YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 24 November 2012

అడుగడుగునా బ్రహ్మరథం

* అప్రతిహతంగా ‘మరో ప్రజాప్రస్థానం’ 
* అడుగడుగునా బ్రహ్మరథం 
* కొంకాల గ్రామంలో పాదయాత్రకు ఘనస్వాగతం
* బియ్యం ఇవ్వడం లేదని.. పింఛన్ ఆపేశారని మహిళల ఏకరువు
* జగనన్నను ఆశీర్వదించండి.. సమస్యలు తీరుస్తాడని షర్మిల హామీ 

పాలమూరులో మరో ప్రజాప్రస్థానం
మూడు రోజులు - 40.6 కిలోమీటర్లు


ఊళ్లకు ఊళ్లే ‘మరో ప్రజాప్రస్థానం’ వెంట కదం కలిపాయి.. పదులు.. వందలు..వేల గొంతుకలు ఒక్కటయ్యాయి.. రాజన్నరాజ్యం రావాలని.. కష్టాలు తీర్చాలని నినదించాయి. రూపాయి బియ్యం ఇవ్వడం లేదని..పింఛన్లు ఆపేశారని మహిళలు, వృద్ధులు పాదయాత్రలో షర్మిలతో చెప్పుకున్నారు. కరెంట్ రాక..పంటలకు నీళ్లందక పొలాలు బీళ్లుగా మారుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్షం కుమ్మకై కుట్రలతో జగనన్నను బంధించాయని షర్మిల దుయ్యబట్టారు. జగనన్న త్వరలోనే బయటికి వస్తారని..రాజన్నరాజ్యం తెస్తారని .. కన్నీళ్లు తుడుస్తారని భరోసా ఇస్తూ ముందుకు సాగారు... 

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: ప్రజా సమస్యలను విస్మరించిన అధికార కాంగ్రెస్‌పార్టీ, దానికి అంటకాగుతున్న ప్రతిపక్ష టీడీపీల వైఖరికి నిరసనగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ అడుగడుగునా జనం నీరాజనం మధ్య అప్రతిహతంగా సాగుతోంది. శనివారం నాటికి 508 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. 38 రోజుల క్రితం కడప జిల్లా ఇడుపులపాయ నుం చి ప్రారంభమైన యాత్ర అనంతపురం, క ర్నూలు జిల్లాల మీదుగా నాలుగురోజుల క్రితం మహబూబ్‌నగర్ జిల్లాలోకి ప్రవేశించింది. శనివారం అలంపూర్ నియోజకవర్గం కొంకాల గ్రామం చేరుకునే సమయానికి యాత్ర 500 కిలోమీటర్లు పూర్తయింది. దీంతో ఆ గ్రామప్రజలు భారీగా తరలొచ్చిన షర్మిలకు ఘనస్వాగతం పలికారు. 

అంతకుముందు శాంతినగర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. మూడేళ్ల కిందట వరదలు వచ్చి ఇళ్లు కోల్పోయిన నిరుపేదలకు అండగా నిలిచి వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. త్వరలో రాజన్నరాజ్యం వస్తుందని అన్ని సమస్యలూ తీరుతాయని అప్పటి వరకు కాస్త ఓపికపట్టాలని ధైర్యం చెప్పారు. ‘‘ ప్రతి పేద కుటుంబాల్లో పెద్ద చదువులు చదవాలనే ఆశయంతో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెడితే ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చింది. ఎక్కడైనా ప్రమాదాలకు గురైతే వారిని వెంటనే ఆస్పత్రికి చేర్చి ప్రాణాపాయం నుంచి గట్టెక్కించేందుకు వీలుగా 108 వాహనాలను ఏర్పాటుచేస్తే ప్రస్తుతం అవి ఎక్కడా కనిపించడం లేదు’’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. తీవ్రమైన విద్యుత్‌కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వీటన్నింటికి కారణం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నిర్లక్ష్యమేనన్నారు. మహానేత బతికిఉంటే 9 గంటల పాటు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేవారని గుర్తుచేశారు. 

ఓర్వలేకనే కాంగ్రెస్, టీడీపీల కుట్ర
ప్రజలకష్టాలపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తుంటే పాలకపక్షం, ప్రతిపక్ష ఓర్వలేకపోయిందన్నారు. రానున్న ఎన్నికల్లో నామరూపాలు లేకుండా పోతామనే భయంతో కుమ్మక్కై అక్రమకేసులు బనాయించి జైల్లో పెట్టించారన్నారు. దేవుడి ఆశీస్సులతో పాటు ప్రజల అండదండలు ఉన్నందున త్వరలో జగనన్న బయటకు వస్తాడన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితే పేదలకు ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మిస్తాడని హామీఇచ్చారు. రైతులు కూడా గిట్టుబాటు ధరలేక ఇబ్బందులు పడకుండా రూ.35 కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసి ఆదుకుంటాడని వెల్లడించారు. 

జగనన్న సీఎం కావాలి..
కొంకాల గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పలువురు మహిళలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. రేషన్ బియ్యం కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. షర్మిల స్పందిస్తూ.. రాజన్నరాజ్యం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికీ 30 కిలోల బియ్యం అందుతాయన్నారు. ‘‘వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా నాన్న చేయి విరిగితే ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా ఆపరేషన్ చేశారు. వైఎస్ మరణానంతరం మా నాన్నమ్మకు కేన్సర్ వస్తే చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని వెళ్తే ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె మృతిచెందింది..’’అని మరో ఓ మహిళ కంట తడిపెట్టింది. 

పేదల బతుకుల్లో వెలుగు రావాలంటే జగనన్న సీఎం కావాలని ఆకాంక్షించారు. అనంతరం వెంకటాపురం స్టేజీ వద్ద షర్మిల మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతు సమస్యలు పట్టించుకోకుండా వారిని తీవ్రమైన క్షోభకు గురిచేస్తుందన్నారు. ఎవరూ ఆధైర్యపడొద్దని త్వరలోనే జగనన్న జైలు నుంచి బయటకు వచ్చి పేదలకన్నీళ్లు తుడుస్తాడని షర్మిల ప్రజలకు భరోసాఇచ్చారు. శనివారం బూడిదపాడు క్రాస్‌రోడ్డు నుంచి ప్రారంభమైన యాత్ర శాంతినగర్, 26 కాల్వ, కొంకాల, పెదతాండ్ర పాడు క్రాస్‌రోడ్డు, వెంకటాపురం స్టేజీ శివారు ప్రాంతం వరకు కొనసాగించి ఆ రాత్రికి షర్మిల అక్కడే బసచేశారు.

పదవులు నీ కుటుంబానికే... ప్రచారం కూడా నీ కుటుంబానికేనా?

ఏం సాధించారని సూర్యాపేట సభ
పది ప్రశ్నలకు సభలోసమాధానం చెప్పాలని డిమాండ్

వరంగల్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కేంద్ర పాలకమండలి సభ్యురాలు కొండా సురేఖ మరోసారి మండిపడ్డారు. తెలంగాణ పేరుతో ఆయన రాజకీయ వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపించారు. హన్మకొండలో శనివారం విలేకరుల సమావేశంలో ఆమె బహిరంగ లేఖ విడుదల చేశారు. తాను సంధించే పది ప్రశ్నలకు సూర్యాపేట బహిరంగ సభలో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఈ లేఖలో డిమాండ్ ఆమె చేశారు. 

కొండా సురేఖ పది ప్రశ్నలు : 1) తెలంగాణ ఉద్యమం పేరుతో మీ కుటుంబం చేసే రాజ కీయవ్యాపారానికి వెయ్యిమందికిపైగా అమాయక యువ కులు, విద్యార్థులు బలి అయినందుకు ఆనందంతో ఉత్సవం జరుపుకోవడానికి సభ నిర్వహిస్తున్నావా..? 2) వైఎస్సార్‌సీపీపై అవాకులు చెవాకులు విసురుతూ, తెలంగాణ సెంటిమెంట్ పేరుతో ప్రజలను మభ్యపెట్టి సొమ్ము చేసుకుంటున్న నువ్వు, నీ కుటుంబ సభ్యులకు, టక్కుట మార విద్యలతో భక్తి పేరుతో అమాయక ప్రజలను మాయ చేసే దొంగ బాబాలు, నకిలీ స్వాములకు తేడా ఉందా..? 3) కాంగ్రెస్‌తో ఒకసారి పొత్తుపెట్టుకుని కేంద్ర మంత్రివర్గంలో చేరావు. నీ కుటుంబసభ్యులు, భజనపరులను మంత్రివర్గంలో చేర్పించావు. ప్యాకేజి కుదరక బయటకు వచ్చావు. మరోసారి టీడీపీతో పొత్తు పెట్టుకున్నావు. ఫలితాలు రాకముందే బీజేపీతో కేంద్రంలో పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నించావు. మళ్లీ కాంగ్రెస్‌తో అంట కాగావు. అసలు నీకు ఓసిద్ధాంతం అంటూ ఉందా..? 4) తెలంగాణకు రావాలంటే వీసాలు, పాస్‌పోర్టులు కావాలని వైఎస్ అన్నారని, పార్లమెంటులో జగన్ సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకున్నారని ప్రచారం చేస్తున్నావు. మరి నువ్వు టీడీపీలో ఉండగా నిండు అసెంబ్లీ సాక్షిగా 610 జీవో ను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర పాట పాడిన విషయం గుర్తు లేదా. 5) 11 ఏళ్లుగా రాజకీయ ప్రక్రియ ద్వారా రాని తెలంగాణ రాష్ట్రం ఇప్పుడెలా వస్తుంది? 6) తెలంగాణ ఇస్తుందంటూ ఇంతకాలం కాంగ్రెస్‌కు వంతపాడిన నువ్వు... ఇప్పుడు కాంగ్రెస్‌ను బొంద పెట్టాలంటున్నావు. ఎన్నికల తరువాత ఏ పార్టీకి మద్దతు ఇస్తావో చెప్పే దమ్ము...ధైర్యం ఉందా.?7)నీ తప్పులకు, నీ మాటలు నమ్మిన యువకులు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి బాధ్యులెవరు? 8)పదవులు నీ కుటుంబానికే... ప్రచారం కూడా నీ కుటుంబానికేనా? పత్రికల్లో రోజూ కేటీఆర్, హరీష్‌రావు, కవిత తప్ప మరొకరు కనిపించరా? అసలు టీఆర్‌ఎస్‌లో మీ కుటుంబ సభ్యులకన్నా సామర్థ్యం, సమర్థత ఉన్న లీడర్లు లేరా? 9) సూర్యాపేట సభ పేరుతో ఎంత వసూలు చేస్తున్నావు?10)ఉద్యమ పార్టీ అంటూ వివిధపార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నావు. ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళితే ప్యాకేజీలు అంటున్నావు. నువ్వు ఎమ్మెల్యేలను ఆకర్షిస్తే ఉద్యమం అంటున్నావు. దీనిపై నీకున్న చిత్తశుద్ధి ఏమిటి?

మానవత్వం లేని పాలకులు

కృష్ణా, తుంగభద్ర వరద బాధితులు మూడేళ్లుగా నరకం చూస్తున్నారు
వరదల్లో సర్వస్వం కోల్పోయి.. ఇప్పటికీ గుడారాల్లోనే బతుకుతున్నారు
పాములు, విషపు పురుగులతో కలిసి జీవనం సాగిస్తున్నారు
వీరందరికీ ఇళ్లు కట్టిస్తామని రోశయ్య ఇచ్చిన మాట ఏమైంది?
ఈ పాలకులకు ప్రజల అవసరం లేదు, ప్రజా సమస్యలూ పట్టవు
ఈ సర్కారుపై అవిశ్వాసం పెట్టి దించేయాలని ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబుకు వినపడడం లేదు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 38, కిలోమీటర్లు: 507.90

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన ఏడాది కృష్ణా, తుంగభద్ర నదులు పొంగి ఇళ్లు మునిగి పోయాయి. పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు సర్వం కోల్పోయారు. ముంపునకు గురైన వాళ్లను పరామర్శించడం కోసం అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య ఇక్కడకు వచ్చి ఇళ్లు కోల్పోయిన వారందరికీ వెంటనే కొత్త ఇళ్లు కట్టిస్తామని మాటిచ్చారు. ఆయన హామీ ఇచ్చి మూడేళ్లు గడిచిపోయాయి. ముంపు బాధితులకు కనీసం ఇళ్లు కాదు కదా.. గుడిసె కూడా వేయించలేదు. ఆ వేళ ప్రాణాలు అరచేతుల్లో పెట్టికొని బతికిబయటపడ్డ వాళ్లంతా ఎక్కడో ఒక చోట గుడారాలు వేసుకొని జీవిస్తున్నారు. మూడేళ్లుగా నరకం చూస్తున్నారు. వాళ్లుంటున్న ప్రాంతం సురక్షితం కాదు. పాములు, విషపు పురుగులు చుట్టూ తిరుగుతున్నా వాటి మధ్యే కాపురాలు చేస్తున్నారు. అయ్యా..! కాంగ్రెస్ పాలకులారా... ఆ వేళ రోశయ్య ఇచ్చిన మాట ఏమయింది?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. 

ఇంత మానవత్వం లేని వాళ్లా మన రాష్ట్రాన్ని పాలిస్తోందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 38వ రోజు శనివారం మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా మార్గమధ్యంలో వరద ముంపు బాధితులు పలువురు షర్మిలను కలిశారు. ‘‘ముగ్గురు ఆడపిల్లల తల్లిని, వరదల్లో నా భర్త పోయాడు. రోడ్డు పక్కన గుడారం వేసుకొని ఉంటున్నాను. నాకు ఏ దిక్కూ లేకుండా పోయింది’’ అని ఉరుకుందమ్మ అనే మహిళ గోడు వెళ్లబోసుకుంది. తమ బతుకులు కూడా అలాగే ఉన్నాయని దుర్గమ్మ, మల్లయ్య తమ బాధలు చెప్పడంతో.. షర్మిల పై విధంగా స్పందించారు. 

ఈ పాలకులకు ప్రజల అవసరం లేదు..

షర్మిల శనివారం శాంతినగర్ నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడ బహింరంగ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘వైఎస్సార్ కేటాయించిన నిధులు ఈ ప్రభుత్వం విడుదల చేసి ఉంటే ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) పూడికతీత పనులు పూర్తైపంట పొలాలకు నీళ్లు అందేవి. ఈ చేతగాని పాలకులకు ప్రాజెక్టుల మీద అవగాహన లేకపోవడంతోనే ఆర్డీఎస్ ఎండిపోయింది. అన్నం పెట్టే రైతన్నకు ఇప్పుడు అన్నం లేకుండా పోయింది. వైఎస్సార్ సువర్ణయుగంలో రైతు రాజులాగా బతికారు. నాన్నగారు ఏ పని చేసినా.. ఆ పనితో ప్రజలకు మేలు జరుగుతుందా? లేదా? అని ఆలోచన చేసేవారు. ఈ పాలకులకు ప్రజల అవసరం లేదు, ప్రజల సమస్యలూ పట్టవు’’ అని విమర్శించారు. ‘‘తొమ్మిదేళ్లు పాలించి ప్రజల్ని పీడించిన చంద్రబాబుకు, ఇప్పుడు పాలిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డికి తేడా ఏమీ లేదు. ఇద్దరూ తోడు దొంగలే. చంద్రబాబు హయాంలో.. అప్పటికే పెన్షన్ పొందుతున్న వారు ఎవరైనా చనిపోతేనే కొత్తగా మరొకరికి పెన్షన్ ఇచ్చేవారు. అంటే పెన్షన్ రావాలంటే ఆ గ్రామంలో ఎవరైనా చనిపోవాలని కోరుకోవాలన్నమాట. అదే పరిస్థితి ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో కనిపిస్తోంది. వృద్ధులకు, వికలాంగులకు ఉన్న పెన్షన్లను తీసేస్తున్నారు.. గ్యాస్ ధరను పెంచారు. సబ్సిడీ సిలిండర్లు ఏడాదికి ఆరే ఇస్తారట. అంతకు మించితే రూ.1,000 పెట్టి కొనుగోలు చేయాలట.. ఇది మానవత్వం లేని పాలన కాదా?’’ అని షర్మిల అన్నారు.

మరో అవకాశం కావాలట..

‘‘టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో వందల మంది చేనేత కార్మికులు, 4 వేల మంది రైతన్నలు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు రాజన్న వారి కుటుంబాలకు సాయం చేయాలని చంద్రబాబును అడిగితే పైసా కూడా సాయం చేయలేదు. రాజన్న అధికారంలోకి వచ్చాక వారికి లక్షన్నర చొప్పున నష్ట పరిహారం ఇచ్చాడు. చంద్రబాబు ఇప్పుడు పాదయాత్ర అంటూ కొత్త డ్రామాలాడుతున్నారు. నా మాట నమ్మాలంటూ మొసలి కన్నీరు కార్చుతున్నారు. ప్రభుత్వాన్ని తిట్టినట్టు నటిస్తూనే మిత్రపక్షంగా ఉంటున్నారు. ఈ చేతగాని ప్రభుత్వం కూలిపోకుండా కాపాడుతున్నారు. ఆయన చేస్తున్న పాదయాత్రకు, ఆ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టి ఈ అసమర్థ ప్రభుత్వాన్ని దించేయాలని ఎంత చెప్పినా చంద్రబాబు నాయుడుకు వినపడటం లేదు’’ అని షర్మిల టీడీపీ అధినేత తీరును ఎండగట్టారు.

500 కి.మీ. పూర్తయిన యాత్ర: షర్మిల శాంతి నగర్ నుంచి కొంకాల గ్రామానికి చేరడంతో పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తయింది. 38వరోజు ఆమె వెంకటాపూర్ వరకు మొత్తం 15 కిలోమీటర్ల యాత్ర చేశారు. వెంకటాపూర్‌లో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 7 గంటలకు చేరుకున్నారు. శనివారానికి మొత్తంగా 507.90 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

షర్మిల యాత్రకు పలువురి సంఘీభావం

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: యాత్ర కొంకాల వద్ద 500 కి.మీ. పూర్తవడంతో షర్మిలకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వేలాది మంది మహిళలు తరలివచ్చి సంఘీభావం తెలిపారు. జిల్లాలోని పలువురు నేతలతో పాటు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు వైవీ సుబ్బారెడ్డి, కేకే మహేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, వంగూరు బాలమణెమ్మ, ఎడ్మ కిష్టారెడ్డి, చల్లా వెంకట్రామిరెడ్డి, డాక్టర్ హరికృష్ణ, జ్యోతుల నవీన్ తదితరులు షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు.

గిట్టుబాటు లేదక్కా...

‘‘మూడేళ్ల నుంచీ ఏం గిట్టుబాటు లేదక్కా.. అన్ని రేట్లూ పెరిగినాయి. కూలీ కూడా గిట్టటం లేదు. అప్పట్లో రూ.400 ఉన్న టన్ను బూడిద ఇప్పుడు రూ.700, అప్పుడు ట్రాక్టర్ కంకర రూ.8,000 ఉంటే.. ఇప్పుడది రూ.12,000, అప్పుడు రూ.600 ఉన్న ఇసుక రూ.1,200 అయింది. ఇంత ధర పెట్టి ఇటుకలు చేస్తే మార్కెట్‌లో కొనేటోళ్లే లేరక్కా.. రైతుల పరిస్థితి బాగా లేదు. మూడేళ్ల నుంచి పంటలు చేతికి అందటం లేదు. రైతు చేతికి పంట వస్తే ఇళ్లు కట్టుకుంటడు. అప్పుడు మాకు కూడా గిరాకీ ఉంటుంది. వాళ్లే అల్లాడిపోతుంటే ఇక మా దిక్కు ఎవరు చూస్తరు చెప్పక్కా..’’ అంటూ 26వ కాల్వ స్టేజ్ ప్రాంతానికి చెందిన ఇటుకల తయారీదారుడు వడ్డె వెంకటేష్.. షర్మిల వద్ద ఆవేదన వ్యక్తంచేశాడు. రైతులు బాగుపడాలంటే జగనన్నే సీఎం కావాలన్నాడు. త్వరలోనే జగనన్న బయటకు వస్తారని, రాజన్న రాజ్యం తెస్తారని అతడికి ధైర్యం చెప్పిన షర్మిల.. ఇక్కడ కొద్దిసేపు ఇటుకల తయారీ విధానాన్ని నేర్చుకున్నారు. ఈ పనిలో ఉన్న కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=492919&Categoryid=1&subcatid=33

మా పాప పంపిన ఏడు మెసేజ్‌లు...

ఇంకో రెండు రోజులు పోతే జగన్‌ను అరెస్టు చేసి ఆరు నెలలు అవుతుంది. ఇంకొక నెల గడిస్తే మా పండగ క్రిస్మస్ వస్తుంది. రెండు రోజుల క్రితం వేయవలసిన 5వ చార్జిషీట్‌లో 167 కింద బెయిల్ పిటిషన్ సీబీఐ కోర్టులో వేశాము. ఆరోజు నేను కోర్టులో వుండగా మా పాప నాకు ఫోన్‌లో ఏడు మెసేజ్‌లు పంపింది.

