా?’ అంటూ ఆరా తీశారు. ‘అమ్మా.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు నష్టపరిహారం, ఇన్‌పుట్ సబ్సిడీ కచ్చితంగా వచ్చేది. ఇప్పుడు ఆ ధైర్యం మాకు లేదు. ఏటా అప్పులు చేసి పంట సాగు చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు పెంచేసి.. వ్యాపారులకు, దళారులకు లాభం చేకూర్చుతోంది. రైతులను నాశనం చేస్తోంది’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘అన్నా.. అధైర్యపడొద్దు.. ఈ కష్టాలు కొన్ని రోజులే. రాజన్న రాజ్యం వస్తుంది. జగనన్న సీఎం అవుతారు. మహానేత రాజన్నలానే రైతుల పక్షాన పనిచేస్తారు. అందరికీ మేలు చేస్తారు’ అంటూ భరోసా ఇచ్చారు.





SHARMILA'S WALKATHON LEAVES AN INDELIBLE FOOTPRINT


.
The YSR congress president YS Jagan Mohan Reddy's sister, Sharmila set out on her 'Maro Praja Prasthanam' padayatra on October 18, creating history of sorts.
Perhaps for the first time in the history of post-independent India, a political leader and a woman at that has embarked upon a challenging mission of mass contact galvanizing the people of the state.
To date, no other youth leader except Jagan, has drawn the kind of crowds she has, wherever she has gone on her walkathon. Importantly, people who have been thronging her meetings and rallies have not been mobilised by the party workers. Rather, they have come forth of their own accord. Equally important is the fact that women of all ages have been attending her meetings in large numbers indicating the support of the fairer sex to the YSRCP.
It is important to bear in mind that the state has no prominent, active youth icon at this point barring YS Jagan Mohan Reddy and his sister Sharmila.
Today, youth constitute 60 per cent of India's population and can hardly find political leaders they can identify themselves with. In such a scenario, Jagan and Sharmila fill the void in Andhra Pradesh as no one else can.
Judging by the crowds at Sharmila's padayatra, the results of by-elections held in June and surveys conducted by reputed media houses, it is clear that the YSRCP is all set to storm the Congress citadel in AP in the next round of  general elections, whenever they are held.
For someone who is used to a life of ease and comfort to endure the rough day-to-day life in villages is certainly not a facile task. But Sharmila has continued her padayatra braving rains, and the heat and dust of the parched Rayalaseema region, taking everything in her stride. It must be remembered that she has to make do with the barest of facilities and minimal comforts—be it food or shelter.
In this historic mission, Sharmila has taken on her political opponents manfully and has widened the reach of the party.
While the popularity of the YSRCP continues to soar in popular imagination, it poses a major threat to all other parties as can be seen from the fact that it is attracting important leaders from across the political spectrum. Party workers in Congress and TDP feel that the YSRCP would be a safer bet today as opposed to their own parties and seem to repose greater faith in this fledgling party. Even as the YSRCP wings its way higher on the strength of Sharmila's padayatra and Jagan's charisma, the TDP and ruling Congress are getting jittery by the hour!
-Sakshipost

http://www.sakshipost.com/index.php/news/state/5604-sharmila-s-walkathon-leaves-an-indelible-footprint

వచ్చే నెల 6న కర్నూలు జిల్లాలో షర్మిల పాదయాత్ర

వైఎస్‌ఆర్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శోభా నాగిరెడ్డి

కర్నూలు, న్యూస్‌లైన్: చంద్రబాబు నాయుడు రాసిన స్క్రిప్టుతో వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌పై మాజీ స్పీకర్ యనమల రామక్రిష్ణుడు దిగజారుడు మాటలు మాట్లాడటం తగదని వైఎస్‌ఆర్‌సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ భూమా శోభా నాగిరెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంచల్‌గూడ జైలులోని జగన్‌మోహన్‌రెడ్డి ములాఖత్‌ల పేరిట రాజకీయాలు చేస్తున్నారని విమర్శించడం, ఫోన్లలో మాట్లాడుతున్నారని చెప్పడం చూస్తుంటే టీడీపీ నాయకులు ఎంత దిగజారారో అర్థమవుతోందన్నారు. ఓ వైపు చంద్రబాబు పాదయాత్రలు చేస్తుంటే మరో వైపు ఆ పార్టీ నాయకులు పార్టీని వీడుతున్నారన్నారు. తెలుగుదేశం నాయకులపై అనుమానాలుంటే పార్టీ ఆఫీసులో పెట్టి తాళాలు వేసుకోవాలని సూచించారు. వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుకు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పార్టీ ఉనికి కోసం బాబు పాదయాత్రలు చేస్తున్న విషయం ప్రజలకు తెలియనిది కాదన్నారు. అధికార పక్షం, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం కుమ్మక్కవడం వల్లే షర్మిల పాదయాత్రలు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమ న కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రజా ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. 

వచ్చే నెల 6న జిల్లాలో షర్మిల పాదయాత్ర

కర్నూలు జిల్లాలో వచ్చే నెల 6వ తేదీ నుంచి షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభమవుతుందని భూమా నాగిరెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని కసాపురం నుండి కర్నూలు జిల్లా మద్దికెరలోకి షర్మిల ప్రవేశిస్తారన్నారు. అక్కడి నుండి పత్తికొండ మీదుగా ఆలూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గం నుంచి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్‌లో ప్రవేశిస్తారని వెల్లడించారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం జైలు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 29న భువన గిరిలో తలపెట్టిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. అలాగే ఆర్టికల్ 3 ప్రకారమే కేంద్రం.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని జిట్టా డిమాండ్ చేశారు. తెలంగాణపై జగన్ చిత్తశుద్ధితో ఉన్నట్లు తెలిపారు.

29న భువనగిరిలో వైఎస్సార్ సీపీలో జిట్టా చేరిక


హైదరాబాద్, న్యూస్‌లైన్: చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ప్రత్యేక ములాఖత్‌లో కలిశారు. అనంతరం జైలు బయట ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 29న భువన గిరిలో తలపెట్టిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. అలాగే ఆర్టికల్ 3 ప్రకారమే కేంద్రం.. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని జిట్టా డిమాండ్ చేశారు. తెలంగాణపై జగన్ చిత్తశుద్ధితో ఉన్నట్లు తెలిపారు.

ప్రజలకేం చేశారని మీ యాత్రలు?

15 వేల కోట్ల రూపాయల విద్యుత్ సర్‌చార్జీలు పెంచినందుకా?
మీ హయాంలో గ్రామాలను శ్మశానాలుగా మార్చినందుకా?
బాబు తన పాలనలో పల్లెలను శ్మశానాలుగా మార్చారు
ఇప్పుడు అవే గ్రామాల గుండా పాదయాత్రలు చేస్తున్నారు
ప్రజల కాళ్లు పట్టుకున్నా ఆయన పాపం పోదేమో
15 లక్షల ఉద్యోగాలిస్తామన్న సీఎం.. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు
మీకు ఒక్కరోజు కూడా పాలించే అర్హత ఉందా అని అడుగుతున్నా
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 9, కిలోమీటర్లు: 130.9


మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: అడ్డగోలుగా చార్జీలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్న సర్కారుపై, అవిశ్వాస తీర్మానం పెట్టకుండా ప్రభుత్వానికి అన్ని విధాలా అండగా నిలుస్తూ పాదయాత్ర పేరుతో డ్రామాలాడుతున్న టీడీపీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజలకు ఏం చేశారని ఇందిరమ్మ బాట పేరుతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. ‘వస్తున్నా మీకోసం’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యాత్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. 

‘‘ముఖ్యమంత్రి గారూ.. ఏం ఘనకార్యం చేశారని ఇందిరమ్మ బాట పట్టారు మీరు? 15 వేల కోట్ల విద్యుత్తు సర్‌చార్జీల భారం ప్రజలపై వేసి పెద్ద ఘనకార్యం చేశామని చెప్పుకోవడానికా? లేక మూడు సార్లు బస్ చార్జీలు పెంచినందుకా..?’’ అని విజయమ్మ నిలదీశారు. ‘‘చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలు ఆడుతున్నారు. తన హయాంలో శ్మశానాలుగా మార్చిన గ్రామాల గుండా ఆయనే ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. ఆ ప్రజల కాళ్లు పట్టుకొని క్షమాపణలు అడిగినా ఆయన పాపం పోదేమో అనిపిస్తుంది’’ అంటూ షర్మిల మండిపడ్డారు. మరో ప్రజాప్రస్థానం తొమ్మిదో రోజైన శుక్రవారం అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల, విజయమ్మ మాట్లాడుతూ.. పాలక, ప్రతిపక్షాల తీరును కడిగిపారేశారు. పెద్దఎత్తున పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. వారేమన్నారో వారి మాటల్లోనే..

