YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 16 July 2012

'మంత్రులందరికీ న్యాయసహాయం ఇవ్వాలి'

సుప్రీంకోర్టు నోటీసులిచ్చిన మంత్రులందరికీ న్యాయసహాయం అందించాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మోపిదేవి వెంకటరమణకు న్యాయసహాయం ఇవ్వకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే ఆనాటి మంత్రులు వ్యవహరించారని తెలిపారు. మోపిదేవి కూడా ప్రభుత్వ విధానం ప్రకారమే వ్యవహరించారన్నారు. క్విడ్‌ప్రోకో కేసులో హైకోర్టు అడిగినప్పుడే ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాల్సిందని, అలా చేసివుంటే ఈనాడు మంత్రులు, సర్కారుకు మరక అంటేది కాదని జీవన్‌రెడ్డి ఆయన అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!