YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 20 October 2012

వైఎస్ ఉంటే ఈ కష్టాలొచ్చేవి కావు


వేముల(వైఎస్సార్ జిల్లా), న్యూస్‌లైన్: ‘‘నాలుగేళ్ల క్రితం నా బిడ్డకు మెదడులో గడ్డ ఉండటంతో తలతిరిగి పడిపోయేవాడు.. వైఎస్ దయవల్ల ఆరోగ్యశ్రీ కార్డు ఉండటంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించాం. అయితే రోగం నయం కాకపోవడంతో మళ్లీ ఆ ఆసుపత్రికి వెళితే ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు రద్దయిందంటూ వైద్యం చేయనంటున్నారు. ఇప్పుడు అక్కడ ఆపరేషన్ చేయాలంటే వేలకు వేలు అడుగుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చేసే పరిస్థితే లేదు. వైఎస్ ఉండి ఉంటే మాకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావు’’ అంటూ వేల్పుల గ్రామానికి చెందిన సుశీలమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. వేల్పుల వద్ద మధ్యాహ్న భోజనం చేసి విశ్రాంతి అనంతరం సమీప కాలనీలోని సుశీలమ్మ ఇంటికి షర్మిల వెళ్లినప్పుడు ఆమె తన సమస్యలను విన్నవించారు. రోడ్డు ప్రమాదంలో తన కాలు దెబ్బతిన్నప్పుడు కూడా తాను వైఎస్ దయతో తిరుపతి వెళ్లి వైద్యం చేయించుకున్నానని తెలిపారు. ఈ ప్రభుత్వం తమ ఆరోగ్యశ్రీ కార్డును రద్దు చేయడంతోపాటు అన్నింటి ధరలూ పెంచేసిందన్నారు. కాలనీలో నీళ్లు రావట్లేదని, కరెంటు ఉండట్లేదని చెప్పారు. త్వరలో మంచి కాలం వస్తుందని, జగనన్న ముఖ్యమంత్రి అయితే సమస్యలన్నీ తీరుతాయని షర్మిల భరోసా ఇచ్చారు. కాలనీలో నీటి విషయంపై స్పందించిన ఎమ్మెల్యే వై.ఎస్.విజయమ్మ.. ఎమ్మెల్యే కోటా నిధులతో కాలనీలో బోరువేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని మహిళలకు హామీ ఇచ్చారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!