YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 17 November 2012

‘రాజ’స్థానానికి రాచబాట సుగమం!


పెరుగుతున్న నైతిక బలం
పాదయాత్ర మాయాజాలం
కలిసిరాబోతున్న మధ్యంతరం
అట్నునంచి నరుక్కొచ్చిన ఎంఐఎం
సజీవంగా సానుభూతి పవనం
రాజశేఖరరెడ్డి అధిష్ఠించిన పీఠం మీదికి అధిరోహణం చేయాలన్నది జగన్ కల. అయితే కలను సాకారం చేసుకునే మార్గంలో ఉన్న జగన్‌ను మార్గమధ్యంలోంచే సీబీఐ తీసుకెళ్లి చంచల్‌గూడలో పెట్టింది. అక్కడ ఆయనకు మరింత ఖాళీ సమయం దొరికింది. మరింత బలంగా కలగంటున్నారు. కల సాకారమయ్యే దిశగా మరింత బలమైన వ్యూహరచనలు చేస్తున్నారు. వాటి ఫలితాలు జైలు వెలుపల కనిపిస్తున్నాయి. ఆయన కలలను ఈడేర్చడానికి ఆయన అనుచరులు, వర్గీయులు, కుటుంబసభ్యులు అందరూ అహరహం పూజలు చేస్తున్నారు. శ్రమిస్తున్నారు. అది సహజం. అయితే, ఆయన అభిమానులు, సన్నిహితుల పూజలు ఫలిస్తునాయో... ఆయన వ్యూహాలు ఫలిస్తునాయోగానీ.. బాహ్యప్రపంచంలో జగన్‌కు అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి.
ఇనుమడిస్తున్న మనోబలం
వైఎస్ జగన్ జైలులోనే ఉండిపోయాడనే ఒక్క బాధ తప్ప... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో దిగులేదీ లేదు. ఆ పార్టీ బలం నానాటికీ పెరుగుతోంది. జగన్ సొంత పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా ఎదుర్కొన్న కడప ఉప ఎన్నికల సమయంలోనే ఆయన గురించి నానా అవాకులూ చెవాకులూ ప్రచారంలోకి వచ్చాయి. గతంలో వచ్చినంత మెజారిటీ ఈసారి రాదని, మరొకటి మరొకటని చివరిక్షణం దాకా ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా సరిగ్గా జగన్ వైరి పక్షాల నుంచి అలాంటి ప్రచారమే జరుగుతోంది. ఇప్పటిదాకా జగన్ గెలిచిన స్థానాలన్నీ సానుభూతితో గెలిచినవేనని, ఈ సానుభూతి 2014 ఎన్నికల వరకు నిలబడడం అనేది అసాధ్యమని... జగన్ మట్టికొట్టుకుపోవడం ఖాయమని పాపం నేతలు గొంతులు చించుకుంటున్నారు. కానీ కడప ఉప ఎన్నికల సందర్భంలో ప్రజలు ఇచ్చిన తీర్పు.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జగన్ పట్ల వెలువడుతుందనడంలో సందేహం లేని పరిస్థితి కనిపిస్తోంది.
జగన్ తన వర్గ బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నించిన రోజున నోరు మెదపకుండా మిన్నకున్న ఎమ్మెల్యేల్లో అనేక మంది ఇప్పుడు ఆయన పార్టీలో సభ్యులుగా ఉన్నారు. ఆనాటినుంచి ఈనాటి లోగా వారు తమ ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామాలు చేసేశారు. ఇంకా రాజీనామాలు చేయకుండా.. తమ రాజకీయ ప్రస్థానాన్ని ఆయనతో కలిపి నడిపిస్తున్న వారు ఇంకా అనేకులు. జగన్ గేలం వేస్తున్నాడు, కొంటున్నాడు, ప్రలోభ పెడుతున్నాడు, డబ్బు సంచులు చేరవేస్తున్నాడు... ఇలాంటి పడికట్టు విమర్శలు అనేకం రాజకీయ ప్రకటనల మార్కెట్‌లో సదా వినిపిస్తూఉండవచ్చు గాక.. సామాన్యుడి చిన్న బుర్రకు స్ఫురించే చిన్న లాజిక్ ఏమిటంటే.. మొన్నటికి మొన్న తన వర్గం వారితో రాజీనామాలు చేయించి... 17 స్థానాల్లో ఉప ఎన్నికలకు తెరతీసిన రోజున జగన్‌కు తన బలాన్ని ‘బ్లోఅప్’ చేసి చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఏకమొత్తంగా ఎంతమంది తనకోసం కాంగ్రెసును వదలి వస్తారో.. అంతమందినీ ఆయన అదేరోజున రాజీనామాలు చేయించడానికి ప్రయత్నించారు. అందులో సందేహం లేదు. ఒకవేళ ఈ వైరిపక్షాలు ఆరోపిస్తున్న డబ్బు సంచులు, ప్రలోభాలు వంటి ప్రక్రియలు ఎన్నయినా.. సరే ఆరోజున జరిగి ఉండాలి. అంతేతప్ప, ఇప్పుడు  అనగా.. ఆయన జైల్లోకి వెళ్లిన తర్వాత.. ఆగి ఆగి.. అప్పుడొకటీ అప్పుడొకటీ ప్రలోభపెట్టే అవకాశం లేదు. అంటే జగన్ కోసం వచ్చేస్తున్న ఎమ్మెల్యేలు కేవలం డబ్బుసంచులకోసమే వస్తున్నారన్న ఆరోపణలు పసలేనివని ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్యే రాజేష్ చేరిక వంటివి నిరూపిస్తున్నాయి. ఎమ్మెల్యే వనిత చేరిక కూడా ఆ పార్టీకి మరో మంచి పరిణామం. కనీసం రాబోయే ఎన్నికల్లో తనకు మళ్లీ టిక్కెట్ ఇస్తారా లేదా అనే ఒప్పందం గురించి కూడా మాట్లాడుకోకుండానే తను వైకాపాలో చేరుతున్నట్లుగా ఆమె చాలా స్పష్టంగా ప్రకటించారు.
అచ్చంగా ఇలాంటి చేరికలు, ఇలాంటి మాటలు పార్టీకి నైతిక బలాన్ని పెంచుతాయి. పొద్దస్తమానమూ తమ ప్రత్యర్థులు ఒకటే తరహా ప్రలోభాల విమర్శలతో విరుచుకుపడుతోంటే.. నలుగురూ చెబితే అబద్ధం నిజమవుతుందనే సిద్ధాంతాన్ని నిరూపణ చేయడానికన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే.. ఇలాంటి పరిణామాలు పార్టీకి నైతికంగా అదనపు బలాన్ని అందిస్తాయి. ఒకవైపు జగన్ జైల్లో ఉన్నాడనే దిగులు దిగమింగుకుంటూ బయట పార్టీ నిర్మాణం సన్నగిల్లకుండా దృష్టి నిలుపుతున్న శ్రేణులకు ఇలాంటి అనల్పమైన మనోబలాన్ని కూడా అందిస్తాయి.
షర్మిల పాదయాత్ర
వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర రోజులు ఇప్పుడు మళ్లీ ఆయన అభిమాన ప్రజలకు గుర్తుకు వస్తున్నాయి. వైఎస్ తనయ... తండ్రి జమానాలో రాజకీయాలంటే విముఖత చూపిస్తూండే షర్మిల అనివార్యమైన పరిస్థితిలో ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చారు. పాదయాత్రకు సాహసించారు. ఆమె పాదయాత్రకు లభిస్తున్న స్పందన కూడా వైకాపా ఆశలను చిగిరింపజేస్తోంది. పార్టీకి గరిష్టంగా ఆశలు పెంచుతున్న మరో మంచి శకునం ఇది.
షర్మిల పాదయాత్ర విషయంలో పార్టీలో అనేక మల్లగుల్లాలు పడ్డారు. తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో తాము కూడా అచ్చంగా అదే యాత్ర కాకుండా.. మరో రకంగా ప్రజలకు చేరువ కావాలని ప్లాన్ చేశారు. అయితే ఎక్కువ ప్రభావ పూరితంగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేయడానికి పాదయాత్ర ఒక్కటే ఉపకరించగలదని నిర్ణయించారు. విజయమ్మ పాదయాత్ర అనేది అసాధ్యం. అయతే వైఎస్ కుటుంబసభ్యులే చేస్తే తప్ప.. పాదయాత్రకు జనాదరణ ఔద్ధత్యస్థాయిలో ఉండడం జరగదు. మిగిలిన ఆప్షన్ షర్మిల ఒక్కటే. తన వ్యక్తిగత అభిరుచుల రీత్యా రాజకీయ పదవులు, ఎత్తుగడల పట్ల అనాసక్తిగా ఉండే మహిళ షర్మిల. జీవితమే రాజకీయంగా, ప్రజాజీవితంగా బతికిన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కూడా ఈ విషయంలో ప్రేమగా పలుమార్లు ఎత్తిపొడుస్తూ ఉండే తనయ ఆమె. అలాంటిది తండ్రి పేరిట  ఏర్పాటైన పార్టీ అధికార పీఠం వైపు ప్రస్థానానికి తాను స్వయంగా సారథ్యం వహించాల్సి రావడం వైచిత్రి.
నిజానికి వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్ణయం వెలువడిన తర్వాత.. వారిని విమర్శిస్తూ ప్రెస్‌మీట్‌లు పెట్టిన కాంగ్రెస్, తెదేపా నాయకులు మైకులు ఆఫ్ అయిన తరువాత ఆఫ్ ది రికార్డ్ ఎన్నెన్ని వెటకారాలు మాట్లాడారో వింటే పార్టీ కార్యకర్తలకు రక్తం ఉడుకెత్తుతుంది. షర్మిల ఏమిటి పాదయాత్ర చేయడం ఏమిటి.. అంటూ అనేకులు సూటిపోటిమాటలతో నీరసపరిచే ప్రయత్నం చేశారు. రెండు మూడు రోజులు గడిచేసరికి వారి నోళ్లకు తాళాలు పడ్డాయి. ఎండ కన్నెరుగకుండా పెరిగన అతివ.. రోజుల తరబడి పాదయాత్ర చేయడం అసలు ఊహకైనా సాధ్యమేనా అనుకున్న వారు.. తమలో నివ్వెరపాటును కప్పిపుచ్చుకోవడానికి నానా పాట్లు పడాల్సి వచ్చింది. ప్లాన్ ఏ విమర్శలు ఫెయిలవడంతో.. అంతా ప్లాన్ బీకి మళ్లారు. షర్మిల పాదయాత్ర వారి కుటుంసభ్యుల్లో అభిప్రాయ భేదాలకు తావిస్తోందని, జగన్ భార్య భారతికి ఇష్టం లేదని.. షర్మిలే అధికారాన్ని తన్నుకు పోతుందని ఇలా రకరకాల కొత్త విమర్శలను అందుకున్నారు. కుటుంబంలోనూ చిచ్చుపెట్టడానికి ప్రయత్నించారు. షర్మిల జగన్‌ను అతిక్రమించి జనాదరణ పొందకుండా కాపలా కాసేందుకే విజయమ్మ అప్పుడప్పుడూ పాదయాత్రలో పాల్గొంటున్నారంటూ పీసీసీ చీఫ్ బొత్స కూడా ఇలాంటి లేకి విమర్శల రాజకీయాలకు దిగజారారు.
అయితే ప్రజలు మాత్రం ఈ అన్ని రకాల విమర్శలను ఏకరీతిగా గమనిస్తున్నారు. ఓర్వలేనితనంగా, వైరిపక్షాల దుష్ర్పచారంగా మాత్రమే చూస్తున్నారు. ఆ రకంగా షర్మిల పాదయాత్ర పార్టీకి అద్భుతమైన మైలేజీని ఇవ్వగలుగుతోంది.
మధ్యంతరం మహిమాన్వితం...
పూర్తికాలం పరిపాలిస్తే.. తమ తమ ప్రభుత్వాలు చేసిన పూర్తిస్థాయి అక్రమాలన్నీ వెలుగుచూస్తే పూర్తిగా పరువు గంగపాలైపోతుందని బెదిరిపోతున్న కాంగ్రెస్ వచ్చే ఆగస్టు సమయానికెల్లా మధ్యంతర ఎన్నికలు వచ్చేలాగా... వ్యూహరచన చేస్తున్నదని సమాచారం. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల తర్వాత రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఒక్కటే వారికి జీవితాశయం. ఏం చేసినా, ఏం ఆలోచించినా ఆ దిశగానే చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ నేలమట్టం అయిపోయినా సరే... వారికి అనవసరం.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏది మంచిదనిపిస్తే అది చేస్తారు. ఆ రీతిగా చూస్తే.. వచ్చే సంవత్సరం బడ్జెట్‌సమావేశాల తర్వాత.. పార్లమెంటు రద్దు నిర్ణయం ప్రకటించి ఆగస్టు వేళకు మధ్యంతరానికి వెళ్లాలన్నది కాంగ్రెస్ పెద్దల ప్లాన్. తమ ప్రభుత్వాల వైఫల్యాలు ఎక్కువ వెలికి రాకుండా ముందే ప్రజల వద్దకు వెళ్లాలని ఆలోచన. అదే జరిగితే ఆ సమయానికే రాష్ట్రప్రభుత్వం కూడా రద్దవుతుంది. ఇక్కడకూడా అప్పుడే మధ్యంతర ఎన్నికలు వస్తాయి.
అదే నిజమైతే.. జగన్‌కు అంతకు మించిన అద్భుతమైన శకునం ఉండదు. అందరూ ఏ సానుభూతి జగన్‌కు అనుకూలం అవుతుందని అంటున్నారో.. 2014 దాకా ఆ సానుభూతి నిలబడదని ఎత్తిపొడుస్తున్నారో...  అలాంటి సానుభూతి మధ్యంతరం నాటికి చాలా చాలా సజీవంగా, ఆమాటకొస్తే మరింత ఉధృతంగా ఉంటుంది. అంటే మధ్యంతరమే వస్తే గనుక... జగన్ మరింత ఢంకా బజాయించి గెలవడం గేరంటీ.
ఎంఐఎం ఉపసంహరణ
దాదాపు దశాబ్దంగా కాంగ్రెస్‌తో కలిసి అంటకాగుతున్న మజ్లిస్ పార్టీ కిరణ్‌ప్రభుత్వ దుర్మార్గం గా వ్యవహరిస్తున్నదన్న ఆరోపణలతో కాంగ్రెస్‌ను సంఘపరివార్ కీలుబొమ్మగా అభివర్ణిస్తూ తమ మద్దతు ఉపసంహరించడం అనేది రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత తాజా పరిణామం. సాధారణంగా హైదరాబాదు మినహా మిగిలిన రాష్ట్రంలో అడుగు పెట్టి కూడా ఎరగని నాయకులు ఒవైసీలు... ఇప్పుడు తాము రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కిరణ్ సర్కారు అనుసరిస్తున్న ముస్లిం వ్యతిరేక వైఖరిని ఎండగడతామని వార్నింగ్ ఇచ్చారు కూడా. ఇది జగన్‌కు చాలా అనుకూలమైన శకునం. నిజానికి జగన్ స్వయంగా నడిపించిన మంత్రాంగం అనికూడా ప్రచారంలో ఉంది.
రాష్ట్రంలో సాంప్రదాయంగా ముస్లిం ఓటుబ్యాంకు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంది. ఈ వర్గంలో తన బలం పెంచుకోవడానికి జగన్ తన ప్రయత్నాలు తాను చేశారు. మధ్యలో జగన్ బీజేపీతో కలవబోతున్నాడనే ప్రచారాన్ని, తప్పుడు అభివర్ణనలతో ప్రచారంలోకి తేవడం ద్వారా ముస్లింలలో జగన్ పట్ల కొంత మేర అనుమానాలు సృష్టించడంలో ఆయన వైరిపక్షాలు కృతకృత్యమయ్యాయి. కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ.. సోనియాతోనే సున్నం పెట్టుకున్న జగన్ కేంద్రస్థాయిలో తన మనుగడను కాపాడుకోవాలంటే.. కాంగ్రెస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం అయిన బీజేపీతో కలవాల్సిందే కదా అనే లాజిక్ కొందరికి అనుమానాలను కలిగించింది. అయితే ఇప్పుడు మజ్లిస్ దన్నుతో జగన్ సదరు అనుమానాలను సమూలంగా, అది కూడా రాష్ట్రవ్యాప్తంగా తుడిచిపెట్టేయబోతున్నారు.
మంచి చెడుల సంగతి ఎలా ఉన్నా.. ఈ రాష్ట్రంలో ముస్లింలకు అంటూ ఓ స్థాయిలో ఉన్న ఏకైక పార్టీ ఎంఐఎం మాత్రమే. రాష్ట్రమంతా ముస్లింలు ఈ పార్టీని తమదిగా ఐడెంటిఫై చేసుకుంటారు. ఆ పార్టీ నాయకులు ఊరూరూ తిరిగి కాంగ్రెస్‌ను తిట్టడం ప్రారంభిస్తే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా ముస్లిం వర్గాల్లో కట్టుబాటు కూడా జాస్తి. అసద్ ఇప్పటికే జగన్ తనకు ప్రస్తుతం మంచి స్నేహితుడు అనే స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. ముస్లిం ఓటు బ్యాంకును గంపగుత్తగా తన వైకాపా ఖాతాలో వేసుకోవడానికి జగన్ సంధించిన పాశుపతాంగా అసదుద్దీన్ ఒవైసీని భావించాలి. వారి రాష్ట్ర యాత్ర కార్యరూపంలోకి రాగానే.. ముస్లిం ఓటు బ్యాంకు వైకాపా కు నీరానాలు పట్టడమూ ఎక్కువవుతుంది. ఆల్రెడీ మతాల ప్రాతిపదికగా క్రిస్టియన్ ఓటు బ్యాంకు గన్ జేబులోనే ఉంది. ఈ రెండు మతాల ఓటు బ్యాంకులను రాష్ట్ర వ్యాప్తంగా ఏకరీతిగా తన పరం చేసుకున్న తర్వాత జగన్ తన దృష్టి కేంద్రీకరించడానికి మిగిలేదెల్లా... హిందువుల్లో కులాల వారీ ఓటుబ్యాంకులు మాత్రమే. అందులో కొన్ని తన ఖాతాలోనే ఉండగా.. మరి కొన్నింటిని మరల్చుకోవడం ఆయనకు కష్టం కాదు. కొన్నింటిని విస్మరించడం వల్ల కూడా ఆయనకు నష్టం లేదు. ఏతావతా మత, కులాల ప్రాతిపదికల పరంగా మజ్లిస్ తాజా ఎత్తుగడ.. గన్‌కు చాలా గొప్ప శకునంగా కనిపిస్తోంది.
సానుభూతి భయం
జగన్ జైల్లో ఉండడం ప్రత్యర్థులకు ఒక రకంగా లాభిస్తుంది. రాబోయే ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తే గనుక... ‘జైల్లో ఉన్నాడనే సానుభూతితోనే ఓట్లు పడ్డాయని, సీబీఐ మీద, న్యాయవ్యవస్థ మీద తాము తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రభావం  చూపించగలిగి ఉన్నా... ఆయనను బయటకు పంపి సానుభూతిని పలుచనచేసి ఉండేవార’మని కాంగ్రెస్ వారు ఆ తర్వాత అయిదేళ్లపాటూ ఆత్మవంచన చేసుకుంటూ బతికేయవచ్చు. అలాగే... ‘కాంగ్రెస్ పార్టీ జగన్‌తో కుమ్మక్కు అయిందని, అందుకే ఆయనను జైల్లో ఉంచి ఆయనకు సానుభూతి పెరిగి ఓట్లు వెల్లువలా పడేలా దోహదం చేసిందని.. పరోక్షంగా కాంగ్రెస్ జగన్ విజయానికి కారణమైం’దని ఇలా రకరకాల ఆషాఢభూతి మాటలు వల్లెవేస్తూ తెలుగుదేశం పార్టీ ఆ తర్వాతి అయిదేళ్లపాటూ కాలం దొర్లించవచ్చు. ఇందుకు పనికొస్తుందే తప్ప... ఆయనను జైల్లో ఉంచడం అనేది... వైకాపా పట్ల ప్రజల్లో సానుభూతి పవనాలు రెట్టింపు కావడానికి కారణం అవుతోంది.
వైకాపా ఆవిర్భావం తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో అవమానకరమైన వ్యత్యాసాలతో ఓడిపోయిన పార్టీలు ... జగన్‌కు సానుభూతి అంశం ఒక్కటే కలిసొచ్చిందని అంటూ మాట్లాడిన ఆత్మవంచన మాటలు మనం ఇంకా మరచిపోలేదు. అయితే ఇప్పుడు ఆయన జైలు పాలవడం అనేది సదరు సానుభూతి (నిజమే అయితే) ప్రజల్లో  చెరగిపోకుండా సజీవంగా ఉండడానికి, జైలుపాలవడం గురించి అదనపు సానుభూతి జతకావడానికి కారణంగా నిలుస్తోందన్నది నిజం. ఆ రకంగా జగన్‌కు జైలు జీవితం.. సానుభూతి పవనాల పరంగా డబుల్ బొనాంజాగా భావించాల్సిందే తప్ప.. మరోరకమైన దిగులు అక్కర్లేదు.
source:
http://greatandhrapaper.com/telugunews.php?id=41335&cat=10&scat=37

