YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 17 November 2012

కే.తిమ్మాపురంలో షర్మిల రచ్చబండ

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ను బాబు ఎన్నికల కోసం వాడుకుని వదిలేశారని... వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేశారని ఆమె గుర్తు చేశారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకమని, దానికి విద్యుత్, మోటర్లు అవసరమన్నారు.

అయితే విద్యుత్, మోటార్లు సమకూర్చటానికి ప్రభుత్వానికి మూడు సంవత్సరాలు సరిపోలేదని షర్మిల విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే నీటి సమస్యను తీర్చుతారన్నారు. కే తిమ్మాపురంలో రచ్చబండలో షర్మిల మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!