YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday 26 July 2012

పెంచిన ఛార్జీలను తగ్గించాలి: గట్టు

పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలు ప్రభుత్వం వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. భూముల విలువ పెంపుపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ప్రజలపై భారం మోపడమే కర్తవ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన విమర్శించారు. ప్రజలపై పన్నుల మోత మోగించడమే లక్ష్యంగా పనిచేస్తుందని గట్టు ఆరోపించారు. బడా కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ పేద ప్రజలపై చూపడం లేదని గట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్థసారధి తన పదవికి రాజీ నామా చేయాలని గట్టు రామచంద్రరావు అన్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!