విజయమ్మను కలిసిన టీడీపీ ఎమ్మెల్యేలు

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మతో ఆదివారం ఉదయం చిత్తూరు జిల్లా పలమనేరు టీడీపీ ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఈ భేటీ జరిగింది. వీరు త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

తెలుగుదేశం పార్టీని ప్రజలు ఎప్పుడో బహిష్కరించారని ఆపార్టీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతో భేటీ అనంతరం వీరు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని వారు ఆరోపించారు. ప్రజల అభీష్టం మేరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామన్నారు. ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నా చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరా ప్రశ్న

అవిశ్వాసం పెట్టకుండా ప్రభుత్వాన్ని తిట్టడం ఎందుకు?
డొంక తిరుగుళ్లు, మెలికలు ఎందుకు?
బేరసారాలు ఎవరివో అవిశ్వాసం వచ్చినపుడు తేలుతుంది
అవిశ్వాసం గురించి మాకు పూర్తిగా తెలుసు
మీరు ఇప్పుడు సరేనంటే.. అసెంబ్లీ సమావేశాలు 
ప్రారంభమైనప్పుడే అవిశ్వాసం పెట్టొచ్చు


హైదరాబాద్, న్యూస్‌లైన్: అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో సూటిగా స్పందించకుండా డొంక తిరుగుళ్లు, వంకర టింకర మాటలెందుకని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు(సీజీసీ) ఎం.వి.మైసూరారెడ్డి టీడీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావుతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వానికి ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే చెబుతున్నారు.. పనికి మాలిన ప్రభుత్వం అంటున్నారు.. అదే నిజమైనపుడు ఒక గుర్తింపు పొందిన ప్రధాన ప్రతిపక్షంగా అవిశ్వాస తీర్మానం పెట్టమని మేం కోరుతున్నాం.. దానికి స్పందించకుండా అవిశ్వాస తీర్మానం గురించి తెలియని వాళ్లు అడిగితే మేం పెడతామా! అని ప్రశ్నించడం ఏమిటి? అవిశ్వాసమంటే మీకు భయమా?’ అని మైసూరా ప్రశ్నించారు. 

రెండుసార్లు ప్రతిపక్షంలోనూ, ఒక సారి అధికారంలోనూ పనిచేసిన వ్యక్తిగా తనకు అవిశ్వాస తీర్మానం గురించి పూర్తిగా తెలుసునని, శాసనసభ నియమావళిపై కూడా అవగాహన ఉంద ని మైసూరా అన్నారు. ‘‘అవిశ్వాసం పెట్టేది శాసనసభ సమావేశాలున్నపుడేనన్న విషయం బాగా తెలుసు, అయినా ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే ఇపుడు మీరందుకు అంగీకరిస్తే చాలు, సమావేశాలు ప్రారంభమైనపుడే పెట్టొచ్చు’’ అని మైసూరా వివరణ ఇచ్చారు. ‘‘చంద్రబాబు చట్టసభలో అవిశ్వాసం పెట్టే అవకాశాన్ని వదిలి వేసి ఊరూరా పాదయాత్రలు చేస్తూ ప్రభుత్వంపై తిట్ల పురాణం చదివితే ప్రయోజనం ఏమిటి? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. వారిని మభ్య పెట్టడమే అవుతుంద’’ని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మాకు అధికార దాహం లేదు: గవర్నర్ వద్దకు వెళ్లి బలప్రదర్శన చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌ను టీడీపీ నేతలు కోరడాన్ని మైసూరా తప్పు పట్టారు. ‘‘గవర్నర్ ముందు బలప్రదర్శన అనేది అధికారదాహంతో ఉన్నవాళ్లు చేసే పని. తమకున్న సంఖ్యాబలాన్ని ప్రదర్శించి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరేవాళ్లు అలా చేస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికార దాహం లేదు, ఆ పని చేయదు. ప్రజల్లో ఉండి వారి విశ్వాసంతో ఎన్నికై ప్రభుత్వంలోకి రావాలనుకునే పార్టీ మాది, అందుకే బల ప్రదర్శన వేరు, అవిశ్వాసం వేరు అంటున్నాం’’ అని అన్నారు. ‘‘మంత్రులే చెబుతున్నారు, ఈ ప్రభుత్వంలో పాలన జరగడం లేదని, అచేతనంగా ఉందని, ఒక చేయికి తెలియకుండా మరో చేయితో పనులు జరుగుతున్నాయని... ఇవన్నీ వారు అంతర్గతంగా మాట్లాడ్డం లేదు, బాహాటంగా మీడియా ముందుకే వచ్చి చెబుతున్నారు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితిని టీడీపీ ఒక ప్రతిపక్షంగా ఉపయోగించుకుని అవిశ్వాసం పెట్టకుండా వెనక్కు తగ్గడాన్నే మేం ప్రశ్నిస్తున్నాం, అవిశ్వాసం అంటే మీకు భయమా? పెట్టడానికి ధైర్యం లేదా’’ అని ఆయన అన్నారు. 

