YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 22 December 2012

వైఎస్‌ఆర్ సీపీ మహిళా విభాగం పాదయాత్ర

వైఎస్.జగన్ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ సంస్థలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మదనపల్లి నుంచి తిరుమలకు వైఎస్‌ఆర్ సీపీ మహిళా విభాగం పాదయాత్ర చేపట్టింది. పాదయాత్ర చేస్తున్న మహిళలను పీలేరులో కొండా సురేఖ, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి కలిశారు. పాదయాత్ర చేపట్టిన గాయత్రిదేవికి కొండా సురేఖ అభినందనలు తెలిపారు.

విశాఖలో జగన్ కోసం 'జనం సంతకం'

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ ఆయన అభిమానులు విశాఖపట్నంలో కోటి సంతకాల సేకరణ మొదలుపెట్టారు. మహిళలు పెద్ద ఎత్తున కోటిసంతకాల సేకరణలో పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా కేంద్రంలోని కొందరు అడ్డుకుంటున్నారని ప్రజలు మండిపడ్డారు. అన్యాయంగా వైఎస్ జగన్‌ను జైల్లో పెట్టారని విమర్శించారు. కోటి సంతకాలను గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తామని వైఎస్ జగన్ అభిమానులు తెలిపారు.

బెయిలుపై ఉత్తర్వులకు ముందు బయటికొస్తున్న భూతాలు


తొలిసారి సీబీఐ కోర్టులో బెయిలు వేసినప్పటి నుంచీ ఇదే తీరు
అప్పట్లో టైమ్ చూసుకుని ‘బెయిల్ డీల్’ వ్యవహారం వెల్లడి
తరవాత హైకోర్టులో ఒక్కరోజు ముందు అనుబంధ చార్జిషీటు దాఖలు
సుప్రీంలో తొలుత లాయరును మార్చారంటూ మీడియాకు లీకులు
తీర్పునకు ఒక్కరోజు ముందు చిదంబరం ద్వారా టీడీపీ నేతల డ్రామా
వారు అడిగిన వెంటనే ‘ఈడీ’ ద్వారా ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆదేశాలు
ఇపుడు హైకోర్టులో బెయిలుపై ఉత్తర్వులకు ముందు కూడా అదే తీరు
ప్రతిసారీ బయటపడుతున్న సీబీఐ- కేంద్రం- టీడీపీల కుమ్మక్కు కుట్ర
ఎమ్మార్‌కు భూమిని కేటాయించిన బాబును విచారించనే లేదు
ఐఎంజీ కేసులో తమకు సిబ్బంది లేరంటూ తప్పించుకున్న సీబీఐ
అదే జగన్ కేసులోనైతే అన్నీ ఆగమేఘాల మీదే

అందరికీ అర్థమవుతూనే ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయినా అదే పద్ధతి. పదే పదే అవే మాయోపాయాలు. ఒక్క వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి ఎన్ని కుట్రలు పన్నారో... ఆయనకు బెయిలు రాకుండా చేసేందుకు అంతకు మించిన కుట్రలు సాగిస్తున్నారు. జనహితాన్ని చూడాల్సిన ప్రభుత్వం... నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ సంస్థలు... అన్యాయాన్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్షం మూడూ కుమ్మక్కయి ఒక్క వ్యక్తిని అణిచేయటానికి అంతకంతకూదిగజారిపోతున్న వైనం బహుశా... ఇంకెక్కడా చూడలేమేమో!!

‘సాక్షి’ పెట్టుబడుల వ్యవహారంలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసింది ఈ ఏడాది మే 27న. అది కూడా కోర్టు సమన్లు అందుకుని... వాటి మేరకు మరో 24 గంటల్లో కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా. అది కూడా... మూడ్రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకూ ఏకబిగిన ఆయన్ను విచారించాక. అది కూడా... ఆయన్ను కనీసం విచారించకుండా మూడు చార్జిషీట్లు దాఖలు చేసేశాక.

? మరి దీన్నేమనాలి? కుట్ర కాక ఇంకేమనాలి? కోర్టుకు హాజరై పూచీకత్తు సమర్పించి బెయిలు తీసుకుంటే ఇక అరెస్టు చేయటం కుదరదనే హడావుడిగా అరెస్టు చేశారనుకోవద్దా? వెనక నుంచి ఎవరో నడిపించబట్టే అంతా స్క్రిప్టు ప్రకారం జరిపించారని అనుకోవద్దా? స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఇలా వ్యవహరించవచ్చా?

బెయిలుకు ముందు ప్రతిసారీ...
అరెస్టు కుట్రను ఇంత పచ్చిగా కళ్లకు కట్టిన సీబీఐ... వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు కోసం పిటిషన్ వేసినపుడు కూడా అడ్డగోలు వాదనలే చేసింది. సరికదా... ఆ బెయిలుపై తీర్పు మరికొద్ది గంటల్లో వస్తుందని అనుకున్న ప్రతిసారీ.. ఏదో ఒక హైడ్రామాకు తెర లేపుతూనే ఉంది. ఒకటా రెండా... ఇప్పటిదాకా వై.ఎస్.జగన్ బెయిలుపై తీర్పు వెలువడిన ప్రతిసారీ ఈ పథకాన్ని అమలు చేస్తూనే వస్తోంది.

జడ్జిలను బ్లాక్‌మెయిల్ చేసే స్థాయిలో...?
అరెస్టయిన వెంటనే దాన్ని సవాలు చేస్తూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిలు మంజూరు చేయాలని కోరారు. దీనిపై జూన్ 1న కోర్టు తీర్పు వెలువరించింది. కాకపోతే ఆ తీర్పు వెలువడటానికి కొన్ని గంటల ముందు సీబీఐ చేసిన పనేంటో తెలుసా? గాలి జనార్దనరెడ్డి బెయిలు కోసం జడ్జిలకు ముడుపులిచ్చిన వ్యవహారాన్ని బయటపెట్టడం. అప్పటికి నాలుగురోజుల ముందే తమకు అందిన సమాచారాన్ని... సమయం కోసం కాసుకు కూర్చుని మరీ బెయిలుపై తీర్పు వెలువడటానికి కొన్ని గంటల ముందు బయటకు వెల్లడించింది. నిజానికి ఈ వ్యవహారాన్ని బయటపెట్టడాన్ని గానీ, మీడియాకు చెప్పటాన్ని గానీ ఎవ్వరూ ప్రశ్నించలేదు. కాకుంటే ఆ బయటపెట్టిన సమయంపై మాత్రం తీవ్రస్థాయి సందేహాలు వ్యక్తమయ్యాయి. అంతకుముందే తమకు ఆ సమాచారం అందినా దాన్ని ఎందుకు బయటకు వెల్లడించలేదన్న విషయమై సీబీఐ నుంచి సైతం సరైన సమాధానం రాలేదు. ఇదంతా జగన్‌కు బెయిలివ్వటంపై ప్రభావాన్ని చూపించిందని, ఆయనకు బెయిలివ్వాలంటేనే జడ్జిలు భయపడే స్థాయిలో సీబీఐ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిందని రాజకీయ నేతల నుంచి విమర్శలెన్నో వచ్చాయి. అవి నిజం కాదని చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు కూడా.

అనుబంధం పేరిట హైకోర్టులో కూడా...
సీబీఐ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు జగన్‌మోహన్‌రెడ్డి. వాదప్రతివాదాలు జరిగాయి. చివరకు జూలై 4న ఉత్తర్వులిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అంతే! సీబీఐ మళ్లీ తన కుట్రకు పదును పెట్టేసింది. మరికొన్ని గంటల ముందు... అంటే జూలై 3న అనుబంధ చార్జిషీటును దాఖలు చేసింది. అపుడెపుడో మార్చి 31న దాఖలు చేసిన తొలి చార్జిషీటుకు అనుబంధమంటూ కొన్ని పత్రాలు దాఖలు చేసింది. వాటిలో కొత్త అంశాలేవీ లేవని, ఈ కేసులో ఏదో ఉందని... బెయిలిస్తే ప్రమాదమని న్యాయవ్యవస్థకు సంకేతాలివ్వటానికే సీబీఐ ఇలా చేసిందని విమర్శలు సైతం వచ్చాయి. మరోవంక ఈ అనుబంధ ఛార్జిషీట్‌ను ఉటంకిస్తూ ఒక వర్గం మీడియాలో పతాకస్థాయి కథనాలు వెలువడ్డాయి. షరా మామూలే. వాటిలో కొత్త విషయాలేవీ లేకపోయినా ఒక సంచలనం సృష్టించే ప్రయత్నం మాత్రం చేశాయి.

లాయరు మారారంటూ మీడియా లీకులు...
ఇది మరీ ఘోరం. దిగజారుడుకు పరాకాష్ట అనే చెప్పాలి. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బెయిలు కోసం సుప్రీంకోర్టులో జగన్ అప్పీలు చేయటంతో సీబీఐ చిత్రమైన విన్యాసాలు చేసింది. బెయిలుపై ఉత్తర్వులు వెలువడే ముందు... సీబీఐకి రెగ్యులర్‌గా వచ్చే లాయరు మారారని, ఆయన బదులుగా వచ్చిన ప్రభుత్వ న్యాయవాదికసలు మాట్లాడటమే రాదని, చట్టం గురించే తెలియదని చెబుతూ ఒక వర్గం మీడియా విష ప్రచారానికి దిగింది. సీబీఐ ఈ లీకుల్ని పెంచి పోషించింది. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌తో రాజీకొచ్చారని, అందుకే లాయరును మార్చి ఉండవచ్చని ఆ మీడియా వండి వార్చేసింది.

? అసలు ఏ న్యాయవాది ఉంటే ఏం? సీబీఐ చెప్పే వాదననే కదా ఆ లాయరు వినిపించేది? అంతా ప్రభుత్వ న్యాయవాదులే కదా? ఏం... చదువుకోకుండానే, ప్రతిభ లేకుండానే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సొలిసిటర్ జనరళ్లు అయిపోతారా? ఇంత ఘోరమైన వాదన ఎక్కడైనా ఉంటుందా? ఒక లాయరు కారణంగా సీబీఐ కేసు గెలవటమో, ఓడిపోవటమో జరిగే పరిస్థితి ఉందా? ఎందుకిలాంటి కుట్రలు? మరి జగన్ కుమ్మక్కయితే బెయిలెందుకు రాలేదు? వీటికి సీబీఐ ఎప్పటికీ జవాబులు చెప్పలేదేమో!!

తెలుగుదేశం- కేంద్రం కలిసి మరీ కుట్ర...
మళ్లీ పాత లాయరు వచ్చి, వాదనలు పూర్తయి.. సుప్రీంకోర్టులో బెయిలు పిటిషన్‌పై ఉత్తర్వులు రాబోయే తరుణంలో ఈ సారి తెలుగుదేశం పార్టీ నేరుగా రంగంలోకి దిగింది. మరికొద్ది గంటల్లో తీర్పు వెలువడనున్నదనగా... నామా నాగ్వేరరావుతో సహా తెలుగుదేశం ఎంపీలు ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిశారు. వై.ఎస్.జగన్ ఆస్తుల్ని స్తంభింపజేయాలని కోరుతూ ఒక నోట్ సమర్పించారు. వారు కోరిన కొన్ని గంటల్లో... సాక్షికి సంబంధించిన కొన్ని ఆస్తులతో పాటు, సాక్షి ఇన్వెస్టర్లయిన హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మాలకు చెందిన కొన్ని ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లు పేర్కొంటూ ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఒక నోట్ విడుదల చేసింది. తరువాతి రోజు బెయిలును తిరస్కరిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.

? అసలు తీర్పునకు కొన్ని గంటల ముందు టీడీపీ ఎంపీలు ఆర్థికమంత్రిని కలవటమేంటి...? వారు కోరినట్లుగా కొన్ని గంటల్లోనే ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఆర్థిక శాఖ పరిధిలోని ఈడీ నోట్ విడుదల చేయటమేంటి? ఇదంతా ఎందుకు? ఈ కేసులో తామెలా వ్యవహరించాలని అనుకుంటున్నామో బయటకు స్పష్టంగా చెప్పటానికి కాదా? న్యాయ వ్యవస్థను సైతం ప్రభావితం చేయడానికి కాదా? ఈ కుట్రలు తెలియనిదెవరికి?

ధర్మాన ప్రాసిక్యూషన్‌తో మరో కుట్ర!
తనను అరెస్టు చేసింది మొదటి చార్జిషీటులోనని, అరెస్టుకు ముందే ఆ చార్జిషీటు దాఖలు చేశారు కనుక... అరెస్టు చేసిన 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేయలేదు కనక బెయిలివ్వాలని కోరుతూ గతనెల 16న సీబీఐ కోర్టులో జగన్ స్టాట్యుటరీ బెయిలు పిటిషన్ వేశారు. విచారణ అనంతరం గతనెల 29న కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే స్టాట్యుటరీ అంశాన్ని ప్రస్తావించకుండానే తిరస్కరించటంతో దాన్ని హైకోర్టులో సవాల్ చేశారు జగన్. వాదప్రతివాదనలు ముగిశాయి. సోమవారం ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

బెయిలు ఉత్తర్వులకు ముందు ప్రతిసారీ ఏదో ఒక భూతాన్ని బయటపెడుతున్నట్లు చేస్తున్న సీబీఐ ఈసారి కూడా అదే ఎత్తులకు దిగింది. వాన్‌పిక్ కేసులో నిందితుడైన రాష్ట్ర మంత్రి దర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌ను తెరపైకి తెచ్చింది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 10న ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని సీబీఐ అడిగింది. న్యాయ సలహా పేరిట ప్రభుత్వం నాలుగు నెలలు నాన్చింది. చివరకు ఇటీవలే తిరస్కరించింది. ఇన్నాళ్లూ కిమ్మనకుండా ఊరుకున్న సీబీఐ... సరిగ్గా బెయిలుపై ఉత్తర్వులు వెలువడే ముందు... అసలు మంత్రి ప్రాసిక్యూషన్‌కు తమకు ప్రభుత్వ అనుమతేమీ అక్కర్లేదంటూ ఈ నెల 13న తాము కోర్టులో వేసిన మెమోను సీబీఐ లీకు చేసింది.

? మంత్రి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అక్కర్లేనపుడు మరి ఇన్నాళ్లూ సీబీఐ దానికోసం ఎందుకు పట్టుబట్టినట్లు? ఈ నెల 13న గోప్యంగా వేసిన మెమోను ఇప్పుడెందుకు బయటపెట్టినట్లు? ఇదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నరు వ్యతిరేకిస్తూ ఆ ఫైలును తిరిగి ప్రభుత్వానికి పంపటంలో ఆంతర్యమేమిటి? ఇదంతా సరిగ్గా ఇప్పుడే ఎందుకు జరుగుతున్నట్లు? ఓ వర్గం మీడియా దీనికి పతాక శీర్షికలు కట్టి ఎందుకు ప్రాధాన్యమిస్తోంది? ఇదంతా సీబీహైడ్రామా కాదని ఎవ్వరైనా చెప్పగలరా?

బ్రహ్మానందరెడ్డి ప్రాసిక్యూషన్‌కూ ఇప్పుడే అనుమతా?
ఇంకా చిత్రమేంటంటే హైకోర్టు తీర్పు కొన్ని గంటల్లో వెలువడనున్న ఈ తరుణంలోనే... సీనియర్ అధికారి బ్రహ్మానందరెడ్డి ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. నిజానికి ఆయన ఏడు నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఇప్పటికే ఆయన్ను సీబీఐ ప్రాసిక్యూట్ చేసింది కూడా.

? మరి సీబీఐ విచారించాక... ఇదే సమయంలో కేంద్రం ప్రాసిక్యూషన్‌కు ఓకే చేస్తూ ఉత్తర్వులిచ్చిందంటే ఏమనుకోవాలి? ఈ కుట్రలో కేంద్ర ప్రభుత్వానికి వాటా లేదని ఎవ్వరైనా చెప్పగలరా? కాంగ్రెస్-టీడీపీల కనుసన్నల్లోనే ఈ కుట్ర మొత్తం నడుస్తోందని చెప్పటానికి ఇంకా ఆధారాలేమైనా కావాలా? అసలు మోపిదేవిని, ధర్మానను ప్రాసిక్యూట్ చేయటానికి తమకు ఎవ్వరి అనుమతీ అవసరం లేదని చెబుతున్న సీబీఐ...ఈ ఫైళ్లన్నీ క్లియర్ కావటానికి కారణమైన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ను ఇప్పటిదాకా ఎందుకు విచారించలేదు? ఆయన్నెందుకు పట్టించుకోవటం లేదు?

బాబు మాత్రం సీబీఐకి వీఐపీయే...
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు నుంచి బెయిలు వరకూ అడుగడుగునా కుట్ర బుద్ధి చూపిస్తున్న సీబీఐ... ఎందుకనో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాత్రం ఈగ కూడా వాలకుండా చూసుకుంటోంది. ఎమ్మార్ కేసులో అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడటమే కాక... హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 535 ఎకరాలను గోల్ఫ్‌కోర్సు కోసం, శ్రీమంతుల విల్లాల కోసం కారుచౌకగా కట్టబెట్టేశారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ... ఈ కేసులో కూడా లేని లింకుల్ని వెదుకుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబీకులను, సన్నిహితులను వేధించటానికే ప్రయత్నించింది. అసలు 535 ఎకరాల స్థలాన్ని సింగిల్ టెండరు వేసిన సంస్థకు పోటీ లేకుండా ఎందుకు కట్టబెట్టారో, అలా చేయటం ద్వారా చంద్రబాబు ఏం లబ్ధి పొందారో తనకు అవసరం లేదన్నట్లు వ్యవహరించింది. ఇంత పెద్ద కేసులో విచారణ జరుపుతూ... సింగిల్ టెండరుపై భూమి కట్టబెట్టేసిన బాబును కనీసం విచారణకు సైతం పిలవలేదు. ఆయన్ను విచారించకుండానే తంతు ముగించేసింది కూడా.

? మరి దీన్నేమనాలి? చంద్రబాబుకు సీబీఐ ఎందుకు కొమ్ము కాస్తోంది? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టనని మాట ఇచ్చి... దాన్ని కాపాడుతూ వస్తున్నందుకా? కేంద్రంలో సైతం అంశాల వారీగా తన ఎంపీలను హోల్‌సేల్‌గా, రిటైల్‌గా విక్రయించేస్తున్నందుకా? సీబీఐ అనేది ఒక దర్యాప్తు ఏజెన్సీయా? లేక అధికార పార్టీకి అనుబంధ సంస్థా?

అదేజగన్ అయితే అన్నీ ఆగమేఘాలే...
చంద్రబాబునాయుడి తొమ్మిదిన్నరేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మ పిటిషన్ వేస్తే... దానిపై హైకోర్టు దర్యాప్తునకు ఆదేశిస్తే మూడు వారాల పాటు ముందుకే కదల్లేదు ఈ సీబీఐ. అదే జగన్‌మోహన్ రెడ్డి కేసుకు వచ్చేసరికి మాత్రం కోర్టు ఉత్తర్వులు వెలువడిన 48 గంటల్లోనే మన్నూమిన్నూ ఏకం చేసేసింది. జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీలు, నివాసాలు, ఇన్వెస్టర్ల కంపెనీలు, ఇళ్ళమీద మూకుమ్మడి దాడులు చేసింది. దేశంలో ఏ కేసులోనూ చేయలేని స్థాయిలో బృందాలను ఏర్పాటు చేసి... దాడులు చేసి ఒక రకమైన భయోత్పాతాన్ని సృష్టించింది.

? ఇదంతా ఎందుకు? తమతో విభేదిస్తే ఎలా ఉంటుందో చెప్పటానికా? ఆ రకంగా రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికా? సీబీఐ... దాని వెనకున్న పార్టీల ఉద్దేశాలు కనిపించటం లేదా?

కేసు వేయించటం నుంచే మొదలైన కుట్ర..
రెండు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించాక... ఆయన తనయుడికి రాష్ట్రంలో అభిమానం అంతకంతకూ పెరుగుతున్న సమయంలో కాంగ్రెస్ తన ఎమ్మెల్యే శంకర్రావుతో కేసు వేయించటమే ఈ కుట్రకు ఆరంభం... పరాకాష్ట కూడా. దాన్లో తెలుగుదేశం నేతలు జత కల వటం దిగజారుడుతనానికి, అపవిత్ర కలయికకు తారస్థాయి తప్ప మరొకటి కాదు. ఇంకా చిత్రమేంటంటే ఈ కేసులో ప్రతివాదులుగా ఒకటి నుంచి 9 వరకు ప్రభుత్వ విభాగాలే ఉన్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి 52వ ప్రతివాది. అయినప్పటికీ ఈ కేసులో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వానిది తప్పో, ఒప్పో తేలకుంటే ఈ కేసే లేదు. అలాంటి కేసులో ప్రభుత్వం సమాధానం ఇవ్వకున్నా... ఆ ఒక్క కారణంతో కేసు కొట్టేయలేమన్న న్యాయమూర్తి అభిప్రాయం కారణంగా తీర్పు జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా వచ్చేసింది.

? అసలు ఈ కేసేంటి? వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ ఆస్తులు, కాంట్రాక్టులు, ప్రాజెక్టులు కొందరు పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని, అందుకు ప్రతిగా వారు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని. మరి ఈ ప్రాజెక్టుల్ని, కాంట్రాక్టుల్ని కట్టబెట్టినపుడు నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? అడ్డగోలుగా ఏమైనా కట్టెబెట్టేశారా? అన్నీ నిబంధనల ప్రకారం జరిగి ఉంటే వారు ముడుపులు చెల్లించాల్సిన అవసరం ఎందుకుంటుంది? ప్రతీదీ జీవోల మేరకు జరిగిందే కదా? మరి ఆ జీవోలు తప్పో, ఒప్పో ప్రభుత్వం చెప్పాలి కదా? ప్రభుత్వం కోర్టుకు సమాధానమెందుకు చెప్పలేదు? జగన్‌మోహన్‌రెడ్డిని ఇరికించడానికి కాదా? మరి ఇన్నాళ్లూ ఊరుకుని, ఇపుడు ఆ జీవోలిచ్చిన మంత్రులకు ప్రభుత్వమే న్యాయ సహాయం అందించి మరీ సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఎందుకు వేయిస్తోంది? ఆ జీవోల్లో ఎలాంటి తప్పూ జరగలేదని ఇపుడు సుప్రీంకోర్టుకు చెబుతున్న ఆ సెక్రటరీలు... మంత్రులు హైకోర్టులోనే ఈ విషయం చెప్పి ఉంటే ఈ కేసు ఉండేదా? జగన్ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండేదా? ఒక్క జగన్ కోసం ఆది నుంచీ పథకం ప్రకారం ఈ కుట్రను నడిపించారని చెప్పటానికి ఇంకా ఏం కావాలి? అసలు వీళ్లని ఏమనుకోవాలి? వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉండగా వేనోళ్ల పొగిడిన నేతలు... ఆ తరవాత అధికారం కోసం ఇంత నైచ్యానికి దిగజారిపోవటం జనానికి తెలియటం లేదనుకోవాలా?


వాన్‌పిక్ అంటే ఐఎంజీలాంటి ప్రాజెక్టు కాదే?
అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులన్నీ ప్రైవేటు పరమయ్యాయి. కాకినాడ పోర్టయితే మరీ ఘోరం. నిక్షేపంగా నడుస్తున్న పోర్టును... ఆదాయం తెస్తున్న పోర్టును... విస్తరణకు నిధుల్లేవన్న కారణంతో ప్రైవేటు పరం చేశారు చంద్రబాబు. అది కూడా తన సన్నిహితుడు, మలేసియా ప్రధాని మహతిర్ మహమ్మద్ తనయుడి సంస్థకే. పెపైచ్చు దాన్లో తన సన్నిహిత సంస్థ ఎల్ అండ్ టీకి వాటా కూడా ఇచ్చారు. ఆ సంస్థ విస్తరణ మరిచి, ప్రభుత్వానికి లీజు చెల్లించకుండా ఆదాయం సాధించి... దాన్నే పెట్టుబడిగా విస్తరించినా కిమ్మనలేదు. పెపైచ్చు దానికి అనుకూలంగా నిబంధనలనూ మార్చేశారు. పెపైచ్చు ఐఎంజీ, ఎమ్మార్ వంటి సంస్థలకు రాజధాని నడిబొడ్డున అత్యంత ఖరీదైన భూముల్ని కట్టబెట్టారు. ఇవేవీ పట్టించుకోని సీబీఐ... ఎమ్మార్ విషయంలో తాము బాబుపై విచారణ జరపబోమని, ఐఎంజీపై దర్యాప్తు జరపడానికి తమ దగ్గర తగినంత సిబ్బంది లేరని చెప్పిన సీబీఐ... ఎక్కడో వెనకబడిన ప్రకాశం జిల్లాలో... సముద్ర తీరాన ఉన్న భూములను పోర్టు కోసం వాన్‌పిక్‌కు కేటాయిస్తే మాత్రం క్షమించరాని తప్పిదమంటూ యాగీ చేస్తోంది. ఆ భూములతో పారిశ్రామికవేత్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారంటూ అడ్డగోలుగా వాదిస్తోంది.

? ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా? అసలు ఆ వాన్‌పిక్ పోర్టును చంద్రబాబు ప్రభుత్వం గతంలోనే స్కోడా కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేయటం సీబీఐకి తెలియదా? స్కోడా కంపెనీ వెనక్కి వెళ్లిపోవటం వల్లే కదా వాన్‌పిక్ తెరమీదికి వచ్చింది? అసలు ఈ పోర్టు ప్రతిపాదన చేసింది చంద్రబాబే కదా? ఇవన్నీ సీబీఐ ఎందుకు మరిచిపోతోంది?

