YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 16 December 2012

వైఎస్సార్ సీపీలో చేరిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

తంబళ్లపల్లె శాసనసభ్యుడు ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చిత్తూరు జిల్లాలో బి.కొత్తకోటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కండువా వేసి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... తన స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీని చంద్రబాబు నాశనం చేశారని విమర్శించారు. గత 30 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేసిన తమను బయటికి వెళ్లగొట్టారని ఆరోపించారు. భారతదేశంలో ఏ నాయకుడు చేయని విధంగా వైఎస్సార్ సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. జగనన్నను ముఖ్యమంత్రి చేసేందుకు కృషి చేయాలని తన నియోజకవర్గ ప్రజలను కోరారు.

బి.కొత్తకోట: జగనన్న ముఖ్యమంత్రి కావాలని శపథం పూనాలని ప్రజలకు తిరుపతి ఎమ్మెల్యే భూమా కరుణాకరరెడ్డి పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా బి. కొత్తకోటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగలో ఆయన మాట్లాడారు. సోదర సమానుడైన తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ కుమార్ రెడ్డి తమ పార్టీలో చేరడాన్ని ఆయన స్వాగతించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!