YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 16 October 2012

కంటక కాంగ్రెస్.. ప్రజాద్రోహి టీడీపీ

ఇడుపులపాయ (వైఎస్సార్ జిల్లా), న్యూస్‌లైన్: ప్రజా కంటక కాంగ్రెస్.. ప్రజాద్రోహి తెలుగుదేశం పార్టీల వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహానేత వైఎస్ కుమార్తె షర్మిల పాదయాత్ర చేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఇడుపులపాయలో మంగళవారం ఆయన వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ యూత్ జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, పాదయాత్ర సమన్వయ కమిటీ సభ్యులు శ్రీధర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే గౌరవ సలహాదారు పి.మోహన్‌రెడ్డి, ఏపీ ఆగ్రోస్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వీరు పాదయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ‘మరో ప్రజాప్రస్థానం’ ఫ్లెక్సీని భూమన కరుణాకర్‌రెడ్డి ఆవిష్కరించి స్వయంగా స్తంభానికి కట్టారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై చేస్తున్న పాదయాత్ర నీరస యాత్రలా మారిందని ఎద్దేవా చేశారు. షర్మిల పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టిస్తుందన్నారు. తండ్రి బాటలో మరోమారు ప్రజా అవసరాలను గుర్తించేందుకు షర్మిల వైఎస్సార్ ఘాట్ నుంచి ఇచ్ఛాపురం వరకు 3 వేల కిలోమీటర్ల సుదీర్ఘ యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. షర్మిల యాత్ర దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

ఆరోగ్యశ్రీ మంచిదే కానీ

చంద్రబాబు పాదయాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రతినిధి: ‘‘ఆరోగ్యశ్రీ వల్ల ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యమయ్యాయి.. ఈ పథకాలు వైఎస్ రాజశేఖరరెడ్డివి కావు’’ అని చంద్రబాబు విమర్శించారు. కర్నూలు జిల్లాలో మంగళవారం 15వ రోజు పాదయాత్రలో మనేకుర్తిలో మాట్లాడుతూ ఆయన ఇలా స్పందించారు. సభలో స్థానిక మహిళ వెంకటలక్ష్మి.. ప్రసూతి సమస్యను బాబు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతి సదుపాయాలు లేవని, అక్కడికి వెళితే ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లమంటున్నారని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే స్థోమత తమకు లేదని, దీనికి పరిష్కారం చెప్పండంటూ బాబును నిలదీశారు. దీనికి చంద్రబాబు స్పందిస్తూ... ‘‘ఆరోగ్యశ్రీ పథకం మంచిదే కానీ దీనివల్ల ప్రభుత్వ ఆసుపత్రులు పని చేయడం లేదు’’ అని విమర్శించారు. మరోవైపు 104, 108 పథకాలపై మాట్లాడుతూ.. ‘‘అసలు ఈ పథకాలు వైఎస్‌వి కావు.. వీటి సృష్టికర్త ‘సత్యం’ రామలింగరాజు. ఇతర రాష్ట్రాల్లోను ఈ పథకాల్ని విస్తరించారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక ఆ వాహనాలపై రాజీవ్‌గాంధీ ఫొటో పెట్టుకొని వీళ్లే సొంతంగా పథకాన్ని రూపొందించినట్లు ప్రచారం చేసుకున్నారు’’ అని అన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!