సంఖ్యాబలం ఉంటే తామే అందుకు పూనుకునే వారమని, లేదు కాబట్టే టీడీపీ పెడితే మద్దతు ప్రకటిస్తామని చెబుతున్నామని అన్నారు. అవిశ్వాసం పెట్టాలని అందరూ డిమాండ్ చేస్తున్నా పెట్టడం లేదంటే టీడీపీ ప్రభుత్వంతో లాలూచీ పడిందనైనా అనుకోవాలి, లేదా అభయహస్తం ఇచ్చిందనైనా అనుకోవాలన్నారు. అసలు అవిశ్వాసం పెడితే ఎవరు బేరసారాలు ఆడుకునేదీ కచ్చితంగా తేలిపోతుందన్నారు. ఏ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే గైర్హాజరైనా వారు ప్రభుత్వంతో బేరమాడుకున్నట్లేనని మైసూరా అన్నారు. ఎమ్మెల్యేలను కొనుక్కునే అవసరం తమకు లేదని, నేలవిడిచి సాము చేయడ ం చంద్రబాబు అలవాటని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

డ్రామాల బాబు: వంద మంది బీసీలను శాసనసభకు పంపిద్దామని తమ పార్టీ ప్రతిపాదిస్తే దానికి సమాధానం చెప్పకుండా వంద టికెట్లు ఇస్తామని చంద్రబాబు చెప్పడం మోసపూరితమని గట్టు రామచంద్రరావు అన్నారు. గెలవలేని చోట్ల సీట్లను కేటాయించడం కన్నా ముఖ్యమైన పార్టీలన్నీ కూడబలుక్కుని అనధికారికంగా బీసీలకు వంద స్థానాలు కేటాయిద్దామనేది తమ పార్టీ విధానమని ఆయన అన్నారు. నిజంగా బాబుకు ఈ విషయంలో చిత్తశుద్ధి లేదని, డ్రామాలాడుతూ డ్రామాల బాబుగా మారి పోయారని విమర్శించారు.

source:sakshi

ప్రజలవైపో.. ప్రభుత్వంవైపో తేల్చుకోండి

అవిశ్వాసం మీరు పెట్టండి.. లేదా మేం పెడతాం మద్దతివ్వండి
మీ పాదయాత్రలో ఉన్న చిత్తశుద్ధి ఎంతో నిరూపించుకోండి
ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి..రోజులు: 31, కిలోమీటర్లు: 403.90

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘చంద్రబాబు నాయుడు గారూ! ఇదిగో.. ఈ ప్రజల మాటలు, వాళ్ల గోడు మీకు వినిపిస్తోందా? ప్రజలకు ఏమీ చేయలేని ఈ దుర్మార్గపు ప్రభుత్వం ఎప్పుడెప్పుడు కూలుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మీ పాదయాత్రలో చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీలో విశ్వసనీయత అనేది ఉంటే వెంటనే అవిశ్వాసం పెట్టండి. కానీ మీరేమో అవిశ్వా సం పెట్టనుగాక పెట్టను అంటారు. కాబట్టి మేమే అవిశ్వాసం పెడతాం.. దానికి మీరు మద్దతు ఇస్తారా? సూటిగా చెప్పండి. మీరు ప్రజల పక్షం ఉంటారో..ప్రభుత్వం పక్షం ఉంటారో తేల్చుకోండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల.. టీడీపీ అధ్యక్షుడికి సవాల్ విసిరారు.

ప్రజల కష్టాలు పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం, దానికి వెన్నుదన్నుగా నిలిచిన టీడీపీ వైఖరులకు నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 31వ రోజు శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల పరిధిలో సాగింది. తిమ్మాపురం గ్రామంలో షర్మిల రచ్చబండ మీద మహిళలతో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ‘అమ్మా.. బోరులో నీళ్లు తోడుకొని తాగుదామన్నా కరెంటు ఉండటం లేదు.. తాగే నీళ్లకు కూడా ఇబ్బంది ఉంది. వానలు లేక పంటలు ఎండిపోయినయ్.. నష్ట పరిహారం ఇస్తామన్నారు కానీ ఇంత వరకు లేదు. జ్వరం వస్తే పస్తులు పడుకుంటున్నాం.. మొన్ననే చంద్రబాబు గారి పాదయాత్ర మా ఊరి నుంచే పోయింది. ఆయనకూ మా బాధలు చెప్పినం. ఇది పనికిరాని ప్రభుత్వం.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించితే మీకు మేలు జరుగుతుంది అన్నారు.. బాబుగారు తలచుకుంటే ప్రభుత్వం కూలిపోతుందని టీవీల్లో చెప్తున్నారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వాన్ని బాబుగారు కూలగొట్టడం లేదమ్మా’’ అని ఇదే గ్రామానికి చెందిన వెన్నెల మహిళా గ్రూపు సభ్యులు తోడేళ్ల రామలింగమ్మ, నర్సమ్మ షర్మిలను అడగటంతో ఆమె పై విధంగా స్పందించారు.

ఇల్లు ఇవ్వట్లేదు.. బిల్లూ ఇవ్వట్లేదు..

‘‘వైఎస్సార్ ఇలాంటి గ్రామాలకే వచ్చి రచ్చబండ మీద నిలబడి ‘అర్హులై ఉండి ఇల్లు లేని నిరుపేదలు ఉంటే చెయ్యి ఎత్తండి’ అని అడిగితే ఒక్క చెయ్యి కూడా పైకి లేవకూడదని, అంతలా ప్రజలకు మేలు చేయాలని ఆయన అనుకున్నాడు. ఈ రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా ప్రతి పేదవానికీ పక్కా ఇల్లు కట్టివ్వాలని కలలుగన్నారు. కాని ఈ చేతగాని ప్రభుత్వం వైఎస్సార్ పెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తోంది. కనీసం వైఎస్సార్ మంజూరు చేసిన ఇల్లుకు కూడా ఈ ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేకపోతోంది. ప్రజలు.. మహిళలు.. విద్యార్థులు.. రైతులు.. కూలీలు ఏ ఒక్కరి సమస్యలు కూడా వారికి పట్టడం లేదు. ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దెదింపాల్సిన చంద్రబాబు పాదయాత్ర అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చి మళ్లీ అక్కడికే వెళ్లి నాకో అవకాశం ఇవ్వాలంటూ మొసలి కన్నీళ్లు కార్చుతున్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని కూల్చకుండా నిలబెడుతున్నారు. ఇప్పుడాయన ప్రతిపక్షం కాదు. కాంగ్రెస్‌కు టీడీపీ మిత్రపక్షంగా మారింది’’ అని షర్మిల నిప్పులు చెరిగారు.

విద్యార్థులకు చెట్ల కింద పాఠాలు..

31వ రోజు ఉదయం ఎమ్మిగనూరు శివారులోని గణేశ్ రైస్ మిల్ నుంచి బయలుదేరిన షర్మిలకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. మధ్యాహ్నం కలగొట్ల, తిమ్మాపూరు చేరేవరకు వేలాది మంది జనం పాదయాత్రలో ఆమె వెంట నడిచారు. తిమ్మాపురంలో ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. ఇక్కడ ఏడు తరగతులకుగాను మూడే గదులు ఉన్నాయి. విద్యార్థులకు చెట్లకింద పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న షర్మిల ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ ఇదా? అని ప్రశ్నించారు. నవంబర్ గడుస్తున్నా ఇప్పటి వరకు స్కూల్ యూనిఫామ్ ఇవ్వక పోవటాన్ని ఆమె తప్పు పట్టారు. తిమ్మాపూరం మీదుగా గార్లదిన్నె, దైవందిన్నె గ్రామాలవైపు వస్తుండగా రైతు కూలీలు ఎదురుగా వచ్చి ఎండిపోయిన పత్తి చెట్లను, నాణ్యత లేని దిగుబడి వచ్చిన పత్తిని షర్మిలకు చూపించారు. దైవందిన్నెలో కిక్కిరిసిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. అక్కడి నుంచి కోడుమూరు నియోజకవర్గంలోని కాంపాడు గ్రామం సమీపంలో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8.45 షర్మిల చేరుకున్నారు. శనివారం మొత్తం 15 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తం 403.90 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తయింది.

షర్మిలకు నాయకుల సంఘీభావం

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: జిల్లాలో సాగుతున్న షర్మిల పాదయాత్రకు ఇతర జిల్లాల నుంచి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు సంఘీభావంగా తరలివస్తున్నారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, వైజాగ్ నాయకులు మల్లి చిన్న, శ్రీనివాస రావు శనివారం కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. కొత్తగా నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ బి. జనార్దన్ రెడ్డి, కావలి ఇన్‌చార్జి రాంరెడ్డి ప్రతాపరెడ్డి, పార్టీ డాక్టర్స్ సెల్ కన్వీనర్ జి. శివ భారత్ రెడ్డి పాదయాత్రలో షర్మిల వెంట నడిచారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, చెన్నకేశవరెడ్డి, పార్టీ ప్రోగ్రాం కమిటీ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ మంత్రి ఎం. మారెప్ప, మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి. మోహన్ రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

చంద్రకళకు మళ్లీ చదువుకళ..

ఇంటర్మీడియెట్ పాసై పేదరికంతో డిగ్రీ చదవలేక కూలీ పనులకు వెళ్తున్న బాలికను షర్మిల అక్కున చేర్చుకున్నారు. తిరిగి కాలేజ్‌కు వెళ్లి చదువుకుంటే ఖర్చులు తాను చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన విరూపాక్ష గౌడ్ కూతురు చంద్రకళ ఇంటర్మీడియెట్ సీఈసీలో ఉత్తీర్ణత సాధించారు. పేదరికంతో చదువు మానేసి కూలీ పనులకు వెళ్తున్నారు. పత్తి చేలో పత్తి తీస్తున్న వారిని షర్మిల పలకరించారు. పేదరికంతో తాను ఉన్నత చదువుకు దూరమయ్యానని, ఇవ్వాళ వైఎస్సార్ బతికే ఉంటే తాను ధైర్యంగా డిగ్రీ చదివేదానినని చంద్రకళ చెప్పారు.

ఆడోళ్లమే ఓట్లేసి గెలిపిస్తాం
‘‘జగన్ను జేళ్ల బెట్టి గెలుద్దామనుకుంటాండారు. ఆయన ఎక్కడున్నా ఆడోళ్లమే ఓట్లేసి గెలిపిత్తం. మొన్న జగన్‌కు(ఎమ్మిగనూరు బైఎలక్షన్‌లో) ఓటెయ్యొద్దని రూపాయలు పంచినారు.. ఓటు వేయకుండా ఉన్నామా? చంద్రబాబు ముందే ముంచేసిన మనిషి. ఇప్పుడొచ్చి అప్పుడు బాగచేయలేదు.. ఇప్పుడు జేస్తా అంటే.. ఆ మనిషిని ఎట్టా నమ్మేది?’’ అని తిమ్మాపూరానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు చాకలి శంకరమ్మ షర్మిలతో అన్నారు. ‘అన్న బాగుండాడా అమ్మా’ అని ఆమె షర్మిలను జగన్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

source:sakshi

భరోసానిస్తూ!

‘తాగడానికి నీళ్లు లేవు... రెండు, మూడు గంటలకు మించి కరెంటు ఉండదు... చేన్లకు నీళ్లు లేవు.. పింఛన్లు ఎత్తేశారు... ఫీజులు కట్టలేక పిల్లలు చదువు మానేశారు... నవంబర్ వచ్చినా స్కూల్లో యూనిఫారాలు లేవు... వలంటీర్ టీచర్లకు జీతాలు లేవు...’

- వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రలో అడుగడుగునా ప్రజలు చెపుతున్న సమస్యల్లో ఇవి కొన్ని మాత్రమే.

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: షర్మిల పాదయాత్ర చేస్తూ వస్తున్నారని తెలియగానే వ్యవసాయ పనులు పక్కన బెట్టి రైతులు... కూలీ పనులు మానుకొని మహిళలు... బస్సులు, ఆటోల్లోని ప్రయాణీకులు... గుంపులు గుంపులుగా తరలివస్తూ జగన్ సోదరికి తమ బాధలు చెప్పుకున్నారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వ పాలనలో ప్రజల కష్టాలు తెలుసుకొని జగనన్నకు చెప్పేందుకే తాను వచ్చానన్నారు. జిల్లాలో పదోరోజు పాదయాత్రలో భాగంగా శనివారం షర్మిల ఎమ్మిగనూరు మండలంలోని గణేష్ రైస్‌మిల్ నుంచి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. కలుగొట్ల, కె. తిమ్మాపురం, దైవం దిన్నెల గుండా కోడుమూరు నియోజకవర్గంలోని కంపాడ్‌లోకి ప్రవేశించించారు. 15 కిలోమీటర్ల పాదయాత్రలో షర్మిలకు అడుగడుగునా జనం నీరాజనాలు పట్టారు.