వెనకబడిన జిల్లాలో పోర్టుకోసం భూముల్ని కొని భారీ ప్రాజెక్టును మొదలుపెట్టిన పారిశ్రామిక వేత్తలెవరూ అది రియల్ ఎస్టేట్ వ్యాపారంలా తక్షణమే లాభాలిస్తుందని ఆశించరు. అదేమీ విల్లాల ప్రాజెక్టులా తక్షణమే లాభాలనిచ్చే ప్రాజెక్టూ కాదు. పోర్టు నిర్మాణం పూర్తయి పని ప్రారంభించిన తరవాత మాత్రమే అలాంటి పారిశ్రామిక వేత్తలకు ఆదాయం లభిస్తుంది. అదీగాక, వాన్‌పిక్ ప్రాజెక్టును వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించింది ఒక కంపెనీకేమీ కాదు. ఒక ప్రభుత్వానికి. రస్ అల్ ఖైమా దేశానికి. ఆ దేశానికైనా, ఆ ప్రభుత్వానికైనా ఇక్కడ పనులను చూసుకోవటానికి స్థానిక ప్రతినిధి ఒకరు ఉండక తప్పదు. ఆ స్థానిక ప్రతినిధిగా అప్పటికే పారిశ్రామిక రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను రాక్ ప్రభుత్వం ఎంచుకుంది. ఇదంతా సీబీఐకి కనిపించకపోవటంలో విచిత్రమేమీ లేదనే అనుకోవాలి. ఎందుకంటే అది నడుస్తున్నది ఆది నుంచీ రాంగ్ రూట్లోనే. కొందరు పెద్దలు చెబుతున్న రూట్లోనే.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=54776&Categoryid=1&subcatid=1

కాంగ్రెస్ వైఖరి చెప్పాల్సిందే

అక్షర క్రమం, సంఖ్యాపరంగా కాంగ్రెసే ముందుంటుంది
తెలంగాణపై ముందుగా వారి అభిప్రాయం చెప్పాల్సిందే
డొంకతిరుగుడు మాటలతో తప్పించుకోవడం కుదరదు
నిర్ణయాధికారం కేంద్రప్రభుత్వానిది, కాంగ్రెస్‌ది కాదు
అవగాహన కోసమే అఖిలపక్షమనడం భావదారిద్య్రం
అసంతృప్తులను బుజ్జగించడానికే అఖిలపక్షం నాటకం
మా పార్టీనుంచి ఒకే అభిప్రాయం వెల్లడిస్తాం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంశంపై ఈ నెల 28న ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో ఒక రాజకీయ పార్టీ హోదాలో కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేసి తీరాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి శనివారంనాడిక్కడ పార్టీ ముఖ్య నేతలు కె.కె.మహేందర్‌రెడ్డి, రాజ్‌సింగ్ ఠాకూర్, జిట్టా బాలకృష్ణారెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో జరిగే అఖిలపక్ష భేటీలో తమ వైఖరేంటో చెప్పబోమని, కేవలం వింటామని కాంగ్రెస్ నేతలు అనడాన్ని ఆయన తప్పుపట్టారు. మీరేమైనా న్యాయమూర్తులా... లేక న్యాయ నిర్ణేతలా... ఊరికే వినడానికి? అని ప్రశ్నించారు. ఈ భేటీకి హాజరు కావాలంటూ కేంద్ర హోంశాఖ ఆహ్వానాలు పంపిన ఎనిమిది రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ ఒకటని... టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాలు ఎలాగో ఆ పార్టీ కూడా అంతేనని ఆయన గుర్తు చేశారు. అక్షర క్రమం ప్రకారం చూసినా, సంఖ్యాపరంగా చూసినా కాంగ్రెసే ముందుంటుంది కనుక ఆ పార్టీయే అందరి కన్నా ముందుగా తెలంగాణపై తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.

సమావేశానికి వెళ్లినపుడు తమ పార్టీ ఆ విధంగా కోరుతుందని కూడా మైసూరా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ తన వైఖరేంటో చెప్పకుండా తప్పించుకుంటానంటే కుదరదని, ఆ పప్పులేమీ ఉడకవని స్పష్టంచేశారు. జాతీయ స్థాయిలో కార్యనిర్వాహక స్థానంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేతిలో నిర్ణయాధికారం ఉంటుందని, కాంగ్రెస్ మాత్రం ఒక రాజకీయ పక్షం లాంటిదేనని ఆయన వివరించారు. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలను ఆహ్వానించడానికి సంబంధించి తీర్మానం లోక్‌సభలో వచ్చినపుడు తమ పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించడానికి హోంశాఖ అఖిలపక్ష భేటీ అనే నాటకానికి తెరతీసిందని, అందువల్ల దీంట్లో కాంగ్రెస్ వేషం వేసుకుని తన పాత్ర పోషించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.

షిండేది భావదారిద్య్రం: కేవలం అవగాహన కోసమే అఖిలపక్షం ఏర్పాటు చేశామని చెప్పడం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే భావదారిద్య్రానికి నిదర్శనమని మైసూరా ధ్వజమెత్తారు. హోంమంత్రిగా ఎవరున్నా ఆ శాఖ పని నిరంతరం కొనసాగుతుండే ప్రక్రియ అని, ఈ అంశంపై ఇప్పటికే ఏం జరిగిందో ఫైళ్లలో ఉంటాయని, వాటిని చూసి కొత్తగా వచ్చిన వారు అవగాహన చేసుకోవచ్చని చెప్పారు. దీనిపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా ఉందన్నారు. వీటిని కాదని మంత్రి మారినప్పుడల్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్యను తెలుసుకుంటాననడం చూస్తే అసలు షిండే దేశానికి హోంమంత్రిగా పనికి వస్తారో రారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చేది, తెచ్చేది తామే కనుక కాంగ్రెస్ తెలంగాణపై తమ వైఖరి చెప్పాల్సిన అవసరం లేదని చెబుతూండటాన్ని విలేకరులు ప్రస్తావించగా... తెచ్చేది, ఇచ్చేది, చచ్చేది కేంద్ర ప్రభుత్వమే తప్ప కాంగ్రెస్ పార్టీ కాదని, అఖిలపక్షం కూడా కేంద్రమే నిర్వహిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై తమ పార్టీ నుంచి ఒకే అభిప్రాయం ఉంటుందని 28వతేదీ లోపే నేతలు సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాయలసీమ వాదుల నుంచి, టీజేఏసీ నుంచి తమకు విజ్ఞప్తులు అందాయని నిర్ణయం తీసుకునేటపుడు పార్టీ వాటన్నింటినీ పరిశీలిస్తుందని మైసూరా తెలిపారు. 

అమెరికా, కువైట్‌లలో జగన్ జన్మదిన వేడుకలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా, కువైట్, దుబాయ్ తదితర దేశాల్లో అభిమానులు, కార్యకర్తలు పలుసేవా కార్యక్రమాలు చేపట్టినట్టు పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈశాన్య అమెరికాలో ఉంటున్న వైఎస్ అభిమానులు నిత్యావసర సరుకులు సేకరించి న్యూజెర్సీలోని మెర్సర్ స్ట్రీట్ ఫ్రెండ్స్, న్యూయార్క్‌లోని పీపుల్ టూ పీపుల్ అనే సంస్థలకు విరాళంగా అందజేశారు. ఆళ్ల రామిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

కువైట్‌లోనూ: జగన్ పుట్టినరోజు సందర్భంగా కువైట్‌లో 3వేల మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్ అక్రమ అరెస్టుకు నిరసనగా సంతకాల సేకరణ చేశారు. వీటిని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆకుల ప్రభాకర్, చంద్రశేఖర్‌రెడ్డి, గోవింద్ నాగరాజు, సయీద్ నాజర్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

లాఠీచార్జీ అమానుషం: విజయమ్మ

దేశ రాజధానిలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు వెళ్లిన విద్యార్థులపై ఢిల్లీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ అన్నారు. నేటికి కూడా దేశ రాజధానిలోనే పట్టపగలు మహిళలు ఒంటరిగా సంచరించే పరిస్థితి లేదు. ఢిల్లీ నడివీధుల్లో ఓ వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందంటే, పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థమవుతోంది’ అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు కారణమైన మూలాలపై అధ్యయనం చేయకుండా, నిరసనకారులపై లాఠీలు ప్రయోగించడం అమానుషమన్నారు.

గోల్ కొడతాడు, ప్రత్యర్థుల్ని గల్లంతు చేస్తాడు


ఆంధ్ర దేశమంతటా జగన్ అనే ఒకే ఒక నినాదం ప్రతిధ్వనిస్తుంటే ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక కట్టడి చేయడానికి వేరే మార్గం లేక నిత్యం ప్రజలమధ్య ఉండవలసిన వ్యక్తిని జైలుపాలు చేయడం ఎంతవరకు న్యాయం? ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేకనే రాష్ర్ట ప్రజలంతా ఎప్పుడు ఎన్నికలొస్తాయా, అని ఎదురు చూస్తూ తమ వద్ద ఉన్న ఓటు అనే ఆయుధాన్ని జగన్‌ని, ఆయన కుటుంబాన్ని టార్చర్ పెడుతున్న వారిపై ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రత్యర్థులను తేరుకోకుండా చేయాలని ఎదురుచూస్తున్నారు. సెలెక్ట్ బిఫోర్ ఎలెక్ట్ అన్న చందంగా ఎలెక్షన్స్ నామ్ కే వాస్తే అని జగన్‌ను సెలెక్ట్ చేసుకుని, అతనే మా ముఖ్యమంత్రి అని యువకులు ఎప్పుడో ప్రకటించారు.

అదే సమయంలో షర్మిలమ్మ ‘మరో ప్రజాప్రస్థానం’తో కాంగ్రెస్ అధిష్టానం కళ్లు బైర్లు కమ్మే స్థితి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో పాలకపక్షం, ప్రతిపక్షం బీరాలు పలుకుతూ బేరాలు చేస్తూ ఎన్నాళ్లు ప్రజల్ని వంచించగలరు? ఎన్నాళ్లీ మేకపోతు గాంభీర్యం? రాష్ట్రంలోని పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారు. ‘పదునాల్గు భువనాలు ఏకమైనా రెండువేల పదునాల్గులో జగనే ముఖ్యమంత్రి’ అని తేలిపోయింది.

ఎవ్వరేమన్నను, తోడు రాకున్నను, పోరా బాబూ పోరా, నీ గమ్యం చేరిపోరా అన్నట్టుగా జగన్ తన ‘గోల్’ను సాధించి, ఇతర పార్టీలను ‘గోల్‌మాల్’ చేస్తాడు. ఆంధ్రదేశ నలుమూలలా తిరిగి రాజన్న అభివాదం చేస్తుంటే ప్రజలంతా అభిమానంతో చెయ్యెత్తి జైకొట్టేవాళ్లు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉరకలేసేవాళ్లు. జనమంతా నీరాజనం పలికేవాళ్లు. అది మళ్లీ జగన్ రాకతోనే సాధ్యం. ప్రజాభిమానం, ప్రజావిశ్వాసం ఉన్న నిజాయతీ, నిస్వార్థం గల నాయకులారా! ఇకనైనా మేల్కోండి. జగన్ వెంట నడవడానికి సిద్ధం కండి. ప్రజాసేవ చేసుకుని ధన్యులు కండి. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడండి.
- దాసరి నాగేశ్వరరావు, బొబ్బిలి, విజయనగరం


http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=54771&Categoryid=11&subcatid=25

చెట్లమట్లలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ

చెట్లమట్లలో వైఎస్సార్ విగ్రహాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. రాజంపల్లెలో వేంచేసియున్న తిరుమలనాథ స్వామి ఆలయంలో శనివారం బాలినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెట్లమట్ల గ్రామానికి చేరుకున్న ఆయన అభిమానుల సమక్షంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా తిరుమలనాథ ఆలయ చైర్మన్ కోటిరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Paintings of YS Jagan attracts many eyes

Mysura Reddy Press Meet 22nd Dec 2012

కాంగ్రెస్ నిర్ణయం చెప్పాలి: మైసూరారెడ్డి

తెలంగాణపై తొలుత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చెప్పవలసి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఎం.వి. మైసూరా రెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర హొం మంత్రి మారినప్పుడల్లా అభిప్రాయాలు తెలుసుకోవడానికి సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు. తెలంగాణ అంశంపై గతంలో అఖిలపక్ష సమావేశాలు రెండు సార్లు నిర్వహించారు. కమిషన్ వేశారు. కమిషన్ నివేదిక ఇచ్చింది. వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అభిప్రాయం చెప్పకుండా ఇతరులను అభిప్రాయం చెప్పమనడం సరికాదన్నారు. తాము పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

తెలంగాణ జేఏసీ ప్రతినిధుల వినతిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు మైసూరారెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ శనివారం వైఎస్ విజయమ్మను కలిశారు. 

భేటీ అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విజయమ్మ చెప్పారన్నారు. 28న పార్టీలు చెప్పే అభిప్రాయాలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కోదండరామ్ తెలిపారు. విజయమ్మను కలిసినవారిలో జేఏసీ ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్ తదితరులు ఉన్నారు.

sakshi

Friday 21 December 2012

‘వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగ’ సదస్సు ఫిబ్రవరిలో..

వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్-128) రాష్ట్ర స్థాయి సదస్సును వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బీ జనక్‌ప్రసాద్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనియన్ ముఖ్యనేతల సమావేశం శుక్రవారం తొలిసారిగా జరిగింది. పలు జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగుల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆచరణ సాధ్యమైన డిమాండ్లనే యాజమాన్యాల ముందు పెట్టాలని సమావేశం అభిప్రాయపడింది. 

అన్న దానాలు.. వైద్య శిబిరాలు

దేవాలయాలు, చర్చి, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను నిరసిస్తూ నిరసనలు
జైలులో జగన్‌ను కలసిన కుటుంబసభ్యులు

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉచిత మెగా వైద్యశిబిరాలు, రక్తదానం, పేదలకు దుస్తులు, వికలాంగులకు వీల్‌చైర్స్, వృద్ధులకు చేతికర్రలు అందజేయడం, ఆసుపత్రులలో పండ్లు, విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, పెన్నులు పంపిణీతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై జగన్‌ను అక్రమంగా అరెస్టు చేయించడానికి నిరసనగా పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని కుటుంబసభ్యులు ప్రత్యేక ములాఖత్ ద్వారా కలుసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

జగన్‌ను కలిసిన వారిలో తల్లి విజయమ్మ, భార్య భారతి, కూతుళ్లు హర్ష, వర్ష, షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి ఉన్నారు. అనంతరం వారు తిరిగి వెళ్లే ముందు జైలు బయట పార్టీనేతల కోరిక మేరకు వారు తీసుకొచ్చిన కేక్‌ను విజయమ్మ కట్‌చేశారు. అంతకుముందు వైఎస్సార్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్ జైలు వద్ద కేక్ కట్ చేసి, పావురాలను గాల్లోకి ఎగురవేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జగన్ జన్మదిన కార్యక్రమాల్లో పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, నల్లా సూర్యప్రకాష్, జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, ఎంవీఎస్ నాగిరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, పీఎన్వీ ప్రసాద్, చల్లా మధుసూదన్‌రెడ్డిలతో పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాజధానిలోని పలు ప్రాంతాల్లో పార్టీనేతలు నిరసన, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 

రాష్ట్రవ్యాప్తంగా: జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో 100 మంది మహిళలు మదనపల్లె నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆయన పేరుపై ప్రత్యేక పూజలు చేయించారు. సీబీఐ తీరును నిరసిస్తూ కడపలోని వైఎస్‌ఆర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ ఏడురోడ్ల కూడలి మీదుగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ అనంతపురంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. గుంటూరుజిల్లా నరసరావుపేటలో రెండుచోట్ల 40 కేజీల భారీ కేక్‌లను కట్‌చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రకాశంజిల్లా ఒంగోలులోని బధిరుల పాఠశాలలో అన్నదానం నిర్వహించారు. నెల్లూరులో నిర్వహించిన భారీ ర్యాలీలో సుమారు 300 మీటర్ల పొడవైన పార్టీ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జగన్ నిర్దోషి అని, ఆయనను విడుదల చేయాలంటూ రాష్ట్రపతికి పంపేందుకు బుజబుజనెల్లూరులో రక్తంతో సంతకాల సేకరణ చేశారు. 

కృష్ణాజిల్లా నందివాడ మండలం జనార్ధనపురంలో వైఎస్సార్ గ్రామ సమైక్య సంఘ సభ్యులు వరి పొలంలో కట్టేత పనులు చేసి రూ. ఏడువేలు సంపాదించారు. ఆ మొత్తాన్ని గ్రామంలో మంచినీటి చెరువుల అభివృద్ధికి వినియోగించనున్నట్లు చెప్పారు. విజయవాడలోని సింగ్‌నగర్‌లో అంధుల పాటల కచేరీ నిర్వహించారు. నల్లగొండజిల్లా సూర్యాపేటలో భారీ కేక్‌ను కట్‌చేసి, వికలాంగునికి వీల్‌చైర్‌ను అందించారు. జగన్ విడుదల కాకుండా ప్రభుత్వం కుట్రపన్నడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో పార్టీ కార్యకర్తలు రోడ్డు ఊడ్చారు. కరీంనగర్‌జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని అయ్యప్ప ఆలయానికి ఒక గదిని విరాళంగా ప్రకటించారు.

జగన్ సీఎం కావాల్సిందే
శతాధిక వృద్ధురాలి ఆకాంక్ష

‘‘పేదల కోసం పనిచేసిన మహానుభావుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. తిరిగి ఆయన పాలన రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. రాజన్న కొడుక్కి ఓటేసేందుకే నేను బతికున్నాను’’ అని తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన శతాధిక వృద్ధురాలు పేకల చెల్లమ్మ చెప్పారు. జగన్‌కు జన్మదినం పేదలకు పండుగరోజులాంటిదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం వేంపాడు గ్రామానికి చెందిన వరదానమ్మ తన ఇంటివద్ద జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్‌చేసి చుట్టుపక్కల ఇళ్లవారికి, స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ‘‘నీ తండ్రి మరణాన్ని తట్టుకోలేక నా భర్త మరణిస్తే నన్ను, నా కుటుంబ సభ్యుల్ని మా ఇంటికి వచ్చి ఓదార్చావు.. మమ్మల్ని ఆపదలో ఆదుకున్నావు. నీవు నిండు నూరేళ్లు వర్ధిల్లు... కుట్రలు, కుతంత్రాలు అశాశ్వతం. విశ్వసనీయత, ఆదరణ, ఆత్మీయత ఎప్పటికీ నిలిచి ఉంటారుు. త్వరలోనే జనం మధ్యకి వస్తావు.. నీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ఆశీర్వదించారు.

సీబీఐ, ప్రభుత్వ తీరుపై అనుమానాలు

ప్రహసనంలా ధర్మాన ‘ప్రాసిక్యూషన్’

జగన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పులు వచ్చే ప్రతిసారీ ‘వ్యూహాత్మక’ చర్యలు
గతంలో ప్రభుత్వ అనుమతి కోరిన సీబీఐ.. అక్కర్లేదంటూ ఇప్పుడు పిటిషన్
ప్రాసిక్యూషన్ తిరస్కరణ ఫైలును తాజాగా తిప్పి పంపిన గవర్నర్! - 2లో

సాక్షి, హైదరాబాద్: మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతిని కోరిన సీబీఐ, ఇంతకాలం కిమ్మనకుండా ఉండి, అలాంటి అనుమతి తమకేమీ అక్కర్లేదని నాలుగు నెలల తర్వాత తాపీగా ఇప్పుడు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. సీబీఐ వైఖరి అనుమానాస్పదంగా మారిన నేపథ్యంలోనే.. ధర్మాన ప్రాసిక్యూషన్‌ను తిరస్కరిస్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మంత్రిమండలి తీర్మానం చేసి పంపిన ఫైలును పలు సందేహాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తిప్పిపంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫైలుపై గవర్నర్ ఎలాంటి అనుమానాలను లేవనెత్తారు? ఏ అంశాలపై న్యాయ సలహాలు సూచించారు? ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? మంత్రుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసిన తరుణంలోనే సంబంధిత ఫైలును గవర్నర్ వెనక్కి పంపిన విషయం బయటికి రావడంలోని ఆంతర్యమేమిటి? ..ఇలాంటి అనేక ప్రశ్నలు కాంగ్రెస్ నేతల్లోనే పెను చర్చకు దారి తీశాయి. 

ధర్మాన ప్రాసిక్యూషన్‌కు గత ఆగస్టు 10న రాష్ట్ర ప్రభుత్వాన్ని సీబీఐ అనుమతి కోరింది. న్యాయ సలహా తీసుకున్నాక నిర్ణయిస్తామంటూ నాలుగు నెలలకు పైగా దాన్ని కిరణ్ పక్కన పెట్టారు. అడ్వొకేట్ జనరల్ నుంచి వివరణ వచ్చాక.. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి తిరస్కరిస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. ఆ మేరకు ఫైలును గవర్నర్‌కు పంపారు. అయితే, మంత్రి ధర్మాన, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ డిసెంబర్ 13న న్యాయస్థానం ముందు సీబీఐ అత్యంత గోప్యంగా మెమో దాఖలు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న సమయంలోనే ఉన్నట్టుండి సీబీఐ దాఖలు చేసిన ఈ మెమో వ్యవహారం బయటికి లీకైంది! పైగా మంత్రిమండలి సిఫార్సు చేసిన ఫైలును పలు సందేహాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ తిప్పిపంపిన విషయం సైతం సరిగ్గా ఈ సమయంలోనే బయటికి రావడం గమనార్హం. చూస్తుంటే ఇదంతా పక్కా పథకం ప్రకారం జరుగుతున్న వ్యవహారంలాగే కనబడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. 

మంత్రుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేనప్పుడు, మొదట దానికోసం సీబీఐ ఎందుకు కోరినట్టంటూ పలువురు మంత్రులు విస్మయం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని 4 నెలల కిందట కోర్టుకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వొద్దని మంత్రిమండలి తీర్మానం చేసినప్పుడు విపక్షంతో పాటు స్వపక్షం నుంచి కూడా పలు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మోపిదేవిని విచారణ కోసం దిల్‌కుశ అథితి గృహానికి పిలిచిన సీబీఐ, రెండో రోజు, అంటే మే 24న విచారణ అనంతరం ఉన్నపళంగా ఆయనను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. సరిగ్గా జగన్ సీబీఐ విచారణకు హాజరు కావడానికి ఒక రోజు ముందు ఇది జరిగింది! జగన్‌ను అరెస్టు చేయాలని కచ్చితమైన నిర్ణయానికి వచ్చినందునే, మంత్రులను ఎందుకు విస్మరించారన్న విమర్శలను తప్పించుకునేందుకు పథకం ప్రకారమే మోపిదేవిని అరెస్టు చేశారని అప్పట్లోనే విమర్శలు బలంగా విన్పించాయి. మే 25 నుంచి వరుసగా మూడు రోజుల పాటు జగన్‌ను సుదీర్ఘంగా విచారించిన సీబీఐ, ఆయనను అరెస్టు చేస్తున్నట్టు 27 రాత్రి 7.20కి తెలియజేసింది. మోపిదేవిని అరెస్టు చేసేటప్పటికి ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. 

కిరణ్ అగమేఘాలపై మోపిదేవి నుంచి రాజీనామా లేఖ తెప్పించుకుని, తక్షణం దానికి ఆమోదం తెలిపారు. పైగా మోపిదేవి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి గానీ, న్యాయ సలహాలు గానీ తీసుకోలేదు. ధర్మాన విషయంలో మాత్రం ప్రభుత్వ అనుమతి కోరుతూ గత ఆగస్టు 10న సీబీఐ లేఖ రాసింది. అది బయటికి తెలిశాక ఆగస్టు 14న ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ కిరణ్‌కు లేఖ పంపారు. 4 నెలలు దాటుతున్నా దానిపై సీఎం నిర్ణయం తీసుకోలేదు. ఇంతలోనే ఉన్నట్టుండి, మంత్రుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సీబీఐ కొత్త వాదనను తెరపైకి తేవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ధర్మాన 2009కి ముందు రెవెన్యూ మంత్రిగా ఉండగా తీసుకున్న నిర్ణయాలపై కేసు నడుస్తోంది.ఆయన పదవీకాలం 2009తో పూర్తయింది గనుక ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు’ అని సీబీఐ కోర్టు ముందుంచిన మెమోలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 4 నెలల క్రితం ధర్మాన ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వాన్ని అనుమతి కోరినప్పుడు కూడా ఈ విషయం సీబీఐకి తెలుసని, అయినా దాన్ని ఈ సమయంలోనే తెరపైకి తేవడంలో ఆంతర్యమేమిటని ఒక ఉన్నతాధికారి ప్రశ్నించారు. జగన్ బెయిల్ పిటిషన్లు కోర్టు ముందుకొచ్చే ప్రతిసారీ సీబీఐ ఇలా చేయడం పరిపాటి అయిందని కాంగ్రెస్ నేతల్లోనే వినిపిస్తోంది. 

హైకోర్టులో ప్రస్తుతం జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయి, ఈ నెల 24న తీర్పు రానుండటం తెలిసిందే. సరిగ్గా దానికి మూడు రోజుల ముందు సీబీఐ మెమో ఉదంతం, ధర్మాన ఫైలును గవర్నర్ తిప్పి పంపిన వార్త ఒకేసారి బయటికి వచ్చాయి! దీన్ని యాదృచ్ఛికంగా ఎంతమాత్రమూ చూడలేమని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. గత జూలైలో జగన్ జగన్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అందుకు తిరస్కరిస్తూ అక్టోబర్ 5న తీర్పు వచ్చింది. సరిగ్గా దానికి ఒక్క రోజు ముందు జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్‌ఫ్రాల రూ.51 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేస్తున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఢిల్లీలో నోట్ విడుదల చేసింది. పైగా, టీడీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి ‘విజ్ఞప్తి’ చేసీ చేయగానే ఈడీ నుంచి అటాచ్‌మెంట్ ఆదేశాలు వెల్లడయ్యాయి. ఇలాంటి సందర్భాలను లోతుగా విశ్లేషిస్తే పై ఆదేశాల మేరకే పథకం ప్రకారం సాగుతోందన్న అనుమానాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

అంతా గందరగోళమే...: శుక్రవారం నాటి ఉదంతాలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో గందరగోళం నెలకొంది. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు కేబినెట్ అనుమతి నిరాకరణతో అంతా సాఫీగా జరుగుతుందని భావిస్తున్న తరుణంలో.. ప్రాసిక్యూషన్‌కు అసలు ప్రభుత్వ అనుమతే అక్కర్లేదంటూ సీబీఐ కోర్టుకెక్కడం, సంబంధిత ఫైలును అదే సమయంలో గవర్నర్ తిప్పి పంపడం చూస్తుంటే అసలేం జరుగుతోందో తమకేమీ అంతుబట్టడం లేదని ఒక మంత్రి వాపోయారు. 

గతంలో సుప్రీంకోర్టు నుంచి నోటీసులందుకుని, వాటికి సమాధానాలు పంపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న మంత్రులను కూడా తాజా పరిణామాలు ఆందోళనలో పడేశాయి. మున్ముందు చిక్కులు తలెత్తకుండా ధర్మాన ఫైలును మరోసారి జాగ్రత్తగా ఏజీ ద్వారా పరిశీలన చేయించి పంపాలని మాత్రమే గవర్నర్ కోరారని కొందరంటున్నారు. కానీ ఏజీ పూర్తిస్థాయి పరిశీలన తర్వాత ఇప్పుడిలా తిప్పి పంపడంపై మరో మంత్రి ఆశ్చర్యం వెలిబుచ్చారు. మరోవైపు శుక్రవారమే గవర్నర్ ఢిల్లీకి వెళ్లారు! తాజా పరిణామాల నేపథ్యంలో ధర్మాన రాజీనామా వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. గవర్నర్ చర్య నేపథ్యంలో బొత్స సత్యనారాయణ, సబిత సహా పలువురు మంత్రులు కిరణ్‌తో భేటీ అయ్యారు.

జగనే లక్ష్యంగా జగన్నాటకాలు?

ఏం జరిగింది?
గత మే 27న వైఎస్ జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది
గత అక్టోబర్ 5న జగన్‌కు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది

డిసెంబర్ 24న జగన్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించనుంది

దానికి ముందేం జరిగింది?
మే 24న, సరిగ్గా మూడు రోజుల ముందు అప్పటి ఎక్సైజ్ మంత్రి మోపిదేవిని సీబీఐ అరెస్టు చేసింది
అక్టోబర్ 4న, అంటే ఒక్క రోజు ముందు రూ.51 కోట్ల విలువైన జగతి, జనని ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నోట్ విడుదల చేసింది

డిసెంబర్ 21న, సరిగ్గా మూడు రోజుల ముందు, ధర్మాన ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి లేదంటూ కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసిన విషయం ‘బయటికి’ వచ్చింది. ప్రాసిక్యూషన్‌కు మంత్రివర్గం నిరాకరించిన ఫైలును గవర్నర్ తిప్పి పంపారు.

కోటి సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం

కోటి సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం
సీబీఐ తీరుపై మండిపడ్డ నేతలు
సీబీఐ దర్యాప్తు సంస్థలా కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోంది
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందుకే అరెస్టు, వేధింపులు..

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ చేస్తున్న కుట్రలను ఆ పార్టీ ముఖ్య నేతలు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల అత్యవసర సమావేశంలో సీబీఐ తీరుపై మండిపడ్డారు. పార్టీ సీజీసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, డి.రవీంద్రనాయక్, పీఏసీ సభ్యులు డీఏ సోమయాజులు, బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావుతో సహా పలువురు నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. సీబీఐ ఒక దర్యాప్తు సంస్థ మాదిరిగా కాకుండా జగన్‌పై కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు. దేశంలో ఏ కేసు విషయంలోనూ సీబీఐ ఇలా వ్యవహరించలేద న్న అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. 

జగన్‌పై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు, సీబీఐ వ్యవహరిస్తున్న తీరును అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకు ‘‘జగన్ కోసం-జనం సంతకం’’ పేరుతో ఆయనకు కోటి సంతకాలతో వినతి పత్రాన్ని సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్ జన్మదినం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన ఈ సంతకాల సేకరణకు.. కార్యకర్తలు, ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పార్టీ నేత డి.రవీంద్రనాయక్ తొలి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా... ఎంవీ మైసూరారెడ్డి సంతకాల సేకరణ లక్ష్యాన్ని వివరించారు. ఎలాగైనా సరే జగన్‌ను దోషిగా చిత్రీకరించాలని అదే పనిగా సీబీఐ చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రపతికి తెలియజేసేందుకే ఈ సంతకాల సేకరణ చేపట్టామని వెల్లడించారు. 

ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా: పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. దేశంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన న్యాయం జరుగుతోందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ములాయం సింగ్ యాదవ్, మాయావతికి ఒక న్యాయం, జగన్‌కు ఒక న్యాయమా అని నిలదీశారు. జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా పార్టీ పెట్టుకున్నారన్న కక్షతోనే ఆయన్ను వేధిస్తున్నారని జూపూడి ప్రభాకరరావు అన్నారు. సంతకాలు చేసిన నేతల్లో డీఏ సోమయాజులు, వాసిరెడ్డి పద్మ, జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాశరావు, హెచ్‌ఏ రెహ్మాన్, గట్టు రామచంద్రరావు, కె.శివకుమార్, రాజ్ ఠాకూర్, మేడపాటి వెంకట్, బి.జనార్దన్‌రెడ్డి, చల్లా మధుసూదనరెడ్డి, విజయారెడ్డి, నాగదేశి రవికుమార్ ఉన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం(హెచ్-128 యూనియన్)కు చెందిన ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో జగన్‌కు మద్దతుగా సంతకాలను చేశారు.

‘జగన్ కోసం-జనం సంతకం’లో రాష్ట్రపతికి విజ్ఞప్తి ఇదీ

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నాం. నిజాలను నిర్ధారించాల్సిన సీబీఐ జగన్‌ను దోషిగా చిత్రీకరించడానికి అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని మేమంతా భావిస్తున్నాం. ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు జగన్‌ను 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచడాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నాం.

జగన్ సీఎం కావడం ఖాయం: మంత్రి దానం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దానం సంచలన వ్యాఖ్యలతో విలేకరులు ఒకింత ఆశ్చర్యానికి గురవుతుండగానే... తాను చెప్పేది నిజమంటూ మళ్లీ అదేమాట చెప్పుకొచ్చారు. వైఎస్సార్ తన గుండెల్లో ఉన్నారని... ఆయన కొడుకైనా రోజూ స్మరించుకుంటాడో లేదో కానీ తాను, తన భార్య మాత్రం నిత్యం వైఎస్సార్‌ను తలచుకోకుండా ఉండమని తెలిపారు. నిత్యం వైఎస్సార్‌కు పూజలు చేస్తామని, దీపం వెలిగిస్తామని చెప్పారు. వైఎస్సార్ ఉంటే ఆ మనోధైర్యం వేరన్నారు.

త్వరలో వైఎస్సార్‌సీపీ బీసీ గర్జన: కాసాని

 ‘వైఎస్సార్ కాంగ్రెస్ బీసీ గర్జన’ పేరిట త్వరలో హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. శుక్రవారం ఆయన పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిశాక విలేకరులతో మాట్లాడారు. జనవరిలో మంచి రోజు చూసుకుని పార్టీలో చేరతానని, ఈ విషయమై విజయమ్మతో చర్చించానన్నారు. ఆయన వెంట పార్టీ నేత ముక్కా రూపానందరెడ్డి ఉన్నారు.

'నిబంధనలకు విరుద్ధంగా సభ్యత్వనమోదు'

నల్గొండ: సహకార ఎన్నికల ఓటరు సభ్యత్వ నమోదు కార్యక్రమం అవకతవకలగా సాగుతోంది. జిల్లాలోని మేళ్ల చెరువు మండలం చింతలపాలెం సహకార కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఓటరు సభ్యత్వ నమోదు సభ్యత్వ కార్యక్రమం ఇంకా కొనసాగడం వెనుక అధికార పార్టీ అండదండలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.


గుంటూరు:సభ్యత్వ దరఖాస్తులు లేకుండా ఓట్లు నమోదు చేసిన ఘటన నాదెండ్ల సహకార సంఘ కార్యాలయంలో జరిగింది. దరఖాస్తులు లేకుండా సభ్యత నమోదు కార్యక్రమం కొనసాగడంపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటి వరకూ న మోదు చేసిన సభ్యత్వ దరఖాస్తులు చూపించాలని వైఎస్సార్‌సీపీ నేత మర్రి రాజశేఖర్ కార్యకర్తలతో కలసి కార్యాలయం ముందు బైఠాయించారు.


ప్రకాశం: సహకార ఎన్నికల ఓటర్ల నమోదులో ఢీసీఓ కొండయ్య అవకతవకలకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు కార్యక్రమంలో పక్షపాత వైఖరితో వ్యవహరించిన డీసీఓను వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నిర్బందించారు.


Magazine Story 'BRAND JAGAN'

జగన్ కోసం 'జనం సంతకం' ఉద్యమం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ఎంపి జగన్మోహన రెడ్డిపై కుట్రకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు 'జనం సంతకం' అనే పేరుతో ఉద్యమం చేపట్టారు. కోటి మందితో సంతకాలు చేయించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపాలన్నది వారి ఉద్దేశం. పార్టీ ఎస్ టి విభాగానికి చెందిన నేత రవీంద్ర నాయక్ తొలి సంతకం చేశారు.

జనం సంతకం పేరుతో వైఎస్ఆర్ సీపీ నేతలు ఒక లేఖను విడుదల చేశారు. వైఎస్ జగన్ పై రాజకీయపరంగా బనాయించిన కేసులను తీవ్రంగా గర్హిస్తున్నాం. జగన్ ను దోషిగా చూపడానికి సిబిఐ అహర్నిశలూ చేస్తున్న ప్రయత్నాలు పరాకాష్టగా భావిస్తున్నాం. 200 రోజులుకు పైగా జగన్ ను అక్రమ నిర్బంధంలో ఉంచడాన్ని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా జగన్ పై కక్ష సాధింపు ఆపాలని కోరుతున్నాం. ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేస్తున్న విజ్ఞప్తి ఇది అని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆ రెండు పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి

పాణ్యం, ఉల్లెందుకొండ సొసైటీల్లో భారీగా బోగస్ ఓట్లు నమోదు చేస్తున్న వారిని వైఎస్ ఆర్ సీపీ కార్యకర్తలు శుక్రవారంఅడ్డుకున్నారు. దీంతో వాతావరణంఒక్క సారిగా ఉద్రికత్తంగా మారి తీవ్ర ఘర్షణకు దారితీసింది. అయితే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ నేత గౌరు వెంకటరెడ్డి ఆరోపించారు. 

రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా జరుపుకున్నారు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్‌ జిల్లాలో పార్టీ శ్రేణులు వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు. వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు వృద్దాశ్రమాల్లో అన్నదానం నిర్వహించారు.

జగన్‌ పుట్టినరోజు వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. కేక్‌ కట్‌ చేసి వేడుక నిర్వహించారు. వైఎస్‌ జగన్‌కు మేలు జరగాలని కోరుతూ సర్వమత ప్రార్ధనలు చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తాడేపల్లి విజయకృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా విశాఖలో వైఎస్‌ఆర్‌ సీపీ పలు సేవాకార్యక్రమాలు చేపట్టింది. వికలాంగులకు వీల్‌చైర్‌లు అందజేశారు. విశాఖలోని 72 వార్డుల్లో వృద్ధులు, పేదలకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు.

కృష్ణాజిల్లాలోనూ జగన్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదానంతో పాటు అన్నదానం చేశారు. బెజవాడలోని ఎస్ కేసివి అనాధ ఆశ్రమమంలో పిల్లలకు బట్టలు పంపిణీ చేశారు. జగన్ జన్మదిన వేడుకలు నిజామాబాద్ లో ఘనంగా జరిగాయి.

నగరంలోని మాధవ్ నగర్ సాయిబాబా ఆలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జగన్ పేరిట అర్చనలు చేశారు. ఆయన త్వరలో జైలు నుంచి విడుదల కావాలని ఆకాంక్షించారు. కువైట్ లోనూ జగన్ జన్మదిన వేడుకలను ప్రవాసాంధ్రులు జరుపుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్. సీబీఐ చేస్తున్న కుట్రలను నిరసిస్తూ ఈరోజు సాయంత్రం మాలియాలో సంతకాల సేకరణ చేపట్టనున్నారు.

జగన్ ను కలిసిన కుటుంబ సభ్యులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని శుక్రవారం చంచల్ గూడ జైల్లో ఆయన కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన కు కుటుంబసభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ను కలిసినవారిలో వైఎస్ విజయమ్మ, భారతి, కుటుంబ సభ్యులు ఉన్నారు. 

కాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా చంచల్ గూడకు అభిమానుల తాకిడి పెరిగింది. వైఎస్ఆర్ సీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ రెహ్మన్, హర్షద్ లు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

రాష్ట్రం అంతటా జగన్ జన్మదిన వేడుకలు

 రాష్ట్రమంతటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి జన్మదిన వేడుకలను అభిమానులు, కార్యకర్తలు జరుపుకుంటున్నారు. కేక్ కట్ చేయడంతోపాటు జగన్ పేరిట ప్రత్యేక పూజలు, యాగాలు చేయిస్తూ అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేద మహిళలకు చీరలు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, రోగులకు పండ్లు, వృద్ధులకు దుప్పట్లు, అన్నదానాలు, రక్తదానాలు చేస్తూ జగన్ పై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 

* మల్కాజ్‌గిరిలో విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. 
* కుత్బుల్లాపూర్‌లోని ఐడీపీఎల్ చౌరస్తాలో చండీయాగం నిర్వహించారు. పేదలకు అన్నదానం చేశారు. 
* ఉప్పల్‌లో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 
*రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌లో వైఎస్‌ఆర్ సీపీ నేత సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు పాలు, పండ్లు పంచారు. 
* కృష్ణా జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జేష్ట్య రమేష్‌బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. 
* నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో వైఎస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంచారు. 
*ఖమ్మం జిల్లా వైరాలో పేదలకు చీరలు పంపిణీ చేశారు. మదిరలో వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం చేశారు. భద్రాచలంలో వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు.
*తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పార్టీ కార్యాలయంలో జక్కంపూడి విజయలక్ష్మీ, ఆదిరెడ్డి అప్పారావు, బొమ్మన రాజ్‌కుమార్ ల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. పి.గన్నవరంలో పేదలకు చీరలు, దుప్పట్లు, రోగులకు పండ్లు పంచారు. 
* నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వైఎస్‌ఆర్ సీపీ నేత ఆదురి కరుణ ఆధ్వర్యంలో ఘనంగా వైఎస్‌ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. శాలిగౌరారం మండలంలో సంకినేని వెంకటేశ్వరరావు వర్గీయులు విద్యార్థులకు స్వీట్లు, రోగులకు పండ్లు పంచారు. కోదాడలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. 
* కరీంనగర్ హౌసింగ్‌బోర్డ్ కాలనీలో ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశ్‌రావు అనాధ, వృద్ధుల ఆశ్రమంలో దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. జిల్లాలోని హుజూరాబాద్‌లో పేదలకు పాలు, పండ్లు పంచారు. 
* విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎమ్మెల్యే ఆర్‌వీ కృష్ణరంగారావు ఆధ్వర్యంలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. 
* కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ అనాథ ఆశ్రమంలో వేడుకలు జరిపారు. ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంచారు. 
* చిత్తూరు జిల్లా చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 
* ప్రకాశం జిల్లా కేసరగుట్ట కాలనీలో యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. 
*మెదక్ జిల్లా జహిరాబాద్ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.

'అభద్రతా భావంతోనే బొత్స వ్యాఖ్యలు'

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై ఎమ్మెల్యే సుజయ కృష్ణా రంగారావు మండిపడ్డారు. బొత్స వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. వైఎస్ కుటుంబానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి అభద్రతా భావంతోనే బొత్స ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి మాట్లాడటం సరికాదని సుజయ కృష్ణా రంగారావు హితవు పలికారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా ఆయన బొబ్బిలిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.

YS Jagan Birthday celebrations in party office

YS Jagan birthday celebrations in state wide

Thursday 20 December 2012

వైఎస్సార్ సీపీలోకి వసంత నాగేశ్వరరావు

 నాప్కాబ్ ఉపాధ్యక్షుడు, మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. చందర్లపాడు మండలం రామన్నపేటలో ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గురువారం వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వసంత నాగేశ్వరరావుకు వైఎస్సార్‌సీపీ కండువా కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఇంటిదగ్గర కూర్చున్న తనను ఎవరూ పట్టించుకోని రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తింపునిచ్చి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా, నాప్కాబ్ ఉపాధ్యక్షుడిగా చేశారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ రుణం తీర్చుకునేందుకు ఆయన తనయుడు స్థాపించిన పార్టీలో చేరి సామాన్య కార్యకర్తగా కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఉదయభాను మాట్లాడుతూ.. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని ప్రజలను నమ్మించి ఎంపీగా గెలిచిన లగడపాటి రాజగోపాల్ తరువాత ఆ మాటల్ని మరచిపోయారని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు

బాబూ.. చిదంబరంతో మాట్లాడలేదా: ఈటెల

చీకట్లో చేతులు కలిపి లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును మించినవారు ఎవరూ లేరని టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. గురువారమిక్కడ తెలంగాణభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు గత మూడేళ్లుగా కాంగ్రెస్‌తో కుమ్మక్కై ప్రభుత్వాన్ని కాపాడటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ‘ఎఫ్‌డీఐలకు అనుకూలంగా రాజ్యసభలో ఓటేస్తామంటూ చంద్రబాబే స్వయంగా చిదంబరంతో ఫోనులో మాట్లాడిండు. చంద్రబాబుకున్న పరపతి, పరిచయంతో పాదయాత్రలో ఉన్నపుడే చిదంబరంతో 40 నిమిషాలపాటు ఫోన్‌లో మాట్లాడింది నిజంకాదా?’ అని ఈటెల ప్రశ్నించారు. కొద్దికాలం కిత్రం జరిగిన ఉప ఎన్నికల్లోనూ మూడు స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీలు సహకరించుకు న్నాయని చెప్పారు. నర్సాపురంలో టీడీపీ అభ్యర్థికి ఓట్లేస్తే రామచంద్రాపురంలో కాంగ్రెస్‌కు టీడీపీవారు ఓట్లేశారని తెలిపారు. కడపలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు కలిపిన విషయం ప్రజలు మర్చిపోలేదన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు


వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా శుక్రవారం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తమ నేత జైల్లో ఉన్నా ప్రజా సంక్షేమమే పరమావధిగా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ఆయన అరెస్టుపై తమ నిరసనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెబుతామని పార్టీ నేతలు ప్రకటించారు. పార్టీ కేంద్ర కార్యాలయంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల కేంద్రాల్లోనూ భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు, పేదలకు దుస్తులు, దుప్పట్లు, చీరల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.

సీబీఐ వాదన అవాస్తవం

హైకోర్టుకు నివేదించిన జగన్ న్యాయవాది పద్మనాభరెడ్డి
అరెస్ట్ వాన్‌పిక్ కేసులో మాత్రమేఅనడం సరికాదు
అన్ని కేసులకు సంబంధించి అరెస్టు జరిగినట్లేనని జస్టిస్ చంద్రకుమార్ గతంలో స్పష్టం చేశారు
రిమాండ్ రిపోర్ట్, కస్టడీ పిటిషన్లు కోర్టుకు సమర్పించిన న్యాయవాది
వాదనలు పూర్తి.. బెయిల్‌పై తీర్పు 24న

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ నెల 24న తన నిర్ణయాన్ని వెలువరిస్తానని జస్టిస్ బి.శేషశయనారెడ్డి ప్రకటించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద తనకు బెయిల్ నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలి సిందే. దీనిపై సీబీఐ వాదనలు బుధవారం ముగిశాయి. గురువారం జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి తిరుగు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీబీఐ వ్యవహారశైలిని ఎండగట్టారు. జగన్‌ను అరెస్ట్ చేసింది కేవలం వాన్‌పిక్ కేసులో మాత్రమేనని సీబీఐ వాదించిన నేపథ్యంలో, ఆయన అరెస్ట్‌కు సంబంధించిన అరెస్ట్ మెమో, రిమాండ్ రిపోర్ట్, పోలీస్ కస్టడీ పిటిషన్‌లో ఏముందో చెప్పాలని సీబీఐని జడ్జి కోరిన విషయం తెలిసిందే. సీబీఐ వాటికి సమాధానం దాటవేయడంతో, గురువారం వాదనలు మొదలవగానే అరెస్ట్ మెమో, రిమాండ్ రిపోర్ట్, పోలీస్ కస్టడీ పిటిషన్లను పద్మనాభరెడ్డి న్యాయమూర్తి ముందుంచారు. 

అన్ని కేసుల్లో జగన్ అరెస్ట్ జరిగింది...

అరెస్ట్ మెమో ప్రకారం వివిధ ఆరోపణలపై జగన్‌ను ఆర్‌సీ 19(ఎ)(1) కింద అరెస్ట్ చేశారని పద్మనాభరెడ్డి నివేదించారు. రిమాండ్ రిపోర్ట్, కస్టడీ పిటిషన్‌లో.. జగన్ తన తండ్రి ద్వారా సండూర్ పవర్ సహా ఇతర కంపెనీలకు పలు ప్రయోజనాలు చేకూర్చారని పేర్కొన్నట్లు తెలిపారు. సండూర్ పవర్ గురించి రిమాండ్ రిపోర్ట్, కస్టడీ పిటిషన్‌లో పేర్కొన్నప్పటికీ, దానిపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపిందని వివరించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. సీబీఐ ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉన్న కేసుల్లో కూడా జగన్‌ను కస్టడీకి అడిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. అవునంటూ పద్మనాభరెడ్డి సమాధానమిచ్చారు. వాన్‌పిక్ సహా దర్యాప్తు చేయాల్సి ఉన్న మిగిలిన ఏడు అంశాలపై కూడా ప్రశ్నించేందుకు జగన్‌ను కస్టడీ కోరే అవకాశం ఉందన్నారు. దీనిని బట్టి మొత్తం 8 కేసుల్లోనూ జగన్‌ను అరెస్ట్ చేసినట్లేనని, కేవలం వాన్‌పిక్ కేసులోనే అరెస్ట్ చేశామని చెప్పడంలో అర్థం లేదని వివరించారు. 

కస్టడీ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఒకసారి పరిశీలిస్తే దర్యాప్తు పూర్తయిన, చార్జిషీట్లు దాఖలు చేసిన కేసుల్లో మాత్రమే కాక, అన్ని అంశాల్లో జగన్ రిమాండ్ కోరినట్లుగా తెలుస్తుందన్నారు. తన అరెస్ట్‌ను అక్రమంగా ప్రకటించాలంటూ జగన్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఇదే హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ తీర్పునిస్తూ.. వేర్వేరు నేరాల్లో జగన్‌కు భాగముందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నప్పుడు, ఆయనను అన్ని కేసుల్లో అరెస్ట్ చేసినట్లు భావించాల్సి ఉంటుందని స్పష్టంగా చెప్పారంటూ కోర్టుకు నివేదించారు. అందులో భాగంగానే జగన్ పిటిషన్‌ను కొట్టివేయడమే కాక, జగన్‌ను అన్ని కేసుల్లోనూ సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. కాబట్టి జగన్‌ను అన్ని కేసుల్లో అరెస్ట్ చేయలేదన్న సీబీఐ వాదనల్లో పసలేదని పద్మనాభరెడ్డి స్పష్టం చేశారు. 

ఆ కేసుల్లో బెయిల్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు..?

రిమాండ్ రిపోర్ట్‌లో.. దర్యాప్తు చేయాల్సి ఉన్న ఏడు అంశాలతో సహా అన్ని అంశాల గురించి స్పష్టమైన ప్రస్తావన ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ‘జగన్‌ను సీబీఐ అన్ని కేసుల్లోనూ అరెస్ట్ చేయలేదనే అనుకుందాం. దర్యాప్తు పూర్తయి, చార్జిషీట్లు దాఖలు చేసిన కేసుల్లో మాత్రమే అరెస్ట్ చేశారని సీబీఐ చెబుతున్న వాదన నిజమని కొద్దిసేపు భావిద్దాం. అదే నిజమైతే ఆ కేసుల్లో బెయిల్ కోసం జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్లను సీబీఐ ఎందుకు వ్యతిరేకిస్తున్నట్లు..?’ అని ప్రశ్నించారు. సీబీఐ న్యాయవాది పి.కేశవరావు జోక్యం చేసుకుంటూ.. లేపాక్షి, ఇందూ ప్రాజెక్ట్ అంశాలు తమ దర్యాప్తులో తేలిన విషయాలని, దర్యాప్తు చేయాల్సిన ఏడు అంశాల్లో అవి తరువాత చేరాయని అన్నారు. ఆ రెండు అంశాలు అసలు ఎఫ్‌ఐఆర్‌లో లేనేలేవని తెలిపారు. పద్మనాభరెడ్డి వాదనలు కొనసాగిస్తూ.. సీబీఐ ఎప్పటికప్పుడు రిమాండ్ పొడిగింపు కోరుతూ మెమోలు దాఖలు చేస్తూ వచ్చిందని, అదే విధంగా కస్టడీ పొడిగింపును కూడా కోరిందని వివరించారు. క్విడ్ ప్రో కోకు సంబంధించి వివిధ అంశాలపై దర్యాప్తు చేస్తున్నామని చెబుతూ వచ్చిందే తప్ప, నిర్దిష్టంగా ఫలానా అంశంపై, ఫలానా కంపెనీపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పలేదన్నారు. 

