YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 23 November 2012

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా....

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శనివారం అలంపూర్ నియోజకవర్గంలోని బూడిదపాడు క్రాస్ నుంచి ప్రారంభం అవుతుందని పార్టీ ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు.

బూడిదపాడు క్రాస్ నుంచి బయల్దేరి శాంతినగర్, 26వ కాల్వ, కొంకల, పెదతాండ్ర క్రాస్ రోడ్, వెంకటాపురం స్టేజీ వరకు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. రాత్రికి వెంకటాపురం స్టేజీ నుంచి కిలోమీటర్ దాటిన తర్వాత షర్మిల బస చేస్తారని వారు తెలిపారు. శనివారం మొత్తం 15 కి.మీ యాత్ర సాగుతుంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!