YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Saturday 9 June 2012

నేటితో ముగియనున్న కస్టడీ


హైదరాబాద్, న్యూస్‌లైన్: కడప ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ అధికారులు శనివారం విచారించారు. జగన్‌ను మరో రెండు రోజులు విచారించేందుకు హైకోర్టు ఆమోదం తెలపడంతో ఆయన్ని ఉదయం 10.30 గంటలకు పటిష్ట బందోబస్తు మధ్య చంచల్‌గూడ జైలు నుంచి కోఠిలోని కేంద్రీయ సదన్‌కు తీసుకువచ్చారు. సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని అధికారుల బృందం ఆయన్ని విచారించింది. సాయంత్రం 5 గంటలకు తిరిగి చంచల్‌గూడ జైలుకు తీసుకెళ్లారు. ఆదివారం సాయంత్రంతో విచారణ ముగియనుంది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!