‘మనము గెలిచామా’
‘గెలిచామా అమ్మా’
‘డాడీకి బెయిల్ వచ్చిందా’
‘వచ్చిందా అమ్మా డాడీకి’
‘ప్లీజ్ చెప్పు అమ్మా’
‘చెప్పు అమ్మా’
‘ప్లీజ్...’


నేను బయటకు వచ్చి చూసుకున్నాను. నేను, నా బిడ్డలే కాదు... ప్రసాద్ అన్న భార్య ఆశ, వాళ్ల పిల్లలు, సునీల్ భార్య తేజ, వాళ్ల అబ్బాయి... ఇలా ఒక రాజగోపాల్ భార్య పిల్లలు కానివ్వండి, మోపిదేవి భార్య పిల్లలు కానివ్వండి... అసలు తప్పు జరిగిందో లేదో తెలియకుండా, రాజకీయ ప్రయోజనాలకోసం ఇన్ని కుటుంబాలను కన్నీటిపాలు చేయడం ఒక సభ్యసమాజంలో, ఒక ప్రజాస్వామ్య దేశంలో, ఇంతమంది కళ్లముందు జరుగుతూ వుంది. ఇంతమంది పెద్దమనుషులు ఈ రాక్షస క్రీడను ప్రోత్సహిస్తున్నారు. దీన్ని ఆమోదించని పెద్దలు, ప్రజలు ఏమీ చేయలేని స్థితిలో చూస్తూ వున్నారు.

ఈరోజు నేను సీబీఐని, రాజకీయ నాయకులను, పత్రికా యజమానులను, టీవీ ఛానెల్స్ అధిపతులను చేతులు జోడించి ఒక్కటే వేడుకుంటున్నాను - దయచేసి మా జీవితాలతో ఆడుకోవద్దండీ - మా భర్తలతో పోరాడాలనుకుంటే వాళ్లను బయట పెట్టుకుని పోరాడండి. అంతేకాని, వాళ్లను లోపలపెట్టి మాతో ఎందుకు మీ పోరాటం? పాపం, పుణ్యం తెలియని మా పిల్లలు ఏం చేశారని వాళ్లను ఈరోజు మానసిక వేదనకు గురిచేస్తున్నారు. దారినపోయేవారు ఏదో అభియోగం మోపారని, తను అనుకున్న దారిలో నడవాలని నా భర్త అనుకున్నాడని, ప్రజాభిమానం కూడగట్టుకున్నాడని, తన తండ్రి వారసత్వం పుణికిపుచ్చుకున్నాడని... ఇంతగా మమ్మల్ని మానసికంగా హింసించటం ఎంతమాత్రం సరైనదో మీరే ఆలోచించండి. పెద్దలు చెబుతూ వుంటారు - ఒకరిని బాధపెట్టి మనం సంతోషపడలేమని. మరి మమ్మల్ని బాధపెట్టి, మీరు అనుకున్న తీరాన్ని చేరగలరా? సంతోషాన్ని పొందగలరా?

రాజకీయ నాయకులైనా, పత్రికాధిపతులైనా, టీవీ ఛానెల్స్ అధిపతులైనా, సీబీఐ అధికారులైనా, న్యాయాధిపతులైనా మీరు వుండేది మంచి సమాజ నిర్మాణం కోసం కాదా! ఒకరి హక్కులకు భంగం కలిగించాలనో, ఒకరిని అన్యాయంగా ఇరికించాలనో, అబద్ధాలు మాట్లాడి, ఉన్నవి లేనివీ రాసి, మసిపూసి మారేడుకాయ చేయడం ద్వారా మీరు మంచి సమాజాన్ని నిర్మించగలరా? పనికి వచ్చే పనుల మీద, మంచితనం మీద, మానవత్వం మీద, సమానత్వం మీద ధ్యాస పెట్టండి. ప్రసాద్‌గారికి, జగన్‌కు, మోపిదేవికి ఒక రూలు, ల్యాంకో రాజగోపాల్ తమ్ముడు శ్రీధర్‌కు, ధర్మానకు, మిగతా మంత్రులకు, చంద్రబాబుకు ఒక రూల్ పెట్టడం ద్వారా సమసమాజం నిర్మిస్తున్నామని, న్యాయం చేస్తున్నామని అనగలరా? ఎందుకీ వివక్ష? ఎందుకీ అన్యాయం? 

దయచేసి మీరు ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి. దేనికోసం నిలబడ్డారో ఆలోచించుకోండి. ఈలోకం గుండా వెళ్తూ వెళ్తూ మన వెనుక ఏమి విడిచి వెళ్తున్నామో ఆలోచించండి. మంచిని, మానవత్వాన్ని, న్యాయాన్ని, సభ్యతను భావితరాలకు, మీ సొంత పిల్లలకు ఇచ్చి వెళ్లండి. అంతేకాని, మాలాంటివాళ్లకు కన్నీటిని, వేదనను, అన్యాయాన్ని, కష్టాన్ని విడిచి వెళ్లకండి. చేతనైతే ఒకరికి సహాయం చెయ్యండి. అంతేకాని ఇతరులకు చేటు చేయకండి. ఇకముందైనా మీ మూలంగా మాలాంటి వాళ్ల హక్కులు హరించబడకుండా, జీవితాలు ఒడిదుడుకులకు లోనుకాకుండా, మా పిల్లలు వేదనకు గురికాకుండా ఉండాలని కోరుకుంటున్నాను.

- వైఎస్ భారతి
w/oవైఎస్ 
జగన్








http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=53140&Categoryid=11&subcatid=25



నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా...

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం వెంకటాపురం స్టేజీ నుంచి ప్రారంభమవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. వెంకటాపురం స్టేజీ నుంచి యాత్ర ప్రారంభమై పర్దీపురం, ఉప్పల్ క్రాస్ రోడ్ మీదుగా ఐజ వరకు కొనసాగుతుందన్నారు. ఐజలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో షర్మిల మాట్లాడతారని, అనంతరం అక్కడి నుంచి బయలు దేరి 5.1 కిలోమీటర్ల తర్వాత రాత్రి బస చేస్తారన్నారు. ఆదివారం మొత్తం 15 కి.మీ యాత్ర సాగుతుందని వారు వివరించారు.

ప్రజలను భయపెట్టి బతకాలని టీఆర్‌ఎస్ చూస్తోంది

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీఆర్‌ఎస్ నాయకులు వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్ పార్టీ నాయకుడు గట్టు రామచంద్రరావు శనివారం పేర్కొన్నారు. ఈ పద్దతి మానుకోవాలని టీఆర్‌ఎస్ నాయకులకు ఆయనహితవు పలికారు. ప్రజలను భయపెట్టి బతకాలని టీఆర్‌ఎస్ పార్టీ చూస్తోందని ఆయన అన్నారు. ఒక పార్టీని మరొక పార్టీ అడ్డుకునే సంస్కృతిని టీఆర్‌ఎస్ ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఇది మంది సంస్కృతి కాదని గట్టు రామచంద్రరావు అభిప్రాయపడ్డారు.

కెసిఆర్ కు కొండా సురేఖ బహిరంగ లేఖ

టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ బహిరంగ లేఖ రాశారు. సూర్యాపేట సభలోనైనా తెలంగాణ ఎప్పుడు వస్తుందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. నేతులు ఎవరైనా టిఆర్ఎస్ లో చేరితే తెలంగాణవాదులు, మరో పార్టీలో చేరితే ద్రోహులా? అని ఆమె ప్రశ్నించారు. ఉద్యమం పేరుతో 
ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఆమె కోరారు. కేసీఆర్‌కు సీట్లు, ఓట్ల రాజకీయం తప్ప మరేం తెలీదని విమర్శించారు.

'చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టరు'

అసమర్థ ప్రభుత్వంపై చంద్రబాబు అవిశ్వాసం ఎందుకు పెట్టడంలేదని షర్మిల సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబే కిరణ్‌ ప్రభుత్వాన్ని కాపాడుతున్నారని ఆమె మండిపడ్డారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా పాలమూరు జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని శాంతి నగర్‌లో శనివారం షర్మిల నీచ రాజకీయాలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌, టీడీపీలు సీబీఐను వాడుకుని జగనన్నను జైల్లో పెట్టించారన్నారు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్‌, టీడీపీలకు బుద్ది చెప్పాలని షర్మిల ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

YS Vijayamma's speech at Shanthi Nagar, Alampur

Konathala Press Meet on 24th Nov 2012

Friday 23 November 2012

ఇప్పటి పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలీదు....

ఏ ప్రాజెక్టు నుంచి, ఏ కాలంలో ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుందో 
వైఎస్ వేళ్ల మీద లెక్కేసి చెప్పేవారు
ఇప్పటి పాలకులకు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలీదు
ప్రస్తుత సీఎంకు పదవిని కాపాడుకోవడానికే సమయం సరిపోతోంది
ప్రజల్ని పట్టించుకోని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం ఎప్పుడు పెడతావు చంద్రబాబూ?
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శుక్రవారం యాత్ర ముగిసేనాటికి.. రోజులు: 37, కిలోమీటర్లు: 492.90

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. పక్క రాష్ట్రాల్లో కూడా విద్యుత్ సంక్షోభం ఉన్నప్పటికీ వాళ్లు ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి, విద్యుత్తు కొనుగోలు చేసి సమస్యను అధిగమించారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ముఖ్యమంత్రి తన సీటును పదిలపరుచుకునే పనిలో పడి ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఉండి కూడా ప్రజలకు ఉపయోగపడటం లేదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. 

పజల బాధలు పట్టని ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వాన్ని అవిశ్వాసంతో దించేయకుండా దానితోనే కుమ్మక్కయిన టీడీపీ వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆమె చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర 37వ రోజు శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా కలుగొట్ల గ్రామానికి చెందిన శనగ రైతులు లక్ష్మీకాంతరెడ్డి, జమ్మన్న, ఆంజనేయులు, జాన్ పాషా షర్మిలను కలిశారు. ‘‘వేళాపాళా లేని కరెంటు కోతలతో పంటలు పూర్తిగా ఎండిపోయాయి. నాలుగు గంటల కరెంటును నాలుగుసార్లు ఇడుస్తున్నారు. బోర్ల లోంచి నీళ్లు కాల్వకు మల్లేసరికి కరెంటు పోతాంది. తోటకు నీళ్లు పారలేదు. పంటంతా ఎండిపోయింది’’ అంటూ వారు ఆవేదన వ్యక్తంచేయడంతో షర్మిల పై విధంగా స్పందించారు.

