YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 29 December 2012

జగన్ కోసం... జనం సంతకం












తేదీ: 22 డిసెంబర్ 2012
మాన్యశ్రీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి...

ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేసుకుంటున్న విజ్ఞప్తి...

జగన్ కోసం... జనం సంతకం
     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ సభ్యులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నాం. నిజాలను నిర్థారించాల్సిన సీబీఐ సంస్థ- జగన్మోహనరెడ్డిని దోషిగా చిత్రీకరించటానికి అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని మేమంతా భావిస్తున్నాం..

     ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు వైయస్ జగన్మోహనరెడ్డిగారిని 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచటాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నాం.




మీరూ చేయికలపండి!

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి అక్రమ అరెస్టును నిరసిస్తూ 'జగన్ కోసం... జనం సంతకం' పేరిట ప్రారంభించిన కోటి సంతకాల సేకరణలో మీరూ పాలుపంచుకోండి. ఇందుకోసం ఈ కింద ఇచ్చిన ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సంతకాలు చేసిన తర్వాత ఫార్మ్‌లో తెలిపిన పార్టీ కేంద్ర కార్యాలయం చిరునామాకు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించగలరు.

Wednesday 26 December 2012

చినబాబునూ , బరించలేం చంద్రబాబూ !









http://telugu.greatandhra.com/politics/1-12-2012/26_china_babu.php

YSRCP leaders remember late PR Kiran Kumar Reddy's activities

Jagan bail petition adjourned

 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది.సీబీఐ మూడు నెలలలో దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీంకోర్టుకు చెప్పిందని, ఆ గడువు ఇంకా పూర్తి కాలేదని న్యాయస్థానం తెలిపింది. మూడు నెలల గడువు ముగిశాక బెయిల్ కోసం వస్తే బాగుంటుందని కోర్టు అభిప్రాయపడింది.

మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని సుప్రీంకోర్టు చెప్పిందని సీబీఐ చెప్పిందని... అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ దర్యాప్తు విషయంలో పరిస్థితులు ఏమీ మారలేదని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. దర్యాప్తు ఎంతవరకూ పూర్తి చేశారో నివేదిక సమర్పించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. జనవరి 4వ తేదీన మళ్లీ వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది.

Konathala Ramakrishna Press Meet on 26th Dec

Tuesday 25 December 2012

జగన్ కోసం... జనం సంతకం


ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేసుకుంటున్న విజ్ఞప్తి...

జగన్ కోసం... జనం సంతకం
     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ సభ్యులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నాం. నిజాలను నిర్థారించాల్సిన సీబీఐ సంస్థ- జగన్మోహనరెడ్డిని దోషిగా చిత్రీకరించటానికి అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని మేమంతా భావిస్తున్నాం..
     ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు వైయస్ జగన్మోహనరెడ్డిగారిని 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచటాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నాం.


మీరూ చేయికలపండి!
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి అక్రమ అరెస్టును నిరసిస్తూ 'జగన్ కోసం... జనం సంతకం' పేరిట ప్రారంభించిన కోటి సంతకాల సేకరణలో మీరూ పాలుపంచుకోండి. ఇందుకోసం ఈ కింద ఇచ్చిన ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సంతకాలు చేసిన తర్వాత ఫార్మ్‌లో తెలిపిన పార్టీ కేంద్ర కార్యాలయం చిరునామాకు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించగలరు.

ప్రజలే బుద్ది చెబుతారు: వైఎస్ వివేకా

వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలులో ఉండటం కుటుంబాన్ని కలచివేస్తోందని వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. ఇడుపులపాయలో జరిగిన క్రిస్మస్ వేడుకల సందర్బంగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ వివేకానంద ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్,టీడీపీలు కుమ్మక్కై వైఎస్ జగన్ బెయిల్‌ను అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని వైఎస్ వివేకా అన్నారు. 

వైఎస్ రాజశేఖరరెడ్డి మాజీ పీఎస్ కిరణ్ ఆరోగ్యం విషమం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాజీ వ్యక్తిగత కార్యదర్శి పీ ఆర్ కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సోమవారం కిరణ్ కుమార్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్సనందిస్తున్నారు. కొద్ది నెలలుగా కిరణ్ కుమార్ రెడ్డి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా సేవలందిస్తున్న ఆయన వైఎస్ ప్రభుత్వ హయంలో ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పలువురు జర్నలిస్ట్ లకు ఆయన సహాయం అందించారు.

Monday 24 December 2012

జగన్ అరెస్ట్‌పై సీబీఐ వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు

వాన్‌పిక్ కేసులో మాత్రమే జగన్‌ను అరెస్ట్ చేశారనటం సరికాదు
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అన్ని అంశాల్లో అరెస్ట్ చేశారు
రిమాండ్ రిపోర్ట్‌ను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది 
సాంకేతిక కారణాలతో చట్టబద్ధ బెయిల్ పిటిషన్ కొట్టివేత 
సాధారణ బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా
జగన్‌మోహన్‌రెడ్డి వాదనను సమర్థించిన జస్టిస్ శేషశయనారెడ్డి 
సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద జగన్ జ్యుడీషియల్ కస్టడీలో లేరు
అందుకే ఆయనకు ఆ సెక్షన్ కింద బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదు

సాక్షి, హైదరాబాద్: కడప పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్ విషయంలో సీబీఐ చేస్తున్న వాదనల్లో పసలేదని హైకోర్టు తేల్చింది. జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్ట్ చేసింది కేవలం వాన్‌పిక్ కేసులో మాత్రమేనంటూ సీబీఐ గత కొద్ది రోజులుగా చేస్తున్న వాదనను హైకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఆ వాదనల్లో అర్థం లేదని స్పష్టం చేసింది. జగన్‌ను కేవలం వాన్‌పిక్‌లో మాత్రమే కాదని, ఆయనను ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అన్ని అంశాల్లో అరెస్ట్ చేసిందని హైకోర్టు తేల్చి చెప్పింది. తద్వారా తన అరెస్ట్ విషయంలో జగన్‌మోహన్‌రెడ్డి వాదనను హైకోర్టు సమర్థించినట్లయింది. ఇదే సందర్భంలో జగన్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు సాంకేతిక కారణాలతో కొట్టివేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద తనకు చట్టబద్ధ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తోసిపుచ్చుతూ న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి సోమవారం తీర్పు వెలువరించారు. 

సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద తనకు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై వాదనలు విని గతవారం తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి.. సోమవారం ఉదయం తన నిర్ణయాన్ని వెలువరించారు. 14.8.12 తరువాత సీబీఐ అధికారులు జగన్ కస్టడీని పొడిగించాలని కోరలేదని, కాబట్టి ఆయన కస్టడీలో లేనట్లేనని, కస్టడీలో లేని వ్యక్తికి బెయిల్ మంజూరు ప్రశ్న తలెత్తదని, అందువల్ల సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద బెయిల్ మంజూరు చేయటం సాధ్యం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. జగన్ బెయిల్ పిటిషన్‌కు సంబంధించి న్యాయమూర్తి ప్రధానంగా రెండు అంశాల గురించి చర్చించారు. 28.5.12న జగన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి పంపింది ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అన్ని అంశాల్లోనా..? లేక వాన్‌పిక్ కేసులో మాత్రమేనా..? అన్న ప్రశ్నతో పాటు జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద విచారణార్హమా..? అన్న మరో ప్రశ్న గురించి తన తీర్పులో ప్రముఖంగా చర్చించారు. 

ఇందులో మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తూ.. ‘జగన్ తన అరెస్ట్ అక్రమంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించే సమయంలో ఇదే హైకోర్టు సింగిల్ జడ్జి.. జగన్ రిమాండ్ ఎందులో జరిగిందనే విషయంపై పూర్తిస్థాయిలో చర్చించారు. ఇరుపక్షాలు కూడా పూర్తిస్థాయిలో వాదనలు వినిపించాయి. వాదనల అనంతరం జగన్‌ను అన్ని అంశాల్లో రిమాండ్‌కు పంపారని సింగిల్ జడ్జి స్పష్టంగా చెప్పారు. అంతేకాక చట్టం నిర్దేశించిన గడువు లోపు తుది చార్జిషీట్ దాఖలు చేయకుంటే, జగన్ సీఆర్‌పీసీ సెక్షన్ 167(2) కింద చట్టబద్ధ బెయిల్ పొందవచ్చునని కూడా సింగిల్ జడ్జి తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నారు. 

జగన్‌ను అరెస్ట్ చేసిన మరుసటి రోజు అంటే 28.5.12న సీబీఐ అధికారులు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో రిమాండ్ రిపోర్ట్ దాఖలు చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్ చాలా సమగ్రంగా ఉంది. ఎఫ్‌ఐఆర్ నమోదుకు దోహదం చేసిన అంశాలన్నింటినీ కూడా ఆ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. కానీ సీబీఐ ఈ రిమాండ్ రిపోర్ట్ కేవలం వాన్‌పిక్‌కు మాత్రమే సంబంధించిందని, మిగిలిన అంశాలకు సంబంధించినది కాదని చెప్తోంది. ఈ వాదనలో అర్థం లేదు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాల్లో దర్యాప్తు నిమిత్తం జగన్ పోలీస్ కస్టడీని పొడిగించాలని కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. నా ఉద్దేశం ప్రకారం జగన్‌ను 27.5.12న అరెస్ట్ చేసింది కేవలం వాన్‌పిక్ కేసులో మాత్రమే కాదు.. మిగిలిన అన్ని అంశాల్లో కూడా’ అంటూ మొదటి ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ఇక రెండో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘సీఆర్‌పీసీ సెక్షన్ 167(1) మరియు (2)లను క్షుణ్ణంగా పరిశీలిస్తే, నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి దర్యాప్తు నిమిత్తం పోలీసుల అదుపులో ఉండాలి. సెక్షన్ 167(2) ఇందుకోసమే ఉద్దేశించింది. అయితే ఇందుకు చట్టం ఓ నిర్దిష్ట గడువును నిర్దేశించింది. ఆ గడువు పూర్తయిన తరువాత కూడా ఆ వ్యక్తిని కస్టడీలో ఉంచుకోవటం చట్టవిరుద్ధం. కాబట్టి నిర్దిష్ట గడువు తరువాత ఆ వ్యక్తి బెయిల్ పొందేందుకు అర్హుడవుతాడు. 167(2) కింద బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే, ఆ వ్యక్తి తప్పనిసరిగా జ్యుడీషియల్ కస్టడీలో ఉండి తీరాలి. 


ఇక ప్రస్తుత కేసు విషయానికొస్తే, 27.5.12న అరెస్టయిన జగన్‌కు కోర్టు 28న జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఎప్పటికప్పుడు దానిని సీబీఐ కోర్టు పొడిగిస్తూ వచ్చింది. 14.8.12 తరువాత అంటే సీబీఐ మొదటి చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత ఆ కస్టడీని సీబీఐ కోర్టు సీఆర్‌పీసీ సెక్షన్ 309 కింద మార్చింది (సీబీఐ కూడా జగన్ కస్టడీని పొడిగించాలని కోరలేదు). ఫార్మా కంపెనీలకు లబ్ధి వ్యవహారంలో 26.8.12 వరకు తాను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నానన్నది జగన్ అభిప్రాయం. అయితే నా ముందున్న రికార్డులను పరిశీలిస్తే వాస్తవం మరోలా ఉంది. 14.8.12 నాటికి జగన్ కస్టడీని సీఆర్‌పీసీ సెక్షన్ 309 కింద మార్చటం జరిగింది. కాబట్టి రికార్డులోని అంశాలు జగన్ అభిప్రాయానికి భిన్నంగా ఉన్నాయి. వాస్తవానికి జగన్ 167(2) కింద జ్యుడీషియల్ కస్టడీలో ఉండి ఉంటే.. అతను బెయిల్ పొందేందుకు అర్హుడై ఉండేవారు. అయితే 14.8.12 నుంచి ఇప్పటి వరకు జగన్ కస్టడీని కోర్టు సెక్షన్ 309 కింద మార్చింది. 167(2) కింద జగన్ జుడీషియల్ కస్టడీలో లేనప్పుడు.. అదే సెక్షన్ కింద అతనికి చట్టబద్ధ బెయిల్ మంజూరు చేసే అంశమే ఉత్పన్నం కాదు. కాబట్టి 167(2) జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ విచారణార్హం కాదు’ అని జస్టిస్ శేషశయనారెడ్డి పేర్కొన్నారు. 

ఇక సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నప్పుడు.. సుప్రీంకోర్టు 167(2) కింద బెయిల్ మంజూరు చేసే విషయాన్ని పరిగణనలోకి తీసుకుందా..? లేదా..? అన్న విషయాన్ని ప్రస్తుతం పరిశీలించాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంతేకాక 167(2) కింద దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌లోని వాస్తవాల ఆధారంగా ఈ కోర్టు తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు భావించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

సాధారణ బెయిల్‌పై 26న విచారణ...

ఇదిలావుంటే.. వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసి తుది చార్జిషీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా, సీబీఐ దర్యాప్తు పూర్తి చేయలేదని, అందువల్ల తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని సోమవారం న్యాయమూర్తి జస్టిస్ బి.శేషశయనారెడ్డి విచారించారు. ఇరుపక్షాల వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

మొదటి జాబితాల్లోని వారికే పోస్టు: వైఎస్సార్ టీఎఫ్

రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో భాగంగా టీచర్ల ఎంపిక జాబితాల్లో మార్పులు చోటు చేసుకున్నాయని ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఓబుళపతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తొలి ఎంపిక జాబితా ప్రకటించి, మళ్లీ మార్చినందున, ఆ జాబితాలో ఉన్న వారికి సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి, పోస్టింగ్‌లు ఇవ్వాలని 
విజ్ఞప్తి చేశారు. 

శంకరరావు లేఖలు - నాడు,నేడు!

ఒకప్పుడు మాజీ మంత్రి శంకరరావు  ఉత్తరం రాస్తే హైకోర్టే స్పందించింది. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై విచారణ చేయాలని ఆయన లేఖ రాస్తే అప్పట్లో హైకోర్టు వెంటనే స్పందించింది. చకచకా విచారణ జరిపి సిబిఐ దర్యాప్తు జరపాలని ఆధేశాలు ఇచ్చింది. ఎమ్.ఆర్.కేసులో శంకరరావు కోరితే అదే హైకోర్టు విచారణకు ఆదేశించింది.మరి ఇప్పుడు ఏమైందో కాని ఆయన కు పరిస్థితి ఎదురు తిరిగింది.ఆయన మంత్రి పదవి పోయింది. ఇప్పుడు ఆయన లేఖలను కూడా హైకోర్టు పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కు సంబంధించి ఆరోపణలు చేస్తే అదే హైకోర్టు శంకరరావును మందలించింది.ఈ పిటిషన్ ను వెనక్కి తీసుకోకపోతే జరిమానా విధిస్తామని హైకోర్టు హెచ్చరించింది.శంకరరావు కొన్ని లేఖలు రాసిన ఫలితంగా మంత్రి పదవిలో ఉన్నవారు. ఎమ్.పి గా ఉన్నవారు, ఐఎఎస్ అధికారులు జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఇప్పుడేమో శంకరరావు జరిమానాకు గురి అయ్యే పరిస్థితి వచ్చింది. 

http://kommineni.info/articles/dailyarticles/content_20121224_14.php

బొత్స నోరు అదుపులో పెట్టుకో: నిర్మల

ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై పీసీసీ చీఫ్ బొత్స చేసిన వాఖ్యలపై వైఎస్ఆర్ సీపీ మహిళా విభాగం నేతలు మండిపడ్డారు. బొత్స నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి హెచ్చరించారు. బొత్స వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఈ సాయంత్రం వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో బొత్స దిష్టిబొమ్మల దగ్ధం కార్యక్రమం చేపట్టనున్నట్టు మహిళా విభాగం వెల్లడించింది. 

sakshi

ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు: విజయమ్మ

రాష్ట్ర ప్రజలకు, ప్రవాసాంధ్రులకు వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపారు. శాంతియుత సహ జీవనమే క్రిస్మస్‌ మనకు ఇచ్చే దివ్య సందేశం అని వైఎస్ విజయమ్మ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అత్యంత దారుణం

 మహిళలపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు అత్యంత దారుణం అని వైఎస్ఆర్ సీపీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర కన్వీనర్ వంగపండు ఉష అన్నారు. బొత్స భార్య ఓ ఎంపీ..అర్ధరాత్రి పార్టీ కార్యక్రమాల కోసం ఆమె తిరగడం లేదా అని ఉష ప్రశ్నించారు. బొత్స తన మనసులోని ఉద్దేశాన్నే బయటపెట్టారని ఆమె అన్నారు. 

Sunday 23 December 2012

Court rejects Jagan Mohan Reddy's bail plea

జగన్ కు స్టాట్యుటరీ బెయిల్ నిరాకరణ

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టాట్యుటరీ బెయిల్ ను హైకోర్టు తోసిపుచ్చింది. స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ కు విచారణార్హత లేదంటూ బెయిల్ పిటిషన్ ను జస్టిస్ శేషశయనారెడ్డి తిరస్కరించారు. కాగా కేసు మెరిట్స్ జోలికి పోవటం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ఈరోజు మధ్యాహ్నం జగన్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

Signatures takeup for YS Jagan at Kuwait

మొదలైన ‘కోటి సంతకాల సేకరణ’


 జగన్ కేసులో సీబీఐ కక్ష సాధింపు ధోరణికి వ్యతిరేకంగా రాష్ట్రపతికి కోటి సంతకాలతో వినతిపత్రం ఇవ్వాలన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ‘కోటి సంతకాల సేకరణ’ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మొదలైంది. విశాఖపట్నం ఎంవీపీ కాలనీ రైతుబజార్‌లో పెద్దసంఖ్యలో వినతిపత్రంపై సంతకాలు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఐటీ విభాగం కన్వీనర్ మధు సంపత్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. సీబీఐ కక్షపూరిత ధోరణిని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా మండపేటలో దివంగత వైఎస్ విగ్రహం వద్ద జిల్లా పార్టీ కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి చేపట్టిన సంతకాల సేకరణలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. జగన్‌ను విడుదల చేయూలంటూ విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడు గౌతంరెడ్డి ఆధ్వర్యంలో సంతకాలు చేశారు. మరోవైపు దుబాయ్ లోనూ ప్రవాసాంధ్రులు జగన్ కోసం సంతకాలు సేకరిస్తున్నారు.

జగన్ కోసం... జనం సంతకం


తేదీ: 22 డిసెంబర్ 2012
మాన్యశ్రీ భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి...

ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేసుకుంటున్న విజ్ఞప్తి...

జగన్ కోసం... జనం సంతకం
     వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, లోక్‌సభ సభ్యులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నాం. నిజాలను నిర్థారించాల్సిన సీబీఐ సంస్థ- జగన్మోహనరెడ్డిని దోషిగా చిత్రీకరించటానికి అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ళకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని మేమంతా భావిస్తున్నాం..
     ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు వైయస్ జగన్మోహనరెడ్డిగారిని 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచటాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నాం.


మీరూ చేయికలపండి!
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిగారి అక్రమ అరెస్టును నిరసిస్తూ 'జగన్ కోసం... జనం సంతకం' పేరిట ప్రారంభించిన కోటి సంతకాల సేకరణలో మీరూ పాలుపంచుకోండి. ఇందుకోసం ఈ కింద ఇచ్చిన ఫార్మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, సంతకాలు చేసిన తర్వాత ఫార్మ్‌లో తెలిపిన పార్టీ కేంద్ర కార్యాలయం చిరునామాకు పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించగలరు.



http://www.ysrcongress.com/home/koti_santhakaalu.html

Shobha Nagi Reddy Press Meet

'Janam Santakam' campaign by YSRCP followers in Guntur

Saturday 22 December 2012

వైఎస్‌ఆర్ సీపీ మహిళా విభాగం పాదయాత్ర

వైఎస్.జగన్ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, టీడీపీ, సీబీఐ సంస్థలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ మదనపల్లి నుంచి తిరుమలకు వైఎస్‌ఆర్ సీపీ మహిళా విభాగం పాదయాత్ర చేపట్టింది. పాదయాత్ర చేస్తున్న మహిళలను పీలేరులో కొండా సురేఖ, ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి కలిశారు. పాదయాత్ర చేపట్టిన గాయత్రిదేవికి కొండా సురేఖ అభినందనలు తెలిపారు.

విశాఖలో జగన్ కోసం 'జనం సంతకం'

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ ఆయన అభిమానులు విశాఖపట్నంలో కోటి సంతకాల సేకరణ మొదలుపెట్టారు. మహిళలు పెద్ద ఎత్తున కోటిసంతకాల సేకరణలో పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా కేంద్రంలోని కొందరు అడ్డుకుంటున్నారని ప్రజలు మండిపడ్డారు. అన్యాయంగా వైఎస్ జగన్‌ను జైల్లో పెట్టారని విమర్శించారు. కోటి సంతకాలను గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపిస్తామని వైఎస్ జగన్ అభిమానులు తెలిపారు.

బెయిలుపై ఉత్తర్వులకు ముందు బయటికొస్తున్న భూతాలు


తొలిసారి సీబీఐ కోర్టులో బెయిలు వేసినప్పటి నుంచీ ఇదే తీరు
అప్పట్లో టైమ్ చూసుకుని ‘బెయిల్ డీల్’ వ్యవహారం వెల్లడి
తరవాత హైకోర్టులో ఒక్కరోజు ముందు అనుబంధ చార్జిషీటు దాఖలు
సుప్రీంలో తొలుత లాయరును మార్చారంటూ మీడియాకు లీకులు
తీర్పునకు ఒక్కరోజు ముందు చిదంబరం ద్వారా టీడీపీ నేతల డ్రామా
వారు అడిగిన వెంటనే ‘ఈడీ’ ద్వారా ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆదేశాలు
ఇపుడు హైకోర్టులో బెయిలుపై ఉత్తర్వులకు ముందు కూడా అదే తీరు
ప్రతిసారీ బయటపడుతున్న సీబీఐ- కేంద్రం- టీడీపీల కుమ్మక్కు కుట్ర
ఎమ్మార్‌కు భూమిని కేటాయించిన బాబును విచారించనే లేదు
ఐఎంజీ కేసులో తమకు సిబ్బంది లేరంటూ తప్పించుకున్న సీబీఐ
అదే జగన్ కేసులోనైతే అన్నీ ఆగమేఘాల మీదే

అందరికీ అర్థమవుతూనే ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. అయినా అదే పద్ధతి. పదే పదే అవే మాయోపాయాలు. ఒక్క వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డిని జైల్లో పెట్టడానికి ఎన్ని కుట్రలు పన్నారో... ఆయనకు బెయిలు రాకుండా చేసేందుకు అంతకు మించిన కుట్రలు సాగిస్తున్నారు. జనహితాన్ని చూడాల్సిన ప్రభుత్వం... నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ సంస్థలు... అన్యాయాన్ని ఎండగట్టాల్సిన ప్రతిపక్షం మూడూ కుమ్మక్కయి ఒక్క వ్యక్తిని అణిచేయటానికి అంతకంతకూదిగజారిపోతున్న వైనం బహుశా... ఇంకెక్కడా చూడలేమేమో!!

‘సాక్షి’ పెట్టుబడుల వ్యవహారంలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేసింది ఈ ఏడాది మే 27న. అది కూడా కోర్టు సమన్లు అందుకుని... వాటి మేరకు మరో 24 గంటల్లో కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా. అది కూడా... మూడ్రోజుల పాటు ఉదయం నుంచి రాత్రి వరకూ ఏకబిగిన ఆయన్ను విచారించాక. అది కూడా... ఆయన్ను కనీసం విచారించకుండా మూడు చార్జిషీట్లు దాఖలు చేసేశాక.

? మరి దీన్నేమనాలి? కుట్ర కాక ఇంకేమనాలి? కోర్టుకు హాజరై పూచీకత్తు సమర్పించి బెయిలు తీసుకుంటే ఇక అరెస్టు చేయటం కుదరదనే హడావుడిగా అరెస్టు చేశారనుకోవద్దా? వెనక నుంచి ఎవరో నడిపించబట్టే అంతా స్క్రిప్టు ప్రకారం జరిపించారని అనుకోవద్దా? స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఇలా వ్యవహరించవచ్చా?

బెయిలుకు ముందు ప్రతిసారీ...
అరెస్టు కుట్రను ఇంత పచ్చిగా కళ్లకు కట్టిన సీబీఐ... వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు కోసం పిటిషన్ వేసినపుడు కూడా అడ్డగోలు వాదనలే చేసింది. సరికదా... ఆ బెయిలుపై తీర్పు మరికొద్ది గంటల్లో వస్తుందని అనుకున్న ప్రతిసారీ.. ఏదో ఒక హైడ్రామాకు తెర లేపుతూనే ఉంది. ఒకటా రెండా... ఇప్పటిదాకా వై.ఎస్.జగన్ బెయిలుపై తీర్పు వెలువడిన ప్రతిసారీ ఈ పథకాన్ని అమలు చేస్తూనే వస్తోంది.

జడ్జిలను బ్లాక్‌మెయిల్ చేసే స్థాయిలో...?
అరెస్టయిన వెంటనే దాన్ని సవాలు చేస్తూ సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిలు మంజూరు చేయాలని కోరారు. దీనిపై జూన్ 1న కోర్టు తీర్పు వెలువరించింది. కాకపోతే ఆ తీర్పు వెలువడటానికి కొన్ని గంటల ముందు సీబీఐ చేసిన పనేంటో తెలుసా? గాలి జనార్దనరెడ్డి బెయిలు కోసం జడ్జిలకు ముడుపులిచ్చిన వ్యవహారాన్ని బయటపెట్టడం. అప్పటికి నాలుగురోజుల ముందే తమకు అందిన సమాచారాన్ని... సమయం కోసం కాసుకు కూర్చుని మరీ బెయిలుపై తీర్పు వెలువడటానికి కొన్ని గంటల ముందు బయటకు వెల్లడించింది. నిజానికి ఈ వ్యవహారాన్ని బయటపెట్టడాన్ని గానీ, మీడియాకు చెప్పటాన్ని గానీ ఎవ్వరూ ప్రశ్నించలేదు. కాకుంటే ఆ బయటపెట్టిన సమయంపై మాత్రం తీవ్రస్థాయి సందేహాలు వ్యక్తమయ్యాయి. అంతకుముందే తమకు ఆ సమాచారం అందినా దాన్ని ఎందుకు బయటకు వెల్లడించలేదన్న విషయమై సీబీఐ నుంచి సైతం సరైన సమాధానం రాలేదు. ఇదంతా జగన్‌కు బెయిలివ్వటంపై ప్రభావాన్ని చూపించిందని, ఆయనకు బెయిలివ్వాలంటేనే జడ్జిలు భయపడే స్థాయిలో సీబీఐ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిందని రాజకీయ నేతల నుంచి విమర్శలెన్నో వచ్చాయి. అవి నిజం కాదని చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు కూడా.

అనుబంధం పేరిట హైకోర్టులో కూడా...
సీబీఐ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు జగన్‌మోహన్‌రెడ్డి. వాదప్రతివాదాలు జరిగాయి. చివరకు జూలై 4న ఉత్తర్వులిస్తామని కోర్టు స్పష్టం చేసింది. అంతే! సీబీఐ మళ్లీ తన కుట్రకు పదును పెట్టేసింది. మరికొన్ని గంటల ముందు... అంటే జూలై 3న అనుబంధ చార్జిషీటును దాఖలు చేసింది. అపుడెపుడో మార్చి 31న దాఖలు చేసిన తొలి చార్జిషీటుకు అనుబంధమంటూ కొన్ని పత్రాలు దాఖలు చేసింది. వాటిలో కొత్త అంశాలేవీ లేవని, ఈ కేసులో ఏదో ఉందని... బెయిలిస్తే ప్రమాదమని న్యాయవ్యవస్థకు సంకేతాలివ్వటానికే సీబీఐ ఇలా చేసిందని విమర్శలు సైతం వచ్చాయి. మరోవంక ఈ అనుబంధ ఛార్జిషీట్‌ను ఉటంకిస్తూ ఒక వర్గం మీడియాలో పతాకస్థాయి కథనాలు వెలువడ్డాయి. షరా మామూలే. వాటిలో కొత్త విషయాలేవీ లేకపోయినా ఒక సంచలనం సృష్టించే ప్రయత్నం మాత్రం చేశాయి.

లాయరు మారారంటూ మీడియా లీకులు...
ఇది మరీ ఘోరం. దిగజారుడుకు పరాకాష్ట అనే చెప్పాలి. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బెయిలు కోసం సుప్రీంకోర్టులో జగన్ అప్పీలు చేయటంతో సీబీఐ చిత్రమైన విన్యాసాలు చేసింది. బెయిలుపై ఉత్తర్వులు వెలువడే ముందు... సీబీఐకి రెగ్యులర్‌గా వచ్చే లాయరు మారారని, ఆయన బదులుగా వచ్చిన ప్రభుత్వ న్యాయవాదికసలు మాట్లాడటమే రాదని, చట్టం గురించే తెలియదని చెబుతూ ఒక వర్గం మీడియా విష ప్రచారానికి దిగింది. సీబీఐ ఈ లీకుల్ని పెంచి పోషించింది. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌తో రాజీకొచ్చారని, అందుకే లాయరును మార్చి ఉండవచ్చని ఆ మీడియా వండి వార్చేసింది.

? అసలు ఏ న్యాయవాది ఉంటే ఏం? సీబీఐ చెప్పే వాదననే కదా ఆ లాయరు వినిపించేది? అంతా ప్రభుత్వ న్యాయవాదులే కదా? ఏం... చదువుకోకుండానే, ప్రతిభ లేకుండానే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సొలిసిటర్ జనరళ్లు అయిపోతారా? ఇంత ఘోరమైన వాదన ఎక్కడైనా ఉంటుందా? ఒక లాయరు కారణంగా సీబీఐ కేసు గెలవటమో, ఓడిపోవటమో జరిగే పరిస్థితి ఉందా? ఎందుకిలాంటి కుట్రలు? మరి జగన్ కుమ్మక్కయితే బెయిలెందుకు రాలేదు? వీటికి సీబీఐ ఎప్పటికీ జవాబులు చెప్పలేదేమో!!

తెలుగుదేశం- కేంద్రం కలిసి మరీ కుట్ర...
మళ్లీ పాత లాయరు వచ్చి, వాదనలు పూర్తయి.. సుప్రీంకోర్టులో బెయిలు పిటిషన్‌పై ఉత్తర్వులు రాబోయే తరుణంలో ఈ సారి తెలుగుదేశం పార్టీ నేరుగా రంగంలోకి దిగింది. మరికొద్ది గంటల్లో తీర్పు వెలువడనున్నదనగా... నామా నాగ్వేరరావుతో సహా తెలుగుదేశం ఎంపీలు ఆర్థికమంత్రి చిదంబరాన్ని కలిశారు. వై.ఎస్.జగన్ ఆస్తుల్ని స్తంభింపజేయాలని కోరుతూ ఒక నోట్ సమర్పించారు. వారు కోరిన కొన్ని గంటల్లో... సాక్షికి సంబంధించిన కొన్ని ఆస్తులతో పాటు, సాక్షి ఇన్వెస్టర్లయిన హెటెరో డ్రగ్స్, అరబిందో ఫార్మాలకు చెందిన కొన్ని ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నట్లు పేర్కొంటూ ఢిల్లీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఒక నోట్ విడుదల చేసింది. తరువాతి రోజు బెయిలును తిరస్కరిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది.

? అసలు తీర్పునకు కొన్ని గంటల ముందు టీడీపీ ఎంపీలు ఆర్థికమంత్రిని కలవటమేంటి...? వారు కోరినట్లుగా కొన్ని గంటల్లోనే ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఆర్థిక శాఖ పరిధిలోని ఈడీ నోట్ విడుదల చేయటమేంటి? ఇదంతా ఎందుకు? ఈ కేసులో తామెలా వ్యవహరించాలని అనుకుంటున్నామో బయటకు స్పష్టంగా చెప్పటానికి కాదా? న్యాయ వ్యవస్థను సైతం ప్రభావితం చేయడానికి కాదా? ఈ కుట్రలు తెలియనిదెవరికి?

ధర్మాన ప్రాసిక్యూషన్‌తో మరో కుట్ర!
తనను అరెస్టు చేసింది మొదటి చార్జిషీటులోనని, అరెస్టుకు ముందే ఆ చార్జిషీటు దాఖలు చేశారు కనుక... అరెస్టు చేసిన 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేయలేదు కనక బెయిలివ్వాలని కోరుతూ గతనెల 16న సీబీఐ కోర్టులో జగన్ స్టాట్యుటరీ బెయిలు పిటిషన్ వేశారు. విచారణ అనంతరం గతనెల 29న కోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే స్టాట్యుటరీ అంశాన్ని ప్రస్తావించకుండానే తిరస్కరించటంతో దాన్ని హైకోర్టులో సవాల్ చేశారు జగన్. వాదప్రతివాదనలు ముగిశాయి. సోమవారం ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.

బెయిలు ఉత్తర్వులకు ముందు ప్రతిసారీ ఏదో ఒక భూతాన్ని బయటపెడుతున్నట్లు చేస్తున్న సీబీఐ ఈసారి కూడా అదే ఎత్తులకు దిగింది. వాన్‌పిక్ కేసులో నిందితుడైన రాష్ట్ర మంత్రి దర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌ను తెరపైకి తెచ్చింది. నిజానికి ఈ ఏడాది ఆగస్టు 10న ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని సీబీఐ అడిగింది. న్యాయ సలహా పేరిట ప్రభుత్వం నాలుగు నెలలు నాన్చింది. చివరకు ఇటీవలే తిరస్కరించింది. ఇన్నాళ్లూ కిమ్మనకుండా ఊరుకున్న సీబీఐ... సరిగ్గా బెయిలుపై ఉత్తర్వులు వెలువడే ముందు... అసలు మంత్రి ప్రాసిక్యూషన్‌కు తమకు ప్రభుత్వ అనుమతేమీ అక్కర్లేదంటూ ఈ నెల 13న తాము కోర్టులో వేసిన మెమోను సీబీఐ లీకు చేసింది.

? మంత్రి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అక్కర్లేనపుడు మరి ఇన్నాళ్లూ సీబీఐ దానికోసం ఎందుకు పట్టుబట్టినట్లు? ఈ నెల 13న గోప్యంగా వేసిన మెమోను ఇప్పుడెందుకు బయటపెట్టినట్లు? ఇదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని గవర్నరు వ్యతిరేకిస్తూ ఆ ఫైలును తిరిగి ప్రభుత్వానికి పంపటంలో ఆంతర్యమేమిటి? ఇదంతా సరిగ్గా ఇప్పుడే ఎందుకు జరుగుతున్నట్లు? ఓ వర్గం మీడియా దీనికి పతాక శీర్షికలు కట్టి ఎందుకు ప్రాధాన్యమిస్తోంది? ఇదంతా సీబీహైడ్రామా కాదని ఎవ్వరైనా చెప్పగలరా?

బ్రహ్మానందరెడ్డి ప్రాసిక్యూషన్‌కూ ఇప్పుడే అనుమతా?
ఇంకా చిత్రమేంటంటే హైకోర్టు తీర్పు కొన్ని గంటల్లో వెలువడనున్న ఈ తరుణంలోనే... సీనియర్ అధికారి బ్రహ్మానందరెడ్డి ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి మంజూరు చేసింది. నిజానికి ఆయన ఏడు నెలలుగా జైల్లోనే ఉన్నారు. ఇప్పటికే ఆయన్ను సీబీఐ ప్రాసిక్యూట్ చేసింది కూడా.

? మరి సీబీఐ విచారించాక... ఇదే సమయంలో కేంద్రం ప్రాసిక్యూషన్‌కు ఓకే చేస్తూ ఉత్తర్వులిచ్చిందంటే ఏమనుకోవాలి? ఈ కుట్రలో కేంద్ర ప్రభుత్వానికి వాటా లేదని ఎవ్వరైనా చెప్పగలరా? కాంగ్రెస్-టీడీపీల కనుసన్నల్లోనే ఈ కుట్ర మొత్తం నడుస్తోందని చెప్పటానికి ఇంకా ఆధారాలేమైనా కావాలా? అసలు మోపిదేవిని, ధర్మానను ప్రాసిక్యూట్ చేయటానికి తమకు ఎవ్వరి అనుమతీ అవసరం లేదని చెబుతున్న సీబీఐ...ఈ ఫైళ్లన్నీ క్లియర్ కావటానికి కారణమైన కార్యదర్శి మన్మోహన్‌సింగ్‌ను ఇప్పటిదాకా ఎందుకు విచారించలేదు? ఆయన్నెందుకు పట్టించుకోవటం లేదు?

బాబు మాత్రం సీబీఐకి వీఐపీయే...
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు నుంచి బెయిలు వరకూ అడుగడుగునా కుట్ర బుద్ధి చూపిస్తున్న సీబీఐ... ఎందుకనో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై మాత్రం ఈగ కూడా వాలకుండా చూసుకుంటోంది. ఎమ్మార్ కేసులో అడుగడుగునా ఉల్లంఘనలకు పాల్పడటమే కాక... హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 535 ఎకరాలను గోల్ఫ్‌కోర్సు కోసం, శ్రీమంతుల విల్లాల కోసం కారుచౌకగా కట్టబెట్టేశారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ... ఈ కేసులో కూడా లేని లింకుల్ని వెదుకుతూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబీకులను, సన్నిహితులను వేధించటానికే ప్రయత్నించింది. అసలు 535 ఎకరాల స్థలాన్ని సింగిల్ టెండరు వేసిన సంస్థకు పోటీ లేకుండా ఎందుకు కట్టబెట్టారో, అలా చేయటం ద్వారా చంద్రబాబు ఏం లబ్ధి పొందారో తనకు అవసరం లేదన్నట్లు వ్యవహరించింది. ఇంత పెద్ద కేసులో విచారణ జరుపుతూ... సింగిల్ టెండరుపై భూమి కట్టబెట్టేసిన బాబును కనీసం విచారణకు సైతం పిలవలేదు. ఆయన్ను విచారించకుండానే తంతు ముగించేసింది కూడా.

? మరి దీన్నేమనాలి? చంద్రబాబుకు సీబీఐ ఎందుకు కొమ్ము కాస్తోంది? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టనని మాట ఇచ్చి... దాన్ని కాపాడుతూ వస్తున్నందుకా? కేంద్రంలో సైతం అంశాల వారీగా తన ఎంపీలను హోల్‌సేల్‌గా, రిటైల్‌గా విక్రయించేస్తున్నందుకా? సీబీఐ అనేది ఒక దర్యాప్తు ఏజెన్సీయా? లేక అధికార పార్టీకి అనుబంధ సంస్థా?

అదేజగన్ అయితే అన్నీ ఆగమేఘాలే...
చంద్రబాబునాయుడి తొమ్మిదిన్నరేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి వై.ఎస్.విజయమ్మ పిటిషన్ వేస్తే... దానిపై హైకోర్టు దర్యాప్తునకు ఆదేశిస్తే మూడు వారాల పాటు ముందుకే కదల్లేదు ఈ సీబీఐ. అదే జగన్‌మోహన్ రెడ్డి కేసుకు వచ్చేసరికి మాత్రం కోర్టు ఉత్తర్వులు వెలువడిన 48 గంటల్లోనే మన్నూమిన్నూ ఏకం చేసేసింది. జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీలు, నివాసాలు, ఇన్వెస్టర్ల కంపెనీలు, ఇళ్ళమీద మూకుమ్మడి దాడులు చేసింది. దేశంలో ఏ కేసులోనూ చేయలేని స్థాయిలో బృందాలను ఏర్పాటు చేసి... దాడులు చేసి ఒక రకమైన భయోత్పాతాన్ని సృష్టించింది.

? ఇదంతా ఎందుకు? తమతో విభేదిస్తే ఎలా ఉంటుందో చెప్పటానికా? ఆ రకంగా రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికా? సీబీఐ... దాని వెనకున్న పార్టీల ఉద్దేశాలు కనిపించటం లేదా?

కేసు వేయించటం నుంచే మొదలైన కుట్ర..
రెండు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించాక... ఆయన తనయుడికి రాష్ట్రంలో అభిమానం అంతకంతకూ పెరుగుతున్న సమయంలో కాంగ్రెస్ తన ఎమ్మెల్యే శంకర్రావుతో కేసు వేయించటమే ఈ కుట్రకు ఆరంభం... పరాకాష్ట కూడా. దాన్లో తెలుగుదేశం నేతలు జత కల వటం దిగజారుడుతనానికి, అపవిత్ర కలయికకు తారస్థాయి తప్ప మరొకటి కాదు. ఇంకా చిత్రమేంటంటే ఈ కేసులో ప్రతివాదులుగా ఒకటి నుంచి 9 వరకు ప్రభుత్వ విభాగాలే ఉన్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి 52వ ప్రతివాది. అయినప్పటికీ ఈ కేసులో హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానమూ ఇవ్వలేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వానిది తప్పో, ఒప్పో తేలకుంటే ఈ కేసే లేదు. అలాంటి కేసులో ప్రభుత్వం సమాధానం ఇవ్వకున్నా... ఆ ఒక్క కారణంతో కేసు కొట్టేయలేమన్న న్యాయమూర్తి అభిప్రాయం కారణంగా తీర్పు జగన్‌మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా వచ్చేసింది.

