విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు విశాఖ ఎయిర్పోర్టులో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు, అభిమానులతో విమానాశ్రయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పార్టీ జెండాలు చేతబట్టి విజయమ్మను ఆహ్వానించారు.
విశాఖ నుంచి రోడ్డు మార్గంలో విజయమ్మ నర్సన్నపేట నియోజకవర్గానికి వస్తారు. నియోజకవర్గంలోని 'మడపాం' నుంచి ప్రచారానికి ఆమె శ్రీకారం చుడతారు. కొమర్తి, మబుగాంలో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారు. నర్సన్నపేటలో జరిగే బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడతారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం ఎన్నికల ప్రచారానికి బయల్దేరారు. ఉదయం ఆరుగంటలకు ఆమె లోటస్ పాండ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి విశాఖకు బయల్దేరారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి విజయమ్మ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. ఆమె అక్కడ రోడ్డు షోను ప్రారంభిస్తారు. జగన్ అరెస్టుతో విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచార బాధ్యతలను స్వీకరించారు.
నర్సన్నపేట : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాక కోసం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మహానేత మరణించిన తర్వాత ఆయన కుమారుడిని ప్రభుత్వం వేధిస్తున్న తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయమ్మకు అండగా ఉంటామని నర్సన్నపేట వాసులు స్పష్టం చేశారు.
విశాఖ నుంచి రోడ్డు మార్గంలో విజయమ్మ నర్సన్నపేట నియోజకవర్గానికి వస్తారు. నియోజకవర్గంలోని 'మడపాం' నుంచి ప్రచారానికి ఆమె శ్రీకారం చుడతారు. కొమర్తి, మబుగాంలో నిర్వహించే రోడ్డు షోలో పాల్గొంటారు. నర్సన్నపేటలో జరిగే బహిరంగ సభలో విజయమ్మ మాట్లాడతారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ బుధవారం ఎన్నికల ప్రచారానికి బయల్దేరారు. ఉదయం ఆరుగంటలకు ఆమె లోటస్ పాండ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి విశాఖకు బయల్దేరారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి విజయమ్మ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారు. ఆమె అక్కడ రోడ్డు షోను ప్రారంభిస్తారు. జగన్ అరెస్టుతో విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచార బాధ్యతలను స్వీకరించారు.
నర్సన్నపేట : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాక కోసం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మహానేత మరణించిన తర్వాత ఆయన కుమారుడిని ప్రభుత్వం వేధిస్తున్న తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయమ్మకు అండగా ఉంటామని నర్సన్నపేట వాసులు స్పష్టం చేశారు.
No comments:
Post a Comment