YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 11 November 2012

నేడు షర్మిల పాదయాత్ర సాగుతుందిలా..

వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర సోమవారం 13.6 కిలోమీటర్లు సాగనుంది. ఆలూరు నియోజకవర్గం పరిధిలో మధ్యాహ్నం వరకు ఈ యాత్ర కొనసాగుతుంది.

మధ్యాహ్న భోజనాల తరువాత ఆదోని నియోజకవర్గంలోని విరుపాపురం గ్రామంలోకి ప్రవేశిస్తుంది. చిరుమానుదొడ్డి నుంచి ఉదయం ప్రారంభమయ్యే పాదయాత్ర హలిగేర, బెనిగేరి, నగరూరు క్రాస్, విరుపాపురం, సాదాపురం క్రాస్ మీదుగా దిబ్బనకల్లు క్రాస్ వరకు సాగుతుందని పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ టి. రఘురాం, జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!