? అసలు ఈ కేసేంటి? వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ ఆస్తులు, కాంట్రాక్టులు, ప్రాజెక్టులు కొందరు పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని, అందుకు ప్రతిగా వారు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని. మరి ఈ ప్రాజెక్టుల్ని, కాంట్రాక్టుల్ని కట్టబెట్టినపుడు నిబంధనల ఉల్లంఘన ఏమైనా జరిగిందా? అడ్డగోలుగా ఏమైనా కట్టెబెట్టేశారా? అన్నీ నిబంధనల ప్రకారం జరిగి ఉంటే వారు ముడుపులు చెల్లించాల్సిన అవసరం ఎందుకుంటుంది? ప్రతీదీ జీవోల మేరకు జరిగిందే కదా? మరి ఆ జీవోలు తప్పో, ఒప్పో ప్రభుత్వం చెప్పాలి కదా? ప్రభుత్వం కోర్టుకు సమాధానమెందుకు చెప్పలేదు? జగన్‌మోహన్‌రెడ్డిని ఇరికించడానికి కాదా? మరి ఇన్నాళ్లూ ఊరుకుని, ఇపుడు ఆ జీవోలిచ్చిన మంత్రులకు ప్రభుత్వమే న్యాయ సహాయం అందించి మరీ సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఎందుకు వేయిస్తోంది? ఆ జీవోల్లో ఎలాంటి తప్పూ జరగలేదని ఇపుడు సుప్రీంకోర్టుకు చెబుతున్న ఆ సెక్రటరీలు... మంత్రులు హైకోర్టులోనే ఈ విషయం చెప్పి ఉంటే ఈ కేసు ఉండేదా? జగన్ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండేదా? ఒక్క జగన్ కోసం ఆది నుంచీ పథకం ప్రకారం ఈ కుట్రను నడిపించారని చెప్పటానికి ఇంకా ఏం కావాలి? అసలు వీళ్లని ఏమనుకోవాలి? వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవించి ఉండగా వేనోళ్ల పొగిడిన నేతలు... ఆ తరవాత అధికారం కోసం ఇంత నైచ్యానికి దిగజారిపోవటం జనానికి తెలియటం లేదనుకోవాలా?


వాన్‌పిక్ అంటే ఐఎంజీలాంటి ప్రాజెక్టు కాదే?
అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులన్నీ ప్రైవేటు పరమయ్యాయి. కాకినాడ పోర్టయితే మరీ ఘోరం. నిక్షేపంగా నడుస్తున్న పోర్టును... ఆదాయం తెస్తున్న పోర్టును... విస్తరణకు నిధుల్లేవన్న కారణంతో ప్రైవేటు పరం చేశారు చంద్రబాబు. అది కూడా తన సన్నిహితుడు, మలేసియా ప్రధాని మహతిర్ మహమ్మద్ తనయుడి సంస్థకే. పెపైచ్చు దాన్లో తన సన్నిహిత సంస్థ ఎల్ అండ్ టీకి వాటా కూడా ఇచ్చారు. ఆ సంస్థ విస్తరణ మరిచి, ప్రభుత్వానికి లీజు చెల్లించకుండా ఆదాయం సాధించి... దాన్నే పెట్టుబడిగా విస్తరించినా కిమ్మనలేదు. పెపైచ్చు దానికి అనుకూలంగా నిబంధనలనూ మార్చేశారు. పెపైచ్చు ఐఎంజీ, ఎమ్మార్ వంటి సంస్థలకు రాజధాని నడిబొడ్డున అత్యంత ఖరీదైన భూముల్ని కట్టబెట్టారు. ఇవేవీ పట్టించుకోని సీబీఐ... ఎమ్మార్ విషయంలో తాము బాబుపై విచారణ జరపబోమని, ఐఎంజీపై దర్యాప్తు జరపడానికి తమ దగ్గర తగినంత సిబ్బంది లేరని చెప్పిన సీబీఐ... ఎక్కడో వెనకబడిన ప్రకాశం జిల్లాలో... సముద్ర తీరాన ఉన్న భూములను పోర్టు కోసం వాన్‌పిక్‌కు కేటాయిస్తే మాత్రం క్షమించరాని తప్పిదమంటూ యాగీ చేస్తోంది. ఆ భూములతో పారిశ్రామికవేత్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటారంటూ అడ్డగోలుగా వాదిస్తోంది.

? ఇంతకన్నా ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా? అసలు ఆ వాన్‌పిక్ పోర్టును చంద్రబాబు ప్రభుత్వం గతంలోనే స్కోడా కంపెనీకి కట్టబెట్టే ప్రయత్నం చేయటం సీబీఐకి తెలియదా? స్కోడా కంపెనీ వెనక్కి వెళ్లిపోవటం వల్లే కదా వాన్‌పిక్ తెరమీదికి వచ్చింది? అసలు ఈ పోర్టు ప్రతిపాదన చేసింది చంద్రబాబే కదా? ఇవన్నీ సీబీఐ ఎందుకు మరిచిపోతోంది?

వెనకబడిన జిల్లాలో పోర్టుకోసం భూముల్ని కొని భారీ ప్రాజెక్టును మొదలుపెట్టిన పారిశ్రామిక వేత్తలెవరూ అది రియల్ ఎస్టేట్ వ్యాపారంలా తక్షణమే లాభాలిస్తుందని ఆశించరు. అదేమీ విల్లాల ప్రాజెక్టులా తక్షణమే లాభాలనిచ్చే ప్రాజెక్టూ కాదు. పోర్టు నిర్మాణం పూర్తయి పని ప్రారంభించిన తరవాత మాత్రమే అలాంటి పారిశ్రామిక వేత్తలకు ఆదాయం లభిస్తుంది. అదీగాక, వాన్‌పిక్ ప్రాజెక్టును వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించింది ఒక కంపెనీకేమీ కాదు. ఒక ప్రభుత్వానికి. రస్ అల్ ఖైమా దేశానికి. ఆ దేశానికైనా, ఆ ప్రభుత్వానికైనా ఇక్కడ పనులను చూసుకోవటానికి స్థానిక ప్రతినిధి ఒకరు ఉండక తప్పదు. ఆ స్థానిక ప్రతినిధిగా అప్పటికే పారిశ్రామిక రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని సాధించిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను రాక్ ప్రభుత్వం ఎంచుకుంది. ఇదంతా సీబీఐకి కనిపించకపోవటంలో విచిత్రమేమీ లేదనే అనుకోవాలి. ఎందుకంటే అది నడుస్తున్నది ఆది నుంచీ రాంగ్ రూట్లోనే. కొందరు పెద్దలు చెబుతున్న రూట్లోనే.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=54776&Categoryid=1&subcatid=1

కాంగ్రెస్ వైఖరి చెప్పాల్సిందే

అక్షర క్రమం, సంఖ్యాపరంగా కాంగ్రెసే ముందుంటుంది
తెలంగాణపై ముందుగా వారి అభిప్రాయం చెప్పాల్సిందే
డొంకతిరుగుడు మాటలతో తప్పించుకోవడం కుదరదు
నిర్ణయాధికారం కేంద్రప్రభుత్వానిది, కాంగ్రెస్‌ది కాదు
అవగాహన కోసమే అఖిలపక్షమనడం భావదారిద్య్రం
అసంతృప్తులను బుజ్జగించడానికే అఖిలపక్షం నాటకం
మా పార్టీనుంచి ఒకే అభిప్రాయం వెల్లడిస్తాం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అంశంపై ఈ నెల 28న ఢిల్లీలో జరిగే అఖిలపక్ష సమావేశంలో ఒక రాజకీయ పార్టీ హోదాలో కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేసి తీరాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి శనివారంనాడిక్కడ పార్టీ ముఖ్య నేతలు కె.కె.మహేందర్‌రెడ్డి, రాజ్‌సింగ్ ఠాకూర్, జిట్టా బాలకృష్ణారెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో జరిగే అఖిలపక్ష భేటీలో తమ వైఖరేంటో చెప్పబోమని, కేవలం వింటామని కాంగ్రెస్ నేతలు అనడాన్ని ఆయన తప్పుపట్టారు. మీరేమైనా న్యాయమూర్తులా... లేక న్యాయ నిర్ణేతలా... ఊరికే వినడానికి? అని ప్రశ్నించారు. ఈ భేటీకి హాజరు కావాలంటూ కేంద్ర హోంశాఖ ఆహ్వానాలు పంపిన ఎనిమిది రాజకీయ పార్టీల్లో కాంగ్రెస్ ఒకటని... టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, వామపక్షాలు ఎలాగో ఆ పార్టీ కూడా అంతేనని ఆయన గుర్తు చేశారు. అక్షర క్రమం ప్రకారం చూసినా, సంఖ్యాపరంగా చూసినా కాంగ్రెసే ముందుంటుంది కనుక ఆ పార్టీయే అందరి కన్నా ముందుగా తెలంగాణపై తన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.

సమావేశానికి వెళ్లినపుడు తమ పార్టీ ఆ విధంగా కోరుతుందని కూడా మైసూరా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాంగ్రెస్ తన వైఖరేంటో చెప్పకుండా తప్పించుకుంటానంటే కుదరదని, ఆ పప్పులేమీ ఉడకవని స్పష్టంచేశారు. జాతీయ స్థాయిలో కార్యనిర్వాహక స్థానంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చేతిలో నిర్ణయాధికారం ఉంటుందని, కాంగ్రెస్ మాత్రం ఒక రాజకీయ పక్షం లాంటిదేనని ఆయన వివరించారు. చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలను ఆహ్వానించడానికి సంబంధించి తీర్మానం లోక్‌సభలో వచ్చినపుడు తమ పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించడానికి హోంశాఖ అఖిలపక్ష భేటీ అనే నాటకానికి తెరతీసిందని, అందువల్ల దీంట్లో కాంగ్రెస్ వేషం వేసుకుని తన పాత్ర పోషించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.

షిండేది భావదారిద్య్రం: కేవలం అవగాహన కోసమే అఖిలపక్షం ఏర్పాటు చేశామని చెప్పడం కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే భావదారిద్య్రానికి నిదర్శనమని మైసూరా ధ్వజమెత్తారు. హోంమంత్రిగా ఎవరున్నా ఆ శాఖ పని నిరంతరం కొనసాగుతుండే ప్రక్రియ అని, ఈ అంశంపై ఇప్పటికే ఏం జరిగిందో ఫైళ్లలో ఉంటాయని, వాటిని చూసి కొత్తగా వచ్చిన వారు అవగాహన చేసుకోవచ్చని చెప్పారు. దీనిపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా ఉందన్నారు. వీటిని కాదని మంత్రి మారినప్పుడల్లా అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్యను తెలుసుకుంటాననడం చూస్తే అసలు షిండే దేశానికి హోంమంత్రిగా పనికి వస్తారో రారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. ఇచ్చేది, తెచ్చేది తామే కనుక కాంగ్రెస్ తెలంగాణపై తమ వైఖరి చెప్పాల్సిన అవసరం లేదని చెబుతూండటాన్ని విలేకరులు ప్రస్తావించగా... తెచ్చేది, ఇచ్చేది, చచ్చేది కేంద్ర ప్రభుత్వమే తప్ప కాంగ్రెస్ పార్టీ కాదని, అఖిలపక్షం కూడా కేంద్రమే నిర్వహిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై తమ పార్టీ నుంచి ఒకే అభిప్రాయం ఉంటుందని 28వతేదీ లోపే నేతలు సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాయలసీమ వాదుల నుంచి, టీజేఏసీ నుంచి తమకు విజ్ఞప్తులు అందాయని నిర్ణయం తీసుకునేటపుడు పార్టీ వాటన్నింటినీ పరిశీలిస్తుందని మైసూరా తెలిపారు. 

అమెరికా, కువైట్‌లలో జగన్ జన్మదిన వేడుకలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా, కువైట్, దుబాయ్ తదితర దేశాల్లో అభిమానులు, కార్యకర్తలు పలుసేవా కార్యక్రమాలు చేపట్టినట్టు పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈశాన్య అమెరికాలో ఉంటున్న వైఎస్ అభిమానులు నిత్యావసర సరుకులు సేకరించి న్యూజెర్సీలోని మెర్సర్ స్ట్రీట్ ఫ్రెండ్స్, న్యూయార్క్‌లోని పీపుల్ టూ పీపుల్ అనే సంస్థలకు విరాళంగా అందజేశారు. ఆళ్ల రామిరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు.

కువైట్‌లోనూ: జగన్ పుట్టినరోజు సందర్భంగా కువైట్‌లో 3వేల మంది సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్ అక్రమ అరెస్టుకు నిరసనగా సంతకాల సేకరణ చేశారు. వీటిని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు పంపించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆకుల ప్రభాకర్, చంద్రశేఖర్‌రెడ్డి, గోవింద్ నాగరాజు, సయీద్ నాజర్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

లాఠీచార్జీ అమానుషం: విజయమ్మ

దేశ రాజధానిలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపేందుకు వెళ్లిన విద్యార్థులపై ఢిల్లీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా తిరగగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ అన్నారు. నేటికి కూడా దేశ రాజధానిలోనే పట్టపగలు మహిళలు ఒంటరిగా సంచరించే పరిస్థితి లేదు. ఢిల్లీ నడివీధుల్లో ఓ వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిందంటే, పరిస్థితులు ఎంతగా దిగజారాయో అర్థమవుతోంది’ అని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనకు కారణమైన మూలాలపై అధ్యయనం చేయకుండా, నిరసనకారులపై లాఠీలు ప్రయోగించడం అమానుషమన్నారు.

గోల్ కొడతాడు, ప్రత్యర్థుల్ని గల్లంతు చేస్తాడు


ఆంధ్ర దేశమంతటా జగన్ అనే ఒకే ఒక నినాదం ప్రతిధ్వనిస్తుంటే ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక కట్టడి చేయడానికి వేరే మార్గం లేక నిత్యం ప్రజలమధ్య ఉండవలసిన వ్యక్తిని జైలుపాలు చేయడం ఎంతవరకు న్యాయం? ఈ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేకనే రాష్ర్ట ప్రజలంతా ఎప్పుడు ఎన్నికలొస్తాయా, అని ఎదురు చూస్తూ తమ వద్ద ఉన్న ఓటు అనే ఆయుధాన్ని జగన్‌ని, ఆయన కుటుంబాన్ని టార్చర్ పెడుతున్న వారిపై ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రత్యర్థులను తేరుకోకుండా చేయాలని ఎదురుచూస్తున్నారు. సెలెక్ట్ బిఫోర్ ఎలెక్ట్ అన్న చందంగా ఎలెక్షన్స్ నామ్ కే వాస్తే అని జగన్‌ను సెలెక్ట్ చేసుకుని, అతనే మా ముఖ్యమంత్రి అని యువకులు ఎప్పుడో ప్రకటించారు.

అదే సమయంలో షర్మిలమ్మ ‘మరో ప్రజాప్రస్థానం’తో కాంగ్రెస్ అధిష్టానం కళ్లు బైర్లు కమ్మే స్థితి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో పాలకపక్షం, ప్రతిపక్షం బీరాలు పలుకుతూ బేరాలు చేస్తూ ఎన్నాళ్లు ప్రజల్ని వంచించగలరు? ఎన్నాళ్లీ మేకపోతు గాంభీర్యం? రాష్ట్రంలోని పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారు. ‘పదునాల్గు భువనాలు ఏకమైనా రెండువేల పదునాల్గులో జగనే ముఖ్యమంత్రి’ అని తేలిపోయింది.

ఎవ్వరేమన్నను, తోడు రాకున్నను, పోరా బాబూ పోరా, నీ గమ్యం చేరిపోరా అన్నట్టుగా జగన్ తన ‘గోల్’ను సాధించి, ఇతర పార్టీలను ‘గోల్‌మాల్’ చేస్తాడు. ఆంధ్రదేశ నలుమూలలా తిరిగి రాజన్న అభివాదం చేస్తుంటే ప్రజలంతా అభిమానంతో చెయ్యెత్తి జైకొట్టేవాళ్లు. ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉరకలేసేవాళ్లు. జనమంతా నీరాజనం పలికేవాళ్లు. అది మళ్లీ జగన్ రాకతోనే సాధ్యం. ప్రజాభిమానం, ప్రజావిశ్వాసం ఉన్న నిజాయతీ, నిస్వార్థం గల నాయకులారా! ఇకనైనా మేల్కోండి. జగన్ వెంట నడవడానికి సిద్ధం కండి. ప్రజాసేవ చేసుకుని ధన్యులు కండి. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడండి.
- దాసరి నాగేశ్వరరావు, బొబ్బిలి, విజయనగరం


http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=54771&Categoryid=11&subcatid=25

చెట్లమట్లలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ

చెట్లమట్లలో వైఎస్సార్ విగ్రహాన్ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. రాజంపల్లెలో వేంచేసియున్న తిరుమలనాథ స్వామి ఆలయంలో శనివారం బాలినేని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెట్లమట్ల గ్రామానికి చేరుకున్న ఆయన అభిమానుల సమక్షంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా తిరుమలనాథ ఆలయ చైర్మన్ కోటిరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు గ్రామాల ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Paintings of YS Jagan attracts many eyes

Mysura Reddy Press Meet 22nd Dec 2012

కాంగ్రెస్ నిర్ణయం చెప్పాలి: మైసూరారెడ్డి

తెలంగాణపై తొలుత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చెప్పవలసి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఎం.వి. మైసూరా రెడ్డి అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర హొం మంత్రి మారినప్పుడల్లా అభిప్రాయాలు తెలుసుకోవడానికి సమావేశాలు నిర్వహించడం సరికాదన్నారు. తెలంగాణ అంశంపై గతంలో అఖిలపక్ష సమావేశాలు రెండు సార్లు నిర్వహించారు. కమిషన్ వేశారు. కమిషన్ నివేదిక ఇచ్చింది. వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అభిప్రాయం చెప్పకుండా ఇతరులను అభిప్రాయం చెప్పమనడం సరికాదన్నారు. తాము పార్టీలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

తెలంగాణ జేఏసీ ప్రతినిధుల వినతిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు మైసూరారెడ్డి తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ జేఏసీ కన్వీనర్ కోదండరామ్ శనివారం వైఎస్ విజయమ్మను కలిశారు. 

భేటీ అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విజయమ్మ చెప్పారన్నారు. 28న పార్టీలు చెప్పే అభిప్రాయాలను బట్టి భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని కోదండరామ్ తెలిపారు. విజయమ్మను కలిసినవారిలో జేఏసీ ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్, దేవీప్రసాద్ తదితరులు ఉన్నారు.

sakshi

Friday 21 December 2012

‘వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగ’ సదస్సు ఫిబ్రవరిలో..

వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్-128) రాష్ట్ర స్థాయి సదస్సును వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించారు. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు బీ జనక్‌ప్రసాద్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనియన్ ముఖ్యనేతల సమావేశం శుక్రవారం తొలిసారిగా జరిగింది. పలు జిల్లాల నుంచి విద్యుత్ ఉద్యోగుల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆచరణ సాధ్యమైన డిమాండ్లనే యాజమాన్యాల ముందు పెట్టాలని సమావేశం అభిప్రాయపడింది. 

అన్న దానాలు.. వైద్య శిబిరాలు

దేవాలయాలు, చర్చి, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను నిరసిస్తూ నిరసనలు
జైలులో జగన్‌ను కలసిన కుటుంబసభ్యులు

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉచిత మెగా వైద్యశిబిరాలు, రక్తదానం, పేదలకు దుస్తులు, వికలాంగులకు వీల్‌చైర్స్, వృద్ధులకు చేతికర్రలు అందజేయడం, ఆసుపత్రులలో పండ్లు, విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, పెన్నులు పంపిణీతో పాటు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై జగన్‌ను అక్రమంగా అరెస్టు చేయించడానికి నిరసనగా పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జీలతో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. చంచల్‌గూడ జైల్లో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డిని కుటుంబసభ్యులు ప్రత్యేక ములాఖత్ ద్వారా కలుసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

జగన్‌ను కలిసిన వారిలో తల్లి విజయమ్మ, భార్య భారతి, కూతుళ్లు హర్ష, వర్ష, షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి ఉన్నారు. అనంతరం వారు తిరిగి వెళ్లే ముందు జైలు బయట పార్టీనేతల కోరిక మేరకు వారు తీసుకొచ్చిన కేక్‌ను విజయమ్మ కట్‌చేశారు. అంతకుముందు వైఎస్సార్ కాంగ్రెస్ మైనారిటీ విభాగం కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్ జైలు వద్ద కేక్ కట్ చేసి, పావురాలను గాల్లోకి ఎగురవేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన జగన్ జన్మదిన కార్యక్రమాల్లో పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, నల్లా సూర్యప్రకాష్, జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, ఎంవీఎస్ నాగిరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, పీఎన్వీ ప్రసాద్, చల్లా మధుసూదన్‌రెడ్డిలతో పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాజధానిలోని పలు ప్రాంతాల్లో పార్టీనేతలు నిరసన, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 

రాష్ట్రవ్యాప్తంగా: జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో 100 మంది మహిళలు మదనపల్లె నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆయన పేరుపై ప్రత్యేక పూజలు చేయించారు. సీబీఐ తీరును నిరసిస్తూ కడపలోని వైఎస్‌ఆర్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ ఏడురోడ్ల కూడలి మీదుగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జగన్ అక్రమ అరెస్టును నిరసిస్తూ అనంతపురంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. గుంటూరుజిల్లా నరసరావుపేటలో రెండుచోట్ల 40 కేజీల భారీ కేక్‌లను కట్‌చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రకాశంజిల్లా ఒంగోలులోని బధిరుల పాఠశాలలో అన్నదానం నిర్వహించారు. నెల్లూరులో నిర్వహించిన భారీ ర్యాలీలో సుమారు 300 మీటర్ల పొడవైన పార్టీ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జగన్ నిర్దోషి అని, ఆయనను విడుదల చేయాలంటూ రాష్ట్రపతికి పంపేందుకు బుజబుజనెల్లూరులో రక్తంతో సంతకాల సేకరణ చేశారు. 

