YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 29 June 2012

హైకోర్టు న్యాయమూర్తులుగా రామచంద్రరావు, ప్రవీణ్‌కుమార్


హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర హైకోర్టు నూతన అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.సత్యరత్న శ్రీరామచంద్రరావు ప్రమాణం చేశారు. శుక్రవారం ఉదయం 10.15 గంటలకు వీరిద్దరి చేత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పినాకినీ చంద్రఘోష్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రమాణం చేసిన ప్రవీణ్‌కుమార్, రామచంద్రరావులను న్యాయమూర్తులు అభినందించారు. అనంతరం జస్టిస్ ప్రవీణ్‌కుమార్ తాత్కాలిక సీజేతో కలిసి పలు కేసులను విచారించగా... సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ వంగాల ఈశ్వరయ్యతో కలిసి రామచంద్రరావు కేసులను విచారించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!