వైఎస్ వేళ్ల మీద లెక్కేసి చెప్పేవారు

దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడు ఏ ప్రాంతానికి ఎంత విద్యుత్తు అవసరమో, ఏ జల విద్యుత్తు ప్రాజెక్టు నుంచి, ఏ కాలంలో ఎంత విద్యుత్తు ఉత్పత్తి అవుతుందో, ఇంకా ఎంత అవసరమవుతుందో వేళ్ల మీద లెక్క వేసి చెప్పేవారని షర్మిల గుర్తుచేశారు. ఇప్పటి పాలకులకు అసలు ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉందో కూడా తెలియదని ఘాటుగా విమర్శించారు. ‘‘వైఎస్సార్ బతికున్నప్పుడు తుంగభద్ర నది నుంచి ఆర్‌డీఎస్(రాజోలి డైవర్షన్ స్కీం)కు నీళ్లు వచ్చేవి. జల సమస్య ఉంటే నాన్నగారు కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి వారిపై ఒత్తిడి తెచ్చి అవసరమైతే పోలీసు బలగాలను పెట్టి రాజోలి బండకు నీళ్లు తెచ్చేవారు. వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ ప్రాజెక్టును పట్టించుకునే వాళ్లే కరువవడంతో ఈ ప్రాంత పంటలకు నీళ్లు రాకుండా పోయాయి’’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలు పట్టని ఈ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా ఇంకా ఎంతకాలం సాగదీస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆమె ప్రశ్నించారు.

జగనన్న వస్తాడు.. రాజన్న రాజ్యం తెస్తాడు

‘‘కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై జగనన్నను జైల్లో పెట్టించాయి. ఒక రోజు వస్తుంది. ఉద యించే సూర్యుడిని ఎలాగైతే ఆపలేమో.. జగనన్నను కూడా అలాగే ఎవరూ ఆపలేరు. ఆ రోజున అన్న బయటకు వస్తాడు. మనందరినీ రాజన్న రాజ్యంవైపు తీసుకెళతాడు. రాజన్న రాజ్యం స్థాపిస్తాడు. ఆ రాజ్యంలో రైతన్నను రాజులా చూస్తాం. రాజన్న కల అయిన కోటి ఎకరాలకు నీటిని జగనన్న ఇస్తాడు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది. రైతన్న గిట్టుబాటు ధరకే తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వీలుగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాడు. రైతులకు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తాడు’’ అని షర్మిల ఉద్ఘాటించారు.

ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తోంది..

‘‘ఉపాధి హామీతో రాష్ట్ర ప్రభుత్వం శ్రమ దోపిడీ చేస్తోంది. ఉపాధి హామీ కింద వైఎస్సార్ ఉన్నప్పుడు రోజుకు రూ.90 నుంచి 120 పడేవి. ఇప్పుడు రోజుకు కనీసం రూ.30 కూడా పడటం లేదని, కొన్ని ప్రాంతాల్లో అయితే రూ.18 కూడా పడటం లేదని అక్కా చెల్లెళ్లు చెబుతున్నారు. అవి కూడా రెండు వారాలకు ఒకసారి, మూడు వారాలకొకసారి ఇస్తున్నారట.. దీంతో ఆ అక్కాచెల్లెళ్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది’’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల కష్టాలన్నీ తీరుస్తాడు. పిల్లలను పనికి కాకుండా బడికి పంపే తల్లుల ఖతాలో డబ్బులు వేస్తాడు. ‘అమ్మ ఒడి’ పథకం ద్వారా తల్లి బ్యాంకు ఖాతాలో పదో తరగతి వరకు రూ. 500, ఇంటరైతే రూ. 700, డిగ్రీ అయితే రూ.1000 చొప్పున వేస్తాడు. వృద్ధులకు, వితంతువులకు రూ. 700, వికలాంగులకు రూ. 1000 పెన్షన్ ఇస్తాడు. రాజన్న చెప్పినవీ చేశాడు.. చెప్పనివీ చేశాడు. జగనన్న కూడా మాట మీద నిలబడే మనిషి. చెప్పినవే కాకుండా ప్రజల అవసరాలను గమనించి అన్నీ సమకూరుస్తాడు. మైనారిటీలకు వీలైనంత ప్రయోజనం కల్పించాలన్నదే వైఎస్ లక్ష్యం. అదే లక్ష్యంతో జగనన్న పనిచేస్తాడు..’ అని ఆమె హామీ ఇచ్చారు.

యాత్రకు నేతల సంఘీభావం

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: షర్మిల యాత్రలో శుక్రవారం వేలాది మంది ఆమె వెంట నడిచి సంఘీభావం తెలిపారు. జిల్లాకు చెందిన పలువురు నాయకులు, నేతలే కాకుండా వైఎస్సార్ సీపీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, మాజీ మంత్రి కొండా సురేఖ, వైఎస్సార్ సీపీ నేతలు వై.వి.సుబ్బారెడ్డి, కె.కె.మహేందర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, సంకినేని వెంకటేశ్వరరావు, బాల మణెమ్మ, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురాం, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, డి.భాస్కర్‌రెడ్డి, చల్లా మధుసూధన్‌రెడ్డి, చల్లా రామక్రిష్ణారెడ్డి, కోటింరెడ్డి వినయ్‌రెడ్డి, కుమార్ యాదవ్, రాయదుర్గం ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి తదితరులు షర్మిల వెంట నడిచారు.

పాలు పితికి.. మిషన్ కుట్టి..

మరో ప్రజాప్రస్థానంలో భాగంగా 37వ రోజు శుక్రవారం కలుగొట్ల నుంచి ప్రారంభమైన యాత్ర పోతులపాడు గేటు మీదుగా బొంకూరుకు చేరింది. కలుగొట్ల గ్రామంలో వేరుశనగ రైతులను, పత్తి రైతులను కలిసి షర్మిల వారి సమస్యలు తెలుసుకున్నారు. బొంకూరులో నల్లాల వద్ద బిందెలు పెట్టుకుని నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్న మహిళలను పలకరించారు. వారం రోజులకు ఒక సారి నీళ్లు వదులుతారని, తాగడానికి నీళ్లు లేవని మహిళలు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి చంద్రశేఖర్ నగర్, శ్రీనివాస నగర్ మీదుగా కలుకుంట్ల చేరుకున్నారు. అక్కడ స్థానిక మహిళలతో కలిసి కుట్టు మిషన్ కుట్టారు. పాలు పితికారు. అక్కడి నుంచి రాత్రి 7.40కు బూడిదపాడు క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన బసకు షర్మిల చేరుకున్నారు. శుక్రవారం 14.50 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. ఇప్పటివరకు మొత్తంగా 492.40 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

గడువు దాటి ఒక్క రోజు జైల్లో ఉంచినా అది చట్టవిరుద్ధమే

సీబీఐ కోర్టులో జగన్ వాదన
బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తి... తీర్పు 28వ తేదీకి వాయిదా 
అరెస్టు చేసి 90 రోజులు దాటినా చార్జిషీట్ దాఖలు చేయలేదు
కాబట్టి, నిబంధనల ప్రకారం బెయిలివ్వాలి 
గడువు దాటి ఒక్క రోజు జైల్లో ఉంచినా అది చట్టవిరుద్ధమే 
చట్టబద్ధంగా ఉన్న హక్కు కాలరాయడమే 
సెక్షన్ 167(2) కింద స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ ఈ కోర్టులోనే వేయాలి
సీబీఐ కోర్టులో జగన్ తరఫున న్యాయవాది పద్మనాభరెడ్డి వాదనలు 
రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ 28కి వాయిదా

‘సుప్రీం’లో వేసిన పిటిషన్‌కు ఈ సెక్షన్ వర్తించదు...

‘‘సెక్షన్ 167 (2) కింద జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం లేనే లేదు. ఆయన ఏ కేసులో అయితే బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారో ఆ కేసు విచారణ అప్పటికే పూర్తయింది. మొదటి చార్జ్‌షీటు ఆధారంగా జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. అందువల్ల ఆ బెయిల్ పిటిషన్ ఈ సెక్షన్‌కు వర్తించదు. 

సెక్షన్ 167 (2) కింద బెయిల్ పిటిషన్‌ను మేజిస్ట్రేట్ కోర్టులో మాత్రమే దాఖలు చేసుకునే అవకాశం ఉంది. ఈ సెక్షన్ కింద బెయిల్ కోసం పై కోర్టులను ఆశ్రయించటానికి వీలు లేదు. అందువల్ల ఈ సెక్షన్ కింద జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లిందీ లేదూ.. సుప్రీంకోర్టు తిరస్కరించిందీ లేదు.’’ 
- సెక్షన్ 167 (2)పై పద్మనాభరెడ్డి వాదన

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 28న తీర్పు వెలువడనుంది. తనను అరెస్ట్ చేసి 90 రోజులు దాటిపోయిందని, ఈ లోగా చార్జిషీటు వేయటంలో సీబీఐ విఫలమైంది కాబట్టి తనకు చట్టబద్ధంగా బెయిలు మంజూరు చేయాలని వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో వాదప్రతివాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు తీర్పును ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పద్మనాభరెడ్డి వాదనలు వినిపించగా, సీబీఐ తరఫున బళ్లా రవీంద్రనాథ్ వాదించారు. 

ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిన బెయిలు 

పిటిషనర్ జగన్‌మోహన్‌రెడ్డిని ఈ ఏడాది మే 27న అరెస్టు చేశారని, ఇప్పటికి దాదాపు ఆరు నెలలు కావస్తోందని, సీఆర్‌పీసీలోని సెక్షన్ 167(2) ప్రకారం 90 రోజుల్లో గనక దర్యాప్తును పూర్తి చేసి చార్జిషీటు వేయకపోతే.. నిందితుడికి తప్పనిసరిగా బెయిలు ఇవ్వాల్సి ఉందని పద్మనాభరెడ్డి వాదించారు. ‘‘గడువు ముగిశాక తనకు ఈ సెక్షన్ ప్రకారం బెయిలివ్వాలని అడిగే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. దీన్ని భూమ్మీద ఏ శక్తీ నిలువరించలేదు’’ అని పద్మనాభరెడ్డి ఉద్ఘాటించారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన ఈ కేసులో జరిగిన వ్యవహారాల క్రమాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ‘‘ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ చెప్తున్న ఏడు అంశాలూ కొత్తవేమీ కావు. దర్యాప్తు చేస్తున్నపుడు బయటపడిన అనుబంధ అంశాలూ కావు. 

