YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday 24 July 2012

జగన్ కొక న్యాయం, బాబుకొక న్యాయమా?

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు సుప్రీం కోర్టు క్లీన్ చిట్ ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఆమె విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేతలు సుప్రీం తీర్పును వక్రీకరిస్తున్నారన్నారు. ఆ పార్టీ నేతలు దయచేసి జాతీయ పత్రికలు చదివితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. చంద్రబాబు అవినీతిని కచ్చితంగా నిరూపిస్తామని చెప్పారు. చంద్రబాబు దొరకని దొంగ మాత్రమేనని, నీతిమంతుడు కాదని విమర్శించారు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్థుడు చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలవి తాత్కాలిక సంబరాలేనని ఎద్దేవా చేశారు. జగన్మోహన రెడ్డికి ఒక న్యాయం, చంద్రబాబుకు ఒక న్యాయమా? అని ప్రజలు చర్చించుకుంటున్నారని ఆమె అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!