వాన్‌పిక్ వ్యవహారంలో నాల్గవ చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత, రిమాండ్ పొడిగింపు కోసం మెమో దాఖలు చేయడం సీబీఐ నిలిపివేసిందని వివరించారు. జగన్ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో దాఖలు చేసిన కౌంటర్‌లో కూడా.. జగన్‌ను వాన్‌పిక్ కేసులో మాత్రమే అరెస్ట్ చేసినట్లుగా సీబీఐ సుప్రీంకోర్టుకు చెప్పలేదని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. వివిధ నేరాలకు సంబంధించి దర్యాప్తు సాగుతోందని, దర్యాప్తు కీలక దశలో ఉందని, ఈ దశలో బెయిలిస్తే, ఎంపీ, ఓ పార్టీ అధ్యక్షుడి హోదాతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని మాత్రమే సుప్రీంకోర్టుకు చెప్పిందని తెలిపారు. 

సీబీఐ వాదన పచ్చి అబద్ధం...

తాము 167(2) కింద చట్టబద్ధ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరామన్న సీబీఐ వాదన పచ్చి అబద్ధమని పద్మనాభరెడ్డి చెప్పారు. తామెప్పుడూ చట్టబద్ధ బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయలేదన్నారు. నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధ బెయిల్ కోసం నవంబర్‌లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో మాత్రమే పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. కాబట్టి సుప్రీంకోర్టు 167(2) అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకునే ఉత్తర్వులు జారీ చేసిందన్న సీబీఐ వాదనల్లో అర్థం లేదని పేర్కొన్నారు. 

దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఇరుపక్షాలు ఈ విధంగా పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నప్పుడు, అసలు ఈ కోర్టు దేనిని నిజమని నమ్మాలి..? అసలు సుప్రీంకోర్టులో ఏం జరిగిందో తెలుసుకునేది ఎట్లా..? అని ప్రశ్నించారు. దీంతో ఒక చార్జిషీట్‌కు సంబంధించి మాత్రమే జగన్ అరెస్టయి, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారని, మిగిలిన చార్జిషీట్లలో ఆయన సీఆర్‌పీసీ సెక్షన్ 309 కింద రిమాండ్‌లో ఉన్నారని, దీనికి సంబంధించి బాండ్లను కూడా సమర్పించారని పద్మనాభరెడ్డి తెలిపారు. దీనినిబట్టి మిగిలిన చార్జిషీట్లకు సంబంధించి జగన్ బెయిల్‌పై విడుదలైనట్లేనన్నారు. కోర్టు లేవనెత్తిన అంశాల ఆధారంగా ఆయనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాయలేరని నివేదించారు. సుప్రీంకోర్టు సైతం తన ఉత్తర్వుల్లో ఎక్కడా కూడా జగన్ 167(2) కింద బెయిల్ కోరినట్లుగా పేర్కొనలేదని వివరించారు. సీబీఐ తరఫున కేశవరావు వాదిస్తూ.. రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలను ప్రస్తావించారు. అందులో తాము జగన్‌ను ఓ నేరం కింద అరెస్ట్ చేశామని పేర్కొన్నామే తప్ప, నేరాల కింద అరెస్ట్ చేశామని చెప్పలేదన్నారు. దీని అర్ధం జగన్‌ను తాము అరెస్ట్ చేసింది కేవలం వాన్‌పిక్ కేసులో మాత్రమేనని తెలిపారు. సుప్రీంకోర్టులో జగన్ 167(2) కింద పిటిషన్ దాఖలు చేశారని తాము ఎన్నడూ చెప్పలేదని, 167(2) అంశాన్ని ప్రస్తావించారని మాత్రమే చెప్పామని ఆయన వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ బెయిల్ పిటిషన్‌పై సోమవారం తన నిర్ణయాన్ని వెలువరిస్తానని ప్రకటించారు.

sakshi

క్రిస్‌మస్‌కి డాడీని ఇంటికి రప్పించమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం

అక్టోబర్ 5న బెయిల్ క్యాన్సిల్ చేశాక చాలా బాధపడ్డాను...
తర్వాత సడెన్‌గా హియరింగ్ వస్తే చాలా హ్యాపీగా ఫీలయ్యాను...
ఇక బెయిల్ వస్తుందని. డాడీ వస్తే ఎలా ఉంటుందో ఊహించుకుని,
దేవునికి థ్యాంక్స్ చెబుతూ ఒక పాట రాశాను. అది డాడీ చూసి చాలా బాగుందన్నారట. హ్యాపీగా అనిపించింది.
- వర్ష 


ఇందిర: డాడీతో టైం ఎలా స్పెండ్ చేసేవారు...
హర్ష: బెంగుళూరులో హెచ్‌ఎస్‌ఆర్ హౌస్‌లో డాడీ ఒళ్లో కూర్చుని సినిమాలు చూడడం బాగా గుర్తుంది. డాడీకి యాక్షన్ మూవీస్, అడ్వంచర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. కానీ ఏ సినిమా ఒక్కసారికన్నా చూడరు. స్టార్‌వార్స్, లార్డ్ ఆఫ్ ద రింగ్స్, 10000 బిసి ... ఈ మూడు సినిమాలే నాకు తెలిసి ఆయన రెండుమూడుసార్లు చూసి ఉంటారు. ఒక్కోసారి సినిమా అయిపోయిన తర్వాత నేను, డాడీ ఆ సినిమా గురించి డిస్కస్ చేసేవాళ్లం.

ఎస్పెషల్లీ నేను చదివిన నవలలను సినిమాల కింద తీస్తే రెండిటిలోనూ తేడాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చెప్పేదాన్ని! డాడీ చాలా ఇంట్రస్టింగ్‌గా వినేవారు.
వర్ష: అమ్మ మాకు చదువు చెప్పాక డాడీ ఒళ్లో కూర్చుని నేను, అక్క సినిమా చూసేవాళ్లం. అమ్మ కూడా జాయినయ్యేది. వాళ్ల ముగ్గురికీ యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం. అప్పట్లో నాకు అంత నచ్చేవి కాదు. అందుకని వాళ్లు చూస్తుండగా నేను నిద్రపోయేదాన్ని. ఇదికాక డాడీతో కూర్చుని 8-9 మధ్య టీవీ షోస్ చూసేవాళ్లం. జాపనీస్ యానిమే అంటే డాడీకి, నాకు ఇష్టం... ఇంకా,బెంగుళూరులో ఉండగా డాడీతో ఓ గంటపాటు కబుర్లు చెప్పుకుంటూ వాక్ చేసేవాళ్లం.
హాలిడేస్ వచ్చాయంటే కంటిన్యుయస్‌గా మూవీస్ చూసేవాళ్లం. వెకేషన్‌కి వెళ్లినప్పుడు కూడా డాడీతో చాలా ఫన్ ఉండేది.

ఇందిర: డాడీలో మీకు నచ్చే విషయం...
హర్ష: డాడీతో ఉంటే చాలా ఫన్... మాతో ఉంటే ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు... దేనికీ ఫోర్స్ చేయరు. అది నాకు చాలా నచ్చుతుంది.
వర్ష: డాడీ ఏ విషయంలోనూ కంప్లయింట్ చేయరు. ఎప్పుడూ తిట్టడం కానీ, కోప్పడ్డం కానీ చేయరు.
ఇందిర: మీరు నైస్ అవడం వల్లా? డాడీ నైసా?

వర్ష: (నవ్వేసి) డాడీనే నైస్ కాబట్టి!
ఇందిర: డాడీతో మెమరబుల్ ఇన్సిడెంట్స్...

హర్ష: నాకు గుర్తున్న ఇన్సిడెంట్స్‌లో ఒకటి .... ప్రతి శనివారం నేను, వర్ష అమ్మతోపాటు పెయింటింగ్ చేసేవాళ్లం. ఓసారి డాడీ కూడా మాతో జాయినయ్యారు. పెయింటింగైతే చేయలేదు కానీ, నాది, వర్షది ఏదో పిక్చర్ గీసి, షేడింగ్ చేసివెళ్లారు. (నవ్వుతూ) బాగానే గీశారు.

వర్ష: నాకు నిద్రంటే ఇష్టం. సెలవుల్లో, ... ఆదివారాల్లో 9.30 అయినా లేవడం ఇష్టపడను. కానీ, డాడీ ఇంట్లో ఉన్నారంటే, 8-9 కల్లా బెడ్ దగ్గరికి వచ్చి షేక్ చేసి మరీ నవ్వుకుంటూ లేపేస్తారు. ఆయనకు మాతో స్పెండ్ చేయాలని ఉంటుంది కాబట్టి, తర్వాత ఆయనకు కుదరదు కాబట్టి, బద్ధకమున్నా డాడీకోసం లేచేసేదాన్ని.

హర్ష: ఇంకోటి... నా బర్త్‌డేకి ... డాడీ దగ్గర మంచి పేపర్స్ లేవు.. కలర్స్ లేవు... మామూలుగా ఆయన బిజీగా ఉండే మనిషి... కార్డులు చేయడం రాదు కదా! కానీ, కష్టపడి, పెన్నులు లేకపోయినా కలర్ పెన్సిల్స్ లేకపోయినా, ఉన్నదాంతో కార్డు చేసి, మంత్లీ క్యాలెండర్ మీద స్మైలింగ్ ఫేస్ గీసి, లెటర్ కూడా రాసి పంపారు. ఇప్పటిదాకా నాకొచ్చిన బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్!

ఇందిర: డాడీ మీద మీకేమైనా కంప్లయింట్స్ ఉండేవా?
హర్ష: మేం బెంగుళూరులో ఉన్న రోజుల్లో అప్పుడప్పుడు డాడీ హైదరాబాద్‌కు వచ్చి 2-3 రోజులు వుండేవారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్ పూర్తిగా షిఫ్టయినప్పుడు ఫ్రెండ్స్‌ని మిస్సవుతానని నాకు ఇష్టంలేకపోయినా, కనీసం డాడీతో రోజూ టైం స్పెండ్ చేయవచ్చునని అనుకున్నాను. కానీ, ఇక్కడికొచ్చాక డాడీ ఓదార్పుతో బిజీగా ఉండడంతో నెలకు ఒకసారే కలవగలిగేవాళ్లం. కానీ ఇంకా వరస్ట్ పార్ట్ ఏంటంటే... ఇప్పుడు అది కూడా లేదు. స్కూల్ ఉన్న టైంలో ములాఖత్ ఉండడంతో, ఎప్పుడో రెండు నెలలకోసారి రెండు గంటలు కలవగలుగుతున్నాం.

వర్ష: ఓదార్పు ఉండగా మేం కంప్లయింట్ చేసేవాళ్లం... మాకు టైం ఎక్కువ ఇవ్వండి డాడీ... అని! కానీ అప్పుడే నయం... ఇప్పుడు అసలు కుదరడం లేదు. ఓదార్పే బెటర్... అన్నివిధాలా... మాతో స్పెండ్ చేయకపోతే చేయకపోయారు... ఆయనకు నచ్చింది, తను కరెక్టనుకున్నది చేసుకుపోయేవారు. ఇప్పుడు ఏమీ చేయటానికి లేదు. అది చాలా బాధగా ఉంటుంది. అప్పట్లో టీవీలో చూసేవాళ్లం. ఫోన్‌లో మాట్లాడగలిగేవాళ్లం.ఇప్పుడు ఎక్కడా కనపడరు. మాట్లాడడానికి లేదు.

ఇందిర: పోనీ లెటర్లు అవీ రాయచ్చుగా...
హర్ష: రాస్తాం. నేను ఫ్రెండ్స్ గురించి, మూవీస్ గురించి ఎక్కువ రాస్తాను. డాడీ కూడా అప్పుడప్పుడు లెటర్స్ రాసి మమ్మీకి ఇచ్చి పంపుతుంటారు. దానిలో 2, 3 పేరాలు మూవీస్ గురించే ఉంటాయి.

వర్ష: నేనైతే ఏయే సబ్జక్టుల్లో ఎన్ని మార్కులు వచ్చాయో రాస్తాను. లెటర్స్ నిండా స్మైలింగ్ ఫేసెస్ పెడుతుంటాను... ఎందుకంటే డాడీ ఎప్పుడూ స్మైల్ చేస్తుండాలని! అప్పుడప్పుడు నలుగురం ఫ్యామిలీగా కలిసి ఉన్నట్టుగా కూడా బొమ్మలు గీసి పంపుతుంటాను.

ఇందిర: మరి డాడీ రిప్లైలు ఇస్తారా?
వర్ష: ఇస్తారు... నా హ్యాండ్ రైటింగ్ బాగుంటే మెచ్చుకుంటారు...కానీ, ఓసారి బాలేకపోతే, ‘నీ స్పెల్లింగ్స్‌లో చాలా తప్పులున్నాయి. నేను చెప్పేంత వాడిని కాదు. ఎందుకంటే... ఎప్పుడూ మమ్మీ అంటుంది - నావి కూడా బ్యాడ్ అని. కానీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. తప్పదు’ అని రాశారు. ప్రతి లెటర్‌లోనూ మా సిస్టర్‌కి చెప్తారు... నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని... నా ఇంపార్టెన్స్‌ను గుర్తించాలని! (నవ్వుతూ) కానీ ఇన్నిసార్లు రాసినా, అక్క ఇప్పటికి కూడా గుర్తించలేదు.