అవన్నీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నవే. సాండూర్ పవర్, భారతి సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, సూట్‌కేస్ కంపెనీలు, ఇందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌లపై దర్యాప్తు చేస్తున్నామని మే 28న కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కూడా సీబీఐ స్పష్టంగా పేర్కొంది. దానర్థం దర్యాప్తు అధికారులకు మొదటి నుంచీ ఆ అంశాలు తెలుసు. వాటిపై గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయకపోతే దర్యాప్తు సంస్థ విఫలమైనట్లే. అరెస్టు చేసిన 90 రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేయకపోతే నిందితుడికి చట్టబద్ధంగా బెయిలు అడిగే హక్కు ఉంటుంది. ఆ హక్కును ఉపయోగించుకోగలిగేది ఈ కోర్టులోనే. అందుకే పిటిషన్ వేశాం. పిటిషనర్ ఇప్పటిదాకా ఆ హక్కును ఉపయోగించుకోలేదు. పిటిషనర్ ఈ హక్కును ఉపయోగించుకుని బెయిల్ అడిగాక నిరాకరించటానికి వీల్లేదు. అలా నిరాకరించి జైల్లో ఉంచితే చట్ట విరుద్ధంగా ఉంచినట్లే లెక్క’’ అని పద్మనాభరెడ్డి కోర్టుకు విన్నవించారు. తొలి చార్జిషీటుకు సంబంధించి (సీసీ-8) జగన్‌ను అరెస్టు చేశారని, తరవాత రెండవ, మూడవ, నాలుగవ చార్జిషీట్లకు సంబంధించి ఆయన వద్ద తగు ష్యూరిటీలు తీసుకుని బెయిలు మంజూరు చేశారని పద్మనాభరెడ్డి గుర్తు చేశారు. 

సుప్రీంలో ప్రస్తావనకే రాలేదు 

వాదనల సందర్భంగాను, తను వేసిన కౌంటర్‌లోను సుప్రీంకోర్టు తీర్పును సీబీఐ ప్రముఖంగా ప్రస్తావించింది. దర్యాప్తు ముగిసేదాకా బెయిలుకు అర్హులు కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటూ బళ్లా రవీంద్రనాథ్ వాదించారు. దీన్ని ముందే ప్రస్తావించిన పద్మనాభరెడ్డి.. సుప్రీంకోర్టులో ఈ స్టాట్యుటరీ బెయిలు ప్రస్తావనకే రాలేదని గుర్తు చేశారు. ‘‘సుప్రీంకోర్టులో బెయిలు దాఖలు చేసేనాటికి 90 రోజుల గడువు పూర్తి కాలేదు. అందుకని దీన్ని ప్రస్తావించే అవకాశం లేకపోయింది. పెపైచ్చు ఈ బెయిలు దాఖలు చేయాల్సింది కింది కోర్టులోనే’’ అని స్పష్టంచేశారు. 

అరెస్టు అన్ని అంశాలకూ వర్తిస్తుంది

జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసిన అనంతరం సీబీఐ కోర్టులో హాజరు పరచగా.. చార్జిషీట్లు దాఖలు చేసిన అనంతరం కస్టడీకి ఇవ్వటం సరికాదంటూ కోర్టు కొట్టివేసిన సందర్భాన్ని పద్మనాభరెడ్డి గుర్తుచేశారు. ‘‘దీనిపై సీబీఐ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు చివరకు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ కొన్ని అంశాల్ని స్పష్టంగా పేర్కొంది. సీబీఐ ఎన్ని చార్జిషీట్లు దాఖలు చేసినా.. ఎఫ్‌ఐఆర్‌లోని ఒక నేరానికి సంబంధించి అరెస్టు చేస్తే దాన్లో పేర్కొన్న అన్ని నేరాలకు గాను అరెస్టు చేసినట్లే భావించాలని జస్టిస్ చంద్రకుమార్ తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీనిప్రకారం ఎఫ్‌ఐఆర్‌లోని అన్ని అంశాలకూ సంబంధించి జగన్‌ను అరెస్టు చేసినట్లే. కాబట్టి ఆయన్ను అరెస్టు చేసిన 90 రోజుల్లోగా సదరు అంశాలన్నిటిపై చార్జిషీటు వేయాల్సిన బాధ్యత సీబీఐకి ఉంది. అలా వేయకపోతే నిందితుడికి చట్టప్రకారం బెయిలిచ్చి తీరాలి’’ అని పద్మనాభరెడ్డి వాదించారు. జస్టిస్ చంద్రకుమార్ ఉత్తర్వుల్ని సీబీఐ ఎక్కడా సవాలు చేయలేదు కాబట్టి, వాటికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ‘‘ఆ ఉత్తర్వుల్ని సీబీఐ ఎక్కడా సవాల్ చేయలేదు. మరి అంగీకరించినట్లే కదా? గడువులోగా దర్యాప్తు పూర్తి చేయనప్పుడు అది దాని వైఫల్యమే కదా?’’ అని పేర్కొన్నారు. బెయిలును అడ్డుకోవటానికే సీబీఐ వరసగా అన్ని చార్జిషీట్లు వేసిందని జగన్ తరఫున వాదించిన మరో న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇవి వేధింపులు తప్ప మరొకటి కావన్నారు. తాము కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నామని సీబీఐ చేస్తున్న వాదనను కొట్టిపారేశారు. 

ఒకే వ్యక్తిపై వేర్వేరు చోట్ల కేసులుంటే

‘‘ఒక వ్యక్తిపై సీబీఐ హైదరాబాద్‌లో, ముంబైలో రెండు వేర్వేరు కేసులు నమోదు చేసిందనుకోండి. హైదరాబాద్ కేసులో 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసేసింది. ముంబై కేసులో మాత్రం నిర్దిష్ట గడువులో అంటే అరెస్టు చేసిన 90 రోజుల్లోగా చార్జిషీట్ దాఖలు చేయలేదు. చార్జిషీటు దాఖలు చేసేసిన హైదరాబాద్ కేసులో పై కోర్టులు వివిధ కారణాలతో బెయిలివ్వలేదు. ముంబై కేసులో చార్జిషీటు దాఖలు చేయలేదు కనక 167(2) కింద చట్టబద్ధ బెయిలు అడిగే హక్కు ఉంటుంది. అయితే హైదరాబాద్ కేసులో మీకు బెయిలు రాలేదు కనక ముంబై కేసులో 167(2) వర్తించదని ఎవరైనా చెప్పగలరా? చట్టబద్ధంగా ఉన్న హక్కును కాదనగలరా?’’ అని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలను కిందికోర్టులు పాటించాల్సిందేనన్న సీబీఐ వాదనను ఆయన తోసిపుచ్చారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పు ఏ సందర్భానికి, ఏ అంశానికి పరిమితమైనదో చూడాలి. ఆ అంశానికి, సందర్భానికి మాత్రమే పరిమితం చేయాలి’’ అని పేర్కొన్నారు. 

సుప్రీం తీర్పుకు విరుద్ధం: సీబీఐ 

ఏడు అంశాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని, ఈ అంశాల్లో దర్యాప్తును పూర్తిచేసి చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాతే జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని సీబీఐ తరఫున డిప్యూటీ లీగల్ అడ్వయిజర్ బళ్లా రవీంద్రనాథ్ వాదించారు. సుప్రీంకోర్టు స్పష్టం చేసిన తర్వాత కూడా ఈ పిటిషన్ దాఖలు చేయడం ఈ కోర్టును తప్పుదోవపట్టించడమే అవుతుందని, కోర్టుధిక్కరణ కూడా అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు వినిపిస్తున్న వాదనలు సుప్రీంకోర్టులోనూ వినిపించారని చెప్పారు. ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు తీర్పును కింది కోర్టులు విధిగా పాటించాలన్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. ఇరువైపులా వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. 

రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై 28న విచారణ 

ఇదిలావుంటే.. కోర్టు ఇప్పటికే విచారణకు స్వీకరించిన సీసీ-8లో దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో సీఆర్‌పీసీ సెక్షన్ 437 కింద దాఖలు చేసిన (రెగ్యులర్) బెయిల్ పిటిషన్‌పై తర్వాత వాదనలు వినిపిస్తామని సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 28కి వాయిదా వేసింది. 

ఇదేమీ తీవ్రమైన శిక్షలు పడే కేసు కూడా కాదు..

‘‘మరణశిక్ష లేదా 10 ఏళ్ల కంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించే కేసుల్లో మినహా ఇతర కేసుల్లో 90 రోజుల తర్వాత నిందితుడిని జైల్లో ఉంచరాదు. ఒక్క రోజు జైల్లో ఉంచినా అది చట్టవిరుద్ధమే. చట్టబద్ధంగా నిందితుడికున్న హక్కులను కాలరాయడమే. దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నా పూచీకత్తు తీసుకుని ఈ కోర్టు బెయిల్ ఇవ్వడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.’’ 

సీబీఐ సత్వరం విచారణ పూర్తి చేస్తామని చెప్పింది

‘‘జగన్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపిన సీసీ-8లో మేం బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాం. ఆ సందర్భంగా సత్వరం దర్యాప్తు పూర్తిచేస్తామని సీబీఐ న్యాయవాది పరాశరన్ స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కోర్టులో ఉన్న సీబీఐ ఎస్‌పీ అక్కడ సుప్రీంకోర్టుకూ హాజరయ్యారు. ఆయనను అడిగి ఈ విషయాన్ని నిర్ధారించుకోవచ్చు. మేం కోర్టును తప్పుదోవపట్టిస్తున్నామన్న సీబీఐ వాదనలో అర్థం లేదు.’’ 
- జగన్ బెయిల్ పిటిషన్‌పై పద్మనాభరెడ్డి వాదనలు

source:sakshi

ఈ ప్రభుత్వం పెట్టదు. మేం తినం. మళ్లీ ఆ దేవుడే రావాలె

వైఎస్ మరణం తర్వాత వరదల్లో సకలం కోల్పోయిన టుంబాలు

పాదయాత్ర మార్గమధ్యంలో వారిని కలిసిన షర్మిల
మూడేళ్లవుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని బాధితుల ఆవేదన
వారి దుస్థితి చూసి చలించిపోయిన షర్మిల

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: దివంగత మహానేత వైఎస్సార్ మరణం తరువాత జలరాశులు రాకాసులై ఊళ్లమీద పడ్డాయి. ప్రళయ కృష్ణమ్మ ఉప్పొంగి ఊళ్లను, నీళ్లను ఏకం చేసింది. కట్టుకున్న బట్టలు తప్ప సకలం గంగపాలయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జనం రోడ్డున పడ్డారు. అప్పటి జల ప్రళయానికి ఎదరురొడ్డి ప్రాణాలు నిలబెట్టున్న వరద బాధితులు ఇప్పుడు మానవత్వం లేని పాలకుల ఏలుబడిలో రోజూ చస్తూ బతుకుతున్నారు. ఉన్న గూడు పోయి మూడేళ్లుగా నరకం చూస్తున్నారు. ఇదీ.. 2009లో మహబూబ్‌నగర్ జిల్లాలో వచ్చిన కృష్ణా, తుంగభద్ర నదుల వరద బాధితులు దుస్థితి. ఆదుకోవాల్సిన పాలకులు తమకేమి పట్టనట్లు గాలికి వదిలేయడంతో.. వారు నీడ దొరికిన చోట గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇప్పటి వరకు బయటి ప్రంపంచానికి తెలియకుండా చీకటిలోనే మగ్గిపోతున్న వారి బతుకులు షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’తో వెలుగులోకి వచ్చాయి.

కంపచెట్ల మధ్యే జీవితం..

మహబూబ్‌నగర్ జిల్లాలోని నాటి వరద బాధితుల్లో కొందరు అలంపూర్ నియోజకవర్గంలోని కలుకుంట్ల, శాంతినగర్ గ్రామాల మధ్య వ్యవసాయ భూముల్లో గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా శుక్రవారం షర్మిల అటుగా వస్తున్నారని తెలిసి.. బాగా చీకటి పడిన తరువాత కూడా ఆ గుడారాల్లోని ఓ వృద్ధ దంపతుల జంట దీపపు బుడ్డీ పట్టుకొని ఎదురు చూస్తూ కూర్చున్నారు. వారి పేర్లు జమ్మన్న, నర్సమ్మ. షర్మిల తన కోసం ఎదురుచూస్తున్న వారిని చూసి.. ‘‘బాగున్నావా తాతా?’’ అంటూ పలకరించారు. ‘‘ఏం బాగమ్మ..! నాయిన పోయినంకా దిక్కూదివాణం లేదు. పట్టించుకున్నోడే లేడు’’ అని సమాధానం వచ్చింది. ‘‘కండ్లు కనపడవు బిడ్డా.. నువ్వొస్తున్నవని అంటే పడిగాపులు గాసుకుంటా కూసున్నా.. జర ఇసుంటా రా బిడ్డా.. నా ఇల్లు జూసి పోదువు’’ అని ఆ తాత షర్మిలను ఆహ్వానించాడు. 

కంపచెట్ల మధ్య మూడు గుడారాలు వేసి ఉన్నాయి. వాటిని చూసిన షర్మిల అవాక్కయ్యారు. ‘‘ఇక్కడెందుకు ఉంటున్నారన్నా?’’ అని గుడారంలోకి తొంగి చూస్తూ.. అందులో నివాసం ఉంటున్న వారిని అడిగారు షర్మిల. ‘‘మాది మద్దూరు అమ్మా! ఏరు పొంగి ఇళ్లు కొట్టుకపోయినయి.. ఆలుమగలం కట్టపడి సంపాయించుకున్నదంతా ఏట్లనే కొట్టుకుపోయింది. ఇప్పటికీ మూడేళ్లు గడిచిపోయింది. వరద వచ్చినపుడే మీ లాంటోళ్లు ఇచ్చిన గుడారాలు ఇక్కడ తెచ్చి వేసుకున్నాం. సర్కారు నుంచి ఈసం కూడా సాయం రాలేదు. ఈ మూడేళ్ల నుంచి పంటలు చేతికి రాలేదు. అప్పటి నుంచి ఈ గుడారాల కిందనే ఉంటున్నామమ్మా!’’అని సుంకన్న, శంకరమ్మ దంపతులు తమ గోడు చెప్పుకొచ్చారు.

పాములొచ్చి.. పిల్లల కాళ్లకు సుట్టుకుంటున్నాయి..

పక్కనే మరో గుడారంలో ఉన్న సోమన్న దంపతులు కూడా షర్మిల వద్దకు వచ్చారు. ‘‘అమ్మా..! మంచిగ బతికినోళ్లం. ఇప్పుడు బతికి చెడుతున్నాం.. పొద్దుగూకితే పాములు గుడారాలకు వస్తాయి. పిల్లల కాళ్లుకు కూడా సుట్టుకున్నాయి’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. వాళ్ల మాటలు షర్మిలను తీవ్రంగా కలచివేశాయి. ‘‘సకలం కోల్పోయిన వారిని ఆదుకునే తీరు ఇదా? ఈ పాలకులకు మానవత్వం లేదా?’’ అని షర్మిల మండి పడ్డారు. మీ సమస్యను అమ్మకూ, పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పి అసెంబ్లీలో చర్చించేయత్నం చేస్తాననగా.. ఆ వృద్ధ దంపతులు జమ్మన్న, నర్సమ్మ కల్పించుకొని ‘‘వద్దమ్మా.. పెట్టే దేవుడే ఎళ్లిపోయినాడు. ఈ ప్రభుత్వం పెట్టదు. మేం తినం. మళ్లీ ఆ దేవుడే రావాలె.. జగనన్నకు ఓటేస్తాం.. అప్పుడే మా బాధలు తీరుతాయి’’ అని వారనడంతో షర్మిల కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ తరువాత షర్మిల చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడుతూ.. ‘‘నాన్న చెప్పాడు చిన్నాన్నా.. మన ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువని! పస్తులైనా ఉంటారుగాని ఇది మాకు కావాలని అడగరని చెప్పారు. నిజం చిన్నాన్నా.. ఇప్పుడు కళ్లారా చూస్తున్నాను. మా కుంటుంబం మీద ఇంత విశ్వాసం పెట్టుకున్న వీళ్లకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

source:sakshi

సీబీఐది అవగాహనాలోపం!

* మంత్రివర్గ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం లేదు
* చట్టబద్ద సంస్థలపై రాజ్యాంగ సంస్థలదే అధిపత్యం
* మంత్రివర్గ నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడం కుదరదు
* మంత్రివర్గ నిర్ణయాలు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రావని ఇదివరకే హైకోర్టు విస్పష్ట ప్రకటన
* విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం మంత్రివర్గానిదే
* చట్టసభలు, ప్రభుత్వాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది

మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలపై సీబీఐ కనీస అవగాహన లేకుండా వ్యవహరిస్తోందని, చరిత్రలో మొదటి సారి బిజినెస్ రూల్స్‌కు వక్రభాష్యం చెపుతోందని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. మంత్రి మండలి నిర్ణయాలు తీసుకునే హక్కును కాపాడటమంటే చట్టసభలను, ప్రభుత్వాన్ని రక్షించుకోవడమేన ని సీబీఐ కేసు ఎదుర్కొంటున్న రెవెన్యూ మంత్రి అభిప్రాయపడ్డారు. సీబీఐ వంటి దర్యాప్తు సంస్థల నివేదిక ఆధారంగా న్యాయవ్యస్థ తీసుకునే చర్యలకు వ్యతిరేకంగా మంత్రి మండలిని, కార్యానిర్వహక వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

వాన్‌పిక్ కేసులో ధర్మానను నిందితునిగా పేర్కొంటూ సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ గత ఆగస్టు 14న మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి విదితమే. వాన్‌పిక్ ప్రాజెక్టు భూసేకరణకు సంబంధించి తాను ఎలాంటి తప్పు చేయలేదని, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేశామే తప్ప... మంత్రిగా ఒక్క అంగుళం భూమి కూడా కేటాయించే అధికారం తనకు లేదంటూ ఎనిమిది పేజీల నివేదికను సీనియర్ మంత్రులకు ధర్మాన శుక్రవారం అందజేశారు. మంత్రులకు ఇచ్చిన నివేదికలో ఆయన సీబీఐ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టారు. చట్టబద్ధసంస్థల కంటే రాజ్యాంగసంస్థలే ఉన్నతమైనవని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం చట్టబద్ధ సంస్థలకు లేదని కుండబద్దలు కొట్టారు. గతంలో హైకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసిందని ఆయన నివేదికలో వివరించారు.


* భారత రాజ్యాంగ ప్రకారం మంత్రిమండలి అధికారాన్ని వినియోగిస్తుంది. సీబీఐ వంటి దర్యాప్తు సంస్థ చట్టబద్ద సంస్థ మాత్రమే. సీబీఐ ఢిల్లీ ప్రత్యేక పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద ఏర్పాటైంది. చట్టబద్ద సంస్థపై రాజ్యాంగ సంస్థకే అధికారం ఉంటుంది. అందువల్ల మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించడానికి వీల్లేదు.

* రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 ప్రకారం విధాన నిర్ణయాలు చేయడంలో మంత్రిమండలిదే అత్యున్నతస్థానం. ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్‌కు మంత్రిమండలి సలహాలు ఇస్తుంది. అదే ఆర్టికల్‌లోని సెక్షన్ రెండు ప్రకారం మంత్రి మండలి తీసుకునే నిర్ణయాలను గవర్నర్ అడగానికి వీల్లేదు. మంత్రివర్గ నిర్ణయాలకు వ్యతిరేకంగా గవర్నర్ తన విచక్షణతో వ్యవహరించలేరు. గవర్నర్‌కు మంత్రివర్గం ఇచ్చే సలహాలను ఏ కోర్టులోనూ విచారించడానికి వీల్లేదు.

* ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూషన్ చేయడానికి మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా కాని అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ల కిందకాని, భారత శిక్షాస్మృతి కిందగాని ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు.

* భూ కేటాయింపులు చేసే అధికారం మంత్రిగా ధర్మాన ప్రసాదరావు కానీ, ముఖ్యకార్యదర్శిగా శామ్యూల్‌కు కానీ లేవనే అంశాన్ని సీబీఐ విస్మరించింది. బిజినెస్ రూల్స్‌లోని నిబంధన 9 ఆర్/డబ్ల్యూ, నిబంధన 15 ప్రకారం భూ కేటాయింపు చేసే అధికారం కేవలం మంత్రిమండలికి మాత్రమే ఉంది. బిజినెస్ రూల్స్ రెండో షెడ్యూల్ ప్రకారం అన్ని భూ కేటాయింపు ప్రతిపాదనలు, మార్కెట్ ధర నిర్ణయాధికారం మంత్రిమండలిదే. మంత్రిమండలి ఆమోదం తరువాతే జీవోలు 1110, 1115, 233 జారీ చేశారు.