కృష్ణాజిల్లా నందివాడ మండలం జనార్ధనపురంలో వైఎస్సార్ గ్రామ సమైక్య సంఘ సభ్యులు వరి పొలంలో కట్టేత పనులు చేసి రూ. ఏడువేలు సంపాదించారు. ఆ మొత్తాన్ని గ్రామంలో మంచినీటి చెరువుల అభివృద్ధికి వినియోగించనున్నట్లు చెప్పారు. విజయవాడలోని సింగ్‌నగర్‌లో అంధుల పాటల కచేరీ నిర్వహించారు. నల్లగొండజిల్లా సూర్యాపేటలో భారీ కేక్‌ను కట్‌చేసి, వికలాంగునికి వీల్‌చైర్‌ను అందించారు. జగన్ విడుదల కాకుండా ప్రభుత్వం కుట్రపన్నడాన్ని నిరసిస్తూ ఖమ్మంలో పార్టీ కార్యకర్తలు రోడ్డు ఊడ్చారు. కరీంనగర్‌జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని అయ్యప్ప ఆలయానికి ఒక గదిని విరాళంగా ప్రకటించారు.

జగన్ సీఎం కావాల్సిందే
శతాధిక వృద్ధురాలి ఆకాంక్ష

‘‘పేదల కోసం పనిచేసిన మహానుభావుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. తిరిగి ఆయన పాలన రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. రాజన్న కొడుక్కి ఓటేసేందుకే నేను బతికున్నాను’’ అని తూర్పుగోదావరి జిల్లా రాజానగరానికి చెందిన శతాధిక వృద్ధురాలు పేకల చెల్లమ్మ చెప్పారు. జగన్‌కు జన్మదినం పేదలకు పండుగరోజులాంటిదన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం వేంపాడు గ్రామానికి చెందిన వరదానమ్మ తన ఇంటివద్ద జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. కేక్ కట్‌చేసి చుట్టుపక్కల ఇళ్లవారికి, స్కూల్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ‘‘నీ తండ్రి మరణాన్ని తట్టుకోలేక నా భర్త మరణిస్తే నన్ను, నా కుటుంబ సభ్యుల్ని మా ఇంటికి వచ్చి ఓదార్చావు.. మమ్మల్ని ఆపదలో ఆదుకున్నావు. నీవు నిండు నూరేళ్లు వర్ధిల్లు... కుట్రలు, కుతంత్రాలు అశాశ్వతం. విశ్వసనీయత, ఆదరణ, ఆత్మీయత ఎప్పటికీ నిలిచి ఉంటారుు. త్వరలోనే జనం మధ్యకి వస్తావు.. నీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ఆశీర్వదించారు.

సీబీఐ, ప్రభుత్వ తీరుపై అనుమానాలు

ప్రహసనంలా ధర్మాన ‘ప్రాసిక్యూషన్’

జగన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పులు వచ్చే ప్రతిసారీ ‘వ్యూహాత్మక’ చర్యలు
గతంలో ప్రభుత్వ అనుమతి కోరిన సీబీఐ.. అక్కర్లేదంటూ ఇప్పుడు పిటిషన్
ప్రాసిక్యూషన్ తిరస్కరణ ఫైలును తాజాగా తిప్పి పంపిన గవర్నర్! - 2లో

సాక్షి, హైదరాబాద్: మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతిని కోరిన సీబీఐ, ఇంతకాలం కిమ్మనకుండా ఉండి, అలాంటి అనుమతి తమకేమీ అక్కర్లేదని నాలుగు నెలల తర్వాత తాపీగా ఇప్పుడు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. సీబీఐ వైఖరి అనుమానాస్పదంగా మారిన నేపథ్యంలోనే.. ధర్మాన ప్రాసిక్యూషన్‌ను తిరస్కరిస్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో మంత్రిమండలి తీర్మానం చేసి పంపిన ఫైలును పలు సందేహాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ తిప్పిపంపడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫైలుపై గవర్నర్ ఎలాంటి అనుమానాలను లేవనెత్తారు? ఏ అంశాలపై న్యాయ సలహాలు సూచించారు? ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? మంత్రుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసిన తరుణంలోనే సంబంధిత ఫైలును గవర్నర్ వెనక్కి పంపిన విషయం బయటికి రావడంలోని ఆంతర్యమేమిటి? ..ఇలాంటి అనేక ప్రశ్నలు కాంగ్రెస్ నేతల్లోనే పెను చర్చకు దారి తీశాయి. 

ధర్మాన ప్రాసిక్యూషన్‌కు గత ఆగస్టు 10న రాష్ట్ర ప్రభుత్వాన్ని సీబీఐ అనుమతి కోరింది. న్యాయ సలహా తీసుకున్నాక నిర్ణయిస్తామంటూ నాలుగు నెలలకు పైగా దాన్ని కిరణ్ పక్కన పెట్టారు. అడ్వొకేట్ జనరల్ నుంచి వివరణ వచ్చాక.. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతి తిరస్కరిస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. ఆ మేరకు ఫైలును గవర్నర్‌కు పంపారు. అయితే, మంత్రి ధర్మాన, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదంటూ డిసెంబర్ 13న న్యాయస్థానం ముందు సీబీఐ అత్యంత గోప్యంగా మెమో దాఖలు చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న సమయంలోనే ఉన్నట్టుండి సీబీఐ దాఖలు చేసిన ఈ మెమో వ్యవహారం బయటికి లీకైంది! పైగా మంత్రిమండలి సిఫార్సు చేసిన ఫైలును పలు సందేహాలు వ్యక్తం చేస్తూ గవర్నర్ తిప్పిపంపిన విషయం సైతం సరిగ్గా ఈ సమయంలోనే బయటికి రావడం గమనార్హం. చూస్తుంటే ఇదంతా పక్కా పథకం ప్రకారం జరుగుతున్న వ్యవహారంలాగే కనబడుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. 

మంత్రుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేనప్పుడు, మొదట దానికోసం సీబీఐ ఎందుకు కోరినట్టంటూ పలువురు మంత్రులు విస్మయం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని 4 నెలల కిందట కోర్టుకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు అనుమతివ్వొద్దని మంత్రిమండలి తీర్మానం చేసినప్పుడు విపక్షంతో పాటు స్వపక్షం నుంచి కూడా పలు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిందని వారు గుర్తు చేస్తున్నారు. ఎక్సైజ్ మంత్రిగా ఉన్న మోపిదేవిని విచారణ కోసం దిల్‌కుశ అథితి గృహానికి పిలిచిన సీబీఐ, రెండో రోజు, అంటే మే 24న విచారణ అనంతరం ఉన్నపళంగా ఆయనను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. సరిగ్గా జగన్ సీబీఐ విచారణకు హాజరు కావడానికి ఒక రోజు ముందు ఇది జరిగింది! జగన్‌ను అరెస్టు చేయాలని కచ్చితమైన నిర్ణయానికి వచ్చినందునే, మంత్రులను ఎందుకు విస్మరించారన్న విమర్శలను తప్పించుకునేందుకు పథకం ప్రకారమే మోపిదేవిని అరెస్టు చేశారని అప్పట్లోనే విమర్శలు బలంగా విన్పించాయి. మే 25 నుంచి వరుసగా మూడు రోజుల పాటు జగన్‌ను సుదీర్ఘంగా విచారించిన సీబీఐ, ఆయనను అరెస్టు చేస్తున్నట్టు 27 రాత్రి 7.20కి తెలియజేసింది. మోపిదేవిని అరెస్టు చేసేటప్పటికి ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. 

కిరణ్ అగమేఘాలపై మోపిదేవి నుంచి రాజీనామా లేఖ తెప్పించుకుని, తక్షణం దానికి ఆమోదం తెలిపారు. పైగా మోపిదేవి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి గానీ, న్యాయ సలహాలు గానీ తీసుకోలేదు. ధర్మాన విషయంలో మాత్రం ప్రభుత్వ అనుమతి కోరుతూ గత ఆగస్టు 10న సీబీఐ లేఖ రాసింది. అది బయటికి తెలిశాక ఆగస్టు 14న ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేస్తూ కిరణ్‌కు లేఖ పంపారు. 4 నెలలు దాటుతున్నా దానిపై సీఎం నిర్ణయం తీసుకోలేదు. ఇంతలోనే ఉన్నట్టుండి, మంత్రుల ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అవసరం లేదని సీబీఐ కొత్త వాదనను తెరపైకి తేవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ధర్మాన 2009కి ముందు రెవెన్యూ మంత్రిగా ఉండగా తీసుకున్న నిర్ణయాలపై కేసు నడుస్తోంది.ఆయన పదవీకాలం 2009తో పూర్తయింది గనుక ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదు’ అని సీబీఐ కోర్టు ముందుంచిన మెమోలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. 4 నెలల క్రితం ధర్మాన ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వాన్ని అనుమతి కోరినప్పుడు కూడా ఈ విషయం సీబీఐకి తెలుసని, అయినా దాన్ని ఈ సమయంలోనే తెరపైకి తేవడంలో ఆంతర్యమేమిటని ఒక ఉన్నతాధికారి ప్రశ్నించారు. జగన్ బెయిల్ పిటిషన్లు కోర్టు ముందుకొచ్చే ప్రతిసారీ సీబీఐ ఇలా చేయడం పరిపాటి అయిందని కాంగ్రెస్ నేతల్లోనే వినిపిస్తోంది. 

