YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 19 August 2012

విజయమ్మ లేఖపై తీవ్ర చర్చ

వంద టిక్కెట్లు కాదు, నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు వంద సీట్లిద్దామన్న వైఎస్సాఆర్‌ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టీడీపీ పొలిటికల్‌ మైలేజీ కోసం బీసీ డిక్లరేషన్‌ను తెరపైకి తెచ్చినా... వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదనపై ఏ విధంగా రెస్పాండ్‌ అవుతుందో అనేది ఆ పార్టీకి డైలామానే. 

అయితే మిగతా పక్షాలు మాత్రం వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదనను స్వాగతిస్తూనే.. అన్ని పార్టీలు దీనిపై సీరియస్‌గా ఆలోచించాలని అభిప్రాయపడ్డాయి. దీని కంటే ముందు ఎన్నికల సంస్కరణలు వస్తే వంద సీట్ల వంటి ప్రతిపాదనలు సత్ ఫలితాలు ఇస్తాయని టీఆర్‌ఎస్‌ అభిప్రాయపడింది. ఈ అంశంపై సోమవారం ఉదయం సాక్షి హెడ్‌లైన్‌షోలో చర్చ జరిగింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!