YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 30 May 2012

నా బిడ్డకు న్యాయం చేయండి: విజయమ్మ

విశాఖపట్నం: జగన్మోహన రెడ్డిని జైలులో పెట్టినందున తాను మీ ముందుకు వచ్చానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పాయకరావుపేట బహిరంగ సభలో చెప్పారు. ' ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నా బిడ్డకు న్యాయం చేయండి' అని ఆమె ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జగన్ తండ్రిలాగే ఆలోచిస్తాడని, వైఎస్ పథకాలన్నింటినీ అమలు చేస్తాడని చెప్పారు.

ప్రజల సంక్షేమం కోసం రాజీనామా చేసిన బాబూరావుని చూస్తే తనకు చాలా గర్వంగా ఉందన్నారు. ఆయనకు ఓటు వేసి ధర్నాన్ని, న్యాయాన్ని గెలిపించమని కోరారు. ఆమె వైఎస్ పథకాల పేర్లు చెప్పినప్పుడు జనం హర్షద్వానాలు చేశారు. ఏ గుర్తుకు ఓటు వేస్తారని విజయమ్మ అడిగితే, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తామని జనం చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!