పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నామని చెప్పిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయకుడు తొమ్మిదేళ్లలో ఈ జిల్లాకు ఏమీచేయకుండానే మోసంచేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ సీజీసీ సభ్యులు కేకే మహేందర్రెడ్డి ఆరోపించారు. ‘‘కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి వదిలేశారు. అలాగే నడిగడ్డలోనూ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి ఎన్నికలకు ముందు హడావుడిగా శిలాఫలకం వేసి ప్రజలను నమ్మించాలని చూశారు. జిల్లాప్రజలను కూలీలుగా మార్చిన ఘనత ఆయనకే దక్కింది’ అని ధ్వజమెత్తారు. ఆదివారం నడిగడ్డలో షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎంతో అనుబంధం ఉందని, జిల్లాలో వలసల సమస్య శాశ్వతపరిష్కారానికి పెండింగ్ ప్రాజెక్టులను చేపట్టారన్నారు. కడప గడపన పుట్టిన వైఎస్ రాజధానికి పాలమూరు జిల్లా ద్వారా వెళ్లిన ప్రతిసారి ఈ జిల్లా ప్రజల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచించేవారని గుర్తుచేశారు.
వైఎస్ జిల్లాలో నాలుగు ప్రధాన ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి వైపు నడిపించాలనే ఆశయంతో పలు పనులు మంజూరుచేశారన్నారు. ఇందులో భాగంగానే జడ్చర్ల వద్ద సెజ్ ద్వారా పాలమూరు ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించడం, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులు చేపట్టారన్నారు. వలసల నివారణకు వేలాదికోట్లు కేటాయించారని తెలిపారు. ఆయన వారసులైన వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పాలమూరు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. పాలమూరు జిల్లాపై వైఎస్ కుటుంబం ప్రత్యేక శ్రద్దను చూపుతుందని, ఆర్డీఎస్ సమస్యకు కూడా వైఎస్ పరిష్కారం ఇచ్చేలా రూ.92 కోట్లను మంజూరు చేస్తే, ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేయలేని స్థితిలో ఉందఅన్నారు.
వైఎస్ జిల్లాలో నాలుగు ప్రధాన ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి వైపు నడిపించాలనే ఆశయంతో పలు పనులు మంజూరుచేశారన్నారు. ఇందులో భాగంగానే జడ్చర్ల వద్ద సెజ్ ద్వారా పాలమూరు ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పించడం, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్ వంటి ప్రాజెక్టులు చేపట్టారన్నారు. వలసల నివారణకు వేలాదికోట్లు కేటాయించారని తెలిపారు. ఆయన వారసులైన వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా పాలమూరు జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారని చెప్పారు. పాలమూరు జిల్లాపై వైఎస్ కుటుంబం ప్రత్యేక శ్రద్దను చూపుతుందని, ఆర్డీఎస్ సమస్యకు కూడా వైఎస్ పరిష్కారం ఇచ్చేలా రూ.92 కోట్లను మంజూరు చేస్తే, ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేయలేని స్థితిలో ఉందఅన్నారు.
No comments:
Post a Comment