బాబూ... ఈ డ్రామాలెందుకు?: షర్మిల

ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవాలని చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అది అసాధ్యం. ప్రజలకు ఆయన చరిత్ర తెలుసు. ఇప్పుడు చేస్తున్న కుమ్మక్కు రాజకీయాలూ తెలుసు. అసలు ఆయన కు పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందా? తన హయాంలో శ్మశానాలుగా మార్చిన గ్రామాల గుండా ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. నేరుగా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టి కాంగ్రెస్ పార్టీని దించేయకుండా ఈ డ్రామాలు ఎందుకు? వారి లక్ష్యమొక్కటే. ఈ రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలి. మరో పార్టీ ఉండకూడదు. బాబు హయాంలో 9 సార్లు కరెంటు చార్జీలు పెరిగాయి. రైతులు కరువు కోరల్లో చిక్కుకుని అప్పుల్లో మునిగారు. కానీ చంద్రబాబు మాత్రం బిల్లులు కట్టాలని వేధించారు. కేసులు పెట్టారు. అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు రెండుసార్లు శిలాఫలకం వేసి వదిలేసిన హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.4 వేల కోట్లు వెచ్చించి 95 శాతం పూర్తిచే శారు. కానీ ఈ ప్రభుత్వం ఆ 5 శాతం పనులను మూడేళ్లలో పూర్తిచేయలేకపోయింది. వైఎస్ ఉన్నప్పుడు పెన్నా రిజర్వాయర్‌కు 10 టీఎంసీల నీటిని తెచ్చి ప్రజలను రక్షించాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భూగర్భ జలాలు పడిపోయాయి. తాగునీరు కూడా లేదు. ఏం తిని బతకాలని రైతన్న అడుగుతున్నాడు. వీటికి సర్కారే సమాధానం చెప్పాలి. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు కిరణ్‌తో పోటీపడి నిద్రపోతున్నారు. ఈ కుమ్మక్కు రాజకీయాలు ఎంతో కాలం సాగవు. దేవుడున్నాడు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవరూ ఆపలేరు.

సిలిండర్ల ధర వెయ్యి చేస్తున్నామని చెబుతారా: విజయమ్మ

సీఎం గారూ.. ఏం ఘన కార్యం చేశారని ఇందిరమ్మ బాట పట్టారు? అన్ని ధరలు పెంచి ఘనకార్యం చేశామని చెప్పుకొంటారా? సిలిండర్ల ధర వెయ్యి రూపాయల వరకు చేస్తున్నామని చెప్పుకోవడానికి వెళుతున్నారా? కనీసం 7 గంటలు ఉచిత విద్యుత్తు ఇవ్వాల్సిన చోట రెండు గంటలు కూడా ఇవ్వలేకపోతున్నామని చెప్పుకోవడానికా? ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చినందుకా? 108లో డీజిల్ కూడా లేదని చెప్పుకోవడానికా? 15 లక్షల ఉద్యోగాలిస్తామన్నారే.. నెలకు 15 రోజుల పాటు పరిశ్రమలకు విద్యుత్ సెలవు ఇచ్చి 25 లక్షల మందిని రోడ్డు పాలుచేశారేం? వారందరికీ ఉద్యోగాలిస్తారా? 104 ఉద్యోగులనే వదిలించుకున్నారు. మీరు 15 లక్షల ఉద్యోగాలిస్తారా? 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి 6 నెలలైంది.. ఏవీ? రైతులకు వడ్డీ లేని రుణాలని ఆగస్టులో చెప్పారు? ఏమైంది. ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? ఒక్క రోజు కూడా మీకు పాలించడానికి అర్హత ఉందా అని ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తారట. ఆయన హయాంలో రైతులు కరువు కోరల్లో విలవిల్లాడుతుంటే ఎందుకు చేయలేదు? నేతన్న పరిస్థితి దారుణంగా తయారైంది. ముడి సరుకు ధర బాగా పెరిగింది. కానీ పట్టు చీరల ధర మాత్రం 10 శాతం మించి పెరగలేదట. నేతన్నల కోసం వైఎస్‌లా పరితపిస్తున్న నాయకుడు జగన్ ఒక్కడే. వారి కోసం 2010లో మహాధర్నా చేశారు. 2011లో 103 డిగ్రీల జ్వరంలోనూ దీక్ష చేశాడు. జగన్ అధికారంలోకి వస్తే ప్రభుత్వమే నూలు సరఫరాచేస్తుంది. కుటుంబానికి కాకుండా మగ్గం యూనిట్‌గా సబ్సిడీ ఇస్తుంది.

దద్దరిల్లిన ధర్మవరం

మరో ప్రజాప్రస్థానం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ధర్మవరం దద్దరిల్లింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానానికి బ్రహ్మరథం పట్టింది. తుమ్మల వైపు నుంచి ధర్మవరంలో ప్రవేశించిన షర్మిలకు.. బహిరంగ సభ ప్రాంతమైన ఎన్టీఆర్ సర్కిల్‌కు చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టింది. వీధులు పోటెత్తడంతో కిలోమీటరు దూరం నడిచేందుకే రెండు గంటల సమయం పట్టింది. శుక్రవారం ఉదయం 10.20 గంటలకు తుమ్మల సమీపం నుంచి షర్మిల పాదయాత్ర మొదలైంది. యాత్ర ఆసాంతం అశేష జనవాహిని మధ్య సాగింది.

