YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 18 November 2012

వైఎస్సార్ సీపీలోకి రాణీరుద్రమ


హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రముఖ టీవీ న్యూస్ రీడర్ రాణీరుద్రమ వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ మేరకు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్య నేతలు కొండా సురేఖ, కొండా మురళి దంపతుల ఆధ్వర్యంలో వచ్చిన రుద్రమ.. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను ఆమె నివాసంలో కలిసి పార్టీలో చేరారు. రుద్రమ టీవీ-9, ‘సాక్షి’, ‘టీ’ న్యూస్ చానెళ్లలో పనిచేశారు. పార్టీ నేతలు కె.కె.మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా ఈ సందర్భంగా ఉన్నారు. రుద్రమ మీడియాతో మాట్లాడుతూ, తనకు పుట్టినిల్లు అయిన మీడియా రంగం నుంచి ఇప్పుడు రాజకీయ రంగంలోకి వస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. 

యువనాయకత్వాన్ని బలపర్చాలనే ఉద్దేశంతో తాను వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరానన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వాలని భావిస్తే తాము అభ్యం తరం చెప్పబోమని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించిందని, ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తానని పేర్కొందని, అందుకే పార్టీలో చేరుతున్నానని ఆమె ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనను పోటీ చేయాల్సిందిగా పార్టీ చెబితే చేస్తానని, లేదు, సేవలందించమంటే అందిస్తానన్నారు. అంతకు ముందు కొండా సురేఖ మాట్లాడుతూ నర్సంపేటకు చెందిన రుద్రమ పదవులను ఆశించి పార్టీలో చేరలేదని, వైఎస్సార్ ఆశయాల సాధన కోసం ఆయన కుటుంబం పడుతున్న తపన చూసి వారితో కలసి పనిచేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆమె ముందుకు వచ్చారన్నారు.


source:sakshi

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!