రాత్రి వరకు ప్రజల బాధలు వింటూనే...
ఉదయం పాదయాత్ర ప్రారంభమైన తరువాత కలుగొట్ల వద్ద మహిళలు, రైతులు, కూలీలు, విద్యార్థులు రోడ్డు పైకి వచ్చి కూర్చొని షర్మిలకు తమ బాధలు చెప్పుకున్నారు. మహానేత వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పటి పరిస్థితి... ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యల గురించి విన్నవించారు. పెరిగిన ఎరువుల ధరలు, కరెంటు లేక బోర్లు పనిచేయక ఎండుతున్న పంటలు, పండిన పంటలకు మద్ధతు ధర లేకపోవడం, ఉపాధి హామీ పథకంలో కూలీలకు రూ. 30 కూడా ఇవ్వని పరిస్థితి... ఇలా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. షర్మిల ఓపిగ్గా విని ధైర్యం చెప్పారు. భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. 

చంద్రబాబే కాదు... కిరణ్‌కుమార్ కూడా అబద్దాల కోరే!
కె. తిమ్మాపురానికి వెళ్లగానే గ్రామ ప్రజలంతా ఊరి చావిడి వద్ద గుమిగూడి షర్మిలతో రచ్చబండ నిర్వహించారు. మహిళలంతా తమకు పింఛన్లు రావడం లేదని, ఉన్న పింఛన్లు కూడా ఎత్తేస్తున్నారని వెల్లడించారు. మహిళా గ్రూపుల కింద అప్పు తీసుకుంటే రూ.3 వడ్డీ వంతున వసూలు చేస్తున్నారని స్థానిక పరిస్థితిని వివరించారు. దీంతో షర్మిల ‘ సీఎం వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెపుతున్నారు కదక్కా!’ అని ప్రశ్నించడంతో అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. దాంతో ఆమె ‘ ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఒక్కరికే అబద్దాలు చెప్పే అలవాటు ఉందనుకొన్నాను.

కానీ కిరణ్‌కుమార్ రెడ్డికి కూడా అబద్ధాలు దండిగానే చెప్పే అలవాటు ఉందన్నమాట’ అని వ్యాఖ్యానించారు. వారితో పాటు రైతులు కూడా కరెంటు, నీటి కష్టాలను చెప్పుకోగా... ‘ ఈ ప్రభుత్వం పట్ల మీకు విశ్వాసం ఉందా?’ అని ప్రశ్నించడంతో ‘లేదు... లేదు’ అంటూ సమాధానం చెప్పారు. దీంతో షర్మిల స్పందిస్తూ... ‘ ప్రజలకు విశ్వాసం లేకపోయినా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు మాత్రం కిరణ్ ప్రభుత్వంపై విశ్వాసం ఉందంట. అందుకే అవిశ్వాసం పెట్టడం లేదు’ అని చెపుతూ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను, జగన్‌ను ప్రజలకు దూరం చేసేందుకు పన్నుతున్న కుట్రలను ప్రజలకు వివరించారు.

పెద్ద పెద్ద చదువులు చదవాలి...
కె. తిమ్మాపురంలో మధ్యాహ్న భోజనాల తరువాత పాదయాత్ర ప్రారంభించిన షర్మిల అక్కడే ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు వెళ్లారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో గుమిగూడి ఆమెకు స్వాగతం పలకడంతో పాటు తమ సమస్యలు వివరించారు. 

250 మంది విద్యార్థులకు ముగ్గురే రెగ్యులర్ టీచర్లు ఉన్నారని, విద్యావలంటీర్లను కూడా ఆగస్టులో గానీ నియమించలేదని వారు చెప్పారు. నవంబర్ నెల వచ్చినా ఇప్పటి వరకు యూనిఫారాలు లేవని, బాత్‌రూంలు సరిగా లేవని తమ బాధలు వెల్లడించారు. దీంతో షర్మిల టీచర్ గా మారి విద్యార్థులకు బుద్ధులు చెప్పారు. ‘తరతరాల వెనుకబాటుకు చదువే శాశ్వత పరిష్కారం. పిల్లలంతా శ్రద్ధగా మనసు పెట్టి చదువుకోవాలి. టెన్త్, ఇంటర్, డిగ్రీలతో చదువు ఆపకుండా పెద్ద చదువులు చదవాలి. పెద్ద ఉద్యోగాలు చేయాలి. మరో ఏడాది గడిస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారు. మీరు ఫ్రీగా చదువుకోవచ్చు. అప్పటి వరకు అధైర్యపడొద్దమ్మా! ’ అని బుజ్జగించారు.

అనంతరం గార్లదిన్నెలో కూలీలు, రైతులతో మాట్లాడి వారి బాధలు విన్నారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పూర్తికాక కాలువలకు నీరు రాక పడుతున్న కష్టాలు వివరించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిలదే ఈ పాపం అని ఆమె వివరిస్తూ... గురు రాఘవేంద్ర ప్రాజెక్టును ప్రారంభించి పనులు పూర్తిచేస్తే ఎత్తిపోతలకు మోటార్లు బిగించలేని దయనీయస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అనంతరం దైవందిన్నె వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ ప్రభుత్వ, ప్రతిపక్ష తీరుపై నిప్పులు చెరిగారు. 

రాజన్న వరం.. మెట్టకు జీవం

పేదల కష్టాలు తమవిగా భావిస్తారు. ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయరు. అందరూ బాగుండాలనే ఆశ. వారి కోసం ఏదో చేయాలనే తపన. ఇదీ మహానేత వైఎస్‌ఆర్ కుటుంబీకుల మనస్తత్వం. మాట తప్పను...మడమ తిప్పను అంటూ ఎప్పుడూ చెప్పే మహానేత ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసి జన హృదయాల్లో స్థిర స్థాయికి నిలిచారు. అదే బాటలో నడిచిన జననేతకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ప్రజల కష్టాలు తెలుసుకుని ఓదార్చేందుకు రాజన్న బిడ్డ షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్రగా ప్రజల ముందుకు వస్తున్నారు. ఆదివారం నుంచి కోడుమూరు నియోజకవర్గం మీదుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మహానేత జలయజ్ఞ ఫలాలపై ‘న్యూస్‌లైన్’ కథనం. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఈ ప్రాంతానికి ఎంతో అనుబంధం ఉంది. 1999లో ఏర్పడిన కరువు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ఆర్ కోడుమూరు, గూడూరు మండలాల్లో పర్యటించారు. అన్ని మెట్ట పొలాలే.. వర్షాలొస్తే సేద్యం. లేదంటే నష్టాలే కళ్లారా చూశారు. ఈ ప్రాంత ప్రజలకు ఏదో చేయాలని నిర్ణయించుకున్నారు. ఓట్ల కోసం ప్రజలను మభ ్య పెట్టేందుకు 1999లో గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకాల పేరుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఓట్లేయించుకొని ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ఈ పథకాలకు పైసా విదిల్చలేదు. 2004లో ముఖ్యమంత్రి అయిన వెంటనే వైఎస్‌ఆర్ నియోజక వర్గంలోని సి.బెళగల్, గూడూరు, కల్లూరు మండలాల్లోని కిష్టదొడ్డి, చింతమానుపల్లె, రేమట, మునగాల ఎత్తిపోతల పథకాలకు రూ. 36.20 కోట్ల నిధులు విడుదల చేశారు. ఏపీఎస్‌ఐడీసీ శాఖతో పనులు చేయించి ఎత్తిపోతల పథకాలకు జీవం పోశారు. రేమట ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన నడుస్తుండగా, మిగతా 3 ఎత్తిపోతల పథకాల కింద పోలకల్, యనగండ్ల, గుండ్రేవుల, కొండాపురం, పల్‌దొడ్డి, ముడుమాల, ఈర్లదిన్నె, కె.సింగవరం, మునగాల గ్రామాల్లో 10902 ఎకరాలకు ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి సాగు నీరు అందుతోంది.

ఒకప్పుడు వర్షాధారంపైనే ఆధారపడి జీవస్తున్న రైతులు నేడు ఎత్తిపోతల పథకంతో ఏడాదికి రెండు పంటలను రైతులు పండించుకుంటున్నారు. ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ నిర్మాణంతో ఆ ప్రాంతాల్లోని పంట పొలాలకు కూడా డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ఎకరా ధర వేలల్లో ఉండగా, నేడు లక్షలాది రూపాయలకు చేరింది. సి.బెళగల్ నుంచి పోలకల్ గ్రామం వరకు రోడ్డుకు ఇరువైపులా ఎల్లకాలం పచ్చటి పొలాలతో ఆ ప్రాంతం కళకళలాడుతోంది. ఎత్తిపోతల పథకాల కింద వ్యవసాయం చేసుకుంటున్న రైతుల జీవన స్థితి మారిపోయింది. ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. అయితే ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ కోత కారణంగా నీళ్లు ఎత్తిపోసే సమస్య రావడంతో ప్రస్తుతం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 

ఆ రోజులు మళ్లీ ఎప్పుడు వస్తాయో: రామాంజనేయులు, రైతు
రైతులకు రాజశేఖర్ రెడ్డి ఎంతో మేలు సేసినాడు. ఆయన బతికున్నప్పుడు పొలానికి నీళ్ల సమస్య ఉండేది కాదు. ఇప్పుడు కరెంటు రాదు, పొలాల్లోకి నీళ్లు పారవు. రాత్రీపగలూ తిరిగినా ఎకరా పొలం తడవదు. సంఘమోళ్లు ఎకరాకు రూ. 700 కట్టించుకుంటున్నారు. ఎత్తిపోతల పథకం నీళ్లు రావని బోరుతోనే సేను తడుపుకుంటున్నాం.

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా..

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం కోడుమూరు నియోజకవర్గంలో సాగుతుంది. 

నియోజకవర్గంలోని సి-బెళగల్ మండలంలోని నాలుగు ప్రధాన గ్రామాల గుండా 17 కిలోమీటర్లు షర్మిల నడవనున్నారని పార్టీ ప్రోగ్రామ్స్ కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. శనివారం రాత్రి బస చేసిన కంపాడు నుంచి ఆదివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమై సి.బెళగల్, పోలకల్ గుండా జూలకల్ చేరుకుంటుందని వారు పేర్కొన్నారు. 

Sharmila's speech at Daivam denni in Kurnool

Probe Subramanian Swamy's charges against Rahul Gandhi: EC

YSRCP ready to no-trust motion if TDP supports : Sharmila

Mysura Reddy comments on Chandrababu

అవిశ్వాసంపై డొంకతిరుగుడు సమాధానాలు వద్దని, చెప్పేది నేరుగా, స్పష్టంగా చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మైసూరా రెడ్డి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుని కోరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు తన పాదయాత్రలో ప్రతిచోట ఈ ప్రభుత్వానికి పాలించే అర్హతలేదని చెబుతున్నారని, అటువంటప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెట్ట్రని అయన ప్రశ్నించారు. అవిశ్వాసంపై ఒంకరిటింకరి మాటలు, ఆయోమయ ప్రకటనలు చేయవద్దన్నారు. శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టమని చెప్పారు. ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరగడంలేదని, అయినప్పటికీ స్పష్టంగా ప్రకటించాలన్నారు. తమకు సంఖ్యాబలం ఉంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేవారమని ఆయన చెప్పారు. బలప్రదర్శనకు, అవిశ్వాసానికి తేడా ఉందని ఆయన వివరించారు. ప్రభుత్వంలోని మంత్రులు, కాంగ్రెస్ శాసనసభ్యులే పరిపాలనపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి సమయంలో గుర్తింపు పొందిన ప్రతిపక్షంగా అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ఎందుకు ముందుకు రావడంలేదని ఆయన ప్రశ్నించారు. అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడితే మద్దతు ఇస్తామని టిఆర్ఎస్ కూడా చెబుతోందన్నారు. తాము కూడా మద్దతు తెలుపుతామని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని బలవంతంగా కూలదోయాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. తాము ప్రజల నుంచే అధికారం పొందుతామని చెప్పారు.

ఠాక్రే మృతిపై విజయమ్మ సంతాపం

శివసేన అధినేత బాల్ ఠాక్రే మృతిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సంతాపాన్ని వెలిబుచ్చారు. పలువురు స్థానిక, జాతీయ ప్రముఖులు కూడా ఠాక్రే మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఢిల్లీలో భారతీయ జనతాపార్టీ సినియర్ నేత సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ టైగర్ (ఠాక్రే) మరణం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

పార్టీ నేత షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ దేశం ఒక యోధుడిని కోల్పోయిందన్నారు. ఠాక్రే అంతిమ యాత్రలో పార్టీ శ్రేణులు పాల్గొంటాయని వెల్లడించారు. శివసేనతో తమ అనుబంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నేడు బీజేపీ నేతలకు ఏర్పాటు చేసిన విందును ఠాక్రే మృతి కారణంగా, ప్రధాని మన్మోహన్ రద్దు చేసుకున్నారు.

కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివసేన అధినేత బాల్ ఠాక్రే శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయనకు చికిత్స చేస్తున్న డాక్టర్ జైల్ ధ్రువీకరించారు. ఠాక్రే శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు. దీంతో ముంబైవాసులే కాక, దేశవ్యాప్తంగా ఉన్న ఠాక్రే అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన కన్నుమూసిన మాతోశ్రీ వద్దకు అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.


source:sakshi

కే.తిమ్మాపురంలో షర్మిల రచ్చబండ

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ను బాబు ఎన్నికల కోసం వాడుకుని వదిలేశారని... వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేశారని ఆమె గుర్తు చేశారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకమని, దానికి విద్యుత్, మోటర్లు అవసరమన్నారు.

అయితే విద్యుత్, మోటార్లు సమకూర్చటానికి ప్రభుత్వానికి మూడు సంవత్సరాలు సరిపోలేదని షర్మిల విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే నీటి సమస్యను తీర్చుతారన్నారు. కే తిమ్మాపురంలో రచ్చబండలో షర్మిల మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.

Friday 16 November 2012

వైఎస్ వల్లే కాంగ్రెస్‌కు ఢిల్లీ పీఠం: షర్మిల

వైఎస్ మరణిస్తే తట్టుకోలేక వందల గుండెలు ఆగిపోయాయి
ఆ బాధిత కుటుంబాలను ఓదార్చుతామన్న కాంగ్రెస్ నేతలు తర్వాత మర్చిపోయారు
ఈ ప్రభుత్వం ఒక్క రాజన్న కుటుంబాన్నే కాదు.. ప్రజలందరినీ కక్షగట్టి ిహ ంసిస్తోంది
అవిశ్వాసం పెట్టాల్సిన చంద్రబాబు.. ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 30, కిలోమీటర్లు: 388.90

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న తండ్రిలా తన రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించాడు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చేసి చూపించాడు. ఒకటి కాదు, రెండు కాదు 30 ఏళ్లు కాంగ్రెస్‌కు సేవ చేసి.. రెండు సార్లు ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందంటే.. రాజన్న ఇచ్చిన ఎంపీల వల్ల కాదా? అని అడుగుతున్నాం. మరి అలాంటి రాజన్న చనిపోతే కొన్ని వందల గుండెలు తట్టుకోలేక బాధతో ఆగిపోతే.. ఒక్కరంటే ఒక్క కాంగ్రెస్ నాయకుడు.. ఒక్కటంటే ఒక్క కుటుంబాన్నైనా ఓదార్చారా? బాధిత కుటుంబాలను ఓదార్చుతామని చెప్పి, డబ్బు సాయం చేస్తామని చెప్పి.. వాళ్లని మరిచిపోయారు. చనిపోయిన వాళ్లంతా కాంగ్రెస్ పార్టీ వాళ్లే. అయినా పట్టించుకోలేదు ఆ పార్టీ’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. ప్రజా సంక్షేమం పట్టని రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, దానిపై అవిశ్వాస తీర్మానం పెట్టకుండాఆ సర్కారుతోనే కుమ్మక్కైన టీడీపీ రాజకీయాలకు నిరసనగా షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 30వ రోజు శుక్రవారం కర్నూలు జిల్లా మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలో సాగింది. సాయంత్రం ఎమ్మిగనూరులో జరిగిన భారీ బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

వైఎస్‌ను దోషిగా నిలబెట్టే యత్నం..

‘‘రాజశేఖరరెడ్డి ఏ పథకం తెచ్చినా ఇందిరాగాంధీ అని, రాజీవ్ గాంధీ అని వాళ్ల పేర్లే పెట్టాడు. అందుకు బహుమానంగా రాజశేఖరరెడ్డి గారి పేరును దోషిగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఇది అన్యాయం కాదా? ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నాం. రాజశేఖరరెడ్డి గారి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి.. మీ గుండెల్లో ఆయనను దోషిగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం ఒక్క రాజన్న కుటుంబాన్నే కాదు.. రాష్ట్ర ప్రజలందరి మీదా కక్షగట్టి హింసిస్తోంది. ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేనే లేదు..’’ అని షర్మిల విమర్శించారు.

సిగ్గులేకుండా మరో అవకాశం ఇవ్వాలంటున్నాడు..

‘‘చంద్రబాబు హయాంలో వందల మంది చేనేత కార్మికులు, 4 వేల మంది రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు రాజన్న వారి కుటుంబాలకు సాయం చేయాలని చంద్రబాబును అడిగితే పైసా కూడా సాయం చేయలేదు. రాజన్న అధికారంలోకి వచ్చాక వారికి లక్షన్నర చొప్పున నష్ట పరిహారం ఇచ్చాడు. చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలాడుతున్నారు. గ్రామాలను శ్మశానాలుగా మార్చి అదే గ్రామాల మీదుగా వెళుతూ ఇప్పుడు సిగ్గు లేకుండా మరో అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారు. నా మాట నమ్మాలంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. ప్రజలు అమాయకులు కాదు. చంద్రబాబు అనుకుంటున్నట్టు పిచ్చోళ్లు అంతకన్నా కాదు’’ అని షర్మిల నిప్పులు చెరిగారు. ‘‘చంద్రబాబు ప్రభుత్వాన్ని తిట్టినట్టు నటిస్తూనే మిత్రపక్షంగా ఉంటూ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు. ఆయన చేస్తున్న పాదయాత్రకు, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజూ అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు పెంచిపోషిస్తున్నారు..’’ అని షర్మిల మండిపడ్డారు.

కిక్కిరిసిన ఎమ్మిగనూరు..

ఉదయం 10.30కు హెచ్.మురవణి శివారులో ప్రారంభమైన పాదయాత్రలో తొలుత అక్కడి స్థానికులతో షర్మిల రచ్చబండ నిర్వహించారు. అక్కడి నుంచి నాలుగో మైలు(కంబదహాళ్ క్రాస్), కొత్తగొలలదొడ్డి మీదుగా సాయంత్రం ఎమ్మిగనూరు చేరుకున్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో శివారు నుంచే ప్రజలు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 5.30కు ఎమ్మిగనూరులో జరిగిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. అక్కడ సభలో మాట్లాడిన తరువాత రాత్రి 7 గంటలకు శివారులోని రైస్‌మిల్లు వద్ద ఏర్పాటుచేసిన రాత్రి బసకు ఆమె చేరుకున్నారు. శుక్రవారం 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు 30 రోజుల్లో మొత్తం 388.90 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తయింది.

షర్మిల పాదయాత్రలో ప్రముఖులు

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: షర్మిల పాదయాత్రలో శుక్రవారం మాజీ మంత్రి, పార్టీ సీజీసీ సభ్యుడు కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం నుంచి షర్మిల వెంట యాత్రలో నడుస్తున్నారు. విశాఖ పట్టణానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, పార్టీ నేత తిప్పల నాగిరెడ్డి, ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్‌రెడ్డి, ప్రకాష్ బాబు, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, వై. బాలనాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, సాయి ప్రసాద్‌రెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఉదయం పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ బస చేసిన క్యాంప్‌కు వచ్చి ఆమెతో మాట్లాడి వెళ్లారు.

ఎంపీనని జైల్లో పెడతారా?

అరెస్టు చేసి ఐదున్నర నెలలు దాటిందని నివేదన

‘‘అరెస్టు చేసిన 90 రోజుల్లోపు చార్జిషీటు దాఖలు చేయకపోతే నిందితుడికి విధిగా బెయిలివ్వాలి. సుప్రీంకోర్టు గత తీర్పులూ అదే చెబుతున్నాయి. ఇంకా దర్యాప్తు జరగాల్సి ఉందని సీబీఐ చెబుతున్న ఏడు అంశాలకు కూడా 90 రోజుల గడువు వర్తిస్తుంది.’’

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘సాక్షి’ పెట్టుబడుల వ్యవహారంలో అరెస్టు చేసిన తనకు బెయిలు మంజూరు చేయాలంటూ కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం సీబీఐ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు కోర్టులో ఆయన రెండు బెయిలు పిటిషన్లు దాఖలు చేశారు. తనను అరెస్టు చేసి ఇప్పటికే ఐదున్నర నెలలు దాటిందని గుర్తు చేశారు. అరెస్టు చేసిన 90 రోజుల్లోపు చార్జిషీటు దాఖలు చేయకపోతే విధిగా నిందితుడికి బెయిలివ్వాల్సి ఉందని పేర్కొంటూ సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద స్టాట్యుటరీ బెయిలు పిటిషన్ వేశారు. తనను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపింది తొలి చార్జిషీటుకు సంబంధించిన (సీసీ-8) కేసులో గనుక, దానిపై ఇప్పటికే దర్యాప్తు పూర్తయినందున బెయిలివ్వాలంటూ సీఆర్పీసీ సెక్షన్ 437 కింద సాధారణ బెయిలు పిటిషన్ కూడా వేశారు. జగన్ తరఫున న్యాయవాది జి.అశోక్‌రెడ్డి వీటిని దాఖలు చేశారు.

‘‘ఇంకా ఏడు అంశాలపై దర్యాప్తు పెండింగ్‌లో ఉందని సుప్రీంకోర్టుకు సమర్పించిన నోట్‌లో సీబీఐ పేర్కొంది. కానీ అవేమీ దర్యాప్తు జరుగుతుండగా బయట పడ్డవేమీ కావు. 2012 ఆగస్టులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో కూడా పేర్కొన్నవే. కాబట్టి దర్యాప్తు చేయడానికి సీబీఐకి గడువు వర్తిస్తుంది. గడువు లోపు పూర్తి చేయకుంటే నిందితుడికి ఆటోమేటిగ్గా బెయిలు లభిస్తుంది. చట్ట ప్రకారం ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిన బెయిలు’’ అని పిటిషన్లో జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు గత తీర్పులను కూడా ఉదాహరించారు. రాజ్యాంగంలోని 19, 21 అధికరణాల కింద తనకున్న ప్రాథమిక హక్కులను సీబీఐ హరిస్తోందని ఆయన ఆరోపించారు. తన చట్టబద్ధ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఈ కోర్టు మీదే ఉందన్నారు. సీబీఐ ప్రత్యేక జడ్జి దుర్గాప్రసాదరావు పిటిషన్లను విచారణకు స్వీకరించారు. వాటిపై సీబీఐ సమాధానమేంటో చెప్పాలని ఆదేశిస్తూ విచారణను నవంబర్ 21కి వాయిదా వేశారు.

కోర్టుకెళ్లే ముందు అరెస్టు చేశారు...

‘‘2011 ఆగస్టు 17న సీబీఐ ఎఫ్‌ఐఆర్ (ఆర్‌సీ నెంబర్ 19(ఎ) నమోదు చేసింది. దాదాపు 9 నెలల పాటు దాదాపుగా దర్యాప్తు పూర్తి చేసి మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత, సరైన కారణాలు చూపకుండానే మే 27న నన్ను అరెస్టు చేసింది. నన్ను అరెస్టు చేసి ఆగస్టు 26 నాటికి 90 రోజులు దాటింది. నిజానికి ఆలోపే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయాలి’’ అని జగన్ గుర్తు చేశారు. కోర్టు ముందు హాజరయ్యేందుకు కేవలం కొన్ని గంటల ముందు సీబీఐ తనను అరెస్టు చేసిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది వివక్షాపూరితమే గాక చట్టవిరుద్ధం కూడానని స్పష్టం చేశారు. ‘‘ఎఫ్‌ఐఆర్ ఆర్‌సీ నంబర్ 19(ఎ)లో సీబీఐ నన్ను మే 27న అరెస్టు చేసింది. మొదటి చార్జిషీట్ (సీసీ-8)లో నాకు కోర్టు సమన్లు అందాయి. నన్ను కనీసం విచారించకుండానే నాపై ఏకంగా మూడు చార్జిషీట్లు కూడా దాఖలు చేసేసిన సీబీఐ... మరో నాలుగు రోజుల్లో కోర్టు ముందు హాజరవాల్సి ఉండగా నన్ను విచారణకు పిలిచింది. 

మూడు రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి దాకా విచారించింది. అందుకు పూర్తిగా సహకరించా. తెల్లవారితే, నేను కోర్టు ఎదుట హాజరయితే, ఇక కేసు మొత్తం కోర్టు పరిధిలోకి వస్తుంది. నాకు బెయిలు వచ్చే వీలుంటుంది. ఆ అవకాశాన్ని దెబ్బ తీయడానికే కోర్టుకు వెళ్లేందుకు కొన్ని గంటల ముందు నన్ను అరెస్టు చేశారు’’ అని ఆయన వివరించారు. సీసీ నంబర్ 14లో ఆరో నిందితుడిగా ఉన్న మంత్రి ధర్మాన ప్రసాదరావును, ఇతర నిందితులను సీబీఐ అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. ‘‘వారిని కూడా నేరానికి ప్రధాన కారకులుగా సీబీఐ పేర్కొం టోంది. కానీ అరెస్టు మాత్రం చేయలేదు. అంటే, నిందితులను అరెస్టు చేయకుండా, రిమాండ్‌కు తరలించకుండా కూడా దర్యాప్తు కొనసాగించవచ్చనేగా అర్థం?’’ అని ప్రశ్నించారు. తన అరెస్టును చట్టవిరుద్ధమని సీబీఐ న్యాయస్థానం కూడా అభివర్ణించిందని గుర్తు చేశారు. ‘‘90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయాలని హైకోర్టు చెప్పినా సీబీఐ చేయలేదు. కాబట్టి చట్టబద్ధంగా నాకు బెయిల్ మంజూరు చేయండి’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎంపీనని జైల్లో పెడతారా?

