YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 31 May 2012

ఇండియాలో ఇకపై రోమింగ్ ఛార్జిలు ఉండవని

న్యూఢిల్లీ: కొత్త టెలికాం విధానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. 2012 సంవత్సరపు జాతీయ టెలికాం విధానం ప్రకారం ఇండియాలో ఇకపై రోమింగ్ ఛార్జిలు ఉండవని కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. ఒక దేశం-ఒక లైసెన్స్ విధానం అంటూ కపిల్ సిబాల్ కొత్త భాష్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..లైసెన్స్ విధానాన్ని సరళీకృతం చేశామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రానికి సంబంధించిన సర్వీస్ ప్రోవైడర్ పరిధిలో ఉన్నా ప్రస్తుత మొబైల్ నంబర్ ను కొనసాగించేలా పూర్తి స్థాయిలో నంబర్ పొర్టబిలిటీని అమలు చేసే దిశగా డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం ప్రయత్నాలు ప్రారంభించనుందని కపిల్ సిబాల్ తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!