విద్యుత్ కోతలకు నిరసనగా విజయవాడలోని విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నాలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. నేతలతో కలిసి ఆమె ధర్నాలో కూర్చున్నారు. వంగవీటి రాధాకృష్ణ, సామినేని ఉదయభాను, జలీల్ ఖాన్, వాసిరెడ్డి పద్మ, తాడి శంకుంతల, నిర్మల కుమారి, విజయచందర్ తదితర నేతలు ధర్నాలో పాల్గొంటున్నారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ధర్నాకు తరలివచ్చారు. అంతుకుముందు విజయవాడలో వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని విజయమ్మ ప్రారంభించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment