తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటుబ్యాంకుగా పరిగణిస్తున్న కమ్మ సామాజిక వర్గమే ఈ ఉప ఎన్నికల్లో చెయ్యిచ్చి పార్టీ కొంపముంచిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు గుంటూరు జిల్లా నేతలు ఫిర్యాదు చేశారు. కమ్మ సామాజిక వర్గ ఓట్లు టీడీపీకి అనుకూలంగా పడని కారణంగానే తాను ఓటమిపాలయ్యానని ప్రత్తిపాడు పార్టీ అభ్యర్థి వీరయ్య అధినేత వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన ప్రత్తిపాడు, మాచర్ల నియోజకవర్గాల క్షేత్రస్థాయి నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్చార్జీలు, ముఖ్య నేతలతో సోమవారం ఎన్టీఆర్భవన్లో చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ అభ్యర్థుల ఓటమికి దారితీసిన పరిస్థితులు ఇతర కారణాలను ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. మొదటి నుండి పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా భావిస్తున్న కమ్మ, బీసీ కులస్థులు ఈ ఉప ఎన్నికలో పార్టీకి దూరం కావడం వల్లే గుంటూరు జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారని జిల్లా నేతలు విశ్లేషించినట్లు తెలుస్తోంది.
ప్రతిపాడు, మాచర్ల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆశించిన టీడీపీకి ఉపపోరు ఫలితాలు శృంగభంగాన్ని మిగిల్చాయి. ఈ నియోజకవర్గాల్లో కమ్మ, బీసీ సామాజికవర్గాలు మొదటి నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికలలో మాత్రం ఈ రెండు వర్గాలు వైస్సార్సీపీకి అనుకూలంగా ఓటు వేశాయనేది ఫలితాల సరళిని బట్టి తెలుస్తోందని గుంటూరు జిల్లా నేతలు వెల్లడించినట్లు తెలిసింది. దీనికి తోడు గుంటూరులో జగన్పై సానుభూతి పవనాలు బాగా వీచినట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికలకు ముందు జగన్ అరెస్టు చేయడం, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ప్రచారంతో రోడ్లపైకి రావడంతో సానుభూతి వెల్లువెత్తిందని గుంటూరు నేతలు పేర్కొన్నట్లు సమాచారం. దీనితో టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా వైస్సార్సీపీకి అనుకూలంగా నమోదయిం దన్నారు.
సానుభూతి ముందు అవినీతి ఆరోపణలు పెద్దగా ఓటర్లపై ప్రభావాన్ని చూపలేకపోయాయని నేతలు విశ్లేషించినట్లు చెబుతున్నారు. జగన్ అవినీతిని అంశాన్ని ప్రజల్లో ఆదే పనిగా మోతాదుకు మించి ప్రచారం చేయడంతో శృతి మించి కూడా పార్టీకి నష్టాన్ని కలిగించిందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కూ డా తమ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, విధానాలను కూడా ప్రచా రం చేయకుండా కేవలం జగన్ అవినీతిని టార్గెట్ చేయడం వల్ల కూడా కాంగ్రె స్, టీడీపీలు దెబ్బతిన్నాయని నేతలు చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. కాగా దీనికి తోడు పార్టీ నాయకుల మధ్య సమన్వయం లోపం అభ్యర్థుల ఓటమికి దారితీసిందని చంద్రబాబు గుర్తించినట్లు తెలుస్తోంది. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు ముఖ్యనేతలు వ్యవహరించారని క్షేత్రస్థాయి నేతలు విమర్శించినట్లు తెలుస్తోంది.
http://www.suryaa.com/Main/News/Article.asp?Category=1&SubCategory=2&ContentId=85864
No comments:
Post a Comment