ఒక వ్యక్తి హోదా గానీ, స్థాయి గానీ ఆయనకు వ్యతిరేకంగా మారకూడదని జగన్ పేర్కొన్నారు. తాను ఎంపీని గనక, తన పలుకుబడితో సాక్ష్యాలను తారుమారు చేయగలనని, సాక్షుల్ని ప్రభావితం చేయగలనని సీబీఐ చేస్తున్న వాదనను గట్టిగా ఖండించారు. ‘‘ఈయన ఈ పదవిలోకి రాకుండా ఉంటే బావుండేదనే స్థాయిలో ఒక వ్యక్తి తన హోదాను, స్థాయిని దుర్వినియోగం చేస్తే తప్ప అది ఆయనకు వ్యతిరేకంగా మారకూడదు. నేను ఎంపీగా ఎన్నికయింది ఇప్పుడు కాదు. సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేనాటికే ఎంపీని. అలాంటిది నన్ను కనీసం విచారణ కూడా చేయకుండా నాపై మూడు చార్జిషీట్లు వేశారు. దానర్థం నేను, నా పదవి ఈ దర్యాప్తుకు ఏమాత్రం అడ్డంకి కాలేదనే కదా? మరి ఆ కారణంతో నా బెయిలునెలా అడ్డుకుంటారు? నేను భవిష్యత్తులో కూడా ఎంపీగా ఉండొచ్చు. ఆ కారణంతో నాకు బెయిలివ్వకపోవటం సమంజసమా?’’ అని ప్రశ్నించారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను, సాక్ష్యాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది గనుక దర్యాప్తును అడ్డుకునే, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశమే లేదని గుర్తు చేశారు. ‘‘ఎంపీగా, రాజకీయ పార్టీకి అధ్యక్షునిగా ఉన్న నన్ను ఉప ఎన్నికల ప్రచార సమయంలో అరెస్టు చేశారు. ఇదే కేసులో నిందితుడు, ప్రభుత్వంలో అత్యంత శక్తివంతుడు అయిన మంత్రి మాత్రం బయటే ఉన్నారు. అలాంటప్పుడు నన్ను అరెస్టు చేయాల్సిన అవసరమే లేదు. 

నన్ను రిమాండ్‌లో కొనసాగించడం పూర్తిగా వివక్షాపూరితం’’ అని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో గత జూలై 27న తాను బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా.. తనను అరెస్టు చేసి అప్పటికి 90 రోజులు దాటనందున సీఆర్పీసీ సెక్షన్ 167(2) కింద తమ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదని జగన్ చెప్పారు. గడువులోగా సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేయకపోతే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే హక్కు తనకుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘కానీ సుప్రీం ఆదేశాలకు సీబీఐ అధికారులు వక్రభాష్యం చెబుతున్నారు. దర్యాప్తును ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పజాలమని, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సుప్రీం నిర్దేశించలేదని సీబీఐ డెరైక్టర్, జాయింట్ డెరైక్టర్ ఇటీవల మీడియాకు తెలిపారు. దర్యాప్తు పేరుతో చార్జిషీటు దాఖలును జాప్యం చేసే ప్రయత్నం జరుగుతోంది’’ అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘‘ప్రత్యక్షంగా, పరోక్షంగా నేనెన్నడూ దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. నేను బెదిరించినట్టు ఒక్క సాక్షి కూడా ఆరోపించలేదు. తుది విచారణకు అందుబాటులో ఉంటా. కోర్టు ఎలాంటి షరతులు విధించినా పాటించేందుకు సిద్ధంగా ఉన్నా. బెయిల్ మంజూరు చేయండి’’ అని కోరారు.

source:sakshi

కుమ్మక్కు కుట్రలు చూడలేకే బయటకొచ్చాను

చంచల్‌గూడ జైల్లో జగన్‌తో ములాఖత్
ప్రజల కోరిక మేరకే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు టీడీపీ ఎమ్మెల్యే వెల్లడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాల కారణంగానే ఆ పార్టీని వీడాల్సి వస్తోందని చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని శుక్రవారం ఆయన పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు చంచల్‌గూడ జైల్లో ప్రత్యేక ములాఖత్ ద్వారా కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీని వదలాడానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు. ‘‘టీడీపీని స్థాపించినప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ల పాటు సేవలందించిన నాపై పార్టీలో బురదజల్లే ప్రయత్నం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న చంద్రబాబు శైలిని తప్పుబట్టినందుకు పలమనేరు నియోజకవర్గంలో నాకు వ్యతిరేకంగా మరొకరిని ప్రొత్సహిస్తూ నీచ రాజకీయాలకు తెరతీశారు. నేను మరో పార్టీలో చేరే పరిస్థితి వస్తుందని ఎన్నడూ ఊహించను కూడా లేదు. పాలక కాంగ్రెస్‌తో కుమ్మక్కై టీడీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్లే నేను వైఎస్సార్‌సీపీలో చేరే పరిస్థితి ఏర్పడింది. నేనెప్పుడూ జగన్‌మోహన్‌రెడ్డిని నేరుగా చూసింది లేదు. ఆయన్ను కలిసింది ఇప్పుడే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఎంతో లాభం చేకూర్చాయి. 

వాటిని మళ్లీ జగన్ నెరవేర్చగలడన్న నమ్మకం నాకుంది’’ అని అమర్‌నాథ్‌రెడ్డి చెప్పారు. పలమనేరు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషుల అభీష్టం మేరకు జగన్‌తో కలిసి పని చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. ‘‘టీడీపీ నన్ను సస్పెండ్ చేయడం కాదు, ప్రజలే ఆ పార్టీని ఎప్పుడో డిలీట్ చేశారు (తొలగించారు)’’ అని ఒక ప్రశ్నకు బదులుగా ఆయన చెప్పారు.

ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. శుక్రవారం చంచల్‌గూడ్ జైలులో ఆయన జగన్‌ను కలిశారన్న సమాచారం అందగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్‌వీఎస్‌ఆర్కే ప్రసాద్ మీడియాకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం పంపారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున 92 మంది ఎమ్మెల్యేలుగా గెలవగా, ఇప్పటివరకు 14 మంది పార్టీని వీడారు. ప్రస్తుతం అసెంబ్లీలో టీడీపీ బలం 78కి తగ్గింది. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీని వీడటాన్ని టీడీపీ నేత దాడి వీరభద్రరావు తేలిగ్గా కొట్టిపారేశారు. పార్టీ నుంచి పోయే వారు పోతుంటారు, వచ్చే వారు వస్తుంటారన్నారు. ‘మీ కళ్ల ముందే బయటికి వెళ్లి విమర్శలు చేసిన వారు తిరిగి వచ్చి ఇదే వేదికపై కూర్చొని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించడం చూస్తున్నారు కదా!’ అని విలేకరులతో ఆయన వ్యాఖ్యానించారు.

రెండున్నర దశాబ్దాలుగా టీడీపీలోనే...

అమరనాథరెడ్డి రెండున్నర దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలకంగా పని చేశారు. పుంగనూరు నుంచి రెండుసార్లు, పలమనేరు నుంచి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, చిత్తూరు డీసీసీబీ చైర్మన్‌గా కూడా చేశారు. 2004లో టీడీపీ అధికారం కోల్పోయిన క్లిష్ట సమయంలో జిల్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ సాహసించని సమయంలో వాటిని భుజానికెత్తుకున్నారు. 2009 ఎన్నికల ముందు నుంచి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు ఆయన్ను అసంతృప్తికి గురిచేశాయి. కాంగ్రెస్ నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయటికి వచ్చినప్పటి నుంచీ అమర్‌పై బాబు అనుమానం పెంచుకున్నారు. రాప్ట్రపతి ఎన్నికకు టీడీపీ దూరంగా ఉండాలన్న బాబు నిర్ణయం, తెలంగాణపై తేల్చాలని ప్రధానికి లేఖ రాయడంపై అమర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో ఆయన్ను సాగనంపే వ్యూహంతో పలమనేరు బాధ్యతలను మాజీ మంత్రి పట్నం సుబ్బయ్యకు బాబు అప్పగించారు. అమరనాథరెడ్డి కుటుంబం టీడీపీ ఆవిర్భావంనుంచీ అందులోనే కొనసాగింది. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు కూడా వెన్నంటే నిలిచింది. 

అలాంటిది.. పార్టీకి ఎంతో సేవ చేసిన తన తండ్రి రామకృష్ణారెడ్డిపైనా బాబు తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని అమర్ జీర్ణించుకోలేకపోయారు. కార్యకర్తలు, నేతలతో ఆత్మీయ సభలు జరిపి, మెజారిటీ అభిప్రాయం మేరకు జగన్ నేతృత్వంలో పని చేయాలని నిర్ణయించుకున్నారు. వారం, పది రోజుల్లో పలమనేరులో భారీ బహిరంగ సభ నిర్వహించి, వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరాలని భావిస్తున్నారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా ములకలచెరువులో బహిరంగ సభ నిర్వహించి, విజయమ్మ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరాలని యోచిస్తున్నారు.

22న మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లోకి షర్మిల పాదయాత్ర


22న మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌లోకి షర్మిల పాదయాత్ర

హైదరాబాద్, న్యూస్‌లైన్: త్వరలో తెలంగాణలో అడుగుపెట్టనున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రను విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత నేతల సమావేశం నిర్ణయించింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సాగిస్తున్న నీచ రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు ఆయన సోదరి షర్మిల.. అక్టోబరు 18న ఇడుపులపాయ నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ పాదయాత్ర తెలంగాణ ప్రాంతంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించేందుకు తెలంగాణ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం భేటీ అయ్యారు. అనంతరం పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్దన్, కె.కె.మహేందర్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాష్‌రావు, జిట్టా బాలకృష్ణారెడ్డి, బాల మణెమ్మ, ఎడ్మ కిష్టారెడ్డిలు విలేకరులతో మాట్లాడారు. షర్మిల పాదయాత్ర ఈ నెల 22న మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలో అడుగుపెట్టనున్న సందర్భంగా తెలంగాణ నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలకనున్నట్లు బాజిరెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి వైఎస్ ఎంతో కృషి చేశారని, తెలంగాణలో ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులున్న విషయాన్ని గుర్తుచేశారు. ‘‘వెనుకబడిన పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు వైఎస్ చాలా కృషిచేశారు. 

నాలుగు సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటు చేసి జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు బాటలు వేశారు. మహానేత ప్రారంభించిన పనులు దాదాపు 90 శాతం పూర్తయినా.. కేవలం 10 శాతం పనులను ఈ అసమర్థ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. పాదయాత్రలో భాగంగా అసంపూర్తిగా మిగిలిన ప్రాజెక్టులను షర్మిల సందర్శిస్తారు’’ అని ఆయన వివరించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆలంపూర్, గద్వాల, మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల మీదుగా సాగుతుందని చెప్పారు. అనంతరం రంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టనుందని తెలిపారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో పాదయాత్ర ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయిన వారిలో సీజీసీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు తెలంగాణకు చెందిన కేంద్ర పాలక మండలి (సీజీసీ), కేంద్ర కార్యనిర్వాహక మండలి (సీఈసీ), జిల్లా కన్వీనర్లు, కో-ఆర్డినేటర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.

source:sakshi

30 రోజుల్లో మొత్తం 388.9 కి.మీలు

'మరో ప్రజాప్రస్థానం'లో శుక్రవారం 30వ రోజు పాదయాత్ర ముగిసింది. నేటి రాత్రికి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివార్లలోని గణేశ్ రైస్‌మిల్‌ వద్ద షర్మిల బస చేస్తారు. శుక్రవారం షర్మిల 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. 30 రోజుల్లో మొత్తం 388.9 కి.మీల దూరం నడిచారు. 
శుక్రవారం ఉదయం హెచ్.మొరవని నుంచి  ప్రారంభమైన షర్మిల పాదయాత్ర నాలుగో మైలు క్రాస్, ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీ రోడ్డు, శ్రీనివాస్ సర్కిల్, ట్యాంక్‌బండ్ రోడ్, సోమప్ప సర్కిల్, జామియా మసీదు, ఎంబీ చర్చి, కలుగట్ల రోడ్డు మీదుగా గణేష్ రైస్‌మిల్లు చేరుకుంది. సోమప్ప సర్కిల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. నేటి పాదయాత్రలో మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి, వాసిరెడ్డి పద్మ తదితరులు పాల్గొన్నారు.

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా..

 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం కోడుమూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకు ఐదు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించారు. 99.40 కిలోమీటర్లు నడిచి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. శనివారం 15 కిలోమీటర్లు నడవనున్నారు. 

శుక్రవారం రాత్రి షర్మిల బస చేసిన గణేష్ రైస్‌మిల్ నుంచి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది. ఎమ్మిగనూరు, కలుగట్ల, కె. తిమ్మాపురం, దైవందిన్నె, కంపాడు వరకు పాదయాత్ర సాగుతుందని పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు.

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా..

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శనివారం కోడుమూరు నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటి వరకు ఐదు నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించారు. 99.40 కిలోమీటర్లు నడిచి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. శనివారం 15 కిలోమీటర్లు నడవనున్నారు.

శుక్రవారం రాత్రి షర్మిల బస చేసిన గణేష్ రైస్‌మిల్ నుంచి శనివారం ఉదయం పాదయాత్ర ప్రారంభమైంది. ఎమ్మిగనూరు, కలుగట్ల, కె. తిమ్మాపురం, దైవందిన్నె, కంపాడు వరకు పాదయాత్ర సాగుతుందని పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు.

'జగన్ పిటిషన్లపై కౌంటర్ దాఖలుచేయాలి'

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు ఎంపి జగన్మోహన రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఈ నెల 21న కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు సీబీఐని ఆదేశించింది. సాక్షి పెట్టుబడుల వ్యవహారంలో తనకు బెయిలు మంజూరు చేయాలని జగన్ సీబీఐ న్యాయస్థానంలో రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ముగిసిన 30వ రోజు షర్మిల పాదయాత్ర

వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు షర్మిల మరో ప్రజాప్రస్థానం 30వ రోజు పాదయాత్ర ముగిసింది. ఈరోజు ఆమె 13 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకు 388.9 కిలోమీటర్లు నడిచారు. ఈ రాత్రికి ఎమ్మిగనూరు శివారులోని గణేష్ రైస్‌మిల్లులో ఆమె బస చేస్తారు.

రైతన్నను ఏడిపిస్తున్న ప్రభుత్వం: షర్మిల

రాష్ట్రంలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకే పాలక కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని షర్మిల ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహిస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె మాట్లాడుతూ ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరని, అలాగే జగన్ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో ప్రజలు ఎన్నడూ లేని కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ తో కుమ్మక్కైందని విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 50 ఏళ్లు నిండిన చేనేత కార్మికులకు పింఛన్లు విడుదల చేస్తే, నేడు చేనేత రంగాన్ని ఆదుకునే నాథుడే కరువయ్యాడన్నారు. 

విద్యుత్ బకాయిను నాడు వైఎస్ 1300 కోట్లు మాఫీ చేశారని, కానీ నేడు కరెంటు కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయని షర్మిల అన్నారు. రైతులకు విత్తనాలు, సబ్సిడీ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, రానున్న కాలంలో జగన్ నేతృత్వంలో ప్రజలు రాజన్న రాజ్యాన్ని తప్పక చూస్తారని షర్మిల పేర్కొన్నారు. ఆమె ప్రసంగానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.

రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఏ మాత్రం శ్రద్ధ లేదని షర్మిల విమర్శించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శుక్రవారం నిర్వహిస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఆమె ప్రసంగిస్తూ రాష్ట్ర పాలక, ప్రతిపక్షాల వైఖరిని తీవ్రంగా ఆక్షేపించారు. రైతులపై మాత్రమే కాకుండా మహిళలు, విద్యార్థుల సమస్యలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందన్నారు. రైతులు తీవ్ర అప్పుల్లో కూరుకుపోయారని, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆ పరిస్థితి లేదని షర్మిల అన్నారు. నాడు మహిళలకు వైఎస్.. పావలావడ్డీ రుణాలు ఇప్పిస్తే, నేడు కిరణ్ సర్కారు వడ్డీలేని రుణాలు ఇస్తామని ప్రకటించి అమలులో విఫలమవుతోందని దుయ్యబట్టారు.

ధరల పెరుగుదల అరికట్టలేకపోవడంతోపాటు, గ్యాస్ సిలిండర్ల పరమితి విధించడం, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపుతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంతో పరిశ్రమలు మూతపడుతున్నాయని, పరిశ్రమలు రోడ్డున పడుతున్నాయన్నారు. వైఎస్ ఉన్నపుడు రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదన్నారు. వైఎస్ దుర్మరణం తట్టుకోలేక చనిపోయినవారిని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందన్నారు. నాడు వారంతా కాంగ్రెస్ కు ఓటేసిన వారే అని, అయినా కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్లక్ష్యం వహించిందని అన్నారు. 

ఎలాంటి సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా రాజీవ్, ఇందిర పేర్లతో ప్రారంభించేవారని.. కానీ, వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ తీవ్ర ద్రోహం చేసిందని దుయ్యబట్టారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, ప్రతి ఇంటి నుంచి పిల్లలు ఉన్నత విద్యావంతులు కావాలని వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రవేశపెడితే నేడు ప్రభుత్వం ఆ పథకాన్ని నానాటికీ మరుగునపరుస్తోందన్నారు. మరోవైపు ప్రతిపక్ష పాత్రను చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు మాట ఇవ్వడం, నిలబెట్టుకోవడం అంటే ఏమిటో తెలియదన్నారు.

source:sakshi

మరోప్రజాప్రస్థానం 22న తెలంగాణలోకి ప్రవేశం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఈ 22న మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రారంభమవుతుంది. అలంపూర్ నియోజకవర్గం పుల్లూరులో తెలంగాణలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. పాదయాత్రను విజయవంతం చేసేందుకు మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 14 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లను నియామించారు. షర్మిల జిల్లాలోకి ప్రవేశించినప్పుడు లక్షమందితో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మహబూబ్‌నగర్ తర్వాత రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. వైఎస్ హయాంలో మొదలై, ప్రస్తుతం ఆగిపోయిన ప్రాజెక్టులను షర్మిల సందర్శిస్తారు. మొత్తం ఏడు నియోజకవర్గాల మీదుగా జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందని తెలంగాణ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్, వైఎస్‌ఆర్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్థన్ చెప్పారు.

source:sakshi

సిబిఐ నత్తనడక

http://www.sakshi.com/Main/Featuredetails.aspx?Newsid=52610&Categoryid=28&subcatid=0

Written by Nagarjuna On 11/16/2012 7:00:00 PM
సిబిఐ తీరుని ఎంతమంది ఎన్నిరకాలుగా విమర్శించినా దానికి చీమకుట్టినట్లు కూడా లేదు. కాంగ్రెస్ కనుసన్నల్లో మెలుగుతూ సిబిఐ విశ్వసనీయత కోల్పోయిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు ఎంపి జగన్మోహన రెడ్డి ఆస్తుల కేసు విషయంలో కోర్టు ఆదేశాలు వెలువడిన 24 గంటల్లోనే ఆగమేఘాలమీద సిబిఐ రంగంలోకి దిగింది. ఇతర రాష్ట్రాల నుంచి 80 బృందాలను రప్పించింది. దర్యాప్తు పూర్తి చేయడంలో మాత్రం సిబిఐ తీవ్ర జాప్యం చేస్తోంది. జగన్ ను అరెస్ట్ చేసి అయిదు నెలలు దాటినా ఇప్పటివరకు ఛార్జిషీట్ దాఖలు చేయలేదు. విచారణ పూర్తి చేయకుండా, ఛార్జిషీట్ దాఖలు చేయకుండా జగన్ బెయిలుకు కూడా అడ్డుపడుతోంది. దర్యాప్తు ప్రారంభించడంలో సిబిఐ చూపిన వేగం, చురుకుదనం పూర్తిచేయడంలో కనిపించడంలేదు.

సాక్షి పెట్టుబడుల వ్యవహారంలో తనకు బెయిలు మంజూరు చేయాలని జగన్ సీబీఐ న్యాయస్థానంలో ఈరోజు రెండు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఆయన తరఫున దాఖలైన ఈ రెండు పిటిషన్లలో ఒకటి చట్టపరమైన(స్టాట్యుటరీ)ది కాగా, రెండవది సాధారణ బెయిల్ పిటిషన్‌. ఈ ఏడాది మే 27న సిబిఐ అధికారులు జగన్ ను అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన 90 రోజుల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేయాలి. అయితే సిబిఐ ఇంకా దాఖలు చేయలేదని జగన్‌ తన పిటిషన్ లో పేర్కొన్నారు. 90 రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయని పక్షంలో తప్పనిసరిగా బెయిలు మంజూరు చేయాలన్న నిబంధన చట్టంలో ఉంది. దాని ప్రకారం జగన్ కు బెయిలు మంజూరు చేయాలి. ఇదే విషయాన్ని జగన్‌ తన పిటిషన్ లో తెలిపారు. సీఆర్‌పీసీలోని సెక్షన్‌ 167(2) కింద చట్టపరమైన బెయిల్ పిటిషన్‌ను, సెక్షన్‌ 437 కింద సాధారణ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

సాక్షి పెట్టుబడుల కేసుకు సంబంధించిన జగన్ ను మే 27న అరెస్టు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆ ఎఫ్‌ఐఆర్‌లోని ఆర్‌సీ-19 కింద అరెస్టు చేసి, అదే నేరంలో జగన్ ను రిమాండ్‌కు ఇవ్వాలని కూడా సీబీఐ కోరింది. సీసీ నెంబరు 8 కింద కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించింది. ఇదే కేసులో జగన్‌ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా దాన్ని సీబీఐ కోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా తిరస్కరించటంతో జులై 27న ఆయన సుప్రీం కోర్టుకు విన్నవించారు. అప్పటికి చట్టపరమైన బెయిల్ పొందడానికి నిర్దేశించిన 90 రోజుల గడువు పూర్తి కాలేదు. దాంతో సుప్రీంకోర్టు ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఎఫ్‌ఐఆర్‌లోని ఆర్‌సీ-19లో ఇంకా దర్యాప్తు పూర్తి కాకపోవటాన్ని ప్రస్తావిస్తూ, వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశిస్తూ ఆ పిటిషన్‌ను తిరస్కరించింది.

నిజానికి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు అడిగినపుడు, అప్పటి నుంచి 90 రోజుల్లోగా దర్యాప్తు సంస్థ తన దర్యాప్తును పూర్తిచేయాలి. జగన్ ను సీసీ నెంబరు-8లో తెలిపిన ప్రకారం అరెస్ట్ చేశారు. ఆ కేసులోని ఇతర నేరాలకు సంబంధించి దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదన్న కారణంతో బెయిల్ తిరస్కరించారు. ఆ దర్యాప్తును 90 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు పూర్తి చేయనందున చట్టపరమైన బెయిల్ కోసం పిటిషన్‌ను దాఖలు చేశారు. ఒక కేసులో దర్యాప్తు పూర్తికాని అంశాలకు సంబంధించి చట్టపరమైన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో, సీసీ నెంబరు 8కు సంబంధించి తనను రిమాండ్‌లో ఉంచటంలో అర్థం లేదని పేర్కొంటూ జగన్ తరపున మరో సాధారణ బెయిల్ పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు.

దర్యాప్తు పూర్తి కాలేదన్న సాకుతో ఒక వ్యక్తిని సుదీర్ఘకాలం రిమాండ్ లో ఉంచడం భావ్యంకాదన్న భావనతోనే ఈ 90 రోజుల నిబంధనను చట్టంలో పొందుపరిచారు. జగన్ ను అరెస్ట్ చేసి 174 రోజులు గడిచినా దర్యాప్తు పూర్తి కాని పరిస్థితులలో బెయిల్ కు అడ్డుపడటం భావ్యంకాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జన నేత జగన్ కు బెయిల్ రావాలని రాష్ట్రంలోని అత్యధిక మంది జనం కోరుకుంటున్నారు. ఆయన బెయిల్ పై బయటకు వచ్చి మళ్లీ జనంలోకి వస్తారని ఆశిద్దాం.

