YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 25 June 2012

‘మద్య రహిత తిరుపతి’ డిమాండ్ న్యాయసమ్మతం


తిరుపతిని మద్యరహిత నగరంగా ప్రకటించాలన్న డిమాండ్ న్యాయ సమ్మతమని మేకపాటి సోదరులు అభిప్రాయపడ్డారు. తిరుపతిలో మద్య నిషేధం కోసం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష సోమవారానికి రెండో రోజుకు చేరుకుంది. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం సాయంత్రం దీక్ష శిబిరంలో కరుణాకరరెడ్డిని పరామర్శించారు. 

వారు మీడియాతో మాట్లాడుతూ షిరిడీ, మౌంట్ అబూ పట్టణాల్లో మద్య నిషేధం అమలులో వున్న సంగతిని గుర్తు చేశారు. తిరుమల తిరుపతి వేరు కాదని తిరుమల తరహాలో తిరుపతిలో కూడా సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేసి తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన అవసరం వుందన్నారు. కరుణాకరరెడ్డి దీక్షకు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నాయకుల సంపూర్ణ మద్దతు వుంటుందని మేకపాటి సోదరులు స్పష్టం చేశారు. కాగా, ‘పుణ్యక్షేత్రంలో తిరుమల, తిరుపతి వే ర్వేరు కాదు. తిరుపతిలో పూర్తి స్థాయిలో మద్యాన్ని నిషేధించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాన’ని టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు అన్నారు. తిరుపతిలో సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించాలని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆమరణ దీక్ష చేస్తున్న విషయంపై ఆయన పైవిధంగా స్పందించారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!