YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 26 November 2012

సకలజనుల సమ్మెను తాకట్టుపెట్టి, పోలవరం కాంట్రాక్టు

ప్రత్యేక తెలంగాణపై టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేసే ప్రకటనలన్నీ పొంతనలేనివని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సంకినేని వెంకటేశ్వర రావు అన్నారు. తెలంగాణ ఇస్తాం చర్చలకు రమ్మని కెసిఆర్ ను 
ఎవరు పిలిచారో చెప్పాలని డిమాండ్ చేశారు. సకలజనుల సమ్మెను తాకట్టుపెట్టి, పోలవరం కాంట్రాక్టు ఇప్పించుకున్నారని ఆరోపించారు. ఈ విషయం అన్ని పత్రికల్లో వచ్చిందన్నారు. 

దివంగత స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లోనే టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని, కెసిఆర్ కనీసం ఆయనకు నివాళులు కూడా అర్పించలేదని విమర్శించారు. తెలంగాణ అమరుల పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారన్నారు. 

దివంగత మహానేత డాక్టర్ వైఎస్ హయాంలోనే ఎస్ఎల్ బీసీ తొలివిడత పనులు పూర్తయ్యాయని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పనులు నిలిచిపోయాయన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!