మధ్యాహ్నం 12.30కు ధర్మవరం శివారులో ఏర్పాటుచేసిన మధ్యాహ్న భోజన బసకు షర్మిల చేరుకున్నారు. అనంతరం రామకృష్ణ అనే చేనేత కార్మికుడి ఇంటికి చేరుకుని వారి కష్టాలను తెలుసుకున్నారు. తర్వాత ధర్మవరం సభలో మాట్లాడారు. వీధుల్లో షర్మిల ప్రవేశించాక కిలోమీటరు దూరంలో ఉన్న బహిరంగ సభ స్థలానికి చేరేసరికి 5.30 అయ్యింది. ధర్మవరం జనసంద్రమవడంతో నడవడం ఆలస్యమైంది. సభ ముగిశాక రాత్రి 8.30కు గొల్లపల్లి వద్ద రైల్వేగేటు పడ్డప్పుడు ఆ గ్రామవాసి నాగలక్ష్మి అనే మహిళ షర్మిలను కలిసి తన దీన పరిస్థితి వివరించింది. దీంతో ఆమె నలుగురు ఆడపిల్లల్లో ఒక కూతురిని తానే చదివిస్తానని షర్మిల ఆమెకు భరోసానిచ్చారు. రాత్రి 8.35 గంటలకు గొల్లపల్లి క్రాస్‌కు సమీపంలో పాదయాత్ర ముగించి, రోడ్డు పక్కన వేసిన గుడారంలో షర్మిల బస చేశారు. తొమ్మిదో రోజు పాదయాత్రలో పార్టీ నేత ఎంవీ మైసూరారెడ్డి, పార్టీ ఎమ్మెల్యేలు గురునాథ రెడ్డి, కాపు రాంచంద్రారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జులు పాల్గొన్నారు. విజయమ్మ ధర్మవరంలో కాసేపు పాదయాత్రలో పాల్గొన్నారు.

ధర్మవరంలో కేబుల్ ప్రసారాల నిలిపివేత

మరో ప్రజాప్రస్థానానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో శుక్రవారం ధర్మవరంలో అధికార పార్టీ నేతలు కేబుల్ నెట్‌వర్క్‌లో ప్రసారాలు నిలిపివేశారు. ఇది ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పనేనని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచే ఎమ్మెల్యే అనుయాయులకు చెందిన కేబుల్ వారు సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారు.

రైతుతో కలిసి.. విత్తనాలు వేసి..

తుమ్మల సమీపంలోని మల్లేనిపల్లె రైతు జంగల వెంకటేశ్ వేరుశనగ విత్తనాలు వేస్తుండగా.. షర్మిల అక్కడికి వెళ్లి తానూ విత్తనాలు వేశారు. అక్కడికి వచ్చిన రైతులు, రైతు కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు కూలీలు షర్మిలతో మాట్లాడుతూ కరెంటు, నీటి కష్టాలను చెప్పుకున్నారు. అనంతరం షర్మిల పేరం చంద్రశేఖర్‌రెడ్డి అనే రైతు పొలానికి చేరుకున్నారు. అక్కడ ఆయన పురుగు మందుల డబ్బాలు చూపుతూ ‘‘రాజన్న ఉన్నప్పుడు రూ.100 ఉన్న డబ్బా ఇప్పుడు రూ. 360 అయ్యింది. కాంటాఫ్ డబ్బా అప్పట్లో రూ. 75 ఉండేది. ఇప్పుడు రూ. 300 అయ్యింది. పంట పండినా దళారులకే తప్ప మాకేం లాభం లేదు..’’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ ‘‘జగనన్న సీఎం అయ్యాక ఏ రైతూ తన పంట నష్టానికి అమ్ముకోకుండా ధరల స్థిరీకరణకు నిధి ఏర్పాటు చేస్తాడు’’ అని భరోసా ఇచ్చారు.

మరో ప్రజాప్రస్థానం వెబ్‌సైట్ ప్రారంభం

పెదవాల్తేరు (విశాఖపట్నం), న్యూస్‌లైన్: వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడానికి పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ అదీప్‌రాజు వెబ్‌సైట్‌ను రూపొందించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల రాష్ట్ర సమన్వయకర్త కొణతాల రామకృష్ణ బీచ్‌రోడ్డులోని తమ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షర్మిల చేపట్టిన పాదయాత్రకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. పాదయాత్రలో పాల్గొన లేకపోయిన వైఎస్ అభిమానులు, ఆ వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ వెబ్‌సైట్ దోహదపడుతుందన్నారు. 

www.maroprajaaprasthanam.com లో పాదయాత్ర పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని అదీప్‌రాజు చెప్పారు.

బక్రీద్ పండుగ శుభాకాంక్షలు: విజయమ్మ


హైదరాబాద్, న్యూస్‌లైన్: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దైవత్వానికి ప్రతీకైన బక్రీద్‌ను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

గొల్లపల్లి నుంచి షర్మిల పాదయాత్ర

అనంతపురం: మరోప్రజాప్రస్థానం పేరిట వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పాదయాత్ర శనివారం పదోరోజుకు చేరనుంది. గొల్లపల్లి క్రాస్ నుంచి ప్రారంభం కానున్న శనివారం పాదయాత్ర.. గరుడంపల్లి క్రాస్, వసంతపురం క్రాస్, చిగిచర్ల, ఉప్పునేసినపల్లి క్రాస్, హంసాపురం క్రాస్ ల మీదుగా కొనసాగుతుంది. షర్మిల రాక కోసం ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, వైఎస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

source:sakshi

పెనుకొండ నియోజక వర్గంలో కాంగ్రెస్‌కు షాక్

అనంతపురం: జిల్లాలోని పెనుకొండ నియోజక వర్గంలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. కాంగ్రెస్ నేత జేసీ దివాకరరెడ్డికి ముఖ్య అనుచరుడైన బ్రహ్మ సముద్రం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన పార్టీ నుంచి వైదొలగనున్నారు. ఈ నెల 28న రాప్తాడులో జరిగే షర్మిల సభలో ఆయన వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

జగన్ ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు: షర్మిల

ధర్మవరం: ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి, తన అన్న జగన్మోహన రెడ్డిని కూడా ఎవరూ ఆపలేరని షర్మిల అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి ఈ సాయంత్రం షర్మిల పాదయాత్ర చేరుకుంది. అధిక సంఖ్యలో జనం వచ్చి ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జనసద్రమైన ధర్మవరంలో భారీస్థాయిలో మహాప్రస్థానం బహిరంగ సభ జరిగింది. అశేష జనవాహిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్ అనంతపురం అల్లుడని, తన తల్లి విజయమ్మ ఈ జిల్లా ఆడపడుచు అని చెప్పారు. జగన్ మీ మేనల్లుడు అన్నారు. షర్మిల మాటలకు జనం నుంచి అద్వితీయమైన స్పందన లభించింది.

రాజస్థాన్ తర్వాత అతితక్కువ వర్షపాతం నమోదైయ్యేది అనంతపురమేనని, అందుకే వైఎస్ఆర్‌కు ఈ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ ఉండేదన్నారు. హంద్రీనీవా ప్రాజెక్ట్‌కు చంద్రబాబు 2 సార్లు శిలాఫలకం వేసి వదిలేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ 4వేల కోట్లతో పనులు చేపట్టారని, ప్రస్తుతం 40 కోట్ల రూపాయలు విడుదల చేయలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఫీజు రీయింబర్స్ విషయంలో అరకొర నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు. సీఎం కిరణ్ నిద్రపోతున్నారని అనుకుంటే, పోటీగా చంద్రబాబు కూడా నిద్రపోతున్నారన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు తంగలో తొక్కారన్నారు. చంద్రబాబుది మాటమీద నిలబడే నైజం కాదని విమర్శించారు. చంద్రబాబుకు మునీశ్వరుడి శాపం ఉందని, నిజం చెబితే తల వెయ్యిముక్కలవుతుందన్నారు.
జగన్‌పై టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారన్నారు. తన అవినీతిపై విచారణ వద్దని, ప్రతిఫలంగా అవిశ్వాసం పెట్టనని బాబు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు పాదయాత్ర డ్రామా ఆడుతున్నారన్నారు.

ధర్మవరం రైల్వేస్టేషన్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి వైఎస్ విజయమ్మ, షర్మిలలు పూలమాలు వేసి నివాళులర్పించారు.

SHARMILA IN DHARMAVARAM: CABLE TV SERVICES CUT OFF


.
 Sharmila's walkathon, titled "Maro Praja Prasthanam" is all set enter the Dharmavaram in Anantapuram district today. Sharmila, accompanied by a massive crowd started at Tummala cross and headed towards Mallenipalli.
Along the way, a farmer requested Sharmila to sow seeds in his fields to which she readily obliged. When she questioned the farmers on the difference between Dr YSR's regime and the current dispensation, they replied that they were plagued with power cuts and shortage of seeds at present. "This was never the case during YSR's tenure," they lamented.
Meanwhile, it is learnt that the cable TV services have been cut off on purpose in Dharmavaram. Added to this, power supply has also been curtailed in the town to prevent YSRCP supporters and the public at large from following the walkathon on television channels.

http://sakshipost.com/index.php/news/state/5571-sharmila-in-dharmavaram-cable-tv-services-cut-off#.UIpYqduqbDE.facebook

YS Vijayamma Speech in Dharmavaram

పోటీచేస్తానంటే, సురేఖకు ఆహ్వానం: బాలినేని

ప్రకాశం: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రాలో పోటీ చేయాలని కొండా సురేఖ భావిస్తే.. తాము ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నామని వైఎస్‌ఆర్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. త్వరలో చంద్రబాబు మైండ్ సెట్ పై క్యాసెట్ ను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. సినిమా వాళ్ల డైరెక్షన్ లో చంద్రబాబు యాత్ర చేయడం సిగ్గుచేటని బాలినేని విమర్శించారు.

ప్రకాశం: వచ్చే ఎన్నికల్లో పరకాలలోనే పోటీచేసి గెలుస్తానని వైఎస్ఆర్ సీపీ నేత కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నేతలకు దోచుకోవడం తప్ప ప్రజాసమస్యలు పట్టడంలేదని సురేఖ ధ్వజమెత్తారు. చంద్రబాబు పాదయాత్ర పేరుతో దొంగజపం చేస్తున్నారని కొండా సురేఖ అన్నారు.

source:sakshi

ధర్మవరంలో షర్మిలకు ఘనస్వాగతం

అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల పాదయాత్రకు ఘనస్వాగతం లభించింది. ధర్మవరంలో గతంలో ఏ నేతకు రానంత ప్రజా స్పందన కనిపించింది. పట్టణ ప్రజలు షర్మిల అడుగులో అడుగువేశారు. పట్టణం అంతా జనంతో కిక్కిరిసిపోయింది. వీధులు, మేడలు, మిద్దెలు జనంతో నిండిపోయాయి. ఇసుకవేస్తే రాలనంతగా జనం చుట్టుపక్క గ్రామాల నుంచి తరలి వచ్చారు. 'మరో ప్రస్థానం' బహిరంగ సభా స్థలం వద్ద జనం భారీ సంఖ్యలో గుమ్మిగూడారు. ఈ ప్రాంతంలోని చేనేత కార్మికులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

'బాబు హయాంలో చిద్రమైన బతుకులు'

అనంతపురం: టిడిపి అధ్యక్షుడు చంద్ర బాబు హయాంలో రైతులు, చేనేత కార్మికుల బతుకులు చిధ్రమైయ్యాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే విజయమ్మ అన్నారు. ధర్మవరంలో ఈ సాయంత్రం జరిగిన మహాప్రస్థానం భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. చంద్రబాబు హయాంలో ఆప్కో దుస్థితిని ఆమె గుర్తు చేశారు. 

ధర్మవరంలో చేనేత బతుకులు చితికిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి, చేనేత వస్త్రానికి మద్దతు ధర లేదని అమె అన్నారు. నూలు, మగ్గం, షెడ్డు సౌకర్యాలు కల్పిస్తామని వైఎస్ఆర్ హామీ ఇచ్చారన్నారు. అధికారులు కూడా వారంలో ఒకసారి చేనేత వస్త్రాలు ధరించాలని వైఎస్ చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ హామీలను ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. అనంత రైతులకు గతంలో ఉన్న 32 టీఎంసీల నీటిని ఇప్పుడు 23 టీఎంసీలకు కుదించారన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తాగునీటి పథకాలన్నీ దిష్టిబొమ్మల్లా తయారయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో పంటలకు, తాగడానికి నీరు లేని దుస్థితి నెలకొందన్నారు. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ ప్రజల మధ్యలో ఉండి వారి కష్టాలు తెలుసుకుంటున్నారని చెప్పారు. 12 వేల కోట్ల రూపాయల రుణమాఫీలో అనంతపురం జిల్లా వాటాగా 555 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు తెలిపారు. చంద్రబాబు హయాంలో రైతులకు 90 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, వైఎస్ఆర్ హయాంలో 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆమె చెప్పారు.

source:sakshi

YSRCP MLA Shobha Nagi Reddy Fires on TDP and Congress

After one year ys jagan Will be CM -MLA Alla nani


Sharmila's Maro Prajaprasthanam reach to Dharmavaram

Thursday 25 October 2012

కాసేపట్లో ధర్మవరం చేరుకోనున్న షర్మిల

అనంతపురం: మరో ప్రజాప్రస్థానం పేరిట షర్మిల చేస్తున్న పాదయాత్ర మరికాసేపట్లో ధర్మవరం చేరుకోనుంది. తుమ్మల క్రాస్ నుంచి శుక్రవారం అశేష జనవాహిని మద్దతుతో ప్రారంభమైన పాదయాత్ర మల్లేనిపల్లి వద్ద కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఓ రైతు షర్మిలను తన పొలంలో విత్తనాలు వేయాలని కోరడంతో అందుకు ఆమె అంగీకరించారు. అనంతరం రాజన్న పాలనకు, ఇప్పటి ప్రభుత్వ పాలనకు తేడా ఏంటని అడగడంతో రైతులు కరెంట్ కోతలు, విత్తనాల కొరత తదితర సమస్యలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని చెప్పారు. 

మరోవైపు ధర్మవరంలో కేబుల్ ప్రసారాలు నిలిపివేసినట్టు తెలుస్తోంది. అంతేకాక ఉదయం నుంచి కరెంట్ సరఫరాను కూడా నిలిపివేశారని సమాచారం. షర్మిల చేపట్టిన పాదయాత్రకు సంబంధించి వివరాలను వైఎస్ అభిమానులు తెలుసుకోకుండా ఉండేందుకే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

Special edition on Ananta Aadaranalo

మల్లేనిపల్లి చేరుకున్న షర్మిల

అనంతపురం: మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల శుక్రవారం జిల్లాలోని మల్లేనిపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు షర్మిలకు సాదర స్వాగతం పలికారు. షర్మిల ప్రసంగం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

Sharmila's Maro Prajaprasthanam padayatra 9th day schedule

Peoples share with Sharmila on our problems

100 కిలోమీటర్ల మైలు రాయి దాటిన ప్రజాప్రస్థానం

జగనన్న సీఎం కావాలి 
రాజన్న రాజ్యం మళ్లీ రావాలని నినాదాలు
ఈ ప్రభుత్వం టమాటాకు బీమా కూడా ఇవ్వట్లేదని ఆవేదన
వచ్చే రాజన్న రాజ్యంలో బీమా ఇప్పిస్తామన్న షర్మిల 
100 కిలోమీటర్ల మైలు రాయి దాటిన ప్రజాప్రస్థానం
పండుగ పూట పోటెత్తిన పల్లెలు 
‘అనంత’లో షర్మిల వెంట కదులుతున్న జనసైన్యం

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు ఎత్తిపోయాయి. పంటలు ఎండిపోయాయి. పరిహారం ఇచ్చే దిక్కులేదు. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు మూడుసార్లు పరిహారం అందింది. ఇప్పుడు పరిహారం ఊసే లేదు. ఇన్‌పుట్ సబ్సిడీలు లేవు. ఎరువులు అడిగితే ఇచ్చే నాథుడే లేడు.. ఈ పాలన మాకొద్దు. జగనన్న సీఎం కావాలి.. రాజన్న రాజ్యం మళ్లీ రావాలి’’ అంటూ ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో పలువురు రైతులు షర్మిలతో మొరపెట్టుకున్నారు. అనంతపురం జిల్లాలో బుధ, గురువారాల్లో పాదయాత్ర సాగిన ధర్మవరం నియోజకవర్గంలో పలు చోట్ల రైతులు తమ ఎండిపోయిన పంటలను ఆమెకు చూపి ఆవేదన వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా తమ్మాపురంలో తమకు బీమా వర్తింపజేయడం లేదని టమాటా రైతులు, తుమ్మల క్రాస్‌రోడ్డు వద్ద వేరుశనగ రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనికి స్పందనగా తమ్మాపురం బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ.. ‘రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది. టమాటా లాంటి పంటలకూ బీమా వర్తింపజేస్తుంది..’ అని హామీ ఇచ్చారు.

100 కి.మీ. దాటిన యాత్ర: షర్మిల యాత్ర విజయదశమి రోజు తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామం వద్ద 100 కిలోమీటర్ల మైలురాయి దాటగా.. మరుసటి రోజు గురువారం నాటికి 119.9 కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ‘అనంత’ జనసైన్యంతో ఆమె ఉత్సాహంగా పరుగులు తీస్తుండగా.. జనంతో మమేకమై పోయిన షర్మిల చెరగని చిరునవ్వుతో ఆత్మీయంగా పల్లెలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను తెలుసుకుంటూ ముందకు సాగుతున్నారు. బుధవారం ఉదయం 10.35కు దాడితోట శివారు నుంచి బయలుదేరిన షర్మిలను చిల్లకొండాయపల్లిలో గొర్రెల కాపర్లు కలిసి తమ నీటి కష్టాలపై ఫిర్యాదు చేశారు. దీనిపై పార్టీ తరపున ధర్నా నిర్వహించి సమస్య పరిష్కారానికి పోరాడుతామని ఆమె భరోసా ఇచ్చారు. జిల్లా శాసనసభ్యులు గురునాథ్‌రెడ్డి, కాపు రాంచంద్రారెడ్డిలు స్థానిక సమస్యలపై పోరాటం చేస్తామని వారికి హామీ ఇచ్చారు.

గ్యాస్ అక్కర్లేనివారికే ఇస్తుందీ ప్రభుత్వం: చిల్లకొండాయపల్లి బహిరంగ సభలో మాట్లాడుతూ రాజన్న కుటుంబం తరఫున విజయదశమి శుభాకాంక్షలు అంటూ షర్మిల అభివాదం చేశారు. ఈ సందర్భంగా అన్ని ధరలూ పెరిగాయని మహిళలు ఆందోళన వ్యక్తంచేయడంతో ‘గ్యాస్ అవసరం లేని వారికే ఈ ప్రభుత్వం గ్యాస్ ఇస్తుందట. దీపం పథకం కింద ఉన్నవాళ్లకు ఆరు సిలిండర్లకంటే ఎక్కువ అవసరం ఉండదు. కానీ వారికే ఇస్తానని మొసలి కన్నీరు కారుస్తోంది. లెక్కల గారడీలో ఈ ప్రభుత్వానికి డాక్టరేట్ ఇవ్వొచ్చు..’ అని షర్మిల ఎత్తిపొడిచారు. పాదయాత్రకు వచ్చిన నార్పల మండలానికి చెందిన వెంకటరెడ్డి అనే యువకుడు కెనాల్ కింద భూమి పోగా నష్టపరిహారం రాలేదని ఫిర్యాదుచేయడంతో పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించి డబ్బులు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు.

పండు ముదుసలికి వయసుందా?: చిల్లకొండాయపల్లి సమీపంలో పాదయాత్ర సాగుతున్న తరుణంలో కదిరి నుంచి వికలాంగులు వచ్చి షర్మిల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. రెండు కళ్లూ లేక 80 ఏళ్ల వయస్సున్నా తనకు పెన్షన్ ఇవ్వలేదని, వయసుందని అంటున్నారని ఓ వృద్ధురాలు మొరపెట్టుకోవడంతో ‘ఈ పండుటాకుకు పెన్షన్ ఇవ్వలేరా? ఈ ప్రభుత్వం గుడ్డిదా? ఈమెకు ఇంకా వయసుందా?’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. పెన్షన్ లేదని, తిండి లేదని, వైఎస్ హయాంలో ఇచ్చిన పెన్షన్‌ను రద్దు చేశారని మరికొందరు ఆవేదన వ్యక్తంచేశారు. రెండు కాళ్లూ లేని వికలాంగులూ అక్కడికి తరలిరావడంతో షర్మిల చలించిపోయారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ జగనన్న సీఎం అయ్యాక పెన్షన్ లభిస్తుందని ఓదార్చారు.

కిడ్నీ ఆపరేషన్‌కు ఏర్పాట్లు: చిల్లకొండాయపల్లి వద్దకు వచ్చిన బత్తలపల్లికి చెందిన నిరుపేద మహిళ లక్ష్మీదేవి తన భర్త నర్సింహకు కిడ్నీ ఫెయిలైందని, ఆపరేషన్ తప్ప మార్గం లేదని వైద్యులు చెప్పారని, కూలిపని చేసుకునే తమకు ఆపరేషన్ చేయించే స్తోమత లేదని విలపించడంతో షర్మిల చలించిపోయింది. అప్పటికప్పుడే వివరాలు తీసుకుని ఆపరేషన్ చేయించే బాధ్యత తనదీ అని హామీ ఇచ్చి.. హైదరాబాద్‌లో ఉన్న వైద్యులతో మాట్లాడారు. అక్కడికెళ్లాలని లక్ష్మీదేవికి దారి ఖర్చులు కూడా ఇచ్చారు. వైద్య ఖర్చులు తామే భరిస్తామని, అధైర్యపడొద్దని ఓదార్చారు.

విజయద శమి రోజు పూజలు: విజయదశమి రోజు మధ్యాహ్నం 1.30కు పెద్దకోట్ల గ్రామంలోని పెద్దమ్మగుడిలో షర్మిల పూజలు చేశారు. అనంతరం ఆ గుడి పూజారి పెద్దరాజు-వరాలమ్మ దంపతుల ఇంట ఓలిగ, చిత్రాన్నం తిన్నారు. శివ్వంపల్లి దాటాక రాత్రి 8 గంటలకు బస చేశారు. దసరా రోజు మొత్తం 15 కిలోమీటర్లు నడిచారు. పండుగ రోజు సైతం జనం షర్మిల వెంటే నడుస్తూ ‘అనంత’ పల్లెలు ఆమెతోనే తమ పండుగ చేసుకున్నాయి. మరుసటి రోజు ఉదయం 9.30కు బయలుదేరిన షర్మిలను.. మార్గమధ్యంలో కలిసిన ప్రజలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. మధ్యాహ్నం 2 గంటలకు అప్రాచెరువు సమీపంలో భోజన విరామం తీసుకున్న ఆమె 4.30కు యాత్ర ప్రారంభించారు. అప్రాచెరువులో స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. రాత్రి 7.40కి తుమ్మల సమీపంలో ఏర్పాటుచేసిన బసస్థలానికి చేరుకున్నారు. పార్టీ నాయకుడు ఎం.వి. మైసూరారెడ్డి గురువారం రోజంతా ఆమె వెంట పాదయాత్రలో పాల్గొన్నారు.
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!