YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 4 June 2012

కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే వేధిస్తారా?


కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులు వేశారని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇవేవీ జరిగేవి కావని ఆజాద్ చేసిన వ్యాఖ్యలతో ఆ విషయం తేటతెల్లమైందన్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినందునే జగన్‌పై కక్ష గట్టి వేధిస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఆయన సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ మరణానంతరం జగన్‌కు కేంద్ర మంత్రి, ఆ తరువాత సీఎం ఆఫర్ ఇచ్చారని... అయితే తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు జగన్ వాటిని వదులుకున్నారని చెప్పారు. నల్లకాలువలో లక్షలాదిమంది ప్రజల ముందు జగన్ ఓదార్పు యాత్రను ప్రకటించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అనుమతితోనే మొదట ఓదార్పు యాత్ర జరిగిందని, ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాల్లో జరిగిన ఓదార్పు యాత్రల్లో మంత్రులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారని చెప్పారు. 

అయితే ఓదార్పు యాత్రలో జగన్‌కు ప్రజలనుంచి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే వేధింపులు మొదలు పెట్టారని విమర్శించారు. శ్రీకాకుళంలో ఓదార్పు తరువాత అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అడ్డుకున్నారని, విజయనగరం నుంచి వేధింపులు మొదలయ్యాయని చెప్పారు. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వాలని జగన్ తన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలతో కలిసి సోనియా గాంధీని కోరినా ఆమె వినిపించుకోలేదన్నారు. అంతటితో ఆగకుండా కుటుంబంలో చిచ్చుపెట్టి వివేకానందరెడ్డిని విడదీశారని విమర్శించారు. ఆ తర్వాత శంకర్రావుతో లేఖ రాయించి వేధింపుల వేగం పెంచారని చెప్పారు. సోనియాగాంధీ అనుమతితోనే తాను లేఖ రాశానని స్వయంగా శంకర్‌రావే చెప్పారని, ఆ తరువాతే ఆయనకు మంత్రి పదవి దక్కిందని గోనె గుర్తుచేశారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!