హైకోర్టులో ప్రస్తుతం జగన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై వాదనలు పూర్తయి, ఈ నెల 24న తీర్పు రానుండటం తెలిసిందే. సరిగ్గా దానికి మూడు రోజుల ముందు సీబీఐ మెమో ఉదంతం, ధర్మాన ఫైలును గవర్నర్ తిప్పి పంపిన వార్త ఒకేసారి బయటికి వచ్చాయి! దీన్ని యాదృచ్ఛికంగా ఎంతమాత్రమూ చూడలేమని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. గత జూలైలో జగన్ జగన్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అందుకు తిరస్కరిస్తూ అక్టోబర్ 5న తీర్పు వచ్చింది. సరిగ్గా దానికి ఒక్క రోజు ముందు జగతి పబ్లికేషన్స్, జననీ ఇన్‌ఫ్రాల రూ.51 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేస్తున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఢిల్లీలో నోట్ విడుదల చేసింది. పైగా, టీడీపీ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి ‘విజ్ఞప్తి’ చేసీ చేయగానే ఈడీ నుంచి అటాచ్‌మెంట్ ఆదేశాలు వెల్లడయ్యాయి. ఇలాంటి సందర్భాలను లోతుగా విశ్లేషిస్తే పై ఆదేశాల మేరకే పథకం ప్రకారం సాగుతోందన్న అనుమానాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

అంతా గందరగోళమే...: శుక్రవారం నాటి ఉదంతాలతో రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో గందరగోళం నెలకొంది. ధర్మాన ప్రాసిక్యూషన్‌కు కేబినెట్ అనుమతి నిరాకరణతో అంతా సాఫీగా జరుగుతుందని భావిస్తున్న తరుణంలో.. ప్రాసిక్యూషన్‌కు అసలు ప్రభుత్వ అనుమతే అక్కర్లేదంటూ సీబీఐ కోర్టుకెక్కడం, సంబంధిత ఫైలును అదే సమయంలో గవర్నర్ తిప్పి పంపడం చూస్తుంటే అసలేం జరుగుతోందో తమకేమీ అంతుబట్టడం లేదని ఒక మంత్రి వాపోయారు. 

గతంలో సుప్రీంకోర్టు నుంచి నోటీసులందుకుని, వాటికి సమాధానాలు పంపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న మంత్రులను కూడా తాజా పరిణామాలు ఆందోళనలో పడేశాయి. మున్ముందు చిక్కులు తలెత్తకుండా ధర్మాన ఫైలును మరోసారి జాగ్రత్తగా ఏజీ ద్వారా పరిశీలన చేయించి పంపాలని మాత్రమే గవర్నర్ కోరారని కొందరంటున్నారు. కానీ ఏజీ పూర్తిస్థాయి పరిశీలన తర్వాత ఇప్పుడిలా తిప్పి పంపడంపై మరో మంత్రి ఆశ్చర్యం వెలిబుచ్చారు. మరోవైపు శుక్రవారమే గవర్నర్ ఢిల్లీకి వెళ్లారు! తాజా పరిణామాల నేపథ్యంలో ధర్మాన రాజీనామా వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. గవర్నర్ చర్య నేపథ్యంలో బొత్స సత్యనారాయణ, సబిత సహా పలువురు మంత్రులు కిరణ్‌తో భేటీ అయ్యారు.

జగనే లక్ష్యంగా జగన్నాటకాలు?

ఏం జరిగింది?
గత మే 27న వైఎస్ జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది
గత అక్టోబర్ 5న జగన్‌కు సుప్రీం కోర్టు బెయిల్ నిరాకరించింది

డిసెంబర్ 24న జగన్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువరించనుంది

దానికి ముందేం జరిగింది?
మే 24న, సరిగ్గా మూడు రోజుల ముందు అప్పటి ఎక్సైజ్ మంత్రి మోపిదేవిని సీబీఐ అరెస్టు చేసింది
అక్టోబర్ 4న, అంటే ఒక్క రోజు ముందు రూ.51 కోట్ల విలువైన జగతి, జనని ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నోట్ విడుదల చేసింది

డిసెంబర్ 21న, సరిగ్గా మూడు రోజుల ముందు, ధర్మాన ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ అనుమతి లేదంటూ కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేసిన విషయం ‘బయటికి’ వచ్చింది. ప్రాసిక్యూషన్‌కు మంత్రివర్గం నిరాకరించిన ఫైలును గవర్నర్ తిప్పి పంపారు.

కోటి సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం

కోటి సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం
సీబీఐ తీరుపై మండిపడ్డ నేతలు
సీబీఐ దర్యాప్తు సంస్థలా కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోంది
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందుకే అరెస్టు, వేధింపులు..

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ చేస్తున్న కుట్రలను ఆ పార్టీ ముఖ్య నేతలు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతల అత్యవసర సమావేశంలో సీబీఐ తీరుపై మండిపడ్డారు. పార్టీ సీజీసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి, డి.రవీంద్రనాయక్, పీఏసీ సభ్యులు డీఏ సోమయాజులు, బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావుతో సహా పలువురు నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. సీబీఐ ఒక దర్యాప్తు సంస్థ మాదిరిగా కాకుండా జగన్‌పై కక్ష సాధింపుతో వ్యవహరిస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు. దేశంలో ఏ కేసు విషయంలోనూ సీబీఐ ఇలా వ్యవహరించలేద న్న అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. 

జగన్‌పై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు, సీబీఐ వ్యవహరిస్తున్న తీరును అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకు ‘‘జగన్ కోసం-జనం సంతకం’’ పేరుతో ఆయనకు కోటి సంతకాలతో వినతి పత్రాన్ని సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్ జన్మదినం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన ఈ సంతకాల సేకరణకు.. కార్యకర్తలు, ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పార్టీ నేత డి.రవీంద్రనాయక్ తొలి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా... ఎంవీ మైసూరారెడ్డి సంతకాల సేకరణ లక్ష్యాన్ని వివరించారు. ఎలాగైనా సరే జగన్‌ను దోషిగా చిత్రీకరించాలని అదే పనిగా సీబీఐ చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రపతికి తెలియజేసేందుకే ఈ సంతకాల సేకరణ చేపట్టామని వెల్లడించారు. 

ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా: పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. దేశంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన న్యాయం జరుగుతోందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ములాయం సింగ్ యాదవ్, మాయావతికి ఒక న్యాయం, జగన్‌కు ఒక న్యాయమా అని నిలదీశారు. జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా పార్టీ పెట్టుకున్నారన్న కక్షతోనే ఆయన్ను వేధిస్తున్నారని జూపూడి ప్రభాకరరావు అన్నారు. సంతకాలు చేసిన నేతల్లో డీఏ సోమయాజులు, వాసిరెడ్డి పద్మ, జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాశరావు, హెచ్‌ఏ రెహ్మాన్, గట్టు రామచంద్రరావు, కె.శివకుమార్, రాజ్ ఠాకూర్, మేడపాటి వెంకట్, బి.జనార్దన్‌రెడ్డి, చల్లా మధుసూదనరెడ్డి, విజయారెడ్డి, నాగదేశి రవికుమార్ ఉన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం(హెచ్-128 యూనియన్)కు చెందిన ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో జగన్‌కు మద్దతుగా సంతకాలను చేశారు.

‘జగన్ కోసం-జనం సంతకం’లో రాష్ట్రపతికి విజ్ఞప్తి ఇదీ

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నాం. నిజాలను నిర్ధారించాల్సిన సీబీఐ జగన్‌ను దోషిగా చిత్రీకరించడానికి అహర్నిశలు చేస్తున్న ప్రయత్నాలను, అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని మేమంతా భావిస్తున్నాం. ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు జగన్‌ను 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచడాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపులు ఆపాలని, ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలని కోరుతున్నాం.

జగన్ సీఎం కావడం ఖాయం: మంత్రి దానం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని రాష్ట్ర కార్మిక శాఖమంత్రి దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దానం సంచలన వ్యాఖ్యలతో విలేకరులు ఒకింత ఆశ్చర్యానికి గురవుతుండగానే... తాను చెప్పేది నిజమంటూ మళ్లీ అదేమాట చెప్పుకొచ్చారు. వైఎస్సార్ తన గుండెల్లో ఉన్నారని... ఆయన కొడుకైనా రోజూ స్మరించుకుంటాడో లేదో కానీ తాను, తన భార్య మాత్రం నిత్యం వైఎస్సార్‌ను తలచుకోకుండా ఉండమని తెలిపారు. నిత్యం వైఎస్సార్‌కు పూజలు చేస్తామని, దీపం వెలిగిస్తామని చెప్పారు. వైఎస్సార్ ఉంటే ఆ మనోధైర్యం వేరన్నారు.

త్వరలో వైఎస్సార్‌సీపీ బీసీ గర్జన: కాసాని

 ‘వైఎస్సార్ కాంగ్రెస్ బీసీ గర్జన’ పేరిట త్వరలో హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. శుక్రవారం ఆయన పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిశాక విలేకరులతో మాట్లాడారు. జనవరిలో మంచి రోజు చూసుకుని పార్టీలో చేరతానని, ఈ విషయమై విజయమ్మతో చర్చించానన్నారు. ఆయన వెంట పార్టీ నేత ముక్కా రూపానందరెడ్డి ఉన్నారు.

'నిబంధనలకు విరుద్ధంగా సభ్యత్వనమోదు'

నల్గొండ: సహకార ఎన్నికల ఓటరు సభ్యత్వ నమోదు కార్యక్రమం అవకతవకలగా సాగుతోంది. జిల్లాలోని మేళ్ల చెరువు మండలం చింతలపాలెం సహకార కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఓటరు సభ్యత్వ నమోదు సభ్యత్వ కార్యక్రమం ఇంకా కొనసాగడం వెనుక అధికార పార్టీ అండదండలు ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.


గుంటూరు:సభ్యత్వ దరఖాస్తులు లేకుండా ఓట్లు నమోదు చేసిన ఘటన నాదెండ్ల సహకార సంఘ కార్యాలయంలో జరిగింది. దరఖాస్తులు లేకుండా సభ్యత నమోదు కార్యక్రమం కొనసాగడంపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటి వరకూ న మోదు చేసిన సభ్యత్వ దరఖాస్తులు చూపించాలని వైఎస్సార్‌సీపీ నేత మర్రి రాజశేఖర్ కార్యకర్తలతో కలసి కార్యాలయం ముందు బైఠాయించారు.


ప్రకాశం: సహకార ఎన్నికల ఓటర్ల నమోదులో ఢీసీఓ కొండయ్య అవకతవకలకు పాల్పడ్డారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల నమోదు కార్యక్రమంలో పక్షపాత వైఖరితో వ్యవహరించిన డీసీఓను వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు నిర్బందించారు.


Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!