YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 25 October 2012

'ప్రభుత్వానికి చంద్రబాబు ప్రధాన సలహాదారు'

అనంతపురం: మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా తంబాపురంలో షర్మిల మాట్లాడుతూ ప్రభుత్వంతోపాటు, ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, ప్రాజెక్టులు కట్టడం నష్టమరి అనుకున్నారని విమర్శించారు. ప్రజలకు ఏదైనా మేలు చేస్తే సోమరిపోతులుగా తయారవుతారని చంద్రబాబు తన పుస్తకంలో రాసుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ విషయాలన్నీ నచ్చడంతో ప్రభుత్వం బాబును ప్రధాన సలహాదారుగా నియమించుకుని ప్రజా సంక్షేమానికి తీరని నష్టం చేకూరుస్తోందని విమర్శించారు.

సిలిండర్లు అవసరం లేనివారికి సబ్సిడీలు ఇస్తామంటోందని ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. రైతులకు కనీసం నాలుగైదు గంటలు కూడా సరిగా కరెంట్ ఇవ్వలేని రీతిలో ప్రభుత్వం ఉందన్నారు. పదవిలో ఉన్నా లేకున్నా రైతుల గురించి ఆలోచించింది ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డే అని షర్మిల స్పష్టం చేశారు. ఇలా ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ షర్మిల ప్రసంగానికి ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!