YS Sharmila's speech at Yemmiganur in Kurnool

YSRCP leader Bajireddy goverdhan reddy press meet

Thursday 15 November 2012

మరో ప్రజా ప్రస్థానానికి నేటికి 30 రోజులు

మరో  ప్రజా ప్రస్థానం మొదలై నేటికి 30 రోజులు. ఈ 30 రోజుల్లో షర్మిల దాదాపు15 బహిరంగ సభల్లో ప్రసంగించారు. అనేక రచ్చబండలు నిర్వహించారు. చెట్ల కింద నుంచోని ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వాన, ఎండ, చలిలోనూ పాదయాత్ర ఆపలేదు. జ్వరంలోనూ ముందుకు కదిలారు. కుమ్మక్కు కుట్రలపై విరుచుకుపడ్డారు. నీచ రాజకీయాలను కడిగిపారేశారు. అవిశ్వాసం పెట్టకుండా పాదయాత్ర  డ్రామాలేంటీ అంటూ ప్రశ్నించారు. 30 రోజుల్లో 375.3 కిలో మీటర్లు నడిచారు షర్మిల.
కుమ్మక్కు కుట్రలకు నిరసనగా, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమంగా అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ ప్రారంభమైన మరో ప్రజా ప్రస్థానాన్ని ప్రజలు అక్కున చేర్చుకున్నారు. వైఎస్‌ కుటుంబాన్ని నిలబెట్టుకుంటేనే తమ బతుకులు నిలబడేదంటూ షర్మిల అడుగులో అడుగేశారు. వైఎస్ఆర్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర ఆరు రోజుల తర్వాత అనంతపురం జిల్లాలోని  ధర్మవరం నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. అనంతపురం జిల్లాలో 17 రోజుల పాటు సాగిన పాదయాత్ర రాప్తాడు, ఉరవకొండ,  గుంతకల్ నియోజకవర్గాల్లో 195 కిలో మీటర్లు పాటు సాగింది. నవంబర్‌ 8న కర్నూలు జిల్లాలోకి మరో ప్రజా ప్రస్థానం అడుగు పెట్టింది.  మద్దెకెర నుంచి  కర్నూలు జిల్లాలో ప్రారంభమైన షర్మిల పాదయాత్ర పత్తికొండ, ఆలూరు, ఆదోని, మంత్రాలయంల మీదుగా  ముందుకు కదులుతోంది. ఈ 30 రోజుల పాదయాత్రలో షర్మిల అనేక సమస్యలను తెలుసుకున్నారు . రైతులకు ధైర్యం చెప్పారు. తెలంగాణలో కూడా మరో  ప్రజా ప్రస్థానానికి అదిరిపోయే స్పందన వస్తుందని నేతలు ఆ ప్రాంత నేతలు చెప్పారు. 28వ రోజు పాదయాత్రలో పాల్గొన్న తెలంగాణ ప్రాంత వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు  వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన కోసం ఆ  ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.



source:sakshitv

చేనేతపురి.. అభిమాన ఒడి

 నమ్ముకున్న క్యాడర్, నమ్మకం ఉంచిన ప్రజల కోసం ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వెనుదిరగని వైఎస్ కుటుంబానికి ఎమ్మిగనూరు ప్రజలు కొండంత అండగా నిలుస్తున్నారు. చేనేతలు అధికంగా ఉండే ఈ ప్రాంతంతో మూడు దశాబ్దాలుగా రాజకీయ బంధం పెనవేసుకున్న వైఎస్ కుటుంబంపై ప్రజలు అభిమానం చూపుతున్నారు. గతంలో మహానేత వైఎస్‌ఆర్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ వచ్చిన సమయంలో ఈ ప్రాంత ప్రజలు నీరాజనాలు పలికారు. 2012 ఎమ్మిగనూరు ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి మరో సారి వైఎస్‌ఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు. 

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు కుమ్మక్కై ప్రజల విశ్వాసాన్ని ఒమ్ము చేసి.. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న తరుణంలో జనం కోసం మహానేత కుమార్తె షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ శుక్రవారం ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సోమప్ప సర్కిల్‌లో జరిగే బహిరంగ సభలో ఆమె ప్రసంగించనున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రసంగించి అభిమానుల్లో ఉత్తేజం నింపిన సోమప్ప సర్కిల్‌లోనే షర్మిల ప్రసంగిస్తుండటం సర్వత్రా ఆసక్తిని పెంచుతున్న అంశం. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల ప్రజలు షర్మిల బహిరంగ సభ కోసం ఎదురు చూస్తున్నారు. ‘వై’ అంటే ఎమ్మిగనూరు.. ‘ఎస్’ సోమప్ప సర్కిల్ అనే నానుడికి సరిపోలే విధంగా వైఎస్ కుటుంబం రాజకీయ ప్రసంగాల వేదికగా సోమప్ప సర్కిల్ మారింది.

1980వ సంవత్సరం మాజీ ఎమ్మెల్యే కేఆర్ హనుమంతరెడ్డి చిన్న కుమారుడు వివాహం సందర్భంగా అప్పటి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి, కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి సారిగా ఎమ్మిగనూరుకు వచ్చారు.
2000 మే 30న వగరూరులో దాడులకు గురైన కాంగ్రెస్ కార్యకర్తలను ఓదార్చేందుకు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎమ్మిగనూరుకు వచ్చి సోమప్ప సర్కిల్‌లో దీక్షా శిబిరం వద్ద ప్రసంగించారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన అనంతరం 2004 నవంబర్‌లో బస్సు యాత్ర సందర్భంగా వైఎస్‌ఆర్ ఎమ్మిగనూరుకు వచ్చి ప్రసంగించారు.
2006 జూన్ 3న సూగూరు రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి, 2008 సెప్టెంబర్ 21న పులికనుమ ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చిన వైఎస్‌ఆర్ ఎమ్మిగనూరు బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
ఓదార్పు యాత్రలో భాగంగా 2011 జూలై 31న ఎమ్మిగనూరుకు వచ్చిన జననేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమప్ప సర్కిల్‌లో మొదటి సారిగా ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు.
2012 మే 13న ఉప ఎన్నికలకు ముందుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మిగనూరు పర్యటనకు వచ్చి సోమప్ప సర్కిల్‌లో ప్రసంగించారు. చేనేత సమస్యలు, రైతు సమస్యలను ప్రధానంగా వివరించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు విశదీకరించారు.
2012 జూన్6న ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమప్ప సర్కిల్‌లో ఉప ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఆ సభలో షర్మిల కూడా పాల్గొన్నారు.
శుక్రవారం సాయంత్రం అదే సర్కిల్‌లో షర్మిల ప్రసంగిస్తుండటం విశేషం.

రాజన్న భరోసా ఏదీ?


పులి కనుమ ప్రాజెక్టు వస్తే ఈ ప్రాంతంలోని 46వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని దివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి భావించారు. అందుకే ఆ ప్రాజెక్టును ప్రారంభించి 75 శాతం పనులు పూర్తి చేశారు. ఆ మహానుభావుడు చనిపోయిన తరువాత మూడేళ్లలో ఈ ప్రభుత్వం 25 శాతం పనులు కూడా పూర్తిచేయలేదు. రాజన్న బతికుంటే మీకీ కష్టం వచ్చేదా?
- పెద్దకడబూరు బహిరంగ సభలో షర్మిల 

కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధి: ‘మరో ప్రజాప్రస్థానం’లో భాగంగా 29వ రోజు షర్మిల పెద్దకడబూరు మండలంలో 14.6 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు. పులి క నుమ ప్రాజెక్టుతో పాటు జిల్లాలో ఏ ప్రాజెక్టును కూడా తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గానీ, వైఎస్ తరువాత అధికారాన్ని అనుభవిస్తున్న సీఎంలు గానీ పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. 50వేల ఎకరాలకు సాగునీరు అందించే గురు రాఘవేంద్ర ప్రాజెక్టు పనులకు రెండుసార్లు శిలాఫలకాలు వేసి చ ంద్రబాబు మరిచిపోతే వై.ఎస్. 

అధికారంలోకి వచ్చి పూర్తిచేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం సబ్‌స్టేషన్ పనులే ఆగిపోయాయని, అవి కూడా పూర్తయితే రైతులకు ఎంతో మేలు జరిగేదన్నారు. ఎల్‌ఎల్‌సీ కాలువను ఆధునికీకరించి తుంగభద్ర నుంచి నీరు కూడా తెప్పించుకోలేని అధ్వానపు ప్రభుత్వం ఇప్పుడు పాలన సాగిస్తోందని ఆమె వివరించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి రైతన్న ఏడుస్తున్నాడని, రైతు కడుపు కొడుతున్న ఈ ప్రభుత్వం 


ఎంతోకాలం కొనసాగదని షర్మిల అన్నారు. పాదయాత్రలో దారి వెంట వస్తుంటే రైతులు సాగునీటితో పాటు తాగునీరు లేక పడుతున్న బాధలు చెపుతుంటే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నన్ని రోజులు రాజులా బతికిన రైతు రోడ్డున పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాజన్నకు రైతంటే చాలా ఇష్టం. రైతుకు ఎంత చేసినా తక్కువే అని భావించేవారు. అందుకే ముఖ్యమంత్రి అయిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైలు మీద సంతకం చేశారు. రూ. 12వేల కోట్ల రుణాలను మాఫీ చేశారు. రోజుకు ఏడుగంటల కరెంటు ఇచ్చారు. రైతుకు ఏ కష్టం లేకుండా చూశారు. కానీ ఈ ప్రభుత్వం రైతన్నల ఉసురు తీస్తోంది’ అని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వాన్ని పైకి తిడుతూ దుష్టపరిపాలన కొనసాగేలా కాపాడుతున్న చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నా ప్రజలు నమ్మరన్నారు. 

అక్కగా... చెల్లిగా... బాధ్యత ఎరిగిన తల్లిలా...
‘మరో ప్రజా ప్రస్థానం’లో భాగంగా అలుపెరగకుండా పాదయాత్ర సాగిస్తున్న షర్మిల దారివెంట గ్రామస్తులను, కూలీలను, విద్యార్థులను కలిసి వారితో ముచ్చటిస్తూ ముందుకు వెళుతున్న తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. అక్కా... అన్నా... అవ్వా.... తమ్ముడూ... అని ఆప్యాయంగా పలుకరిస్తూ వారు ఎదుర్కొంటున్న బాధలను ఓపిగ్గా వింటున్నారు. బడికి వెళ్లే పిల్లలు కలిసినప్పుడు తల్లిలా వారికి భవిష్యత్తు గురించి చెపుతున్నారు. ‘చదువుకోవాలమ్మా... బాగా చదువుకోవాలి. డిగ్రీ కంటే పెద్ద చదువులు చదవాలి. రాజన్న కలలు కన్నట్లు మీరు డాక్టరో, ఇంజినీరో కావాలి’ అని పెద కడుబూరు కస్తూరిబా పాఠశాలలో చదువుతున్న బాలికలకు ఉద్భోదించిన తీరు అమ్మను గుర్తుకు తెచ్చింది. 

ఫీజులు కట్టలేకనే, పిల్లలు సైతం పనికి వెళ్లకపోతే పూట గడవదనో చదువు మాన్పించిన తల్లులను కలిసినప్పుడు ‘ ఒక్క ఏడాది ఎలాగోలా చదివించండక్కా! తరువాత జగనన్న సీఎం అవుతారు. పిల్లలందరికీ చదువు ఫ్రీగా చెప్పిస్తాడు. వారిని స్కూలుకు పంపించినందుకు మీ అకౌంట్‌లో డబ్బులు కూడా వేస్తాడు’ అని ధైర్యం చెప్పి చదువు అవసరాన్ని పెద్ద కూతురులా తల్లులకు వివరిస్తున్నారు. రైతులు, కూలీలను ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగుతున్నారు. 

భారీగా తరలివస్తున్న జనం
షర్మిల సాగిస్తున్న పాదయాత్రకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గురువారం పెద కడుబూరు మండలంలో సాగిన పాదయాత్రకు జీపులు, ఆటోలు, లారీల్లో భారీగా జనం తరలివచ్చారు. పెద కడుబూరు మండల కేంద్రంలో సాగిన బహిరంగసభను అదుపు చేయడం పోలీసులకు కష్టసాధ్యమైంది. మూడు రోడ్ల కూడలిలో ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, నరవ రమాకాంత్ రెడ్డి విడివిడిగా ఏర్పాటు చేసిన రెండు వైఎస్ విగ్రహాలను ఆవిష్కరించి అక్కడే బహిరంగసభలో మాట్లాడ గా, కిక్కిరిసిన జనంతో నిలబడడం కూడా కష్టంగా మారింది. పాదయాత్ర వెంట కూడా వేలాదిగా జనం తరలివచ్చారు. దాంతో దుమ్ము లేచి దారి పొడువునా పొగలా కమ్ముకుంది. 

పాదయాత్రలో ఉన్న ఇతర నాయకులు, ప్రజలు దుమ్ముకు భయపడి ముక్కులకు చేతిరుమాళ్లు అడ్డు పెట్టుకుంటే షర్మిల మాత్రం ఇబ్బందిగా ఉన్నా అలాగే పాదయాత్ర కొనసాగించారు. బుధవారం రాత్రి వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ షర్మిలతో పాటే బస చేసి గురువారం కూడా జిల్లాలోనే ఉన్నారు. గురువారం నాటి పాదయాత్రకు ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి(రాయచోటి), పి. రామకృష్ణారెడ్డి(మాచర్ల)లతో పార్టీ శాసనసభా పక్షం ఉపనేత శోభా నాగిరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాల నాగిరెడ్డి, పార్టీ సీజీసీ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరిత, సాయి ప్రసాద్ రెడ్డి, ఇతర నేతలు వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ మధుసూదన్, రమాదేవి, ఎం.ఎల్. కాంతారెడ్డి, నిడ్జూరి రాంభూపాల్ రెడ్డి, వై. సీతారామ రెడ్డి, దేశాయి కృష్ణ, అత్రి గౌడ్, మహేందర్ రెడ్డి, విరూపాక్షప్ప పాల్గొన్నారు.
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!