ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వడం కుదరకపోతే.. మధ్యంతర బెయిల్ ను మంజూరు చేయాలని బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జూన్ 10 తేది సాయంత్రం 5 గంటల వరకు ప్రచారంలో పాల్గొంటానని, 11న తేదిన హాజరవుతానని కోర్టును వైఎస్ జగన్ అభ్యర్థించారు. ప్రచారం నిర్వహించిన తర్వాత.. ప్రతిరోజు స్థానిక పీఎస్లో రిపోర్టు చేస్తానని బెయిల్ పిటిషన్లో వైఎస్ జగన్ పేర్కోన్నారు. అయితే ప్రచారానికి జగన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నారని సీబీఐ కోర్టుకు తెలిపింది. పార్టీ అధ్యక్షుడు ప్రచారానికి వెళ్లకపోతే ఎలానంటూ కోర్టు సీబీఐ వాదనకు అభ్యంతరం తెలిపింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment