ఉప ఎన్నికల్లో 18 సీట్లలో డిపాజిట్లు రావనే భయంతోనే జగన్ ను జైల్లో పెట్టారని షర్మిల అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె శనివారం ఒంగోలులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. జగన్ త్వరలోనే నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. రాజన్నరాజ్యం కావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.
హెలికాప్టర్లు కూల్చి, మంచివాళ్లను జైల్లో పెట్టే దుర్మార్గపు రాజకీయాలను తిప్పికొట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. దేశమంతా హెరిటేజ్ లు పెట్టి చిదంబరంతో చీకటి ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబుకు వైఎస్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కోట్ల రూపాయలతో ఐటీ దాడుల్లో దొరికిన చిరంజీవి ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కష్టకాలంలో వైఎస్ కుటుంబానికి అండగా ఉండి, రైతుల పక్షాన నిలబడి పదవికి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని షర్మిల కోరారు.
హెలికాప్టర్లు కూల్చి, మంచివాళ్లను జైల్లో పెట్టే దుర్మార్గపు రాజకీయాలను తిప్పికొట్టాలని షర్మిల పిలుపునిచ్చారు. దేశమంతా హెరిటేజ్ లు పెట్టి చిదంబరంతో చీకటి ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబుకు వైఎస్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కోట్ల రూపాయలతో ఐటీ దాడుల్లో దొరికిన చిరంజీవి ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కష్టకాలంలో వైఎస్ కుటుంబానికి అండగా ఉండి, రైతుల పక్షాన నిలబడి పదవికి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి ఓటు వేసి గెలిపించాలని షర్మిల కోరారు.
No comments:
Post a Comment