YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 30 August 2012

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న బంద్

హైదరాబాద్ : ఒకవైపు పారిశ్రామిక రంగం, మరోవైపు వ్యవసాయ రంగం విద్యుత్ కోతలతో సంక్షోభంలో కూరుకుపోతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సర్కార్‌ ధోరణికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహిస్తోంది. బంద్‌కు అన్నివర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అయితే బంద్‌ను భగ్నం చేయడానికి పోలీసులు విఫలయత్నాలు చేస్తున్నారు. గత అర్థరాత్రి నుంచే గృహనిర్బంధాలు, అరెస్టులు చేస్తున్నారు. బంద్‌పై పోలీసులు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్నారు. 

కాగా కరెంట్ కోతలకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చిన వైఎస్ఆర్‌ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. బంద్‌ చేసుకునే హక్కు కూడా లేదన్నట్లు పోలీసులను ప్రయోగిస్తోందని విమర్శించారు. హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు , పలువురు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అరెస్ట్ అయ్యారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కూడా చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని గట్టు రామచంద్రరావు అన్నారు. 

విశాఖపట్నంలో కూడా పోలీసులు జులం ప్రదర్శిస్తున్నారు. చాలామంది కార్యకర్తల్ని అరెస్ట్‌ చేశారు. పోలీసుల అరెస్ట్‌కు నిరసనగా అయిదో టౌన్ పోలీస్‌స్టేషన్‌ ఎదుట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు.

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్‌కు ప్రజలు మద్దతు పలికారు. పాఠశాలలు, వ్యాపార వర్గాలు స్వచ్చందంగా బంద్‌కు మద్దతు తెలిపాయి. అయితే పోలీసులు మాత్రం తమ అత్యుత్సాహన్ని ప్రదర్శించారు. అర్థరాత్రి నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తల అరెస్ట్‌లపై పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. 


ప్రకాశం జిల్లాలో పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్నారు. అర్థరాత్రి నుంచే పార్టీ నాయకులను గృహ నిర్బందంలో ఉంచిన పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు దిగుతున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చిన బంద్‌ను భగ్నం చేయడానికి వరంగల్‌లో పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులను, నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్నారు. చాలా మందిని గృహనిర్బంధం చేశారు. 

నిజామాబాద్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్‌కు అనూహ్య మద్దతు లభించింది. బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు తెల్లవారుజామునుంచే రోడ్డెక్కారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ ఆర్టీసి డిపో ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!