హర్ష: అదే విషయం డాడీకి నేను రాశాను కూడా... నేను ఇప్పటికీ చెల్లెలి ఇంపార్టెన్స్ గుర్తించలేదని!
ఇందిర: స్కూల్లో ఫ్రెండ్స్ డాడీ గురించి ఏమైనా అడుగుతుంటారా?

హర్ష: ఫ్రెండ్స్ ఆ విషయం అసలు ఎత్తరు.. వాళ్లు చాలా అండర్‌స్టాండింగ్‌గా ఉంటారు.
వర్ష: నా ఫ్రెండ్స్ కూడా చాలా స్వీట్... ఇంత జరుగుతున్నప్పుడు ఎందుకులే అని అనుకుంటారేమో... ఎవరూ అడగరు.

ఇందిర: అసలు డాడీని ఎందుకిలా చేశారో తెలుసా?
వర్ష: ఓదార్పు చేయడం లీడర్స్ ఎవరికీ ఇష్టంలేదు. డాడీకి ఇంతమంది సపోర్ట్ ఇవ్వడం కూడా వాళ్లకి నచ్చలేదు. డాడీని ఎన్నాళ్లు కుదిరితే అన్నాళ్లు పెట్టేలాగా రాంగ్ డీల్స్ చేస్తున్నారు అందరూ. నాట్ ఫెయిర్!

హర్ష: అంతేకాదు, వాళ్లని వాళ్లు (హర్ష ఉద్దేశంలో ప్రత్యర్థులు) బెటర్ చేసుకునేకన్నా అవతలి వాళ్లని తక్కువ చేయడంలోనే ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేస్తున్నారు. డాడీని వాళ్లు అన్యాయంగా బాధపెడితే వాళ్ల సంగతి కూడా దేవుడే చూసుకుంటాడు. డాడీ అలా చేయరు కాబట్టి డాడీ పట్ల దేవుడు డెఫినిట్లీ కైండ్‌గా ఉంటారని అనుకుంటున్నాను.

ఇందిర: డాడీకి బెయిల్ రానప్పుడు చాలా బాధపడ్డారట కదా..
హర్ష: ప్రతిసారీ బెయిల్ వస్తుందీ... రాదు... అంటున్నప్పుడు చాలా బ్యాడ్‌గా ఫీలవుతాం. మా అందరికంటే మమ్మీ ఎక్కువ డిప్రెషన్ ఫీలవుతుంది. ఇంతకుముందు ఎప్పుడూ మమ్మీ ఏడవగా చూడలేదు. ఎప్పుడూ మమ్మల్ని హ్యాపీగా ఉండమని చెప్పే అమ్మే... అలా డిప్రెషన్లో ఉండి ఏడుస్తుంటే ఏం మాట్లాడాలో, ఏం చేయాలో అర్థం కాక హెల్ప్‌లెస్‌గా ఫీలయ్యి, సెలైంట్‌గా ఉంటాం. స్పేస్ ఇస్తే బెటరని వదిలేస్తాం.

వర్ష: వాళ్ల వెడ్డింగ్ యానివర్సరీకి కూడా అంతే! డాడీ పక్కన లేరని మమ్మీ చాలా శాడ్‌గా ఫీలయ్యింది... ఏడ్చింది... ఇంకోసారి ప్రేయర్‌లో కూడా అంతే... ఇంకా పేయర్ మొదలెట్టకుందే ఏడ్చింది. మాకేం చేయాలో అర్థం కాక... ఏదో మాట్లాడబోయి నెగిటివ్ మాట్లాతామేమో అనే భయానికి ఇంకా బ్యాడ్ అవుతుందని ఏం మాట్లాడకుండా కూర్చున్నాం.

ఇందిర: బెయిల్ వస్తుందనుకున్న రోజు... 7 ఎస్‌ఎంఎస్‌లు పంపావట!
వర్ష: స్కూల్‌కు వెళ్లినప్పుడు కనీసం ఓ ఇరవై సార్లయినా ప్రేచేసి ఉంటాను. టెన్షన్ అనిపించి స్కూల్ నుంచి బయటకు రాగానే కారులోకి రాగానే సెల్ తీసుకుని మమ్మీకి 7 ఎస్‌ఎంఎస్‌లు పంపాను. ఏమైంది... ఏమైంది... అని పంపాను. కానీ, ఆరోజు కూడా రాలేదు. చాలా బాధపడ్డాను. ఎందుకంటే, అందరూ ఇంత ప్రే చేస్తున్నారు... బైబిల్‌లో ఉంటుంది... ‘దేవుని పేరు మీద ఇద్దరు ముగ్గురు కలిసి ప్రే చేస్తే అనుకున్నది జరుగుతుంది’ అని! అందులోనూ చాలామంది ప్రే చేస్తున్నారు... కాబట్టి తప్పనిసరిగా జరుగుతుంది అనుకున్నాను.

ఇందిర: డాడీ బర్త్‌డే రోజు కలుస్తారు కదా... ఏం గిఫ్ట్ ఇస్తున్నారు?
హర్ష: క్రిస్మస్‌కి డాడీ ఇంటికి వస్తారని దేవుడ్ని ప్రార్థిస్తున్నాం. అందుకే, డాడీ కోసం తనకు నచ్చే ఎమేజింగ్ స్పైడర్‌మ్యాన్, డార్క్‌నైట్ రెజైస్ మూవీస్ కొన్నాను.

వర్ష: చాలా ఫోటోలు, రాతలతో కూడిన స్క్రాప్ బుక్ తయారుచేస్తున్నాం. ఆ పిక్చర్స్ పెట్టి, ఆ టైంలో ఏం జరిగింది... అవన్నీ రాస్తాను. స్క్రాప్‌బుక్కే కాకుండా కలర్‌ఫుల్ కార్డు కూడా తయారుచేస్తున్నాను డాడీకి... కాలిగ్రఫీలో ఇంతవరకు ఎప్పుడు రాయనంత అందంగా... స్పెషల్ కార్డును తయారుచేయాలనుకుంటున్నాను. చాలా స్మైలీ ఫేసెస్ పెట్టి!

ఇందిర: మీకన్నా ముందు ఈ పేపర్ వెళ్తుంది... మరి డాడీకి ఏం విషెస్ చెప్తారు?
హర్ష: హ్యాపీ బర్త్‌డే డాడీ! మీరు మాతో ఉంటే బాగుండేది... కానీ, మేమే మిమ్మల్ని కలవడానికి వస్తాం!
వర్ష: హాయ్, హ్యాపీ బర్త్‌డే డాడీ! మీరు బయటకొచ్చేసి మాతోపాటు ఉండుంటే చాలా బాగుండేది. ఇంట్లో చాలామందితోపాటు మీ బర్త్‌డే చేసుకునేవాళ్లం. బట్.. పర్లేదు... అక్కడ కూడా... మిమ్మల్ని చూడగలుగుతాం కదా అది చాలు...

హర్ష: క్రిస్మస్‌కి మాత్రం మీరు బయటకు రావాలి. లేకపోతే మీరు మన ఇంటి ట్రెడిషన్‌ని (చుట్టాలందరితో పులివెందులలో గడపడం) బ్రేక్ చేసినట్టవుతుంది.

ఇందిర: మీకు తాత ఎంత గుర్తున్నారు?
వర్ష: ఎప్పుడు అబ్బకు హాయ్ చెప్పినా వెంటనే ఎత్తుకునేవారు. అమ్మ నాకు శ్రేయ అని పెట్టాలనుకుంటే... అబ్బ తనకు ఇష్టమని వర్ష అని పెట్టుకున్నారు. అందుకే ప్రతిసారీ, ప్రతి వర్క్‌బుక్, ప్రతి షీట్‌లో, ఏ నోట్‌బుక్‌లో ఎప్పుడు ఆ పేరు రాసినా... అబ్బను తలచుకోకుండా ఉండలేను.
హర్ష: అబ్బ పోయి మూడేళ్లయినా చాలా ఏళ్లయినట్టు అనిపిస్తుంది. అంతేకాదు, అబ్బ పోయినప్పటినుంచీ మాకు ఏదీ సరిగా జరగడం లేదు.
ఇందిర: తాతలో, నాన్నలో... మీకు నచ్చే విషయాలు...
హర్ష: అబ్బకి, నాన్నకి - ఇద్దరికీ ప్రజలకు హెల్ప్ చేయడం చాలా ఇష్టం.. వాళ్లు చేసే ప్రతి పనినీ ఇష్టంగా చేస్తారు. మంచిగా చేస్తారు. ఒకసారి చేయాలనుకుంటే పట్టుదలతో చేయడం, చెప్పదలచుకున్నది సూటిగా చెప్పడం, ప్రతిరోజూ దేవునికంటూ కొంత టైం కేటాయించడం, స్పిరిచ్యువల్ గెడైన్స్... ఏది చేసినా ‘మేం చేస్తున్నాం’ అని అనుకోకుండా దేవుడు చేస్తున్నాడు అని అనుకుని చేయడం... నాకు ఇద్దరిలో నచ్చుతుంది.

వర్ష: ఈరోజు డాడీ ప్లేస్‌లో అబ్బ ఉండుంటే... ఇలానే డాడీలానే కామ్‌గా ఉండేవారు. ఇద్దరికీ అసలు ఎప్పుడూ కోపం రాదు. ఎవరిమీదా అరవరు... వాళ్లు థింక్ చేసే విధానం, యాటిట్యూడ్ ఒకేలా ఉంటుంది. ఇద్దరూ బైబిల్ బాగా చదువుతారు, ప్రేయర్స్ ఎక్కువ చేస్తారు. ఒకేలా ఆలోచిస్తారు. ఇద్దరికీ దేవుడంటే చాలా ఇష్టం. మేం కొంచెం పెద్దయిన తర్వాత మమ్మల్ని అబ్బ దగ్గర పెట్టాలని అమ్మకు చాలా ఉండేదట. అలా చేస్తే మేం కూడా అబ్బలాగా పేషన్స్‌తో ఉంటామని!

ఇందిర: వీటిల్లోంచి డాడీ దగ్గర నేర్చుకోవాలనుకునేవి...
హర్ష: కామ్‌గా ఉండడం, పేషన్స్‌తో ఉండడం... డాడీకి ఎప్పుడైనా ఫోన్లు వస్తుంటే.. ఇంకెంత సేపు మాట్లాడతారు... అని చెవిలో అరుస్తుండేవాళ్లం... అయినా కూడా ఎప్పుడూ మా మీద ఒక్కసారి కూడా ఆయన విసుక్కోరు... వేలితో ‘ఒక్క నిమిషం ఒక్క నిమిషం’ అని సైగ చేసేవారే తప్ప కోప్పడేవారు కాదు. మేమిద్దరం కొట్టుకున్నా, కొట్టుకోవద్దని కామ్‌గా చెప్తారు గానీ అరవరు.

వర్ష: అందరికోసం టైం కుదుర్చుకునేవారు. (నవ్వుతూ) కానీ, కజిన్స్ అందరినీ అక్క తనే పిలుస్తుంది... కానీ ఎవరితో మాట్లాడకుండా తన గొడవన తను పోయి పుస్తకాలు చదువుకుంటుంది... ఎవ్వరికీ ఇవ్వడానికి తన దగ్గర టైం ఉండదు... కానీ మా డాడీ అలా కాదు... అందరికీ ఇవ్వడానికీ టైం ఉంటుంది మా డాడీ దగ్గర. ఐ గెస్ అబ్బ కూడా అలానే! అమ్మ చెప్తూ ఉంటుంది... ఎంత పెద్ద పార్టీ పెట్టినా, ఏం చేసినా అందరితో రెండు నిమిషాలు అయినా అదే పనిగా వచ్చి మాట్లాడేవారట... డాడీ కూడా అంతే!

ఇందిర: ఇలా జరుగుతున్నందుకు దేవుని మీద ఎప్పుడూ కోపం రాలేదా?
హర్ష: ‘నువ్వు అనుకుంటే అయిపోదా’ అని దేవుడ్ని చాలాసార్లు అడగాలనిపించింది కానీ, ఆలోచిస్తే అనిపించింది... ప్రతి మనిషి విషయంలో దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది! దేవుడు మనల్నీ చేశాడు... ప్రపంచంలోని అందర్నీ చేశాడు. ఎవరేంటో దేవునికి తెలుసు. అందరం ఆయన క్రియేట్ చేసినవాళ్లమే కాబట్టి ఆయనకు ఎవరిని ఏం చేయాలనేది బాగా తెలుసు. మనకు ఎవరేంటో తెలీదు కాబట్టి అన్నీ ఆయనకు వదిలేయటం బెటర్!

వర్ష: అయితే, ఇంతకుముందు ఉన్నదానికన్నా ముందు ముందు బాగా వుంటుందని హోప్ వుంది. అన్నీ బాగా అయిపోయేరోజు వస్తుందని, అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా మన మంచికే జరిగిందని అప్పుడనిపిస్తుందని నాకు ఇప్పుడు అనిపిస్తుంది.


sakshi
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!