సిరిసిల్ల : సిరిసిల్ల బయల్దేరిన వైఎస్ విజయమ్మ సిద్ధిపేట బైపాస్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు. స్థూపానికి పుష్పమాల వేసి ఆమె అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఎమ్మెల్సీ కొండా మురళి, మాజీ ఎమ్మెల్యేల కొండా సురేఖ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కన్వీనర్ పుత్తా ప్రతాప్ రెడ్డి తదితరులు విజయమ్మ వెంట వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో అమరవీరుల స్థూపం దగ్గరకు తరలివచ్చారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment