మత్స్యకారుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. పదిహేన్ రోజుల్లోగా తిక్కవానిపాలెం మత్స్యకారులకు న్యాయం జరిగేలా చూడాలని ఎన్టీపీసీ యాజమాన్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు. ఎన్టీపీసీ వల్ల బాధితులైన మత్స్యకారులను పరామర్శించేందుకు వైఎస్ విజయమ్మ, షర్మిలాలు ఆదివారం ఉదయం విశాఖ జిల్లాలోని తిక్కవానిపాలెంలో వచ్చారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ఆమె ప్రసంగించారు.ఎన్టీపీసీ వల్ల మత్స్యకారులు బాధితులుగా మారారని కావున న్యాయం అందించేందుకు యాజమాన్యం సత్వరం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా మత్స్యకారులు వైఎస్విజయమ్మకు వినతి పత్రాన్ని సమర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రె స్ పార్టీ నిత్యం ప్రజల పక్షాన నిలుస్తుందని వైఎస్ విజయమ్మ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. |
Saturday 30 June 2012
మత్స్యకారులపై అసెంబ్లీలో ప్రస్తావిస్తాం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment