అనంతపురం: జిల్లాలోని శివంపల్లి నుంచి గురువారం ఉదయం ప్రారంభమైన షర్మిల మరో ప్రజాప్రస్థానం 8వ రోజు పాదయాత్ర.. ఆత్మకూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తాము ఎదుర్కొంటున్న కష్టాలను షర్మిలకు మొరపెట్టుకున్నారు. మరోవైపు ధర్మవరం ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి తమను వేధింపులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ ఎవరూ అధైర్యపడవద్దని, ముందు ముందు మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment