YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 3 April 2012

Vijayamma Speech on Power hike

విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. పులివెందుల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వైఎస్‌ విజయమ్మ, ఈసి గంగిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ, పెరిగిన విద్యుత్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

పన్నులు వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ఆమె విమర్శించారు. ఈ ప్రభుత్వానికి వైఎస్‌ఆర్‌, జగన్‌లను విమర్శించడానికే సమయం సరిపోతోందని మండిపడ్డారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రభావం చేతి వృత్తులపై కూడా పడనుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!