YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 20 November 2012

యనమలకు జ్యోతుల నెహ్రు బహిరంగలేఖ

టీడీపీ నేత యనమల రామకృష్ణుడుకు వైఎస్ఆర్ సీపీ నేత జ్యోతుల నెహ్రు బహిరంగ లేఖ రాశారు. వైఎస్ జగన్ జైల్లో సెల్‌ఫోన్ వాడుతున్నారంటూ చేసిన ఆరోపణలపై ఆయన 4 పేజీల లేఖ పంపారు. వైఎస్ జగన్‌పై యనమల అర్ధరహిత ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. జైలు నిబంధనలు తెలుసుకోకుండా యనమల మూర్ఖంగా మాట్లాడుతున్నారన్నారు. ప్రజాక్షేతంలో వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేక కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. జగన్ సాక్షులను ప్రభావతం చేస్తారన్నది మీ భయమా? లేక ప్రజల భవిష్యత్‌కు తన తండ్రి మాదిరిగానే భరోసా ఇస్తారని భయమా? అని సూటిగా ప్రశ్నించారు. జగన్‌కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!