YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 25 November 2012

మహిళలపై కేసులు పెట్టించిన ఘనత బాబుదే..



‘‘ దివంగత మహానేత వైఎస్ పాలమూరు ప్రజల ఇబ్బందులు గుర్తించి మేలు చేయాలనే సంకల్పంతో వేలకోట్లు ఖర్చుచేసి నె ట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్ వంటి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించేందుకు కృషి చేశారు. ఆయన హయాంలో 80 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయితే, ప్రస్తుత పాలకులు మూడేళ్లుగా 20 శాతం పనులు కూడా పూర్తిచేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశారు. ఆర్డీఎస్‌కు కూడా వైఎస్ నిధులు విడుదల చేస్తే కనీసం సకాలంలో పనులు చేయించేందుకు ఈ పాలకులకు చేతకావడం లేదు. ’’
- పాదయాత్రలో షర్మిల 

- ఉచిత విద్యుత్ కూడా ఎత్తేస్తారేమో..?!
- నిధులున్నా ఆర్డీఎస్ పనులు చేపట్టలేకపోయారు
- దత్తత తీసుకున్న బాబు జిల్లాకు చేసేందేమీ లేదు
- వైఎస్ హయాంలోనే పాలమూరు అభివృద్ధి 
- ‘ మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రలో షర్మిల 
- అయిజలో షర్మిలకు ఘనస్వాగతం 
- సమస్యలు విన్నవించుకున్న గీత కార్మికులు, బుడగజంగాలు 

మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్ ప్రతినిధి: మన పాలకులు ఏసీ గదుల్లో ఉంటూ ప్రజాసమస్యలు పట్టించుకోకుండా గాలికొదిలేస్తున్నారని, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన ఉచిత విద్యుత్‌ను కూడా మున్ముందు ఈ కాంగ్రెస్ పెద్దలు ఎత్తివేసినా దిక్కులేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలను పట్టించుకోని చేతకాని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హతలేదని, వెంటనే దిగిపోవాలని డిమాండ్‌చేశారు. మరో ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా ఆదివారం వెంకటాపురం స్టేజీ నుంచి యాత్ర ప్రారంభించి అయిజ దాటి ఐదు కిలోమీటర్ల వరకు కొనసాగించారు. 

ఈ సందర్భంగా పర్దిపురం గ్రామంలో షర్మిల మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పెద్ద చదువులు చదువుకోవాలనే ఆలోచన వైఎస్ రాజశేఖరరెడ్డికి ఉండేదని, అంతే పెద్ద మనసు జగనన్నకు కూడా ఉందని రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటువేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గీత కార్మికులు షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడినా కూలి గిట్టుబాటు కావడం లేదని దీంతో జీవనం ఎంతో దుర్భరంగా మారిందని తమగోడును వెళ్లబోసుకున్నారు. అదేవిధంగా బుడగజంగం కులస్తులు కూడా తమ సమస్యలు విన్నవిస్తూ కన్నీమున్నీరయ్యారు. 

అనంతరం మండల కేంద్రమైన అయిజలో షర్మిలకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద ఏర్పాటుచేసిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ ముస్లిం సోదరుల పవిత్ర దినమైన మొహర్రం పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలంటే వైఎస్‌కు ప్రత్యేక గౌరవమని అందుకే వారు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో చదువు, ఉద్యోగాల్లో ఐదుశాతం రిజర్వేషన్ కల్పించాలని గుర్తుచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలంటే ఎంతో త్యాగధనులని తన తండ్రి రాజశేఖరరెడ్డి ఎప్పుడూ చెబుతుండేవారని గుర్తుచేశారు. తీవ్రమైన కరువు వచ్చి స్థానికంగా పనులు లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు నెలల తరబడి వలసలు వెళ్తున్నారన్నారు.

జిల్లాను దత్తత తీసుకొని చేసేందేమీ లేదు

చంద్రబాబు నాయుడు హయాంలో జిల్లాను దత్తత తీసుకున్నా ఏనాడు కూడా చిత్తశుద్ధితో జిల్లా ప్రజలను ఆదుకోలేదన్నారు. వైఎస్ హయాంలో పాలమూరు జిల్లాను దత్తత తీసుకోకపోయినా ఈ ప్రాంత ప్రజల ఇబ్బందులను గుర్తించి వేలకోట్లు ఖర్చుచేసి నె ట్టెంపాడు, కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయన హయాంలో 80 శాతం పనులు పూర్తయితే ప్రస్తుత పాలకులు మూడేళ్లుగా 20 శాతం పనులు కూడా పూర్తిచేయకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్డీఎస్‌కు కూడా వైఎస్ నిధులు విడుదల చేస్తే కనీసం సకాలంలో పనులు చేయించడానికి కూడా ఈ పాలకులకు చేతకావడం లేదన్నారు.

మహిళలపై కేసులు పెట్టించిన ఘనత బాబుదే..

చంద్రబాబు హయంలో కరెంటు బిల్లులు చెల్లించలేదని ఇంటి వద్ద మగవాళ్లు లేకపోతే మహిళలను స్టేషన్‌లో వేయించి కేసులు పెట్టించాడని, అలాంటి వ్యక్తి తాను ఉచిత విద్యుత్ ఇస్తానంటూ మోసంచేసేందుకు జనం ముందుకు వస్తున్నాడన్నారు. వైఎస్ బతికి ఉంటే రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేసేవారని తెలిపారు. జగన్‌కు అన్ని వర్గాల నుంచి ఆదరణ లభిస్తుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మకై జైల్లో పెట్టించాయన్నారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తారని ప్రతిఒక్కరూ ఆయన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సెంటిమెంటును అడ్డుపెట్టుకొని విద్యార్థులను బలితీసుకుంటున్న పార్టీలకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!