YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 8 October 2012

జగన్‌ను కలిసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

బాబువి నీచ రాజకీయాలు: సంకినేని వెంకటేశ్వరరావు
కార్యకర్తలతో చర్చించి వైఎస్సార్సీపీలో చేరిక

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలుగుదేశం ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావును సోమవారం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సంకినేని గతంలో నల్లగొండ జిల్లా తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన సోమవారం ప్రత్యేక ములాఖత్‌లో చంచల్‌గూడ జైలులో ఉన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఎస్‌ఎంఎస్ ద్వారా మీడియాకు సమాచారం అందించారు. సంకినేని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆయన అందులో పేర్కొన్నారు. జగన్‌ను కలిసిన సందర్భంగా సంకినేని మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ప్రోత్సాహంతోనే ఈనెల 4న టీడీపీ ఎంపీలు చిదంబరాన్ని కలిసి జగన్ ఆస్తుల అటాచ్‌మెంట్ కోరారని ఆరోపించారు. 

జగన్‌ను నేరుగా ఎదుర్కోలేక బెయిల్ రాకుండా అడ్డుకుని బాబు నీచరాజకీయాకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలు కుమ్మక్కైనా రాష్ర్ట ప్రజలు వారికి తగిన బుద్ధిచెప్పి వైఎస్సార్సీపీకి పట్టం గట్టారని చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని బాబు భ్రష్టు పట్టిస్తున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని నేతలు, కార్యకర్తలు, అభిమానులతో చర్చించి వైఎస్సార్సీపీలో చేరే విషయాన్ని ప్రకటిస్తానని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!