* వాన్‌పిక్ ప్రాజెక్ట్‌కు భూ కేటాయింపు మంత్రి మండలి చేసిందే తప్ప... ధర్మాన కానీ, శామ్యూల్ కానీ కాదు.
* వాప్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు భూమి కేటాయింపు చేయాలని ధర్మాన ప్రసాదరావు కానీ, శామ్యూల్ కానీ చేయలేదు. ఈ నిర్ణయం మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ (ఐ అండ్ ఐ) నిర్ణయం. ఇదే విషయాన్ని హైకోర్టు కూడా ధృవీకరించింది. ఐ అండ్ ఐ శాఖ మెమో నంబర్ 881(ఎ)/పోర్ట్స్.1(1)/ 2008 తేదీన ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు నోట్ పంపించారు. ఈ నోట్ వాన్‌పిక్ పోర్ట్స్‌కు కాకుం డా వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌కు భూమి కేటాయించాలని సూచించింది.
* ఏ భూ కేటాయింపు అయినా ప్రభుత్వ ప్రయోజనానికి లోబడి జరగాలి. కేటాయించిన భూమిని సద్వినియోగం చేసుకోని పక్షంలో తిరిగి స్వాధీనం చేసుకోవడానికి బోర్డు స్టాండింగ్ ఆర్డర్ 24 కింద అధికారం ఉంటుంది.
* వాన్‌పిక్ ప్రాజెక్టు ఐ అండ్ ఐకి సంబంధించినది. ఐ అండ్ ఐ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం మినహా రెవెన్యూ శాఖకు దీనితో ఏమాత్రం సంబం ధం లేదు.
* మంత్రిమండలి 2008 జూన్ 30న జరిగిన సమావేశంలో, ఆ తదుపరి మంత్రి మండలి సమావేశాల్లో తీసు కున్న నిర్ణయాలను అమలుచేయడం తప్ప... మం త్రులకు తెలిసిందే తప్ప ధర్మానకు ఈ అంశాలపై అదనంగా ఏమీ తెలియదు. అందువలన ఆయన కేబినెట్‌ను తప్పుదోవ పట్టించే సమస్యే తలెత్తదు.
* భూ కేటాయింపు ప్రతిపాదనలపై నిర్ణయాలు రాష్ట్ర బిజినెస్ రూల్ 8 ప్రకారం, సచివాలయ సూచనల ప్రకారం మంత్రివర్గం సమష్టిగా తీసుకున్నవే.
* మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలకు దురుద్దేశాలను ఆపాదించడం, నేరపూరితంగా చూడటం సరికాదు. మంత్రిమండలి తీసుకునే అన్ని నిర్ణయాలను కాపాడాల్సిన అవసరం ఉంది.
* ప్రభుత్వ వ్యవహారాలలో, పరిపాలనలో ఏవైనా పొరపాట్లు జరిగినా దానికి దురుద్దేశాన్ని ఏ చట్టం కింద కూడా ఆపాదించలేరు.
* ఫైళ్లపై సంతకాలు కేవలం విధి నిర్వహణలో భాగంగా చేసినవే తప్ప.. మరే ఇతర ఉద్దేశంతో చేసినవి కావు.
* రెవెన్యూ మంత్రిగా ధర్మాన ప్రసాదరావుకు నిర్ణయం తీసుకోవడంలోకానీ ఉత్తర్వులు జారీచేయడంలోకానీ ఎలాంటి పాత్రలేదు. భూములు కేటాయించాలని కానీ, ప్రతిపాదనలు పంపించాలని కానీ ఎక్కడా చెప్పలేదు.
* వాన్‌పిక్ ప్రాజెక్టు ఐ అండ్ ఐలో రూపుదిద్దుకుంది. ఆ విభాగం అధికారులకు లబ్ధిదారు ఎవరు...ఎంత భూమి కావాల్సి ఉంటుంది? అనే విషయాలు ఆ శాఖ అధికారులకే తెలుస్తుంది. లబ్ధిదారుతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది ఆ శాఖనే. రెవెన్యూ శాఖ పరిధి పరిమితం.
* భూ నిర్వాసితులకు నేరుగా నష్టపరిహారం చెల్లింపు లను ప్రసాదరావు లేదా శామ్యూల్ ఎక్కడా అనుమతించలేదు. ధర నిర్ణయించడానికి సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే జారీ చేయడం జరిగింది.
* నోట్‌ఫైల్స్ కానీ, భూ కేటాయింపునకు అనుమతించే విషయంలో కానీ, నమ్మకద్రోహం, నేరపూరిత ప్రవర్తన, మోసం చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడం చేయలేదనే విషయాన్ని సీబీఐ కావాలనే విస్మరించింది.
* మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనలను మాత్రమే ముందుకు పంపిం చడం తప్ప... ఒక వ్యక్తికి అనుకూలంగా ఉద్దేశపూర్వకంగా ఫైళ్లలో ఏవైనా అక్షరాలు తొలగించడం లేదా చేర్చడం చేయలేదన్న విషయాన్ని సీబీఐ కావాలనే విస్మరించింది.
* ఒక మంత్రి లేదా అధికారి వ్యక్తిగత హోదాలో తీసుకున్న నిర్ణయం కాకుండా మంత్రి మండలి తీసుకున్న నిర్ణయం అవినీతి నిరోధకచట్టం కిందకు రాదని 2006లో హైకోర్టు ఓ కేసులో స్పష్టం చేసింది.
* మంత్రి మండలి తీసుకునే నిర్ణయాల్లో కొంతమంది లబ్ధిపొందినా దాని ఆధారంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడానికి వీల్లేదు.
* వాన్‌పిక్ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఒక్క ఎకరా కూడా అప్పగించలేదు. వాన్‌పిక్ పేరిట సేల్ డీడ్ ఇవ్వలేదు. 4992 ఎకరాలకు సంబంధించి తహశీల్దార్ కేవలం భూ కేటాయింపు లేఖమాత్రమే ఇచ్చారు.
http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=53105&Categoryid=1&subcatid=18 

'రాష్ట్ర సర్కారుపై ప్రజల్లో అసంతృప్తి వాస్తవమే'

రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంపై ప్రజ ల్లో అసంతృప్తి ఉన్న మా ట వాస్తవమేనని కేంద్ర మానవ వనరుల అభివద్ధి శాఖ మంత్రి ఎం.ఎం.పళ్లంరాజు అంగీకరించారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు సమర్థంగా చెప్పకోలేకపోవడమే అందుకు ప్రధాన కారణమన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమష్టి కృషితో ప్రజల్లోకి తీసుకెళితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని చెప్పారు. శుక్రవారమిక్కడి కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరిగిన ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూ లింగ్’ 24వ వార్షికోత్సవాల్లో పొల్గొన్నాక పళ్లం రాజు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్రలు, కాంగ్రెస్ నుంచి వలసల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయమెలా సాధ్యమన్న ప్రశ్నకు.. ‘ప్రజాస్వామ్యంలో ప్రతీ నాయకుడు ప్రజల్లోకి వెళ్లాల్సిందే. అధికారంలో ఉన్నవారేమో తమ పథకాల గురించి, ప్రతిపక్షాలమో సర్కారు వైఫల్యాల గురించి ప్రజలకు చెబుతారు. వాస్తవమేంటన్నది ప్రజలే నిర్ణయిస్తారు’ అని అన్నారు. అవకాశవాదంతో కొందరు ఇతర పార్టీల్లోకి వలస వెళ్తున్నారన్నారు. జలయజ్ఞం ప్రాజెక్టులు సరిగ్గా అమలు కావడం లేదన్నది వాస్తవమేనన్నారు.

http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=492489&Categoryid=14&subcatid=0

చంద్రబాబు సారుకు బహిరంగ లేఖ...

గౌరవనీయులైన చంద్రబాబు గారికి,

సార్, ఈమధ్యకాలంలో పేపర్‌లో మీ ప్రసంగాలు చదివినప్పుడు, టీవీలో మీ ప్రసంగాలు విన్నప్పుడు, నా భర్త తరచు అనే మాటలు నాకు గుర్తుకు వచ్చాయి- ‘ఈరోజు రాజకీయాల్లో విలువలు లేని పరిస్థితి చూస్తున్నాము’ అని. అదెంత నిజమో ఇప్పుడు తెలుస్తోంది! మీరు మీ ఎంపీలను చిదంబరం దగ్గరికి పంపి నా భర్తకు రావాల్సిన బెయిల్‌ను అడ్డుకున్నారు. మీ నీచ రాజకీయాలకోసం సీబీఐతో, కాంగ్రెస్‌తో చేతులు కలిపి, మీ గోబెల్స్ ప్రచారకులను, కొన్ని ఎల్లో పత్రికలను, ఛానల్స్‌ను వాడుకుని, జగన్ మీద, మా కుటుంబం మీద మీరు కరడుగట్టిన ఫ్యాక్షనిస్ట్ కంటే అన్యాయంగా ప్లాన్స్ వేసి, నా భర్తను మా నుండి, మా పిల్లల నుండి, ప్రేమించే ప్రజల నుంచి ఎంతకాలం వీలైతే అంతకాలం దూరంగా వుంచాలని నిత్యం ప్రయత్నిస్తున్నారు. నా భర్తను జైలు లోపల వుంచి, ఆయన మీద ఎన్ని అబద్ధాలు వీలైతే అన్ని అబద్ధాలు మీరు, మీ గోబెల్స్ ప్రచారకులు, మీ ఎల్లో గ్యాంగ్ కలిపి ప్రచారం చెయ్యాలనుకుంటున్నారు.

ఒక మనిషి ఎదుట లేనప్పుడు ఆ మనిషి గురించి తప్పుగా మాట్లాడడం కుసంస్కారం అని మాకు తెలిసిన, మాకు నేర్పిన విలువలు సార్! మరి మీరు నిజాలు కాదు... ఆ మనిషి లేనప్పుడు ఏకంగా అబద్ధాలే ప్రచారం చేస్తున్నారు. అది మీ స్థాయికి, మీ వయస్సుకు తగదు సార్. మిమ్మల్ని ఎందరో ప్రజలు గమనిస్తున్నారు. మీ నుంచి భావితరాలు ఎన్నో నేర్చుకోవాలి. అందుకే ఇటువంటి విలువలు లేని రాజకీయాలను భావితరాలకు నేర్పకండి. ఇప్పటికైనా విశ్వసనీయత లేని రాజకీయాలు చేయడం మానండి. మనిషి ఎదురుగా వున్నప్పుడు పోరాడితే అది ఒక సమఉజ్జీ పోరాటం అవుతుంది. అంతేకాని ఇలా దొడ్డిదారిగుండా ఒకరిని తగ్గించి, మనలను మనం పెంచుకోవాలనుకోవడం వీరుల లక్షణం కాదు సార్. అది నా దృష్టిలో పిరికివారు, నయవంచకులు, వెన్నుపోటుదారులు వాడే మార్గం సార్.

సార్, ఈరోజు మీరు నా భర్త స్థాపించిన వ్యాపారాల గురించి మాట్లాడుతున్నారు. నా భర్త స్థాపించిన రెండు కంపెనీలు - భారతి సిమెంట్, జగతి పబ్లికేషన్స్ రెండూ దేశంలోనే అగ్రగామిగా, మన రాష్ట్రానికి వన్నె తెచ్చేవిగా, ఈరోజు నిలిచాయంటే దానికి కారణం -దేవుని దయ, నా భర్త యొక్క అంకితభావం! 

ఈరోజు ఆ రెండు కంపెనీలు ఆధారంగా 30,000 పైచిలుకు కుటుంబాలు బతుకుతున్నాయి. మీకు జగన్ మీద, మా మామగారి మీద వుండే కక్షపూరితమైన మనస్సుతో ఈ 30,000 కుటుంబాలకు అన్యాయం చేసే నీచ రాజకీయాలు మానండి. 

సార్, తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఒకానొకప్పుడు దేశ రాజకీయాలను నిర్దేశించిన వ్యక్తిగా, మన రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష ముఖ్యనాయకుడుగా వున్న మీ ద్వారా ప్రజలకు, నాలాంటి ఈ రాష్ట్ర ఆడబిడ్డలకు మంచి జరగాలి కానీ, మీ మూలంగా నాలాగా ఏ ఆడబిడ్డ ఈ రాష్ట్రంలో కన్నీరు పెట్టకూడదు సార్! నాలాంటి ఆడబిడ్డల కన్నీరు మీకు మంచిది కాదు... మన రాష్ట్రానికి అంతకన్నా మంచిది కాదని చెప్తూ...

వయస్సులోను, అనుభవంలోనూ మీకంటే చిన్నదాన్ని అయిన నేను రాయడం తప్పుగా భావిస్తే క్షమించమని కోరుతూ... 
విలువలుగల రాజకీయాల కోసం నా భర్త నిలబడినట్టుగా మీరు కూడా నిలబడాలని మనస్పూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.



yours sincerely,
Y.S. Bharathi.









source:sakshi

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా....

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శనివారం అలంపూర్ నియోజకవర్గంలోని బూడిదపాడు క్రాస్ నుంచి ప్రారంభం అవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు.

బూడిదపాడు క్రాస్ నుంచి బయల్దేరి శాంతినగర్, 26వ కాల్వ, కొంకల, పెదతాండ్ర క్రాస్ రోడ్, వెంకటాపురం స్టేజీ వరకు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. రాత్రికి వెంకటాపురం స్టేజీ నుంచి కిలోమీటర్ దాటిన తర్వాత షర్మిల బస చేస్తారని వారు తెలిపారు. శనివారం మొత్తం 15 కి.మీ యాత్ర సాగుతుంది.



పార్టీలు మారేవారంతా అవకాశవాదులు : బాలకృష్ణ

http://www.andhrajyothy.com/mainnewsshow1.asp?qry=2012%2Fnov%2F23%2Flatest%2F23new21&more=dailyupdates%2Fajlatestnews

 బావ చంద్రబాబు కాంగ్రెస్ నుండి తెలుగుదేశం లోకి , అక్క,బావ దగ్గుబాటి పురందేశ్వరి,వెంకటేశ్వర్ రావు తెలుగు దేశం నుండి కాంగ్రెస్ కి, అన్న హరికృష్ణ కూడా పార్టీ మారాడు,ఇంకో అన్న కూడా మారినట్లున్నాడు.  కుటుంబం లోనే ఇంత మంది అవకాశవాదులా ? ఇంకా నీతులేందుకు?

కలుకుంట్ల గ్రామస్తులతో షర్మిల రచ్చబండ

కలుకుంట్ల గ్రామస్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల రచ్చబండ నిర్వహించారు. ఆర్డీఎస్ నీటి సమస్యను గ్రామస్తులు షర్మిల వద్ద ప్రస్థావించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ దివంగ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్డీఎస్‌కు నిధులు కేటాయించారని చెప్పారు. ఆయన మరణానంతరం ఆర్డీఎస్ పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంత రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని కలుకుంట్ల గ్రామస్తులకు షర్మిల భరోసా ఇచ్చారు.

చంద్రబాబును వెంటాడుతున్న గతం



నీతి నిజాయితీలతో బ్రతికిన ఎవరికైనా జీవితంలో మరీ యవ్వనంలో ఆటు పోట్లు తప్పవు. అయితే నానాటికి పెరిగి పోతున్న కలి ప్రభావం కారణంగా కొద్దో గొప్పో నిజాయితి ప్రదర్శించిన వారిని సైతం లోకం ఎంతో గౌరవంగా చూస్తుంది.
బాబు మొదటి కోవకు చెందిన వారు కాదన్నది జగత్ప్రసిద్దం. రెండో కోవకు చెందిన వారూ కాదన్నది బాబు మద్దత్తు దారులే ఆంతరింగిక సంభాష్ణల్లో అంగీకరించే విషయం. ఈ నేపథ్యంలో వర్థమానం పచ్చగా లేకున్నా భవిష్యత్ భగ్నమని తేలి పోయినా కనీశం గతాన్ని తలుచుకుని విశ్రాంతి తీసుకోవలసిన పరిస్థితి వయస్సు బాబుది.కాని దురదృష్ఠ వశాస్తూ బాబు గతం ఒక పెను భూతంలా ఆయన్ని వెంటాడి వేదిస్తూంది.
“చంద్ర”బాబు ఎంతగా నవ్వడం నేర్చి ( మరీ దర్ద్రంగా ఉంది ఆ భలవంతపు నవ్వు ) పున్నమి చంద్రుడిలా ముస్తాబై ఎన్ని శ్రీరంగ నీతులు వల్లించినా అతని గతం అతన్ని అమావాశ్య చంద్రుడిక్రిందే చూపుతూంది.
పిల్లనిచ్చిన మామ పైనే పోటీకి సిద్దం అని బీరాలు పలకడం – తీరా అతను సి.ఎం కాగానే కాంగ్రెసుకు వెన్ను పోటు పొడిచి మామ చెంతన చేరడం – కుర్చీ ఎప్పుడు ఖాళి అవుతుందా అని ముళ్ళ పొదల చాటున గుంట నక్కలా కాచుక్కూర్చోవడం – తండ్రి సమానుడని -కోట్లాది మంది అభిమానుల ఆరాద్య దైవమని కూడ జంకక వెన్ను పోటు పొడిచి -గుండె పోటు తెప్పించడం .
ఇక్కడ మొదలు పెడితే బాబు గతమంతా మనకు కనిపించేవి :
అబద్రతా భావం – ఎలాగైనా ఎదగాలన్న కకృత్తి – తాను ఎదగడం కోసం ఏ పక్షానికైనా జై కొట్టే అవకాశ వాదం తనకు అధికారం వస్తుందంటే నమ్మిన వారిని నట్టేట ముంచడం – తనవారిని సైతం సదా అనుమానించడం – తన భలం పై తనకు నమ్మకం లెక పోవడంతో తనవారిలోనే గ్రూపులను ప్రోత్సహించడం.
తన స్వార్థం కోసం తానెన్ని గడ్డైనా కరవవచ్చుగాని – తన వారి పై ఏ మాత్రం నింద పడినా -అది నిజమో కాదో కూడ ఆలోచించక పక్కన పెట్టడం -స్వంత పార్టి ఎం.ఎల్.ఏలను ప్రజాప్రతినిదులను సైతం నమ్మక అధికారుల పై ఆధారపడటం.
బా.జ.పా పొత్తుతో నెగ్గి తనకేదో బలం ఉందని అతిగా ఊహించుకుని ఎన్.టి.ఆర్ కన్నా గొప్ప పాలకుడు కావాలన్న తుత్తరతో మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అనే స్థాయికి చేరారు. ( ఎన్.టి.ఆర్ గొప్ప వక్త అన్నది గమనార్హం – తనకు వక్తృత్వం లేక పోవడాన్ని కప్పి పుచ్చుకోవడమే కాక గొప్ప వక్త -మానవతావాది అయిన ఎన్.టి.ఆర్ ని పరోక్షంగా కించ పరచే వ్యాఖ్య ఇది.
ఏ వర్గ ప్రజలైతే తనను నమ్మి ఓటిచ్చారో ప్రత్యక్షంగా వారిని బాధించే చర్యలకు ఏమాత్రం జంకక పోవడం. తానో బ్రమలోకి వెళ్ళి పోయి -పిచ్చివాడిలా తయారై సహచర రాజకీయనాయకులంతా అవుట్ డేటడ్ అయినట్టు తానొకడే హైటెక్ అన్నట్టు బిల్డప్పు ఇవ్వడం మైంద్ సెట్ మార్చుకోమని సలహాలివ్వడం -అస్తమానం రాజకీయాలేనా..రాజకీయం అంటే అది ఎన్నికల సమయంలోనే అంటూ అసహనం వ్యక్తం చెయ్యడం. ఇల ఒకటి కాదు వెయ్యి విషయాలున్నాయి.
బాబు గతాన్ని తవ్విన కొద్ది ఇటువంటి శవపేటికలే భయిట పడతాయి. ఆ కళేబరాలు పెనుభూతమై బాబు వెంటాడి వేదిస్తున్నాయి.
పాపం బాబు ! ఇప్పటికీ గతంలో తాను గొప్పగా చేసాడని భావిస్తున్నారు. ఈ నిమిషం వరకు బాబువి అన్ని చార్తిత్రిక తప్పిదాలే.
వాటన్నింటిని లిస్ట్ అవుట్ చేసి శ్వేత పత్రం విడుదల చేసి 48 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి భయిటకొచ్చి ఒక్క మాట చెప్పినా నమ్మే పరిస్థితిలో జనం లేరు. ఎందుకంటే బాబు గతం బాబును మాత్రమే కాదు ఈ రాష్ఠ్ర్ర ప్రజలను సైతం -నిద్రలో సైతం భెదిరిస్తున్నాయి.
కాని బాబు మాత్రం ఇంకా తాను కరెక్ట్ అని భావిస్తుండడం – తన పరిపాలనకు తానే కితాబులిచ్చుకోవడం కౄయల్ జోక్.

http://sambargaadu.wordpress.com/2012/11/23/cn-jpg/
Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!