YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 25 August 2012

విద్యుత్తు సంక్షోభానికి ముస్లింలు కారణమా?ముస్లింల పట్ల టీడీపీ వైఖరికి సుజనా చౌదరి వ్యాఖ్యలే నిదర్శనo

రంజాన్ సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలో ముస్లింలకు నిరంతరాయంగా కరెంటు ఇవ్వడం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందంటూ టీడీపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం కన్వీనర్ హెచ్.ఎ.రెహ్మాన్ తీవ్రంగా ఖండించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన సుజనా చౌదరి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రెహ్మాన్ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వారంలోగా బహిరంగంగా ముస్లింలకు క్షమాపణలు చెప్పాలని లేదంటే పార్టీలకు అతీతంగా ఏకమై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇంటితోపాటు సుజనా చౌదరి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. విద్యుత్తు కోతలకు సంబంధించి సుజనా చౌదరి ఈనెల 22వ తేదీన పత్రికలకు విడుదల చేసిన ప్రకటన ప్రతిని ఈ సందర్భంగా రెహ్మాన్ ప్రదర్శించారు. ముస్లింల పట్ల టీడీపీ వైఖరికి సుజనా చౌదరి వ్యాఖ్యలే నిదర్శమని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్డీయే అధికారంలో కొనసాగడానికి కారణమైన చంద్రబాబు ఇప్పుడు డిక్లరేషన్ల పేరుతో బీసీలు, ఎస్సీలు, ముస్లింలను మోసగించే పనిలో ఉన్నారని ఆరోపించారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!